బుగ్గారం జి.పి.లో దొంగ నిర్మాణ అనుమతులు - ఆన్ లైన్ లో కనిపించని ఇండ్ల వివరాలు
వసూలైన ఇంటి పన్నులూ మాయం
దొంగ రశీదులతో ఇంటి పన్నుల వసూళ్లు
ట్రెజరీ లో జమ కాలేదని ఆరోపణ
గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడి దోపిడి
గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు పిర్యాదు
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - స్పెషల్ ఆపీసర్ జి.సునిత
బుగ్గారం ఏప్రిల్ 24:
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ హయాంలో ఇండ్ల నిర్మాణానికి దొంగ అనుమతి పత్రాలు జారీ అయ్యాయని ఆరోపిస్తూ తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి గురువారం స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు పిర్యాదు చేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్పెషల్ ఆపీసర్ జి. సునిత అధ్యక్షతన గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి ప్రత్యేకంగా పిర్యాదు చేస్తూ గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడిగా దోచుకున్నారని ఆరోపించారు.
భారీగా అవినీతికి పాల్పడి సుమారు 30 ఇండ్ల కు దొంగ అనుమతి పత్రాలు జారీ చేశారని అన్నారు. ఆ ఇండ్ల వివరాలు నేడు ఆన్ లైన్ లో కనబడడం లేదన్నారు. అదే ఇండ్ల పై ప్రతి ఏటా వసూలు చేసిన ఇంటి పన్నులు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయ రికార్డులలో నమోదు కాలేదన్నారు. అట్టి రశీదుల సొమ్ము కూడా ట్రెజరీ ద్వారా బ్యాంక్ ఖాతాలో కూడా జమ కాలేదని చుక్క గంగారెడ్డి సూచించారు. స్థానిక మండల పంచాయతీ అధికారి దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా, గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ లు ఇద్దరూ కుమ్మక్కై ఈ అక్రమాలు చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తగు విచారణ జరిపి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధిత ఇంటి యజమానులకు కూడా సరైన న్యాయం చేయాలని ఆయన కోరారు. *PRESS NOTE* - 2
గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దాం
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - బుగ్గారం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన స్పెషల్ ఆపీసర్ జి.సునిత 
బుగ్గారం గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దామని, ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంచుదామని స్పెషల్ ఆపీసర్ జి. సునీత గురువారం బుగ్గారం గ్రామ ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆమె అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు హాజరైన ప్రజలతో, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సమైక్య గ్రూప్ లతో కలిసి ముందుగా పరిశుభ్రత - పారిశుధ్యం, నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత, మరుగు దొడ్ల నిర్మాణం తదితర ముఖ్య అంశాలతో కూడిన విషయాలను ప్రజల నోటితో అనిపిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామ సభలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామం లోని వీధి లైట్లు, మురికి కాలువలను, రోడ్ల ను ఆమె ప్రత్యేకంగా తిరిగి పరిశీలించారు. గ్రామ కార్యదర్శి అక్బర్ నేతృత్వంలో గ్రామ ప్రజలు, వివిధ శాఖల సిబ్బంది స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు ఘన స్వాగతం పలికారు. అంజీర మొక్కను బహుమతి గా ఆమెకు అందజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ గ్రామ సభలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, కోర్ కమిటి కో కన్వీనర్ పెద్దనవేణి రాగన్న, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సా గౌడ్, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, విడిసి సభ్యులు సుంకం గంగారెడ్డి, శ్రీ పేరంబూదూరి సురేందర్ స్వామి, చింతపండు మల్లయ్య, అంగన్ వాడీ టీచర్లు, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు, మహిళా సమైక్య గ్రూప్ లీడర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎప్స్టైన్ ఫోటోల కొత్త కలెక్షన్ విడుదల… వూడీ అలెన్, గేట్స్, క్లింటన్, ట్రంప్ వంటి ప్రముఖుల హాజరు
వాషింగ్టన్ డిసెంబర్ 12:
అమెరికాలో హౌస్ ఓవర్సైట్ కమిటీకి లభించిన జెఫ్రీ ఎప్స్టైన్ ఫోటోల కొత్త ట్రోవ్ దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. డెమోక్రాట్లు విడుదల చేసిన ఈ ۱۹ చిత్రాల్లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు కనిపించడం మరింత వివాదాస్పదంగా మారింది.
🔻 ఎవరు ఉన్నారు ఈ ఫోటోలలో?
మొత్తం దాదాపు తొంభై... మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి :బార్ కౌన్సిల్పై మహిళా న్యాయవాదుల నిరసన
సికింద్రాబాద్, డిసెంబర్ 12 (ప్రజామంటలు):
తెలంగాణ బార్ కౌన్సిల్లో మహిళలకు రిజర్వేషన్ లేకపోవడం తీవ్ర అన్యాయమని మహిళా న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు అడ్వకేట్ డా. జీ. సుభాషిణి మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో తాను ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.
బార్ కౌన్సిల్ ఏర్పాటైన... సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, వార్డు సభ్యులకు మంత్రి పొన్నం ఘన సత్కారం
భీమదేవరపల్లి, డిసెంబర్ 12 (ప్రజామంటలు) :
గ్రామీణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ములుకనూరు గ్రామ పంచాయతీ కొత్త సర్పంచ్గా విజయం సాధించిన జాలి ప్రమోద్ రెడ్డితో పాటు ఎన్నికైన వార్డు సభ్యులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి... సైబర్ మోసాలకు ఫుల్స్టాప్ : వంగరలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం
భీమదేవరపల్లి, డిసెంబర్ 12 (ప్రజామంటలు) :
సైబర్ మోసాలకు పూర్తిగా చెక్ పెట్టే లక్ష్యంతో భీమదేవరపల్లి మండలంలోని వంగర పోలీస్స్టేషన్ అధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వంగర ఎంసీఆర్బి గోదాం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు హాజరై ఆసక్తిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ జి. దివ్య మాట్లాడుతూ, ఇటీవలి... ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
*ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష*జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు)రెండవ విడత జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు మూడవ ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు.
అనంతరం ఎన్నికల నిర్వహణ... ఎన్నికల నేపథ్యంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కవాత్
(ప్రతినిధి అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 12 (ప్రజా మంటలు)
ధర్మపురి సీఐ రాంనర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ప్రజలు శాంతి యుత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల పరిస్థితుల పర్యవేక్షణ కోసం జగిత్యాల... గాంధీ రోగులకు లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం
ప్రతి శనివారం గాంధీలో లీగల్ సెల్ హెల్ఫ్ డెస్క్.. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి
సికింద్రాబాద్, డిసెంబర్ 12 ( ప్రజామంటలు) :
గాంధీ ఆస్పత్రిలో లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ విభాగం ఆధ్వర్యంలో రోగులకు, వారి సహాయకులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో వచ్చిందని సూపరింటెండెంట్ డా.వాణి తెలిపారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్... కాంగ్రెస్ కీలక సమావేశాలకు శశి థరూర్ 3వ సారి గైర్హాజరు : పార్టీ నేతల్లో ఆందోళన
న్యూ ఢిల్లీ డిసెంబర్ 12 (ప్రత్యేక ప్రతినిధి):
కాంగ్రెస్ సీనియర్ నేత, త్రివేండ్రం ఎంపీ శశి థరూర్ వరుసగా మూడోసారి పార్టీ కీలక సమావేశానికి హాజరు కాకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం జరిగిన స్టేట్ బ్యాంకెట్కు హాజరైన ఏకైక కాంగ్రెస్ ఎంపీగా థరూర్ నిలిచిన నేపథ్యంతో,... ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు)జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం రోజున దరూర్ క్యాంప్ లో ఈవీఎం లను భద్రపరిచిన గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల... దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత..." "ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి..." డా. భోగ శ్రావణి బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు
"జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో శృంగేరి శారద పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చే నిర్వహించబడుతున్న మహాభారత ప్రవచన మహా యజ్ఞం కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ... 108 శ్రీ చక్ర సహిత శ్రీ లలితామాత ఆలయంలో వైభవంగా కుంకుమార్చన
జగిత్యాల రూరల్ డిసెంబర్ 12 ( ప్రజా మంటలు)
S. వేణు గోపాల్ 108 శ్రీ చక్ర సహిత శ్రీ లలితామాత దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి మంగళహారతులను సమర్పించారు. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఫౌండరి ట్రస్టి చైర్మన్ శ్రీమతి చెల్లం స్వరూప ఆధ్వర్యంలో విశేష సంఖ్యలో మాతలు పాల్గొని... మళ్లీ ఉద్యమానికి సిద్ధమైన అన్నా హజారే — మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం
పుణె డిసెంబర్ 12 (ప్రత్యేక ప్రతినిధి):
దేశాన్ని ఒకప్పుడు కదిలించిన మహా నిరసనల నాయకుడు అన్నా హజారే… బీజేపీ ప్రభుత్వంపై పలుమార్లు కోరినా, ఆయన మళ్లీ ఉద్యమానికి దిగలేదు. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంపై దీక్ష ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో హల్చల్ ఏర్పడింది.
88 ఏళ్ల అన్నా హజారే,జనవరి 30 నుంచి స్వగ్రామం... 