జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్

On
జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్

జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
డిసెంబర్ 28... నేరెళ్ల వేణుమాధవ్ జయంతి


జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
డిసెంబర్ 28... నేరెళ్ల వేణుమాధవ్ జయంతి.
 
రామ కిష్టయ్య సంగన భట్ల...
    9440595494
...............................

భారత్‌లో మిమిక్రీ కళకు ఆయన ఆద్యుడు, ఎంతో మంది ప్రముఖుల వందలాదిగా గొంతులను సునాయాసంగా, యథాతథంగా అనుకరించేవాడు. భారత్‌లో అనుకరించి నవ్వించే కళగా మాత్రమే ఉన్న మిమిక్రీని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించే స్థాయికి తీసుకెళ్లిన గొప్ప కళాకారుడు. రాష్ట్రపతులు, ప్రధానుల నుండి సామాన్యుల వరకూ దేశంలో ఆయన అపూర్వ, అపురూప కళను అభినందించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు గుర్తు పట్టారనుకుంటా. ఆయనే వందలాది గొంతుకల వేణు మాధవుడు.

ధ్వన్యనుకరణ సామ్రాట్ అనే బిరుదును పొందిన తెలంగాణ గర్వించ దగ్గ  ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ ( డిసెంబరు 28, 1932 - జూన్ 19, 2018 ) చిన్నప్పుడు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నాడు. అయినా ఆయన అమెరికా, బ్రిటన్ ఇంగ్లిష్ ఉచ్చారణలతో కూడా గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన సొంతంగా ఈ కళను సాధన చేశారు. స్వీయ పరిశీలన, స్వయం అధ్యయనంతో తనను తాను మెరుగు పరచుకుంటూ అత్యున్నత స్థాయిని అందుకున్న ప్రతిభాశాలి.

చిన్నతనంలో  చిలకమర్తి
 లక్ష్మీనరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నా అప్పటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపాడు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. 1953 లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. కేంద్రప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, జె. ఎన్. టి. యు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌరసన్మానం జరిగాయి. ఆయన స్వయంగా నేరెళ్ళ వేణుమాధవ్ సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి యేటా ఒక కళాకారుడిని సన్మానించాడు. హనుమకొండలో ఆయన పేరు మీదుగా డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం నిర్మించారు.

నేరెళ్ళ వేణుమాధవ్ వరంగల్ పట్టణంలోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు.

పండితుడైన తండ్రి,  వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ తన ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తుండగా,  అలా వచ్చిన వారిలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి గొప్పవారి సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. సినిమాలంటే ఎంతో ఇష్టం.  చిత్తూరు నాగయ్య నటించిన గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి, నాగయ్య కూడా ధ్వన్యనుకరణ చేయగలవారు కావడంతో ఆయన  పై అభిమానంతో కేవలం స్వయం పరిశీలనతోనే ఆ రంగంలో ప్రవేశించాడు. అలాగే వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా  అనుకరించి చూపేవాడు. అలా మొదలయ్యింది  అయన మిమిక్రీ ప్రస్థానం.

1950 లో మెట్రిక్యులేషన్, 1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు, ఇతర  లెక్చరర్లు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ కు ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ ( బర్సరీ ) మంజూరు చేశారు. ఆ డబ్బుతో పలు ఇంగ్లీషు సినిమాల్ని చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపిస్తే, రామనర్సు  పరమానంద భరితులై "యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్" అని,  అయితే నీవు నా రెండవ కుమారుడవు అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే వీరిని 'విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్' గా ఎదిగేలా చేసాయి. 1953 లో ప్రభుత్వ పాఠశాల (జి సి ఎస్ స్కూలు హనుమకొండ) లో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి, ధర్మ సాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. అనంతరకాలంలో ప్రైవేటుగా బీ.ఏ. బీ. కాం పాసయ్యారు. 
తొలి ప్రదర్శన 1947 లో ఇచ్చారు.  మలి ప్రదర్శన 1953 లో రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ లో బలరాజ సహానీ గారి అధ్యక్షతన, గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు, స్థానం నరసింహారావు, చాగంటి సన్యాసిరాజు గారల సమక్షంలో ఇచ్చారు. 

ఆయన ప్రదర్శనలు చూసిన పలువురు రాజకీయ ప్రముఖుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు లాంటి ఎంతోమంది ఉన్నారు.

ఆస్ట్రేలియా,ఫిజీ దీవులు -1965,
సింగపూర్,మలేషియా - 1968
పశ్చిమ జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా, కెనెడా, లెబనాన్ - 1971
ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన - 1971, సింగపూర్,మలేషియా - 1975, అమెరికా, కెనెడా - 1976
దక్షిణాఫ్రికా,మారిషస్,సీషెల్స్ - 1976, సింగపూర్, మలేషియా -1977, అమెరికా, కెనెడా - 1982
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 1987, మారిషస్ - 1990 తదితర దేశాలలో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చాడు.

వేణుమాధవ్ గారు నిర్వహించిన పదవుల్లో ఎం.ఎల్.సీ (1972-78)
ఎఫ్.డీ.సీ డైరెక్టర్ (1976-77)
సంగీత నాటక అకాడమీ సభ్యుడు (1974-78), సౌత్ జోన్ కల్చరల్ కమిటీ, తంజావూరు సభ్యుడు, 
దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-94), 
టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-96), 
రైల్వే జోనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు (1993-96), 
ఎ.పి.లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడు (1972-75), రవీంద్ర భారతి కమిటీ సభ్యుడు (1974-78), ప్రభుత్వ అకాడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడు (1975-76) తదితర పదవులు నిర్వహించాడు.
 

 ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, చుపే రుస్తుం ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళాసరస్వతి, స్వర్ కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ, మున్నగు బిరుదులు వరించాయి. 1977  ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ  బిరుదు, 1982 రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, 1987 జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వ విద్యాలయం, 1992 కాకతీయ  విశ్వవిద్యాలయం నుండి  గౌరవ డాక్టరేటు...1997 కనకాభిషేకం, 1998 ఎన్టీఆర్ ఆత్మ గౌరవ పురస్కారం, 2001 పద్మశ్రీ, 2005 తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018లో భాగంగా జూన్‌ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందజేయ బడింది. తిరుపతి పట్టణంలో గజారోహణం, పొరసన్మానం జరిగాయి.


పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్‌ 2018, జూన్ 19వ తేదీ తమ 85వ యేట కన్నుమూశారు. హనుమకొండ పట్టణంలో నిర్మింపబడ్డ 'డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళాప్రాంగణం ' సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని వేదికగా ఉపయోగ పడుతున్నది. నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్' ను స్థాపించి ప్రతియేటా తన పుట్టినరోజైన డిసెంబర్ 28న ప్రముఖ కళాకారులను పదివేల రూపాయల పురస్కారంతో సత్కరిస్తున్నారు. 

2017లో నేరెళ్ల వేణుమాధవ్ పేరుతో పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్‌ను విడుదల చేసింది. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 28వ తేదీని తెలుగు రాష్ట్రాల్లో 'మిమిక్రీ డే'గా జరుపు కుంటారు.

Tags

More News...

Local News 

డిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

డిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక భీమదేవరపల్లి ప్రజామంటలు ఫిబ్రవరి 12 తేది.11.02.2025 మంగళవారం రోజున డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భీమదేవరపల్లి మండల శాఖ సర్వ సభ్య సమావేశం మండల శాఖ అధ్యక్షులు దాసరి రవీందర్ అధ్యక్షతన బాలుర ఉన్నత పాఠశాల మల్కనూరు లో జరిగింది.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బత్తుల అశోక్ కుమార్ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టగా సభ్యులు చర్చించి...
Read More...
Local News 

ధర్మపురి మం నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ధర్మపురి మం నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి ఢిల్లీ ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని సకాలంలో అమలు చేయాలని కేంద్ర విద్య శాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ కలిసిన ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్  *కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయన్ని ధర్మపురి మండలం నేరెళ్లలో మంజూరు చేయగా దాన్ని తరలించకుండ...
Read More...
Local News 

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మం అంబర్ పేట గ్రామములో కొండపై స్వయంభుగా వెలసినశ్రీవేంకటేశ్వర స్వామి వారి 25 వ వార్షిక బ్రహ్మోత్సవాలు  లో భాగంగా  మంగళవారం రెండవ రోజులో భాగంగా ఘనంగానిర్వహించిన కార్యక్రమాలు విశ్వక్సేన విధి వాసుదేవ పుణ్యాహవాచనం, అంకురారోపణ ముత్సాంగ్గ్రహణం, ఆచార్య రిత్వికరణం, వైనతేయ ప్రతిష్టా విధి...
Read More...
Local News  State News 

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  రైతుల సంక్షేమం కోసం రూ. 55,256 కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు పదేళ్ల కాలంలో రైతులకు బీ.ఆర్.ఎస్. చేసిందేమీ లేదు  - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి  హైదరాబాద్ ఫిబ్రవరి 11: కాంగ్రెస్...
Read More...
Local News 

సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (

సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి  సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 ( సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు): పద్మారావునగర్​ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయాన్ని మాజీ మంత్రి,రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్​ రెడ్డి మంగళవారం సందర్శించారు. తైపూసం పాల్గుడి కావడి పౌర్ణమి వేడుకల సందర్బంగా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మర్రిశశిధర్​ రెడ్డిని శాలువాతో...
Read More...
Local News 

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం సికింద్రాబాద్​, ఫిబ్రవరి 11 ( ప్రజామంటలు): బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యునిటీ హాలులో మంగళవారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.  రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైయిన్ బో కమ్యూనిటీ కేర్...
Read More...
Local News 

స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు) : పద్మారావునగర్​ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయంలో మంగళవారం తైపూసం పాలకావడి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి, శ్రీసుబ్రహ్మాణ్యస్వామి వార్లను దర్శించుకున్నారు. భుజాన పాల కలశంతో కూడిన కావడిని ఎత్తుకొని ఆలయం చుట్టు ప్రదక్షిణ...
Read More...
Local News 

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ 

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్  ▪️ జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)  హైదరాబాదులో నిర్వహించిన నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్  తెలంగాణ మైనార్టీ జూనియర్ కాలేజ్ విద్యార్థి  ఎండీ అయా నొద్దీన్ ( ఏం పీ సి 1 సం:) గోల్డ్ మెడల్ సాధించినందుకు  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  గారు అభినందించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ జూనియర్ కళాశాల...
Read More...
Local News 

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం  అంబారి పేట  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు....
Read More...
Local News 

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం  అంబారి పేట  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు....
Read More...
Local News 

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ  ఆహ్వాన పత్రిక అందజేత

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ  ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)పట్టణంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పురాని పేట , బోయవాడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో హాజరు కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ  కి ఆహ్వాన పత్రిక అందజేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి...
Read More...
National  International   State News 

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి అమెరికా విదేశీ అవినీతి చట్టాన్ని ట్రంప్ సస్పెండ్ చేశారు; అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగాయి మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి వాషింగ్టన్, ఫిబ్రవరి 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ అధికారులకు లంచం ఇవ్వకుండా అమెరికా కంపెనీలు నిషేధించే చట్టం అమలును నిలిపివేయడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన తర్వాత,...
Read More...