మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.
మెట్టుపల్లి ఏప్రిల్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక):
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బిస్మిల్లా మస్జిద్ నుండి ముస్లిం సమాజ ఆధ్వర్యంలో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్ఫ్ ప్రొటెక్షన్ బిల్ – 2025కు వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ...ఈ బిల్లులో ఉన్న కొన్ని నిబంధనలు ముస్లిం సమాజ హక్కులను తీవ్రంగా హరించేవిగా ఉన్నాయని,వాక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉన్న ప్రస్తుత విధానాలను మార్చి, ముస్లిమేతరులను వాక్ఫ్ బోర్డుల్లో చేర్చే ప్రతిపాదన మాతోపాటు మొత్తం ముస్లిం సమాజ అభిమతానికి వ్యతిరేకంగా ఉంది అని అన్నారు.
మతపరమైన ఆస్తులపై ముస్లిం సమాజకు మాత్రమే పరిపాలనాధికారం ఉండాలని వారు డిమాండ్ చేశారు. ముస్లింల సెంటిమెంట్స్ను గౌరవించకుండా తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని వారు హెచ్చరించారు.ఆయా సంఘాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ, "మా అభిప్రాయాలను గౌరవించి వాక్ఫ్ ప్రొటెక్షన్ బిల్ 2025ను వెంటనే వెనక్కు తీసుకోవాలి" అని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆర్డీఓ కు వినతి పత్రం అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందనలు

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
