బుగ్గారం జి.పి.లో దొంగ నిర్మాణ అనుమతులు - ఆన్ లైన్ లో కనిపించని ఇండ్ల వివరాలు
వసూలైన ఇంటి పన్నులూ మాయం
దొంగ రశీదులతో ఇంటి పన్నుల వసూళ్లు
ట్రెజరీ లో జమ కాలేదని ఆరోపణ
గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడి దోపిడి
గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు పిర్యాదు
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - స్పెషల్ ఆపీసర్ జి.సునిత
బుగ్గారం ఏప్రిల్ 24:
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ హయాంలో ఇండ్ల నిర్మాణానికి దొంగ అనుమతి పత్రాలు జారీ అయ్యాయని ఆరోపిస్తూ తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి గురువారం స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు పిర్యాదు చేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్పెషల్ ఆపీసర్ జి. సునిత అధ్యక్షతన గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి ప్రత్యేకంగా పిర్యాదు చేస్తూ గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడిగా దోచుకున్నారని ఆరోపించారు.
భారీగా అవినీతికి పాల్పడి సుమారు 30 ఇండ్ల కు దొంగ అనుమతి పత్రాలు జారీ చేశారని అన్నారు. ఆ ఇండ్ల వివరాలు నేడు ఆన్ లైన్ లో కనబడడం లేదన్నారు. అదే ఇండ్ల పై ప్రతి ఏటా వసూలు చేసిన ఇంటి పన్నులు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయ రికార్డులలో నమోదు కాలేదన్నారు. అట్టి రశీదుల సొమ్ము కూడా ట్రెజరీ ద్వారా బ్యాంక్ ఖాతాలో కూడా జమ కాలేదని చుక్క గంగారెడ్డి సూచించారు. స్థానిక మండల పంచాయతీ అధికారి దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా, గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ లు ఇద్దరూ కుమ్మక్కై ఈ అక్రమాలు చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తగు విచారణ జరిపి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధిత ఇంటి యజమానులకు కూడా సరైన న్యాయం చేయాలని ఆయన కోరారు. *PRESS NOTE* - 2
గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దాం
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - బుగ్గారం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన స్పెషల్ ఆపీసర్ జి.సునిత 
బుగ్గారం గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దామని, ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంచుదామని స్పెషల్ ఆపీసర్ జి. సునీత గురువారం బుగ్గారం గ్రామ ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆమె అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు హాజరైన ప్రజలతో, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సమైక్య గ్రూప్ లతో కలిసి ముందుగా పరిశుభ్రత - పారిశుధ్యం, నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత, మరుగు దొడ్ల నిర్మాణం తదితర ముఖ్య అంశాలతో కూడిన విషయాలను ప్రజల నోటితో అనిపిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామ సభలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామం లోని వీధి లైట్లు, మురికి కాలువలను, రోడ్ల ను ఆమె ప్రత్యేకంగా తిరిగి పరిశీలించారు. గ్రామ కార్యదర్శి అక్బర్ నేతృత్వంలో గ్రామ ప్రజలు, వివిధ శాఖల సిబ్బంది స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు ఘన స్వాగతం పలికారు. అంజీర మొక్కను బహుమతి గా ఆమెకు అందజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ గ్రామ సభలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, కోర్ కమిటి కో కన్వీనర్ పెద్దనవేణి రాగన్న, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సా గౌడ్, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, విడిసి సభ్యులు సుంకం గంగారెడ్డి, శ్రీ పేరంబూదూరి సురేందర్ స్వామి, చింతపండు మల్లయ్య, అంగన్ వాడీ టీచర్లు, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు, మహిళా సమైక్య గ్రూప్ లీడర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విజయకాంత్.డీఎండీకే పార్టీ డీఎంకే కూటమిలో తొలిసారి చేరిక
చెన్నై, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ డీఎంకే కూటమిలో చేరని డీఎండీకే, తొలిసారిగా డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎండీకే, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా పోటీ చేయనుంది.
పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు... ఏఐ ని ప్రజాస్వామ్యీకరించాలి – గ్లోబల్ సౌత్కు సాధికారత సాధనంగా మారాలి
న్యూఢిల్లీ ఫిబ్రవరి 19:
కృత్రిమ మేధ (ఏఐ)ని ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరం ఉందని, అది ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ దేశాలకు సమావేశం, సాధికారతకు మాధ్యమంగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఏఐ ఇంపాక్ట్ కాన్క్లేవ్లో మాట్లాడిన ప్రధాని, ఏఐ అభివృద్ధి కొద్ది దేశాలు, కొద్ది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికతను... బడ్జెట్ సమావేశాల్లో హామీల అమలు చేయాలి – ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఎన్నికల హామీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని, ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు... మూడు టీ20 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ వరుసగా డక్ అవుట్
అహ్మదాబాద్ ఫిబ్రవరి 18:
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో శూన్య పరుగులకే అవుట్ కావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆయా మ్యాచ్ల వివరాలు ఇలా ఉన్నాయి:
1️⃣ భారత్ – అమెరికా
వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం
ఎవరి బౌలింగ్లో: షాడ్లీ వాన్ షాల్క్విక్
ఎన్ని బంతులు:... ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ.. ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్కు బ్రిటిష్ పౌరుడు
సికింద్రాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):
130 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లో మరణించిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఇంగ్లండ్కు చెందిన రాబిన్ డిక్సన్ హైదరాబాద్కు వచ్చారు. దాదాపు 19 ఏళ్ల అన్వేషణ ఎట్టకేలకు ఫలించడంతో, పూర్వీకుడి సమాధి వద్ద భావోద్వేగంతో నివాళులర్పించారు.
రాబిన్ డిక్సన్ తన కుటుంబ పాత దస్త్రాల ద్వారా తన ముత్తాత... చంచల్గూడా జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):
ఐబొమ్మ వ్యవహారంలో అరెస్టై సుమారు 90 రోజులుగా జైలులో ఉన్న ఐబొమ్మ రవి కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
బెయిల్ ఉత్తర్వుల నేపథ్యంలో రవిని చంచల్గూడా జైలు అధికారులు విడుదల చేశారు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహణకు సంబంధించి రవిపై మొత్తం ఐదు... నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):
పవిత్ర రంజాన్ నెలవంక భారత్లో నిన్న దర్శనమివ్వడంతో, ముస్లిం సోదరులు ఈరోజు (గురువారం) నుంచి రంజాన్ ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. నెల రోజుల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసాలు పాటిస్తూ, అల్లాహ్కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
రంజాన్ మాసం ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది.... నియోజకవర్గ సర్పంచులకు న్యాక్ కేంద్రంలో దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 18 ( ప్రజా మంటలు)తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆద్వర్యం లో జగిత్యాల న్యాక్ కేంద్రం లో జగిత్యాల నియోజకవర్గ సర్పంచుల ఓరియంటేషన్ 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులకు దిశానిర్దేశం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ... మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ – మార్చి 3 వరకు రిమాండ్
క్యాతనపల్లి, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను క్యాతనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎంపిక సందర్భంగా జరిగిన గందరగోళంలో పోలీసులపై దాడి చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల సమాచారం ప్రకారం, చైర్మన్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు... బయోఏషియా–2026 వేదికగా హైదరాబాద్ను ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):
వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ గుర్తింపు పొందిన హైదరాబాద్ను ఇకపై ప్రపంచ జీవవిజ్ఞాన (Life Sciences) రాజధానిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. BioAsia–2026 అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన 23వ బయోఏషియా సదస్సును పరిశ్రమల శాఖ మంత్రి ... తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16 నుంచి పాఠశాలలను ఒంటిపూటగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తించనుంది.
అధికారుల ప్రకారం ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం... ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికలకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి : మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):
ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు.
మంగళవారం సచివాలయంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... 