జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
డిసెంబర్ 28... నేరెళ్ల వేణుమాధవ్ జయంతి
జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
డిసెంబర్ 28... నేరెళ్ల వేణుమాధవ్ జయంతి.
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
...............................
భారత్లో మిమిక్రీ కళకు ఆయన ఆద్యుడు, ఎంతో మంది ప్రముఖుల వందలాదిగా గొంతులను సునాయాసంగా, యథాతథంగా అనుకరించేవాడు. భారత్లో అనుకరించి నవ్వించే కళగా మాత్రమే ఉన్న మిమిక్రీని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించే స్థాయికి తీసుకెళ్లిన గొప్ప కళాకారుడు. రాష్ట్రపతులు, ప్రధానుల నుండి సామాన్యుల వరకూ దేశంలో ఆయన అపూర్వ, అపురూప కళను అభినందించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు గుర్తు పట్టారనుకుంటా. ఆయనే వందలాది గొంతుకల వేణు మాధవుడు.
ధ్వన్యనుకరణ సామ్రాట్ అనే బిరుదును పొందిన తెలంగాణ గర్వించ దగ్గ ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ ( డిసెంబరు 28, 1932 - జూన్ 19, 2018 ) చిన్నప్పుడు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నాడు. అయినా ఆయన అమెరికా, బ్రిటన్ ఇంగ్లిష్ ఉచ్చారణలతో కూడా గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన సొంతంగా ఈ కళను సాధన చేశారు. స్వీయ పరిశీలన, స్వయం అధ్యయనంతో తనను తాను మెరుగు పరచుకుంటూ అత్యున్నత స్థాయిని అందుకున్న ప్రతిభాశాలి.
చిన్నతనంలో చిలకమర్తి
లక్ష్మీనరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నా అప్పటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపాడు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. 1953 లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. కేంద్రప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, జె. ఎన్. టి. యు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌరసన్మానం జరిగాయి. ఆయన స్వయంగా నేరెళ్ళ వేణుమాధవ్ సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి యేటా ఒక కళాకారుడిని సన్మానించాడు. హనుమకొండలో ఆయన పేరు మీదుగా డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం నిర్మించారు.
నేరెళ్ళ వేణుమాధవ్ వరంగల్ పట్టణంలోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు.
పండితుడైన తండ్రి, వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ తన ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తుండగా, అలా వచ్చిన వారిలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి గొప్పవారి సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. సినిమాలంటే ఎంతో ఇష్టం. చిత్తూరు నాగయ్య నటించిన గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి, నాగయ్య కూడా ధ్వన్యనుకరణ చేయగలవారు కావడంతో ఆయన పై అభిమానంతో కేవలం స్వయం పరిశీలనతోనే ఆ రంగంలో ప్రవేశించాడు. అలాగే వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవాడు. అలా మొదలయ్యింది అయన మిమిక్రీ ప్రస్థానం.
1950 లో మెట్రిక్యులేషన్, 1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు, ఇతర లెక్చరర్లు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ కు ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ ( బర్సరీ ) మంజూరు చేశారు. ఆ డబ్బుతో పలు ఇంగ్లీషు సినిమాల్ని చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపిస్తే, రామనర్సు పరమానంద భరితులై "యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్" అని, అయితే నీవు నా రెండవ కుమారుడవు అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే వీరిని 'విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్' గా ఎదిగేలా చేసాయి. 1953 లో ప్రభుత్వ పాఠశాల (జి సి ఎస్ స్కూలు హనుమకొండ) లో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి, ధర్మ సాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. అనంతరకాలంలో ప్రైవేటుగా బీ.ఏ. బీ. కాం పాసయ్యారు.
తొలి ప్రదర్శన 1947 లో ఇచ్చారు. మలి ప్రదర్శన 1953 లో రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ లో బలరాజ సహానీ గారి అధ్యక్షతన, గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు, స్థానం నరసింహారావు, చాగంటి సన్యాసిరాజు గారల సమక్షంలో ఇచ్చారు.
ఆయన ప్రదర్శనలు చూసిన పలువురు రాజకీయ ప్రముఖుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు లాంటి ఎంతోమంది ఉన్నారు.
ఆస్ట్రేలియా,ఫిజీ దీవులు -1965,
సింగపూర్,మలేషియా - 1968
పశ్చిమ జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా, కెనెడా, లెబనాన్ - 1971
ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన - 1971, సింగపూర్,మలేషియా - 1975, అమెరికా, కెనెడా - 1976
దక్షిణాఫ్రికా,మారిషస్,సీషెల్స్ - 1976, సింగపూర్, మలేషియా -1977, అమెరికా, కెనెడా - 1982
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 1987, మారిషస్ - 1990 తదితర దేశాలలో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చాడు.
వేణుమాధవ్ గారు నిర్వహించిన పదవుల్లో ఎం.ఎల్.సీ (1972-78)
ఎఫ్.డీ.సీ డైరెక్టర్ (1976-77)
సంగీత నాటక అకాడమీ సభ్యుడు (1974-78), సౌత్ జోన్ కల్చరల్ కమిటీ, తంజావూరు సభ్యుడు,
దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-94),
టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-96),
రైల్వే జోనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు (1993-96),
ఎ.పి.లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడు (1972-75), రవీంద్ర భారతి కమిటీ సభ్యుడు (1974-78), ప్రభుత్వ అకాడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడు (1975-76) తదితర పదవులు నిర్వహించాడు.
ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, చుపే రుస్తుం ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళాసరస్వతి, స్వర్ కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ, మున్నగు బిరుదులు వరించాయి. 1977 ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ బిరుదు, 1982 రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, 1987 జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వ విద్యాలయం, 1992 కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు...1997 కనకాభిషేకం, 1998 ఎన్టీఆర్ ఆత్మ గౌరవ పురస్కారం, 2001 పద్మశ్రీ, 2005 తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018లో భాగంగా జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందజేయ బడింది. తిరుపతి పట్టణంలో గజారోహణం, పొరసన్మానం జరిగాయి.
పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ 2018, జూన్ 19వ తేదీ తమ 85వ యేట కన్నుమూశారు. హనుమకొండ పట్టణంలో నిర్మింపబడ్డ 'డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళాప్రాంగణం ' సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని వేదికగా ఉపయోగ పడుతున్నది. నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్' ను స్థాపించి ప్రతియేటా తన పుట్టినరోజైన డిసెంబర్ 28న ప్రముఖ కళాకారులను పదివేల రూపాయల పురస్కారంతో సత్కరిస్తున్నారు.
2017లో నేరెళ్ల వేణుమాధవ్ పేరుతో పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్ను విడుదల చేసింది. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 28వ తేదీని తెలుగు రాష్ట్రాల్లో 'మిమిక్రీ డే'గా జరుపు కుంటారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కన్నాపూర్ లో కాలిన ఈత - తాటి వనం సందర్శించిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల జూన్2- ( ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో గత 5 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలిపోయిన 500 ఈత - తాటి చెట్లను జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మంగళ వారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కన్నాపూర్ గ్రామంలోని దాదాపు 27... మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపు కోసం ప్రచారo
మల్యాల జూన్ 2 (ప్రజా మంటలు)
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడం మరియు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలతో పోటీని ఎదుర్కొనే దృష్టితో, మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శివరామకృష్ణ మరియు అధ్యాపకులు ఇంటింటికీ ప్రచారం చేపట్టారు.
ఈ ప్రచారంలో ఎస్.ఎస్.సి. పాసైన ప్రతి విద్యార్థిని మరియు వారి తల్లిదండ్రులను కలిసి, కళాశాల... ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టౌన్ సిఐ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ ,ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు ,టౌన్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)ఎంపికైన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన “సేవా పథకం”లకు ఎంపికైన జగిత్యాల జిల్లా పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత,... జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థలో రాష్ట్రావిర్భావ వేడుకు
జగిత్యాల జూన్ 02 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం తెలంగాణ ఆవిర్భావం, రాష్ట్ర సాధనలో జరిగిన ఉద్యమాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక విద్యార్థిని, విద్యార్థులు... మానవహక్కుల కమీషన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
TGHRCలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు | జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంMeta Description:.SEO Tags: Telangana, Telangana News, Hyderabad Newsవార్త:హైదరాబాద్, జూన్ 02 (ప్రజా మంటలు):తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కార్యాలయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు.కమిషన్... జర్నలిస్టు సంక్షేమానికి ప్రభుత్వం కృషి :ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, జూన్ 01 (ప్రజా మంటలు):
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన కార్యవర్గ పరిచయ, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వం–ప్రజల... తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో... ఆచార్య కలువకుంట రామకృష్ణ కు అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక వారిచే అవార్డు ప్రదానం
కరీంనగర్ మే 31(ప్రజా మంటలు)ప్రముఖ సాహితీ వేత్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ కలువకుంట రామ కృష్ణ కు ఆదివారం నెల్లూరు లో జరిగిన అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక, బ్రాహ్మణ ఘోష సభలో 'ఆచార్య కళా ప్రపూర్ణ' పురస్కారాన్నిఅవధానం సాయి కుమార్ , తదితరులు ప్రదానం చేశారు.
అఖిల భారత... “కథ చెబుతా వింటారా” కథల పోటీ
హనుమకొండ, మే 30 (ప్రజా మంటలు):తెలుగు భాషపై చిన్నారుల్లో మక్కువ పెంపొందించడంతో పాటు, అమ్మభాషైన తెలుగును గౌరవించే భావనను పెంచేందుకు హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కథ చెబుతా వింటారా” పేరుతో కథల చెప్పే పోటీని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి ఒక... ఎసిబి వలలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్
హైదరాబాద్ మే 30 (ప్రజా మంటలు):
ఏసీబీ వలలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ చిక్కారు. లంచం కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్ శనివారం అరెస్ట్ అయ్యారు.ఎసిబి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్ మోసం కేసులో కుటుంబ... రైతు డిస్కమ్తో రైతాంగాన్ని నాశనం చేసే కుట్ర : కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు
హైదరాబాద్ మే 29 (ప్రజా మంటలు):హైదరాబాద్లో జరిగిన రైతు డిస్కమ్ పబ్లిక్ హియరింగ్లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ Kalvakuntla Kavitha ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు డిస్కమ్ వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండా విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. డిస్కమ్లకు ప్రభుత్వం... 