జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్

On
జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్

జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
డిసెంబర్ 28... నేరెళ్ల వేణుమాధవ్ జయంతి


జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
డిసెంబర్ 28... నేరెళ్ల వేణుమాధవ్ జయంతి.
 
రామ కిష్టయ్య సంగన భట్ల...
    9440595494
...............................

భారత్‌లో మిమిక్రీ కళకు ఆయన ఆద్యుడు, ఎంతో మంది ప్రముఖుల వందలాదిగా గొంతులను సునాయాసంగా, యథాతథంగా అనుకరించేవాడు. భారత్‌లో అనుకరించి నవ్వించే కళగా మాత్రమే ఉన్న మిమిక్రీని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించే స్థాయికి తీసుకెళ్లిన గొప్ప కళాకారుడు. రాష్ట్రపతులు, ప్రధానుల నుండి సామాన్యుల వరకూ దేశంలో ఆయన అపూర్వ, అపురూప కళను అభినందించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు గుర్తు పట్టారనుకుంటా. ఆయనే వందలాది గొంతుకల వేణు మాధవుడు.

ధ్వన్యనుకరణ సామ్రాట్ అనే బిరుదును పొందిన తెలంగాణ గర్వించ దగ్గ  ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ ( డిసెంబరు 28, 1932 - జూన్ 19, 2018 ) చిన్నప్పుడు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నాడు. అయినా ఆయన అమెరికా, బ్రిటన్ ఇంగ్లిష్ ఉచ్చారణలతో కూడా గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన సొంతంగా ఈ కళను సాధన చేశారు. స్వీయ పరిశీలన, స్వయం అధ్యయనంతో తనను తాను మెరుగు పరచుకుంటూ అత్యున్నత స్థాయిని అందుకున్న ప్రతిభాశాలి.

చిన్నతనంలో  చిలకమర్తి
 లక్ష్మీనరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నా అప్పటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపాడు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. 1953 లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. కేంద్రప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, జె. ఎన్. టి. యు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌరసన్మానం జరిగాయి. ఆయన స్వయంగా నేరెళ్ళ వేణుమాధవ్ సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి యేటా ఒక కళాకారుడిని సన్మానించాడు. హనుమకొండలో ఆయన పేరు మీదుగా డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం నిర్మించారు.

నేరెళ్ళ వేణుమాధవ్ వరంగల్ పట్టణంలోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు.

పండితుడైన తండ్రి,  వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ తన ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తుండగా,  అలా వచ్చిన వారిలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి గొప్పవారి సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. సినిమాలంటే ఎంతో ఇష్టం.  చిత్తూరు నాగయ్య నటించిన గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి, నాగయ్య కూడా ధ్వన్యనుకరణ చేయగలవారు కావడంతో ఆయన  పై అభిమానంతో కేవలం స్వయం పరిశీలనతోనే ఆ రంగంలో ప్రవేశించాడు. అలాగే వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా  అనుకరించి చూపేవాడు. అలా మొదలయ్యింది  అయన మిమిక్రీ ప్రస్థానం.

1950 లో మెట్రిక్యులేషన్, 1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు, ఇతర  లెక్చరర్లు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ కు ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ ( బర్సరీ ) మంజూరు చేశారు. ఆ డబ్బుతో పలు ఇంగ్లీషు సినిమాల్ని చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపిస్తే, రామనర్సు  పరమానంద భరితులై "యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్" అని,  అయితే నీవు నా రెండవ కుమారుడవు అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే వీరిని 'విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్' గా ఎదిగేలా చేసాయి. 1953 లో ప్రభుత్వ పాఠశాల (జి సి ఎస్ స్కూలు హనుమకొండ) లో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి, ధర్మ సాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. అనంతరకాలంలో ప్రైవేటుగా బీ.ఏ. బీ. కాం పాసయ్యారు. 
తొలి ప్రదర్శన 1947 లో ఇచ్చారు.  మలి ప్రదర్శన 1953 లో రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ లో బలరాజ సహానీ గారి అధ్యక్షతన, గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు, స్థానం నరసింహారావు, చాగంటి సన్యాసిరాజు గారల సమక్షంలో ఇచ్చారు. 

ఆయన ప్రదర్శనలు చూసిన పలువురు రాజకీయ ప్రముఖుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు లాంటి ఎంతోమంది ఉన్నారు.

ఆస్ట్రేలియా,ఫిజీ దీవులు -1965,
సింగపూర్,మలేషియా - 1968
పశ్చిమ జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా, కెనెడా, లెబనాన్ - 1971
ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన - 1971, సింగపూర్,మలేషియా - 1975, అమెరికా, కెనెడా - 1976
దక్షిణాఫ్రికా,మారిషస్,సీషెల్స్ - 1976, సింగపూర్, మలేషియా -1977, అమెరికా, కెనెడా - 1982
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 1987, మారిషస్ - 1990 తదితర దేశాలలో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చాడు.

వేణుమాధవ్ గారు నిర్వహించిన పదవుల్లో ఎం.ఎల్.సీ (1972-78)
ఎఫ్.డీ.సీ డైరెక్టర్ (1976-77)
సంగీత నాటక అకాడమీ సభ్యుడు (1974-78), సౌత్ జోన్ కల్చరల్ కమిటీ, తంజావూరు సభ్యుడు, 
దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-94), 
టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-96), 
రైల్వే జోనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు (1993-96), 
ఎ.పి.లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడు (1972-75), రవీంద్ర భారతి కమిటీ సభ్యుడు (1974-78), ప్రభుత్వ అకాడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడు (1975-76) తదితర పదవులు నిర్వహించాడు.
 

 ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, చుపే రుస్తుం ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళాసరస్వతి, స్వర్ కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ, మున్నగు బిరుదులు వరించాయి. 1977  ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ  బిరుదు, 1982 రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, 1987 జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వ విద్యాలయం, 1992 కాకతీయ  విశ్వవిద్యాలయం నుండి  గౌరవ డాక్టరేటు...1997 కనకాభిషేకం, 1998 ఎన్టీఆర్ ఆత్మ గౌరవ పురస్కారం, 2001 పద్మశ్రీ, 2005 తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018లో భాగంగా జూన్‌ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందజేయ బడింది. తిరుపతి పట్టణంలో గజారోహణం, పొరసన్మానం జరిగాయి.


పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్‌ 2018, జూన్ 19వ తేదీ తమ 85వ యేట కన్నుమూశారు. హనుమకొండ పట్టణంలో నిర్మింపబడ్డ 'డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళాప్రాంగణం ' సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని వేదికగా ఉపయోగ పడుతున్నది. నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్' ను స్థాపించి ప్రతియేటా తన పుట్టినరోజైన డిసెంబర్ 28న ప్రముఖ కళాకారులను పదివేల రూపాయల పురస్కారంతో సత్కరిస్తున్నారు. 

2017లో నేరెళ్ల వేణుమాధవ్ పేరుతో పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్‌ను విడుదల చేసింది. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 28వ తేదీని తెలుగు రాష్ట్రాల్లో 'మిమిక్రీ డే'గా జరుపు కుంటారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

వేములవాడలో ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్‌పై భార్య ఫిర్యాదు

వేములవాడలో ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్‌పై భార్య ఫిర్యాదు వేములవాడ, ఆగస్టు 20 (ప్రజా మంటలు): వేములవాడలోని రెడ్డి భవన్‌లో తన భర్త ఈశ్వర్ సాయిని మాధురి రాథోడ్‌తో ఒకే గదిలో గుర్తించానని ఆరోపిస్తూ ఆయన భార్య శరణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. శరణ్య ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.    ఫోక్ సాంగ్స్‌లో నటించిన ఈశ్వర్ సాయి,...
Read More...
State News 

2 వేల మంది అన్‌ఫిట్ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలి: కవిత

2 వేల మంది అన్‌ఫిట్ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలి: కవిత హైదరాబాద్, ఆగస్టు 19 (ప్రజా మంటలు): సింగరేణిలో అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 2 వేల మంది కార్మికులను మెడికల్ బోర్డు ద్వారా అన్‌ఫిట్ చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యే వరకు ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు. హెచ్ఎంఎస్ జనరల్...
Read More...
State News 

పేదల కోసం ‘భూలక్ష్మి’ పథకం - కల్వకుంట్ల కవిత

పేదల కోసం ‘భూలక్ష్మి’ పథకం - కల్వకుంట్ల కవిత సామాజిక న్యాయం కోసం మళ్లీ భూ పంపిణీ జరగాలి: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ఆగస్టు 18 (ప్రజా మంటలు): తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం సాధించాలంటే మళ్లీ భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీ అధికారంలోకి...
Read More...
Local News 

కొండగట్టు  సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం*   *బస్సులో ఉన్న  25 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

కొండగట్టు  సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం*    *బస్సులో ఉన్న  25 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు *  జగిత్యాల జిల్లా ఆగస్టు17 {ప్రజా మంటలు} మల్యాల మండలం కొండగట్టు  సమీపంలో  ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మందికి ప్రయాణికులు గాయపడగా క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మల్యాల మండలం కొండగట్టు సమీపంలో జగిత్యాల నుంచి...
Read More...
Local News 

బృందావనం ఫ్యామిలీ రిసార్ట్లో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం

బృందావనం ఫ్యామిలీ రిసార్ట్లో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం కొండగట్టు ఆగస్టు 16 (ప్రజా మంటలు)మల్యాల మండలం కొండగట్టు బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ లో ఆదివారం శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంటింటా లలిత పారాయణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కలశ గణాధిపతి గౌరీ పూజ తొలతగా నిర్వహించి అమ్మవారి విగ్రహానికి పల రసాలు పంచామృతాలతో అభిషేకం చేసి వివిధ రకాలైన పుష్పాలతో అమ్మవారిని...
Read More...
State News 

22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి    హైదరాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు): నిషేధిత జాబితా (22-ఏ)లో చేరిన భూముల హక్కుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములకు సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ...
Read More...
Local News 

ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య  సంస్మరణ వేడుక

ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య  సంస్మరణ వేడుక రాయికల్ ఆగస్టు 15 (ప్రజా మంటలు)రాయికల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో  చిలుకమర్రి పరాంకుశాచార్య  సంస్మరణ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమంలో పరాంకుశ ఆచార్య తనయుడు అడ్వకేట్ మదన్మోహన్ రాయికల్ సరస్వతి శిశు మందిర్ పునర్నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ. 1,11,111/-  భవన నిర్మాణ కమిటీకి అందజేయడం జరిగింది.    ఈ సందర్భంగా...
Read More...
Local News 

హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ

హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ జగిత్యాల ఆగస్టు 14లోక కళ్యాణార్థం పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా సహస్రనామ సామూహిక పారాయణం ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించారు.    అంతకుముందు గణపతి గౌరీ దేవతల పంచామృత అభిషేకము నిర్వహించి శ్రీ లలిత అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో షోడశ ఉపచార పూజలు నిర్వహించారు. శ్రీ సూక్త...
Read More...
Local News 

పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పెన్షన్లు ఇవ్వడం లేదు  తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత 

పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పెన్షన్లు ఇవ్వడం లేదు  తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత  జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు)రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లకు పలుమార్లు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప ఇవ్వడం లేదని ఆరోపించారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల పూర్తయిందని...
Read More...
Local News 

ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి 

ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి  జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సుయాత్ర చేరుకుంది. జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ బస్సు...
Read More...
Local News 

పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేకాలు 

పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేకాలు     జగిత్యాల ఆగస్ట్ 13( ప్రజా మంటలు)పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివుని మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏటా లాగే శ్రావణమాసం సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయపద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. తొలుతగా గణపతి ఉపనిషత్తులతో గణపతి పూజ, అనంతరం నారాయణ ఉపనిషత్తులతో శ్రీ సీతారామచంద్రుల పరివార...
Read More...
Local News 

వెల్గటూర్‌లో 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు

వెల్గటూర్‌లో 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు వెల్గటూర్, ఆగస్టు 13 (ప్రజా మంటలు): వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యం,...
Read More...