బుగ్గారం జి.పి.లో దొంగ నిర్మాణ అనుమతులు - ఆన్ లైన్ లో కనిపించని ఇండ్ల వివరాలు
వసూలైన ఇంటి పన్నులూ మాయం
దొంగ రశీదులతో ఇంటి పన్నుల వసూళ్లు
ట్రెజరీ లో జమ కాలేదని ఆరోపణ
గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడి దోపిడి
గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు పిర్యాదు
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - స్పెషల్ ఆపీసర్ జి.సునిత
బుగ్గారం ఏప్రిల్ 24:
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ హయాంలో ఇండ్ల నిర్మాణానికి దొంగ అనుమతి పత్రాలు జారీ అయ్యాయని ఆరోపిస్తూ తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి గురువారం స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు పిర్యాదు చేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్పెషల్ ఆపీసర్ జి. సునిత అధ్యక్షతన గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి ప్రత్యేకంగా పిర్యాదు చేస్తూ గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడిగా దోచుకున్నారని ఆరోపించారు.
భారీగా అవినీతికి పాల్పడి సుమారు 30 ఇండ్ల కు దొంగ అనుమతి పత్రాలు జారీ చేశారని అన్నారు. ఆ ఇండ్ల వివరాలు నేడు ఆన్ లైన్ లో కనబడడం లేదన్నారు. అదే ఇండ్ల పై ప్రతి ఏటా వసూలు చేసిన ఇంటి పన్నులు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయ రికార్డులలో నమోదు కాలేదన్నారు. అట్టి రశీదుల సొమ్ము కూడా ట్రెజరీ ద్వారా బ్యాంక్ ఖాతాలో కూడా జమ కాలేదని చుక్క గంగారెడ్డి సూచించారు. స్థానిక మండల పంచాయతీ అధికారి దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా, గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ లు ఇద్దరూ కుమ్మక్కై ఈ అక్రమాలు చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తగు విచారణ జరిపి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధిత ఇంటి యజమానులకు కూడా సరైన న్యాయం చేయాలని ఆయన కోరారు. *PRESS NOTE* - 2
గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దాం
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - బుగ్గారం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన స్పెషల్ ఆపీసర్ జి.సునిత 
బుగ్గారం గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దామని, ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంచుదామని స్పెషల్ ఆపీసర్ జి. సునీత గురువారం బుగ్గారం గ్రామ ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆమె అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు హాజరైన ప్రజలతో, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సమైక్య గ్రూప్ లతో కలిసి ముందుగా పరిశుభ్రత - పారిశుధ్యం, నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత, మరుగు దొడ్ల నిర్మాణం తదితర ముఖ్య అంశాలతో కూడిన విషయాలను ప్రజల నోటితో అనిపిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామ సభలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామం లోని వీధి లైట్లు, మురికి కాలువలను, రోడ్ల ను ఆమె ప్రత్యేకంగా తిరిగి పరిశీలించారు. గ్రామ కార్యదర్శి అక్బర్ నేతృత్వంలో గ్రామ ప్రజలు, వివిధ శాఖల సిబ్బంది స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు ఘన స్వాగతం పలికారు. అంజీర మొక్కను బహుమతి గా ఆమెకు అందజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ గ్రామ సభలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, కోర్ కమిటి కో కన్వీనర్ పెద్దనవేణి రాగన్న, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సా గౌడ్, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, విడిసి సభ్యులు సుంకం గంగారెడ్డి, శ్రీ పేరంబూదూరి సురేందర్ స్వామి, చింతపండు మల్లయ్య, అంగన్ వాడీ టీచర్లు, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు, మహిళా సమైక్య గ్రూప్ లీడర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉద్యమ స్ఫూర్తికి గౌరవం – ఎమ్మెల్సీగా కోదండరాం నియామకంపై శుభాకాంక్షల వెల్లువ
జగిత్యాల, ఏప్రిల్ 25 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్. కోదండరాం ఎమ్మెల్సీగా నియామకం కావడం పట్ల తెలంగాణ జన సమితి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ రథసారధిగా ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లిన ఆయనకు ఈ పదవి లభించడం సముచిత గౌరవమని... మన కేసీఆర్ కాదు… మారిన మనిషి!” – బీఆర్ఎస్పై తీవ్ర దాడి, కొత్త పార్టీతో అధికారమే లక్ష్యం
హైదరాబాద్ ఏప్రిల్ 25 (ప్రజా మంటలు);
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపేలా జాగృతి నేత కేసీఆర్పై నేరుగా, నిర్భయంగా విరుచుకుపడ్డారు. “ఇవ్వాళ ఉన్నది మన కేసీఆర్ కాదు… మారిన మనిషి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో ప్రజల కోసం పోరాడిన నాయకుడు, ఇప్పుడు ప్రజలను పట్టించుకోని పాలకుడిగా మారిపోయాడని విమర్శించారు.నీళ్లు, నిధులు,... ఘనంగా సత్య సాయి ఆరాధన మహోత్సవ వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 24 (ప్రజా మంటలు)భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆరాధన ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయము నగర సంకీర్తన అల్పాహార వితరణ రుద్ర పారాయణము రుద్రాభిషేకము మధ్యాహ్నం అర్హులైన వారికి వీల్ చైర్ ల పంపిణీ దుస్తుల... జగిత్యాల మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులకు కౌన్సిల్ ఆమోదం
జగిత్యాల ఏప్రిల్ 24 ( ప్రజా మంటలు) పురపాలక సంఘం కార్యాలయంలో పురపాలక సంఘ అధ్యక్షురాలు సమిండ్ల వాణి శ్రీనివాస్ అధ్యక్షతన కో-ఆప్షన్ ఎన్నికకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగినది.
ఇట్టి సమావేశము కౌన్సిల్ సమావేశములో వీరబత్తిని పద్మజ, గట్టు సతీష్, తస్లీం సుల్తాన మరియు మహమ్మద్ అబ్దుల్ కదీర్ అలియాస్ ముజ్జు భాయి... సహకార సంఘాలపై నామినేటెడ్ విధానం వెనక్కి తీసుకోవాలి: పిఎసిఎస్ మాజీ అధ్యక్షుల డిమాండ్
జగిత్యాల, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (DCCB)లకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానం తీసుకురావడం ప్రజాస్వామ్య విరుద్ధమని పిఎసిఎస్ తాజా మాజీ అధ్యక్షులు తీవ్రంగా విమర్శించారు.
జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పోతారం పిఎసిఎస్... వరి ధాన్యం కుప్పలను పరిశీలించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత
సారంగాపూర్ ఏప్రిల్ 24 (ప్రజా మంటలు) మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని వరి ధాన్య కుప్పలను రైతులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...నిన్న కురిసిన పడగళ్ల వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించి వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను తొందరగా... కవిత కొత్త పార్టీ: ఆశలు, ఆశయాలు – తెలంగాణ రాజకీయాలకుకొత్త దిశా?
హైదరాబాద్ ఏప్రిల్ 25:తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం తెరలేపేందుకు కల్వకుంట్ల కవిత సిద్ధమవుతున్నారు. మునీరాబాద్లో అట్టహాసంగా ఏర్పాటు చేసిన సభలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న ఈ పరిణామం, కేవలం ఒక పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు – ఇది తెలంగాణ రాజకీయ వ్యవస్థలో మార్పు అవసరంపై మరోసారి చర్చను తెరపైకి తెస్తోంది.... ట్రా"ఫికర్" పై నిద్రలేచిన జగిత్యాల మున్సిపాలిటీ
జగిత్యాల ఏప్రిల్ 24 (ప్రజా మంటలు) జగిత్యాలలో నానాటికి ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వ్యాపారస్తులు తమ దుకాణాల ముందు ప్రదర్శన కోసం ఎన్నో వస్తువులను ఉంచడంతో రోడ్డు పైన నడిచే పాదాచార్లకు వాహనాలకు ఇబ్బందులు ఎదురవడమే కాకుండా ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులదే బాధ్యత అన్నట్లుగా మున్సిపల్... జగిత్యాలలో RTC సమ్మెకు జీవన్ రెడ్డి మద్దతు | ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శలు
జగిత్యాల, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు):
పట్టణంలోని RTC డిపో ముందు జరుగుతున్న RTC కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, RTC కార్మికులు సమ్మెకు దిగడం దురదృష్టకరమని, ఈ పరిస్థితి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఫలితమని విమర్శించారు.... కాలేశ్వరం ప్రాజెక్టు పై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి కుట్రలకు చెంప దెబ్బ* *ఎవరు ఔనన్నా కాదన్నా* *తెలంగాణకు ప్రాణేశ్వరం ముమ్మాటికీ కాళేశ్వరమే* తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్
* జగిత్యాల ఏప్రిల్ 22 ( ప్రజా మంటలు) కాలేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సందర్భంగా ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో తాసిల్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ నాయకులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...* ఘోష్ కమిషన్... ‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా… ఏప్రిల్ 24న గ్రాండ్ రిలీజ్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):
‘పరమపద సోపానం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. అర్జున్ అంబటి హీరోగా, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని గణపర్తి నారాయణరావు నిర్మించగా, నాగ శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ... ఈ రోజు ఉదయం10 గంటలకు సభాస్థలి పరిశీలించనున్న కవిత
:హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):
మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ను ఈ రోజు (బుధవారం) ఉదయం 10 గంటలకు తెలంగాణ జాగృతి నాయకులు పరిశీలించనున్నారు.
ఈనెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో, సభ ఏర్పాట్లను పర్యవేక్షించి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రం... 