బుగ్గారం జి.పి.లో దొంగ నిర్మాణ అనుమతులు -  ఆన్ లైన్ లో కనిపించని ఇండ్ల వివరాలు

On
బుగ్గారం జి.పి.లో దొంగ నిర్మాణ అనుమతులు -   ఆన్ లైన్ లో కనిపించని ఇండ్ల వివరాలు

వసూలైన ఇంటి పన్నులూ మాయం
దొంగ రశీదులతో ఇంటి పన్నుల వసూళ్లు

ట్రెజరీ లో జమ కాలేదని ఆరోపణ
గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడి దోపిడి

గ్రామ సభలో  స్పెషల్ ఆపీసర్ కు పిర్యాదు
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - స్పెషల్ ఆపీసర్ జి.సునిత  


బుగ్గారం ఏప్రిల్ 24:

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ హయాంలో ఇండ్ల నిర్మాణానికి దొంగ అనుమతి పత్రాలు జారీ అయ్యాయని ఆరోపిస్తూ తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి గురువారం స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు పిర్యాదు చేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్పెషల్ ఆపీసర్ జి. సునిత అధ్యక్షతన గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి ప్రత్యేకంగా పిర్యాదు చేస్తూ గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడిగా దోచుకున్నారని ఆరోపించారు.
భారీగా అవినీతికి పాల్పడి సుమారు 30 ఇండ్ల కు దొంగ అనుమతి పత్రాలు జారీ చేశారని అన్నారు. ఆ ఇండ్ల వివరాలు నేడు ఆన్ లైన్ లో కనబడడం లేదన్నారు. అదే ఇండ్ల పై ప్రతి ఏటా వసూలు చేసిన ఇంటి పన్నులు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయ రికార్డులలో నమోదు కాలేదన్నారు. అట్టి రశీదుల సొమ్ము కూడా ట్రెజరీ ద్వారా బ్యాంక్ ఖాతాలో కూడా జమ కాలేదని చుక్క గంగారెడ్డి సూచించారు. స్థానిక మండల పంచాయతీ అధికారి దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా, గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ లు ఇద్దరూ కుమ్మక్కై ఈ అక్రమాలు చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తగు విచారణ జరిపి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆపీసర్ కు  చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధిత ఇంటి యజమానులకు కూడా సరైన న్యాయం చేయాలని ఆయన కోరారు. *PRESS NOTE* - 2


గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దాం

ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - బుగ్గారం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన స్పెషల్ ఆపీసర్ జి.సునిత  IMG-20250424-WA0009

బుగ్గారం గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దామని, ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంచుదామని స్పెషల్ ఆపీసర్ జి. సునీత గురువారం బుగ్గారం గ్రామ ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆమె అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు హాజరైన ప్రజలతో, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సమైక్య గ్రూప్ లతో కలిసి ముందుగా పరిశుభ్రత - పారిశుధ్యం, నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత, మరుగు దొడ్ల నిర్మాణం తదితర ముఖ్య అంశాలతో కూడిన విషయాలను ప్రజల నోటితో అనిపిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామ సభలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
 గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామం లోని వీధి లైట్లు, మురికి కాలువలను, రోడ్ల ను ఆమె ప్రత్యేకంగా తిరిగి పరిశీలించారు.  గ్రామ కార్యదర్శి అక్బర్ నేతృత్వంలో గ్రామ ప్రజలు, వివిధ శాఖల సిబ్బంది స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు ఘన స్వాగతం పలికారు. అంజీర మొక్కను బహుమతి గా ఆమెకు అందజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు. 
ఈ గ్రామ సభలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్,  కోర్ కమిటి కో కన్వీనర్ పెద్దనవేణి రాగన్న, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సా గౌడ్, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, విడిసి సభ్యులు సుంకం గంగారెడ్డి, శ్రీ పేరంబూదూరి సురేందర్ స్వామి, చింతపండు మల్లయ్య, అంగన్ వాడీ టీచర్లు, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు, మహిళా సమైక్య గ్రూప్ లీడర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

చెరువులను,కుంటలను రక్షించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

చెరువులను,కుంటలను రక్షించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల (రూరల్) నవంబర్ 27 (ప్రజా మంటలు): సారంగాపూర్‌లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గీత కార్మికులు, గంగపుత్రులు, ముదిరాజులు, గొర్ల కాపరులు వంటి కుల వృత్తుల ప్రోత్సాహం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కల్లు దుకాణాలు, చెరువులు–కుంటల హక్కులు గ్రామస్థులకే ఇవ్వాలని, మత్స్య కార్మికులకు సహకార సంఘాల ద్వారా...
Read More...

ఎల్లారెడ్డి – బాన్సువాడ ప్రాంతాల్లో జాగృతి జనంబాటలో భాగంగా పర్యటించిన కల్వకుంట్ల కవిత

ఎల్లారెడ్డి – బాన్సువాడ ప్రాంతాల్లో జాగృతి జనంబాటలో భాగంగా పర్యటించిన కల్వకుంట్ల కవిత ఎల్లారెడ్డి/బాన్సువాడ – నవంబర్ 27 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా పలు పర్యటనలు నిర్వహించారు. విద్యార్థులు, రైతులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. బాన్సువాడ –...
Read More...
State News 

హైదరాబాద్ లో రాజ్యాంగ దినోత్సవ ఫోటో ఎగ్జిబిషన్

హైదరాబాద్ లో రాజ్యాంగ దినోత్సవ ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించిన అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ హైదరాబాద్, నవంబర్ 27 (ప్రజా మంటలు)::  రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫోటో ప్రదర్శనను గురువారం తెలంగాణ హైకోర్టు భారత అదనపు సొలిసిటర్ జనరల్  బి. నరసింహ శర్మ సందర్శించారు....
Read More...
National  International  

భారత్ నుంచి అమెరికా కంపెనీ భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం

భారత్ నుంచి అమెరికా కంపెనీ  భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం శ్రీహరికోట (SDSC) నుండి LVM-3 రాకెట్ ద్వారా BlueBird-6ను పంపిణీ చేయనున్నది — ఇది LEOలోకి వెళ్లే అత్యంత భారీ వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో ఒకటి.   ISRO: డిసెంబర్ 15, 2025 — భారత్ నుంచి అమెరికా కంపెనీ AST SpaceMobile యొక్క భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)...
Read More...
Crime  State News 

ACB కి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్

ACB కి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు):      ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి మళ్ళీ రాజ్యమేలిందని చూపించే ఘటన వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ రాజు తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఇంటి నంబర్ కేటాయింపునకు రూ. 20,000 లంచం డిమాండ్ ఒక వ్యక్తికి ఇంటి నంబర్ కేటాయింపునకు...
Read More...

నూక పెల్లి డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆందోళన

నూక పెల్లి డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆందోళన జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు)నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డ్రైనేజీ నీటి సమస్య పరిష్కరించాలని గురువారం ఆందోళన చేపట్టారు. జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై  మహిళలు బైఠాయించడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. త్వరలోనే  నీటి సౌకర్యం,డ్రైనేజీ సమస్య తీర్చాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ సర్కారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్,అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్...
Read More...

బీసీలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొడదాం.. బీసీల సత్తా చాటుదాం   తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

బీసీలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొడదాం.. బీసీల సత్తా చాటుదాం   తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సారంగాపూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు)  సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...  కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది, బీసీ ల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.  కులగణన...
Read More...

ర్యాగింగ్‌ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ర్యాగింగ్‌ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల నవంబర్ 27(ప్రజా మంటలు)గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి    జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ మరియు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన సదస్సును...
Read More...
Local News 

గొల్లపల్లిలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెల్ఫేర్ అవగాహన సదస్సులు

గొల్లపల్లిలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెల్ఫేర్ అవగాహన సదస్సులు (అంకం భూమయ్య): గొల్లపల్లి నవంబర్ 27 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా జిల్లా ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ లో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెల్ఫేర్ కార్యక్రమం కింద అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ వీరలక్ష్మి, మహిళా సాధికారత కేంద్రం సభ్యులు స్వప్న, గౌతమి, హేమశ్రీ విద్యార్థులు, తల్లులు,...
Read More...
National  Crime  State News 

తంజావూర్‌లో దారుణం: ప్రేమ పేరుతో యువతిని నరికి చంపిన అజిత్‌కుమార్‌

తంజావూర్‌లో దారుణం: ప్రేమ పేరుతో యువతిని నరికి చంపిన అజిత్‌కుమార్‌ తంజావూర్ (తమిళనాడు) నవంబర్ 27:   తమిళనాడు తంజావూర్ జిల్లాలో మరొకటి హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో విఫలమైన ఓ యువకుడు అతి దారుణానికి ఒడిగట్టాడు. యువతి మరొకరిని పెళ్లి చేసుకోబోతుందనే ఆగ్రహంతో యువకుడు నేరుగా దాడి చేసి నరికి చంపిన ఘటన పెద్ద కలకలం రేపింది. ప్రేమలో విఫలం – ఘాతుకానికి...
Read More...
Crime  State News 

సీనియర్ IPS అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు

సీనియర్ IPS అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు అమరావతి నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఆరోపణలతో చుట్టుముట్టిన సీనియర్ IPS అధికారి సంజయ్ పై మరో కీలక నిర్ణయం. ఇప్పటికే అమల్లో ఉన్న సస్పెన్షన్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో, ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేస్తూ సస్పెన్షన్‌ను వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు పొడిగించింది. విజిలెన్స్ నివేదిక –...
Read More...
Local News  Crime 

మంచిర్యాల జిల్లా నంబాల గ్రామంలో 6 ఏళ్ల బాలికను హత్య చేసి బావిలో పడేశారు

మంచిర్యాల జిల్లా నంబాల గ్రామంలో 6 ఏళ్ల బాలికను హత్య చేసి బావిలో పడేశారు మంచిర్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు): మంచిర్యాల జిల్లా, డండేపల్లి మండలం నంబాల గ్రామంలో జరిగిన హృదయ విదారక ఘటన స్థానికులను కలచివేసింది. మూడు రోజులుగా అదృశ్యమైన ఆరుగేళ్ల చిన్నారి మృతదేహం గ్రామంలోని ఓ బావిలో గుర్తించబడింది. ఘటనపై పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఘటన వివరాలు - మృతురాలు: *శనిగరపు మహాన్విత (వయస్సు...
Read More...