బుగ్గారం జి.పి.లో దొంగ నిర్మాణ అనుమతులు - ఆన్ లైన్ లో కనిపించని ఇండ్ల వివరాలు
వసూలైన ఇంటి పన్నులూ మాయం
దొంగ రశీదులతో ఇంటి పన్నుల వసూళ్లు
ట్రెజరీ లో జమ కాలేదని ఆరోపణ
గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడి దోపిడి
గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు పిర్యాదు
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - స్పెషల్ ఆపీసర్ జి.సునిత
బుగ్గారం ఏప్రిల్ 24:
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ హయాంలో ఇండ్ల నిర్మాణానికి దొంగ అనుమతి పత్రాలు జారీ అయ్యాయని ఆరోపిస్తూ తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి గురువారం స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు పిర్యాదు చేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్పెషల్ ఆపీసర్ జి. సునిత అధ్యక్షతన గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి ప్రత్యేకంగా పిర్యాదు చేస్తూ గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడిగా దోచుకున్నారని ఆరోపించారు.
భారీగా అవినీతికి పాల్పడి సుమారు 30 ఇండ్ల కు దొంగ అనుమతి పత్రాలు జారీ చేశారని అన్నారు. ఆ ఇండ్ల వివరాలు నేడు ఆన్ లైన్ లో కనబడడం లేదన్నారు. అదే ఇండ్ల పై ప్రతి ఏటా వసూలు చేసిన ఇంటి పన్నులు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయ రికార్డులలో నమోదు కాలేదన్నారు. అట్టి రశీదుల సొమ్ము కూడా ట్రెజరీ ద్వారా బ్యాంక్ ఖాతాలో కూడా జమ కాలేదని చుక్క గంగారెడ్డి సూచించారు. స్థానిక మండల పంచాయతీ అధికారి దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా, గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ లు ఇద్దరూ కుమ్మక్కై ఈ అక్రమాలు చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తగు విచారణ జరిపి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధిత ఇంటి యజమానులకు కూడా సరైన న్యాయం చేయాలని ఆయన కోరారు. *PRESS NOTE* - 2
గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దాం
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - బుగ్గారం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన స్పెషల్ ఆపీసర్ జి.సునిత 
బుగ్గారం గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దామని, ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంచుదామని స్పెషల్ ఆపీసర్ జి. సునీత గురువారం బుగ్గారం గ్రామ ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆమె అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు హాజరైన ప్రజలతో, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సమైక్య గ్రూప్ లతో కలిసి ముందుగా పరిశుభ్రత - పారిశుధ్యం, నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత, మరుగు దొడ్ల నిర్మాణం తదితర ముఖ్య అంశాలతో కూడిన విషయాలను ప్రజల నోటితో అనిపిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామ సభలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామం లోని వీధి లైట్లు, మురికి కాలువలను, రోడ్ల ను ఆమె ప్రత్యేకంగా తిరిగి పరిశీలించారు. గ్రామ కార్యదర్శి అక్బర్ నేతృత్వంలో గ్రామ ప్రజలు, వివిధ శాఖల సిబ్బంది స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు ఘన స్వాగతం పలికారు. అంజీర మొక్కను బహుమతి గా ఆమెకు అందజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ గ్రామ సభలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, కోర్ కమిటి కో కన్వీనర్ పెద్దనవేణి రాగన్న, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సా గౌడ్, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, విడిసి సభ్యులు సుంకం గంగారెడ్డి, శ్రీ పేరంబూదూరి సురేందర్ స్వామి, చింతపండు మల్లయ్య, అంగన్ వాడీ టీచర్లు, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు, మహిళా సమైక్య గ్రూప్ లీడర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత్–అమెరికా మధ్య అంతరిమ వాణిజ్య ఒప్పందం: కీలకాంశాలు
ఇదిగో మీ వెబ్సైట్ “ప్రజా మంటలు” కోసం, పూర్తి స్థాయి **తెలుగు సమగ్ర నివేదిక (Comprehensive Report)**తో పాటు SEO Meta Title, Description కూడా ఇస్తున్నాను. వార్తా శైలి, విశ్లేషణ, ఉపశీర్షికలతో సిద్ధంగా ఉంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
భారత్–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలకు కొత్త దిశ చూపించేలా **అంతరిమ... అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవ వేడుకలు
జగిత్యాల ఫిబ్రవరి 6 (ప్రజా మంటలు)పట్టణంలోని శ్రీ శ్రీనివాసా0 జనేయ భవాని శంకర దేవాలయంలో 66వ ఆలయ వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ శ్రీనివాస పద్మావతి ల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.స్వామివారి నామస్మరణతో ఆలయం అంతా మారుమోగింది.
ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను... డాలర్పై రూపాయి పైచేయి: మూడేళ్లలోనే అతిపెద్ద లాభం, భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావం
న్యూఢిల్లీ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
డాలర్ ముందు రూపాయి తన బలాన్ని చాటింది. గత కొంతకాలంగా డాలర్ కారణంగా రూపాయి ఒత్తిడిని ఎదుర్కొన్నా, గత వారం ఒక్కసారిగా బలపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మూడేళ్లలోనే అత్యధిక లాభాన్ని నమోదు చేసింది. మొత్తం వారంలో రూపాయి 1.4 శాతం బలపడగా, ఇది జనవరి 2023 తర్వాత... షిల్లాంగ్ గని ప్రమాదంలో 25 కు చేరిన మృతుల సంఖ్య
షిల్లాంగ్ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
మెఘాలయ రాష్ట్రంలో నిన్న జరిగిన బొగ్గు గని పేలుడు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. మరో ఏడుగురు మృతదేహాలు వెలికితీయడంతో మరణాల సంఖ్య పెరిగినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఐ. నోంగ్రాంగ్ తెలిపారు. ఇప్పటివరకు 12... జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ లో "స్కూలొంపిక్స్-2026" పేరిట క్రీడా ఉత్సవాలు
జగిత్యాల ఫిబ్రవరి 6 (ప్రజా మంటలు)జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే వార్షిక క్రీడోత్సవాలు ఈ సంవత్సరం *“స్కూలోంపిక్స్ –2026 Annual Sports Meet”* పేరుతో ఘనంగా నిర్వహించబడనున్నాయి.
ఈ క్రీడోత్సవాలు 2026 ఫిబ్రవరి 6, 7 మరియు 8 తేదీలలో జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం గ్రౌండ్... విధి నిర్వహణలో మరణించిన ప్రమోద్, సౌమ్య కుటుంబాలకు ₹ కోటి చెక్కు అందజేసిన సీఎం
నిజామాబాద్ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి, అలాగే గతేడాది కత్తిపోటుతో మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయ చెక్కులు అందజేశారు.
‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్... అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
రాయికల్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
రాయికల్ మండలం ఆలూరు, రాజ్నగర్ గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు కాగా, ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమిపూజ నిర్వహించారు.
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తూ, గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య,... జగిత్యాలలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు
జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్లు నిర్వహించింది. టీఆర్ నగర్లో 10, 11వ వార్డుల అభ్యర్థులు ఎంఏ కాశీం, దేవేందర్ నాయక్కు, బీరయ్య గుడి సమీపంలో 18, 19, 20వ వార్డుల అభ్యర్థులు ఏనుగుల భూమయ్య, భారతి సంతోష్,... యావర్ రోడ్డు విస్తరణ, పట్టణ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
జగిత్యాల మోతే రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే తన లక్ష్యమన్నారు.
2021లో జగిత్యాల పట్టణంలో 12 జోన్ల పరిధిలో 121 సర్వే నంబర్లను మార్చి, యావర్ రోడ్డుపై ఉన్న ప్రాంతాలను రెసిడెన్షియల్,... ఆర్టీఐపై ఐదేళ్ల నిర్లక్ష్యం: సమాచార కమిషన్ ఆదేశాలతో కదిలిన జగిత్యాల జిల్లా యంత్రాంగం
గొల్లపల్లి (బుగ్గారం) ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో గత ఐదేళ్లుగా ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం ఇవ్వని విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చింది. 2022 మే 17న చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఐ దాఖలు చేసినప్పటికీ, ఇప్పటి వరకు సమాచారం అందించకపోవడంతో ఆయన... ఎపిస్టీన్తో లేఖల వ్యవహారం: హరిదీప్ సింగ్ పూరి వివరణపై సందేహాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
జెఫ్రీ ఎపిస్టీన్కు సంబంధించిన కేసు డాక్యుమెంట్లు, ఈమెయిల్ రికార్డులపై తాజాగా బయటకొచ్చిన ఫోటోలు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి గతంలో ఇచ్చిన వివరణలపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. అలాగే మాజీ ప్రధాన సమాచార కమీషనర్ యశ్వర్ధన్ సిన్హా పేరు కూడా బయటపడింది.
మొదటి ఫోటోలో కనిపిస్తున్న ఈమెయిల్ ప్రకారం,... టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర
తిరుమల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
టీటీడీ ఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న ముద్దాడ రవిచంద్ర తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో వీరభద్రం, సీవీఎస్ఓ మురళీకృష్ణ, సీపీఆర్ఓ రవి స్వాగతం పలికారు.
ఈరోజు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ముద్దాడ రవిచంద్ర అధికారికంగా టీటీడీ ఈఓగా... 