బనకచర్ల ప్రాజెక్టు వెంటనే ఆపాలి - రంగారెడ్డి జిల్లా జనసమితి ప్లీనరీలో ప్రొ.కోదండరాం.

On
బనకచర్ల ప్రాజెక్టు వెంటనే ఆపాలి - రంగారెడ్డి జిల్లా జనసమితి ప్లీనరీలో ప్రొ.కోదండరాం.

హైదరాబాద్ జూన్ 21 (ప్రజా మంటలు):

తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రాజెక్టు వ్యతిరేకంగా తెలంగాణ జన సమితి పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు.

తెలంగాణ జన సమితి రంగారెడ్డి జిల్లా ప్లీనరీ సమావేశం శనివారం ఉదయం ఎల్.బి.నగర్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టి.జె.ఎస్ అధినేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారు హాజరైయ్యారు.

టి.జె.ఎస్ రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ పల్లె వినయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోదండరాం గారు మాట్లాడుతూ " నాడు ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ ఏర్పడ్డ తరువాత కెసిఆర్ పాలనలోనూ రంగారెడ్డి జిల్లా తీవ్ర వివక్షకు గురైంది. తెలంగాణ ఉద్యమంలో రంగారెడ్డి జిల్లా కీలక పాత్ర పోషించింది, అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఈ ప్రాంతం నిలిచింది. ఇక్కడి త్యాగాలు ఎప్పటికీ ప్రజలకు స్ఫూర్తినిస్థాయి. రంగారెడ్డి జిల్లాలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాల్లో తెలంగాణ జన సమితి ముందుండి పోరాడిందని, జిల్లా ప్రజల హక్కులను నిలబెట్టేందుకు పార్టీ నిరంతరం కృషి చేస్తోందన్నారు."

IMG-20250621-WA0009

ఇక గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, "గత పాలనలో ఫోన్ ట్యాపింగ్ చేస్తూ తమ ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై నిత్యం నిఘా పెడుతూ వారిని వేదించేవారు. ఎదైనా కార్యక్రమం తలపెడితే ముందుగానే పోలీసులు ఆ విషయం తెలుసుకొని నిర్బంధించేవారు, నేడు ఆ పరిస్థితి పోయి స్వేచ్చ వాతావరణం ఉందని, సభలు సమావేశాలు జరుపుకోవడానికి అవకాశం ఉందన్నారు. కాలేశ్వరం పేరుతో లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణను ఆర్ధికంగా దెబ్బతీశారని అన్నారు.
రైతుల భూముల విషయంలో గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, 420000 ఎకరాల భూమిని భూసేకరణ పేరుతో తీసుకున్నదని, అందులో ఎక్కువగా  పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూములేనని గుర్తు చేశారు.

నాటి నుండి నేటి వరకు తెలంగాణ జన సమితి ప్రజల పక్షానే నిలబడి ప్రజా సమస్యలను రాజకీయ ఎజెండా మీద నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిందని, భవిష్యత్తులో కూడా అలానే పని చేస్తుందని స్పష్టం చేశారు. హార్డ్ వేర్ పార్క్, ఫార్మా సిటీ రైతుల హక్కుల కోసం జన సమితి నిరంతరం ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరుపుతోంది అని తెలిపారు.
అదే విధంగా, రాజకీయాలు డబ్బు చుట్టూ తిరిగే విధంగా కాకుండా ప్రజల చుట్టూ తిరిగేలా మారాలని. ప్రజలతో సంబంధం ఉన్నవారికి ప్రభుత్వ పనిలో భాగస్వామ్యం దక్కేలా ఉండాలని ఆకాంక్షించారు

ప్లీనరీ సమావేశం అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యునిగా కె.వి.రంగారెడ్డిని, రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా దార సత్యం, ప్రధాన కార్యదర్శిగా కొత్త రవి, ఉపాధ్యక్షులుగా ఆర్.కే నాగని, షేక్ ఇమామ్ హుస్సేన్, పగడాల రమణ, జాయింట్ సెక్రటరీలుగా నిరంజన్, ఓబుల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా జంగయ్య, లింగయ్య, రమేష్ యాదవ్, పెంటా రెడ్డి ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్, బైరి రమేష్, ఆశప్ప, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.నరసయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి హనుమంత్ రెడ్డి, హైదరాబాద మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు దేశపాక శ్రీనివాస్, జనగాం జిల్లా అధ్యక్షుడు అశోక్ వర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్మిక విభాగ కన్వీనర్ ఆకుల శ్రీనివాస్, శేఖర్ యాదవ్, జంగయ్య, కళ్లెం శ్రీను, వినీల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు..

More News...

Local News 

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్  సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్  సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం యొక్క ధ్యేయం-మంత్రి అడ్లూరి గొల్లపల్లి జూన్ 29 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో  కళ్యాణ లక్ష్మి షాది ముబారక్  సీఎం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతులుగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ,వృద్ధుల మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ అదేవిధంగా...
Read More...
Local News 

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ జూన్ 29 (ప్రజా మంటలు): నిజామాబాదు లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం నిమిత్తము కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వచ్చారు.  బేగంపేట్ ఎయిర్ పోర్ట్ పోర్టులో విమానం దిగిన అమిత్ షా కు అభివాదం చేసిన మాజీ మంత్రి, NDMA వైస్ ప్రెసిడెంట్ మర్రి శశిధర్...
Read More...
Local News 

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం సికింద్రాబాద్, జూన్ 29 (ప్రజామంటలు): సికింద్రాబాద్ చిలకలగూడ లోని కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సర్వసభ్య సమావేశం ఆదివారం ఆలయ ఆవరణలో నిర్వహించారు. ఆషాడ బోనాల ఉత్సవాల నేపద్యంలో భక్తుల సౌకర్యార్థమై చేయాల్సిన ఏర్పాట్లు, తదితర అంశాలపై హక్కుదారులు చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఏడాది ఆలయ హక్కుదారులు అమ్మవారికి తొలిబోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది....
Read More...
Local News 

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి భీమదేవరపల్లి, జూన్ 29 (ప్రజామంటలు) : ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి మరియు మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వ్యవస్థాపక అధ్యక్షులు, సహకారోద్యమానికి ప్రాణం పోసిన కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39వ వర్ధంతిని ఆదివారం ఉదయం సంఘ ఆవరణలో శ్రద్ధాంజలుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సంఘ ప్రస్తుత అధ్యక్షులు ఎ. ప్రవీణ్ రెడ్డి...
Read More...
Local News 

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి    జగిత్యాల జూన్ 29 (ప్రజా మంటలు) పట్టణం విశ్వకర్మ సంఘం వారి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల జాతర సందర్భంగా మహిళలతో కలిసి డప్పు చప్పుల్ల మధ్యలో బోనం ఎత్తుకున్న, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  సరైన సమయంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పోచమ్మ...
Read More...
Local News 

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

భీమదేవరపల్లి, జూన్ 29 (ప్రజామంటలు) :    ముల్కనూర్ లోని విశ్వశాంతి విద్యాలయం 2010-11 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఒక ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మళ్లీ ఒకచోట చేరి గురువుల పట్ల కృతజ్ఞతలు తెలిపి, మిత్రుల మధ్య మధురానుభూతులు పంచుకున్నారు. “గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః...” శ్లోకంతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో, జీవితానికి మార్గదర్శకులైన...
Read More...
Local News 

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి 

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి  సికింద్రాబాద్, జూన్ 29 (ప్రజామంటలు): జూలై 13, 14న జరగనున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను వైభవంగా నిర్వహిద్దామని, అందుకు ప్రభుత్వ అధికారులు,పార్టీలకతీతంగా నాయకులు,భక్తులు సహకరించాలని దక్కన్ మానవ సేవాసమితి కోరింది.ఈ మేరకు వారు ఆదివారం మహంకాళి ఆలయ ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ అధ్యక్షతన...
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ సికింద్రాబాద్,  జూన్ 29 (ప్రజా మంటలు): హైదరాబాద్ రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు ఆదివారం పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు, స్వేటర్లు పంపిణి చేశారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్నవారికి ఔషదాలు కూడ అందచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు  డాక్టర్. వై....
Read More...
Local News  State News 

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు 

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు  మృతదేహం తరలింపు ప్రక్రియలో పురోగతి - మరో రెండు రోజుల్లో ఇజ్రాయిల్ నుంచి ఇండియాకు చేరనున్న మృతదేహం  జగిత్యాల జూన్ 29 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణానికి చెందిన రేవెల్ల రవీందర్ (57) ఈ నెల 16న ఇజ్రాయిల్‌లో గుండె సంబంధిత అనారోగ్యంతో మరణించారు. అదే సమయంలో ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న...
Read More...
Local News 

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్  జూన్ 29 (ప్రజా మంటలు): మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆదయ్య ఎక్స్ రోడ్ ఫుట్ పాత్  పై పడి ఉన్న దాదాపు 45 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు ఎలాంటి వివరాలు...
Read More...
Local News  State News 

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జూన్ 28 (ప్రజా మంటలు) :  జూలై 1 వ తేదీసాయంత్రం 5:30గంటలకు స్ధానిక స్వామి వివేకానంద మినీ స్టేడియం లో జగిత్యాల జిల్లా బాస్కెట్ బాల్ జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించబడునని అసోసియేషన్ కార్యదర్శి డా. వేణు గోపాల్ రెడ్డి...
Read More...
Local News  State News 

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి. జగిత్యాల 28 జూన్ (ప్రజా మంటలు) :  భారత ప్రధానమంత్రిగా బహుభాషావేత్తగా భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహులుగా పేరొందిన పాములపర్తి వేంకట నరసింహారావు గారి నూట నాల్గవ జయంతి సందర్భంగా రాయికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అందించిన ప్రత్యేక కథనం. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని...
Read More...