బిహార్ ఎన్నికలు - తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థి, ముకేష్ సహని డిప్యూటీ సీఎం
మహాఘట్బంధన్ సంయుక్త పత్రికా సమావేశం
పాల్గొన్న అశోక్ గెహ్లాట్, తేజస్వి యాదవ్ ముఖేష్ సహాని, దీపాంకర్ భట్టాచార్య, రాజేశ్ రామ్,
అమిత్ షా రెండు భారీ సభల్లో పాల్గొంటారు.
పట్నా, అక్టోబర్ 23:
బిహార్ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. రాబోయే 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ కూటములు తమ వ్యూహాలను ఖరారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహాగఠ్బంధన్ (Grand Alliance) ఈరోజు సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక ప్రకటన చేసింది.
మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్నే మహాగఠ్బంధన్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా (CM candidate) ప్రకటించారు. అంతేకాకుండా, రెండు ఉపముఖ్యమంత్రి (Deputy CM) పదవులను కేటాయించాలని నిర్ణయించగా, వీటిలో ఒకదానికి విఐపీ పార్టీ చీఫ్ ముకేష్ సహని (Mukesh Sahani) పేరు ఖరారయింది.
ఇదే సమయంలో, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో బిహార్ రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి.
అమిత్ షా రెండు భారీ సభల్లో పాల్గొంటారు.
మరోవైపు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈరోజు రెండు భారీ సభల్లో పాల్గొంటున్నారు — ఒకటి ఔరంగాబాద్లోని గోహ్, మరొకటి వైశాలీలోని పాతేపూర్లో. ఇరు సభల్లో కూడా ఆయన మహాగఠ్బంధన్ పై తీవ్ర విమర్శలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
బిహార్లో ప్రధాన కూటముల మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలతో రాజకీయ వాతావరణం కాస్త ఉత్కంఠభరితంగా మారింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
1.jpeg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా

మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.

మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు

మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

తెలంగాణ IAS అధికారి రిజ్వీ స్వచ్ఛంద విరమణ – మద్యం టెండర్ వివాదం నేపథ్యంగా
.jpeg)
భోపాల్లో దీపావళి విషాదం: కార్బైడ్ గన్స్ పేలుళ్లతో 60 మందికి పైగా గాయాలు, పిల్లలు చూపు కోల్పోయిన ఘటనలు
