బుగ్గారం జి.పి.లో దొంగ నిర్మాణ అనుమతులు - ఆన్ లైన్ లో కనిపించని ఇండ్ల వివరాలు
వసూలైన ఇంటి పన్నులూ మాయం
దొంగ రశీదులతో ఇంటి పన్నుల వసూళ్లు
ట్రెజరీ లో జమ కాలేదని ఆరోపణ
గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడి దోపిడి
గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు పిర్యాదు
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - స్పెషల్ ఆపీసర్ జి.సునిత
బుగ్గారం ఏప్రిల్ 24:
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ హయాంలో ఇండ్ల నిర్మాణానికి దొంగ అనుమతి పత్రాలు జారీ అయ్యాయని ఆరోపిస్తూ తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి గురువారం స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు పిర్యాదు చేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్పెషల్ ఆపీసర్ జి. సునిత అధ్యక్షతన గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి ప్రత్యేకంగా పిర్యాదు చేస్తూ గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడిగా దోచుకున్నారని ఆరోపించారు.
భారీగా అవినీతికి పాల్పడి సుమారు 30 ఇండ్ల కు దొంగ అనుమతి పత్రాలు జారీ చేశారని అన్నారు. ఆ ఇండ్ల వివరాలు నేడు ఆన్ లైన్ లో కనబడడం లేదన్నారు. అదే ఇండ్ల పై ప్రతి ఏటా వసూలు చేసిన ఇంటి పన్నులు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయ రికార్డులలో నమోదు కాలేదన్నారు. అట్టి రశీదుల సొమ్ము కూడా ట్రెజరీ ద్వారా బ్యాంక్ ఖాతాలో కూడా జమ కాలేదని చుక్క గంగారెడ్డి సూచించారు. స్థానిక మండల పంచాయతీ అధికారి దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా, గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ లు ఇద్దరూ కుమ్మక్కై ఈ అక్రమాలు చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తగు విచారణ జరిపి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధిత ఇంటి యజమానులకు కూడా సరైన న్యాయం చేయాలని ఆయన కోరారు. *PRESS NOTE* - 2
గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దాం
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - బుగ్గారం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన స్పెషల్ ఆపీసర్ జి.సునిత 
బుగ్గారం గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దామని, ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంచుదామని స్పెషల్ ఆపీసర్ జి. సునీత గురువారం బుగ్గారం గ్రామ ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆమె అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు హాజరైన ప్రజలతో, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సమైక్య గ్రూప్ లతో కలిసి ముందుగా పరిశుభ్రత - పారిశుధ్యం, నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత, మరుగు దొడ్ల నిర్మాణం తదితర ముఖ్య అంశాలతో కూడిన విషయాలను ప్రజల నోటితో అనిపిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామ సభలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామం లోని వీధి లైట్లు, మురికి కాలువలను, రోడ్ల ను ఆమె ప్రత్యేకంగా తిరిగి పరిశీలించారు. గ్రామ కార్యదర్శి అక్బర్ నేతృత్వంలో గ్రామ ప్రజలు, వివిధ శాఖల సిబ్బంది స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు ఘన స్వాగతం పలికారు. అంజీర మొక్కను బహుమతి గా ఆమెకు అందజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ గ్రామ సభలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, కోర్ కమిటి కో కన్వీనర్ పెద్దనవేణి రాగన్న, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సా గౌడ్, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, విడిసి సభ్యులు సుంకం గంగారెడ్డి, శ్రీ పేరంబూదూరి సురేందర్ స్వామి, చింతపండు మల్లయ్య, అంగన్ వాడీ టీచర్లు, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు, మహిళా సమైక్య గ్రూప్ లీడర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటారు..? *కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజేశ్వరి విమర్శలు
సికింద్రాబాద్, నవంబర్ 23 ( ప్రజా మంటలు):
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖంతో విజయోత్సవాలు జరుపుకుంటోంది, ఎలాంటి నెరవేర్చని హామీలతో ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోంది అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మల్లేశ్వరపు రాజేశ్వరి ప్రశ్నించారు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు మినహా ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు కాలేదని ఆమె విమర్శించారు.... గుజరాత్లో SIR పని ఒత్తిడితో నాలుగు రోజుల్లో నలుగురు BLO సిబ్బంది మృతి
వడోదరా / గుజరాత్, నవంబర్ 22 (ప్రజా మంటలు):
గుజరాత్లో Special Intensive Revision (SIR) కార్యక్రమం క్రమంలో Booth Level Officers (BLO) మరియు BLO అసిస్టెంట్లపై భారీ పని ఒత్తిడి నెలకొంది. ఈ ఒత్తిడిలోనే వడోదరాలో BLO అసిస్టెంట్ ఉషాబెన్ ఇంద్రసింగ్ సోలంకీ విధి నిర్వహణలో మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో... అణు రంగంలో ప్రైవేట్ ప్రవేశానికి బిల్లు:: మరో 10 కీలక బిల్లులు సిద్ధం
న్యూ ఢిల్లీ, నవంబర్ 22 (ప్రజా మంటలు):
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే వింటర్ సెషన్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 10 కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. వీటిలో దేశంలోని సివిల్ న్యూక్లియర్ రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు తెరవడాన్ని ప్రతిపాదించే బిల్లు ప్రధానంగా నిలుస్తోంది.
అదేవిధంగా, చండీగఢ్పై రాష్ట్రపతికి నేరుగా చట్టాలు, నిబంధనలు రూపొందించే అధికారం... అందెశ్రీ కీర్తి తెలంగాణ చరిత్రలో శాశ్వతం:రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కవులు, కళాకారులలో అందెశ్రీ పేరు ఎన్నటికీ చెరిగిపోదని, రాష్ట్ర చరిత్రలో ఆయన స్థానం శాశ్వతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో జరిగిన అందెశ్రీ స్మారక సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వజ్రాలపై దశాబ్దాలు చర్చించినా కోహినూర్కు పోటీ లేకపోయినట్టే,... జగిత్యాల జిల్లా నూతన డీసీసీ అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం
జగిత్యాల, నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన జిల్లా కమిటీ అధ్యక్షుల్లో భాగంగా జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రి వర్గీయుడైన, గాజంగి నందయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇందిరా భవన్లో నందయ్యను ఘనంగా సన్మానించారు.... తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ప్రకటన
హైదరాబాద్ నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణలో డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది.డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించింది.
ఇక్కడ తెలంగాణ కొత్తగా ప్రకటించిన DCC అధ్యక్షుల జాబితా ను సులభంగా చదవగల టేబుల్ ఫార్మాట్లో అందిస్తున్నాను:
తెలంగాణ – జిల్లావారీ... ఇయ్యాల సికింద్రాబాద్ లో భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు) :
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ లో నేడు ఆదివారం ఉదయం భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం సీతాఫల్మండిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో బీజేపీ నాయకులు, జిల్లా యువజన శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.
ఉదయం 10 గంటలకు సీతాఫల్మండి... బీపీ పెరగడంతో నరాలు చిట్లి యువకుడు మృతి
ఇబ్రహీంపట్నం నవంబర్ 22 (ప్రజ మంటలు దగ్గుల అశోక్)
జగిత్యాలజిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన చెని ప్రసాద్(38) s/o చెని చిన్న దేవయ్య కుమారుడు బీపీతో మెదడు లో నరాలు చితికి పోవడంతో గత నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో లో చేర్పించారు.ఎలాంటి ట్రీట్మెంట్ కి స్పందించకపోవడంతో నిన్న రాత్రి... గౌహతి టెస్ట్: దక్షిణాఫ్రికా తొలి రోజు 247 పరుగులు
గౌహతి నవంబర్ 22:
భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ మరియు రియాన్ రికల్డన్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
మార్క్రామ్ 38 పరుగులకు, రికల్డన్ 35 పరుగులకు... అమీర్పేట్లో రూ.25 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ హర్షం..
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు):
అమీర్పేట్ డివిజన్లో రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు రక్షించారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. పార్కు కోసం దశాబ్దాల క్రితం కేటాయించిన 1500 గజాల స్థలాన్ని... కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ భోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. నర్సరీ,ఎల్ కేజీ, యూకేజీ చిన్నారి విద్యార్థులకు ఈ సందర్బంగా వెజిటేబుల్స్ ప్రాముఖ్యత గురించి వివరించారు.
దైనిందిన ఆహారంలో కూరగాయలను ఖచ్చితంగా తినాలని, వాటి వలన ఆరోగ్యం బాగుంటుందని, వెజిటేబుల్స్ లోని... కోరుట్ల తాళ్ళచెరువు ఫిల్టర్ బెడ్ పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ )బి రాజా గౌడ్
కోరుట్ల నవంబర్ 22(ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని తాళ్లచెరువు ఫిల్టర్ బెడ్ ను శనివారం పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) బి.రాజ గౌడ్
పట్టణం లోని పట్టణ ప్రజలకు సకాలంలో నీరు అందించాలి. ఫిల్టర్ బెడ్ ను మరియు నీరు యొక్క స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.... 