మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.
మెట్టుపల్లి ఏప్రిల్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక):
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బిస్మిల్లా మస్జిద్ నుండి ముస్లిం సమాజ ఆధ్వర్యంలో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్ఫ్ ప్రొటెక్షన్ బిల్ – 2025కు వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ...ఈ బిల్లులో ఉన్న కొన్ని నిబంధనలు ముస్లిం సమాజ హక్కులను తీవ్రంగా హరించేవిగా ఉన్నాయని,వాక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉన్న ప్రస్తుత విధానాలను మార్చి, ముస్లిమేతరులను వాక్ఫ్ బోర్డుల్లో చేర్చే ప్రతిపాదన మాతోపాటు మొత్తం ముస్లిం సమాజ అభిమతానికి వ్యతిరేకంగా ఉంది అని అన్నారు.
మతపరమైన ఆస్తులపై ముస్లిం సమాజకు మాత్రమే పరిపాలనాధికారం ఉండాలని వారు డిమాండ్ చేశారు. ముస్లింల సెంటిమెంట్స్ను గౌరవించకుండా తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని వారు హెచ్చరించారు.ఆయా సంఘాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ, "మా అభిప్రాయాలను గౌరవించి వాక్ఫ్ ప్రొటెక్షన్ బిల్ 2025ను వెంటనే వెనక్కు తీసుకోవాలి" అని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆర్డీఓ కు వినతి పత్రం అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
