బుగ్గారం జి.పి.లో దొంగ నిర్మాణ అనుమతులు -  ఆన్ లైన్ లో కనిపించని ఇండ్ల వివరాలు

On
బుగ్గారం జి.పి.లో దొంగ నిర్మాణ అనుమతులు -   ఆన్ లైన్ లో కనిపించని ఇండ్ల వివరాలు

వసూలైన ఇంటి పన్నులూ మాయం
దొంగ రశీదులతో ఇంటి పన్నుల వసూళ్లు

ట్రెజరీ లో జమ కాలేదని ఆరోపణ
గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడి దోపిడి

గ్రామ సభలో  స్పెషల్ ఆపీసర్ కు పిర్యాదు
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - స్పెషల్ ఆపీసర్ జి.సునిత  


బుగ్గారం ఏప్రిల్ 24:

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ హయాంలో ఇండ్ల నిర్మాణానికి దొంగ అనుమతి పత్రాలు జారీ అయ్యాయని ఆరోపిస్తూ తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి గురువారం స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు పిర్యాదు చేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్పెషల్ ఆపీసర్ జి. సునిత అధ్యక్షతన గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి ప్రత్యేకంగా పిర్యాదు చేస్తూ గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడిగా దోచుకున్నారని ఆరోపించారు.
భారీగా అవినీతికి పాల్పడి సుమారు 30 ఇండ్ల కు దొంగ అనుమతి పత్రాలు జారీ చేశారని అన్నారు. ఆ ఇండ్ల వివరాలు నేడు ఆన్ లైన్ లో కనబడడం లేదన్నారు. అదే ఇండ్ల పై ప్రతి ఏటా వసూలు చేసిన ఇంటి పన్నులు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయ రికార్డులలో నమోదు కాలేదన్నారు. అట్టి రశీదుల సొమ్ము కూడా ట్రెజరీ ద్వారా బ్యాంక్ ఖాతాలో కూడా జమ కాలేదని చుక్క గంగారెడ్డి సూచించారు. స్థానిక మండల పంచాయతీ అధికారి దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా, గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ లు ఇద్దరూ కుమ్మక్కై ఈ అక్రమాలు చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తగు విచారణ జరిపి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆపీసర్ కు  చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధిత ఇంటి యజమానులకు కూడా సరైన న్యాయం చేయాలని ఆయన కోరారు. *PRESS NOTE* - 2


గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దాం

ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - బుగ్గారం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన స్పెషల్ ఆపీసర్ జి.సునిత  IMG-20250424-WA0009

బుగ్గారం గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దామని, ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంచుదామని స్పెషల్ ఆపీసర్ జి. సునీత గురువారం బుగ్గారం గ్రామ ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆమె అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు హాజరైన ప్రజలతో, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సమైక్య గ్రూప్ లతో కలిసి ముందుగా పరిశుభ్రత - పారిశుధ్యం, నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత, మరుగు దొడ్ల నిర్మాణం తదితర ముఖ్య అంశాలతో కూడిన విషయాలను ప్రజల నోటితో అనిపిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామ సభలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
 గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామం లోని వీధి లైట్లు, మురికి కాలువలను, రోడ్ల ను ఆమె ప్రత్యేకంగా తిరిగి పరిశీలించారు.  గ్రామ కార్యదర్శి అక్బర్ నేతృత్వంలో గ్రామ ప్రజలు, వివిధ శాఖల సిబ్బంది స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు ఘన స్వాగతం పలికారు. అంజీర మొక్కను బహుమతి గా ఆమెకు అందజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు. 
ఈ గ్రామ సభలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్,  కోర్ కమిటి కో కన్వీనర్ పెద్దనవేణి రాగన్న, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సా గౌడ్, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, విడిసి సభ్యులు సుంకం గంగారెడ్డి, శ్రీ పేరంబూదూరి సురేందర్ స్వామి, చింతపండు మల్లయ్య, అంగన్ వాడీ టీచర్లు, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు, మహిళా సమైక్య గ్రూప్ లీడర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి 

జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది  - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి  జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)యావర్ రోడ్డు పై అక్రమ నిర్మాణాలు తొలగించండి జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో జీవన్ రెడ్డి పిర్యాదు    జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అవలంబిస్తున్న వైఖరి చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన జగిత్యాల జిల్లా  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో...
Read More...
Local News 

బదిలీ పై వెళుతున్న సహాయ సంచాలకులు డా.బి.నరేష్ ను సన్మానించిన టిఎన్జీఓ లు

బదిలీ పై వెళుతున్న సహాయ సంచాలకులు డా.బి.నరేష్ ను సన్మానించిన టిఎన్జీఓ లు   జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లా పశు సంవర్థక శాఖ లో సహాయ సంచాలకులు గా పని చేసిన డా.బోనగిరి నరేష్  ఇటీవలే బదిలీ పై కరీంనగర్ వెళ్లిన సందర్బంగా జిల్లా పశు వైద్యాధికారి డా.బి.ప్రకాశ్  అధ్యక్షతన నిర్వహించిన వీడ్కోలు సన్మాన కార్యక్రమం లో టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఎన్జీఓ...
Read More...
Local News 

జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లాను వైద్య ఆరోగ్య రంగాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి, పేద వర్గాల వారికి ఆధునిక వైద్య సౌకర్యాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో...
Read More...
Local News 

సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత

సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత మంచిర్యాల/బెల్లంపల్లి/ఆసిఫాబాద్, జూన్ 15 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన ఉత్తర తెలంగాణ పర్యటనలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, కేస్లాపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యలు, ఆదివాసీ హక్కులు, యువత ఉపాధి, విద్యా-వైద్య రంగాలపై పార్టీ వైఖరిని వెల్లడించారు. మంచిర్యాలలో...
Read More...
Crime  State News 

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ  ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ  ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్ జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు): (చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)  జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్‌లను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి...
Read More...
State News 

ఖమ్మం బాధితురాలికి న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత

ఖమ్మం బాధితురాలికి న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని త్వరితగతిన శిక్ష పడేలా...
Read More...
State News 

ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక

ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజతో సహా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు రూప్ సింగ్ డిమాండ్ చేశారు. కేంద్రం 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండగా, రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి...
Read More...
Local News 

సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు 

సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు  జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కు చెందిన ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త ఎంవీ నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం మృతి చెందగా బుధవారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నరసింహారెడ్డి కుమారులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు చితికి నిప్పు అంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమయాత్రలో బంధువులు అభిమానులు శిష్యులు కళాశాల...
Read More...
Local News 

రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన

రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన    జగిత్యాల : జూన్ 10(ప్రజా మంటలు) ప్రపంచ నేత్రదాన దినోత్సవం జూన్ 10, సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ - రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, హైదరాబాద్ వారి సహకారంతో బుధవారం పెన్షనర్స్ భవన్ (కోర్ట్ ప్రక్కన) “కంటి దానం – నేత్రదాన ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం”...
Read More...
Local News 

స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు

స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు జగిత్యాల జూన్ 10(ప్రజా మంటలు)స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను సేకరించిన ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ కు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సునీల్ కుమార్, ఎం సి హెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సిరిసిల్లశ్రీనివాస్, రోటరీసభ్యులు టీవి సూర్యం ద్వారా అందజేస్తున్న రామేశం కుమారుడు మంచాల...
Read More...
Local News 

దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ

దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు): దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు....
Read More...
State News 

నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి

నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు): జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు. ఒక...
Read More...