జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
డిసెంబర్ 28... నేరెళ్ల వేణుమాధవ్ జయంతి
జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
డిసెంబర్ 28... నేరెళ్ల వేణుమాధవ్ జయంతి.
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
...............................
భారత్లో మిమిక్రీ కళకు ఆయన ఆద్యుడు, ఎంతో మంది ప్రముఖుల వందలాదిగా గొంతులను సునాయాసంగా, యథాతథంగా అనుకరించేవాడు. భారత్లో అనుకరించి నవ్వించే కళగా మాత్రమే ఉన్న మిమిక్రీని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించే స్థాయికి తీసుకెళ్లిన గొప్ప కళాకారుడు. రాష్ట్రపతులు, ప్రధానుల నుండి సామాన్యుల వరకూ దేశంలో ఆయన అపూర్వ, అపురూప కళను అభినందించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు గుర్తు పట్టారనుకుంటా. ఆయనే వందలాది గొంతుకల వేణు మాధవుడు.
ధ్వన్యనుకరణ సామ్రాట్ అనే బిరుదును పొందిన తెలంగాణ గర్వించ దగ్గ ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ ( డిసెంబరు 28, 1932 - జూన్ 19, 2018 ) చిన్నప్పుడు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నాడు. అయినా ఆయన అమెరికా, బ్రిటన్ ఇంగ్లిష్ ఉచ్చారణలతో కూడా గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన సొంతంగా ఈ కళను సాధన చేశారు. స్వీయ పరిశీలన, స్వయం అధ్యయనంతో తనను తాను మెరుగు పరచుకుంటూ అత్యున్నత స్థాయిని అందుకున్న ప్రతిభాశాలి.
చిన్నతనంలో చిలకమర్తి
లక్ష్మీనరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నా అప్పటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపాడు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. 1953 లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. కేంద్రప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, జె. ఎన్. టి. యు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌరసన్మానం జరిగాయి. ఆయన స్వయంగా నేరెళ్ళ వేణుమాధవ్ సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి యేటా ఒక కళాకారుడిని సన్మానించాడు. హనుమకొండలో ఆయన పేరు మీదుగా డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం నిర్మించారు.
నేరెళ్ళ వేణుమాధవ్ వరంగల్ పట్టణంలోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు.
పండితుడైన తండ్రి, వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ తన ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తుండగా, అలా వచ్చిన వారిలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి గొప్పవారి సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. సినిమాలంటే ఎంతో ఇష్టం. చిత్తూరు నాగయ్య నటించిన గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి, నాగయ్య కూడా ధ్వన్యనుకరణ చేయగలవారు కావడంతో ఆయన పై అభిమానంతో కేవలం స్వయం పరిశీలనతోనే ఆ రంగంలో ప్రవేశించాడు. అలాగే వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవాడు. అలా మొదలయ్యింది అయన మిమిక్రీ ప్రస్థానం.
1950 లో మెట్రిక్యులేషన్, 1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు, ఇతర లెక్చరర్లు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ కు ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ ( బర్సరీ ) మంజూరు చేశారు. ఆ డబ్బుతో పలు ఇంగ్లీషు సినిమాల్ని చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపిస్తే, రామనర్సు పరమానంద భరితులై "యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్" అని, అయితే నీవు నా రెండవ కుమారుడవు అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే వీరిని 'విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్' గా ఎదిగేలా చేసాయి. 1953 లో ప్రభుత్వ పాఠశాల (జి సి ఎస్ స్కూలు హనుమకొండ) లో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి, ధర్మ సాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. అనంతరకాలంలో ప్రైవేటుగా బీ.ఏ. బీ. కాం పాసయ్యారు.
తొలి ప్రదర్శన 1947 లో ఇచ్చారు. మలి ప్రదర్శన 1953 లో రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ లో బలరాజ సహానీ గారి అధ్యక్షతన, గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు, స్థానం నరసింహారావు, చాగంటి సన్యాసిరాజు గారల సమక్షంలో ఇచ్చారు.
ఆయన ప్రదర్శనలు చూసిన పలువురు రాజకీయ ప్రముఖుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు లాంటి ఎంతోమంది ఉన్నారు.
ఆస్ట్రేలియా,ఫిజీ దీవులు -1965,
సింగపూర్,మలేషియా - 1968
పశ్చిమ జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా, కెనెడా, లెబనాన్ - 1971
ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన - 1971, సింగపూర్,మలేషియా - 1975, అమెరికా, కెనెడా - 1976
దక్షిణాఫ్రికా,మారిషస్,సీషెల్స్ - 1976, సింగపూర్, మలేషియా -1977, అమెరికా, కెనెడా - 1982
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 1987, మారిషస్ - 1990 తదితర దేశాలలో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చాడు.
వేణుమాధవ్ గారు నిర్వహించిన పదవుల్లో ఎం.ఎల్.సీ (1972-78)
ఎఫ్.డీ.సీ డైరెక్టర్ (1976-77)
సంగీత నాటక అకాడమీ సభ్యుడు (1974-78), సౌత్ జోన్ కల్చరల్ కమిటీ, తంజావూరు సభ్యుడు,
దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-94),
టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-96),
రైల్వే జోనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు (1993-96),
ఎ.పి.లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడు (1972-75), రవీంద్ర భారతి కమిటీ సభ్యుడు (1974-78), ప్రభుత్వ అకాడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడు (1975-76) తదితర పదవులు నిర్వహించాడు.
ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, చుపే రుస్తుం ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళాసరస్వతి, స్వర్ కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ, మున్నగు బిరుదులు వరించాయి. 1977 ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ బిరుదు, 1982 రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, 1987 జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వ విద్యాలయం, 1992 కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు...1997 కనకాభిషేకం, 1998 ఎన్టీఆర్ ఆత్మ గౌరవ పురస్కారం, 2001 పద్మశ్రీ, 2005 తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018లో భాగంగా జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందజేయ బడింది. తిరుపతి పట్టణంలో గజారోహణం, పొరసన్మానం జరిగాయి.
పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ 2018, జూన్ 19వ తేదీ తమ 85వ యేట కన్నుమూశారు. హనుమకొండ పట్టణంలో నిర్మింపబడ్డ 'డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళాప్రాంగణం ' సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని వేదికగా ఉపయోగ పడుతున్నది. నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్' ను స్థాపించి ప్రతియేటా తన పుట్టినరోజైన డిసెంబర్ 28న ప్రముఖ కళాకారులను పదివేల రూపాయల పురస్కారంతో సత్కరిస్తున్నారు.
2017లో నేరెళ్ల వేణుమాధవ్ పేరుతో పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్ను విడుదల చేసింది. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 28వ తేదీని తెలుగు రాష్ట్రాల్లో 'మిమిక్రీ డే'గా జరుపు కుంటారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
కొండగట్టు జులై 25( ప్రజా మంటలు)
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ , శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు చైర్మన్ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వేద పండితుల వేదాశీర్వచనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో సత్కరించారు... ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన గొప్ప విజయం - దావ వసంత సురేష్.
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113.
జగిత్యాల 25 జూలై (ప్రజా మంటలు) :
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా పై స్పందించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారిపై దేశవ్యాప్తంగా విద్యార్థులు,... విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన
హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా NEET ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కందుల మధు, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి దావ వసంత సురేష్
జగిత్యాల జులై 23( ప్రజా మంటలు) పట్టణం 37 ,38 వార్డ్ లో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పరిశీలించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
ప్రజాస్వామ్య విలువలను... తమిళనాడు లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరు మార్పు
చెన్నై, జూలై 22: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ పేరును 'తలైవార్ కామరాజర్ అల్పాహార పథకం’గా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ... NEET ప్రాథమికంగానే అన్యాయమైన విధానం: ఎం.కె. స్టాలిన్
:చెన్నై ,జులై 22:
“న్యాయం, NEET రెండూ కలసి ఉండలేవు. NEET ప్రాథమికంగానే అన్యాయమైన విధానం” అని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ అన్నారు.తమిళనాడులో బీజేపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు NEETను వ్యతిరేకిస్తున్నాయని ఆయన తెలిపారు. NEET నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ పలుమార్లు... ప్రైవేట్ పాఠశాలలను వేధిస్తే కఠిన చర్యలు: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి
హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు ):
బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధుల బృందం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ను కలిసి, ప్రైవేట్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని కొందరు అనధికార వ్యక్తులు బ్లాక్మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలపై వెంటనే చర్యలుప్రతినిధుల... ఢిల్లీ విద్యార్థులపై దాడికి బీజేపీ సమాధానం చెప్పాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ జులై 22 (ప్రజా మంటలు):
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. “బ్రిటీష్ జాహిల్ పార్టీ” అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటని ఆమె అన్నారు. ఈ... సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు రోడ్డు భద్రత చర్యలు పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జులై 22 (ప్రజా మంటలు)
ప్రతి 15 రోజులకు రవాణా, పోలీసు, ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్ష
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసి, అవసరమైన అన్ని చర్యలను 60 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రత కమిటీ చైర్ పర్సన్ బి. సత్యప్రసాద్... రజక సంఘం ఆధ్వర్యంలో వైభవంగా వీరమ్మ బోనాల పండుగ శోభాయాత్ర
జగిత్యాల జూలై 22 (ప్రజా మంటలు)
రజక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వీరమ్మ బోనాల పండుగ శోభాయాత్ర బుధవారం మధ్యాహ్నం గంటలకు ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా జగిత్యాల రజక సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాసం కావడంతో ప్రతి ఏటా నిర్వహించే వీరమ్మ బోనాల పండుగ సందర్భంగా మడలేశ్వర స్వామి వారి భారీ విగ్రహం... ఉద్యమకారుల గుర్తింపులో ఆలస్యం వద్దు: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్, కల్వకుంట్ల కవిత తన సూచనలు, సలహాలతో కూడిన నివేదికను అందజేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయవద్దని ఆమె కమిటీని కోరారు.తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం... ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే ప్రజలు మీ ప్రభుత్వాన్ని పడగొడతరుప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను తిప్పికొడతాంగ్రామాల్లోకి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నరు
హైదరాబాద్, జూలై 20 (ప్రజా మంటలు):
ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర... 