మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.
మెట్టుపల్లి ఏప్రిల్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక):
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బిస్మిల్లా మస్జిద్ నుండి ముస్లిం సమాజ ఆధ్వర్యంలో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్ఫ్ ప్రొటెక్షన్ బిల్ – 2025కు వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ...ఈ బిల్లులో ఉన్న కొన్ని నిబంధనలు ముస్లిం సమాజ హక్కులను తీవ్రంగా హరించేవిగా ఉన్నాయని,వాక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉన్న ప్రస్తుత విధానాలను మార్చి, ముస్లిమేతరులను వాక్ఫ్ బోర్డుల్లో చేర్చే ప్రతిపాదన మాతోపాటు మొత్తం ముస్లిం సమాజ అభిమతానికి వ్యతిరేకంగా ఉంది అని అన్నారు.
మతపరమైన ఆస్తులపై ముస్లిం సమాజకు మాత్రమే పరిపాలనాధికారం ఉండాలని వారు డిమాండ్ చేశారు. ముస్లింల సెంటిమెంట్స్ను గౌరవించకుండా తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని వారు హెచ్చరించారు.ఆయా సంఘాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ, "మా అభిప్రాయాలను గౌరవించి వాక్ఫ్ ప్రొటెక్షన్ బిల్ 2025ను వెంటనే వెనక్కు తీసుకోవాలి" అని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆర్డీఓ కు వినతి పత్రం అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
