హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు - మంత్రివర్గ నిర్ణయం
హైదరాబాద్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు):
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తి వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించడానికి వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం -2018 లోని సెక్షన్ 21(3) ని తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని తీర్మానించింది.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభం నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలను ఫ్లోరైడ్ రహిత ప్రాంతాలుగా చేయడానికి సంకల్పించిన ఈ ప్రాజెక్టు 44 కిలోమీటర్ల సొరంగంలో ఇప్పటికే దాదాపు 35 కి.మీ పూర్తయింది.
మిగిలిన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. ఇప్పటివరకు పనులు చేపట్టిన ఏజెన్సీ ద్వారానే పూర్తి చేయించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం అదనంగా ఆర్థిక భారం లేకుండా ప్రాజెక్టు పూర్తి చేయాలి. టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా కాకుండా అత్యాధునిక డ్రిల్లింగ్ పద్ధతిలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి మంత్రిమండలి ఆమోదించింది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసిందని మంత్రిమండలి అభిప్రాయపడుతూ, ఈ అంశంపై హైకోర్టు తీర్పును అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని మంత్రిమండలి భావించింది.
వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యంగా ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్, వరంగల్లలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. అలాగే రామగుండంలో 52 ఏళ్ల కిందటి థర్మల్ స్టేషన్ (ఆర్టీఎస్ – బి 62.5 మెగావాట్ల యూనిట్) కాలపరిమితి ముగిసినందున దానికి తొలగించడానికి ఆమోదించింది.
రాబోవు పదేళ్లకు విద్యుత్ అవసరాలు, డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికను తయారు చేయాలని విద్యుత్ శాఖను మంత్రిమండలి ఆదేశించినట్టు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేరేళ్ల వద్ద ఊడిపోయిన బస్సు చక్రం - తప్పిన ప్రమాదం
ధర్మపురి అక్టోబర్ 24 (ప్రజా మంటలు):
జగిత్యాల - ధర్మపురి ప్రధాన రహదారి పై నేరెళ్ల వద్ద ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు తప్పిన ప్రమాదం.పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో బస్సు టైరు ఊడిపోయింది.డ్రైవర్ అప్రమత్తతో, బస్సును ఆపివేయడంతో, ప్రమాదం తప్పింది.
ధర్మపురి నుంచి జగిత్యాల కు బయలుదేరిన బస్సులో సామర్ధ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో... కర్నూలు జిల్లాలో ఘోర విషాదం: దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – 32 మంది మృతి?
కర్నూలు అక్టోబర్ 24:
కర్నూలు జిల్లా చిన్నటెకూరు సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి. కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు జాతీయ రహదారి 44పై దగ్ధమైంది. ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులలో 33 మంది సజీవదహనమయ్యారని అధికారులు తెలిపారు.
స్థలం: చిన్నటెకూరు, కర్నూలు జిల్లా
సమయం: తెల్లవారుజామున... హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు - మంత్రివర్గ నిర్ణయం
హైదరాబాద్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు):
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తి వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించడానికి... ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్,జగిత్యాల్ గారి ఆదేశానుసారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ ఐ, ఏ. అనిల్ గారి ఆధ్వర్యంలో గురువారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో యువకులతో పాటుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినది.... బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
1 కోటి రూపాయల నిధులు మంజూరుకు తన వంతుగా కృషి చేస్తా
దేవాలయాల్లో రాజకీయాలకు స్థానం లేదు
సామాజిక సేవా కార్యక్రమాల తోనే ప్రజల్లో గుర్తింపు, సేవ చేయాలని లక్ష్యం తోనే రాజకీయాల్లోకి వచ్చాను
సారంగాపూర్ అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డ్ నూతన కార్యవర్గ... డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్
హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా ఇటీవలే నియమితులైన బి. శివధర్ రెడ్డి ను మాజీ మంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్ డిజిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ... అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
అమెరికా ఆంక్షలు 21 నవంబర్ నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ అక్టోబర్ 23:భారత రిఫైనరీలు రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో పాటు, నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చే రోస్నెఫ్ట్ (Rosneft), లుకోయిల్ (Lukoil) కంపెనీలపై అమెరికా ఆంక్షలు ఈ నిర్ణయానికి... సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల స్థల పరిశీలన కొరకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం సాంఘీక మైనారిటీ పాఠశాల సిఇ ఎండి, షఫీమియా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.
చావు డబ్బు కొట్టి నిరసన వ్యక్తం చేసిన మాదిగ సంఘ నాయకులు...
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమర్ ను అనుచిత వ్యాఖ్యలు చేసిన గాధరి కిషోర్ దిష్టిబొమ్మను డప్పులతో ఉరేగించి, దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఎంబిబిఎస్ మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులు కట్కూరి మహేందర్ రాపల్లి మరియు చందం రాజేష్ వెల్గటూర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకుల చేతుల మీదుగా సన్మానించారు కట్కూరి మహేందర్ ,నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించగా, చంద... శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు
ధర్మపురి అక్టోబర్ 23 (ప్రజా మంటలు)
”యమద్వితీయ” పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం నకు అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి దేవాలయం లో గురువారం స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం,ఆయుష్యసూక్తం తో అబిషేకం , ఆయుష్యహోమం హరతి మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
అనంతరం విశేష సంఖ్యలో భక్తులు... మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పి ఎం జె జె బి వై,పీఎం ఎస్బివై, అటల్ పెన్షన్ యోజన , సైబర్ సెక్యూరిటీ సుకన్య సమృద్ధి యోజన మరియు బ్యాంకు
కార్యక్రమానికి... 