జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
డిసెంబర్ 28... నేరెళ్ల వేణుమాధవ్ జయంతి
జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
డిసెంబర్ 28... నేరెళ్ల వేణుమాధవ్ జయంతి.
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
...............................
భారత్లో మిమిక్రీ కళకు ఆయన ఆద్యుడు, ఎంతో మంది ప్రముఖుల వందలాదిగా గొంతులను సునాయాసంగా, యథాతథంగా అనుకరించేవాడు. భారత్లో అనుకరించి నవ్వించే కళగా మాత్రమే ఉన్న మిమిక్రీని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించే స్థాయికి తీసుకెళ్లిన గొప్ప కళాకారుడు. రాష్ట్రపతులు, ప్రధానుల నుండి సామాన్యుల వరకూ దేశంలో ఆయన అపూర్వ, అపురూప కళను అభినందించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు గుర్తు పట్టారనుకుంటా. ఆయనే వందలాది గొంతుకల వేణు మాధవుడు.
ధ్వన్యనుకరణ సామ్రాట్ అనే బిరుదును పొందిన తెలంగాణ గర్వించ దగ్గ ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ ( డిసెంబరు 28, 1932 - జూన్ 19, 2018 ) చిన్నప్పుడు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నాడు. అయినా ఆయన అమెరికా, బ్రిటన్ ఇంగ్లిష్ ఉచ్చారణలతో కూడా గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన సొంతంగా ఈ కళను సాధన చేశారు. స్వీయ పరిశీలన, స్వయం అధ్యయనంతో తనను తాను మెరుగు పరచుకుంటూ అత్యున్నత స్థాయిని అందుకున్న ప్రతిభాశాలి.
చిన్నతనంలో చిలకమర్తి
లక్ష్మీనరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నా అప్పటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపాడు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. 1953 లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. కేంద్రప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, జె. ఎన్. టి. యు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌరసన్మానం జరిగాయి. ఆయన స్వయంగా నేరెళ్ళ వేణుమాధవ్ సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి యేటా ఒక కళాకారుడిని సన్మానించాడు. హనుమకొండలో ఆయన పేరు మీదుగా డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం నిర్మించారు.
నేరెళ్ళ వేణుమాధవ్ వరంగల్ పట్టణంలోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు.
పండితుడైన తండ్రి, వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ తన ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తుండగా, అలా వచ్చిన వారిలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి గొప్పవారి సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. సినిమాలంటే ఎంతో ఇష్టం. చిత్తూరు నాగయ్య నటించిన గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి, నాగయ్య కూడా ధ్వన్యనుకరణ చేయగలవారు కావడంతో ఆయన పై అభిమానంతో కేవలం స్వయం పరిశీలనతోనే ఆ రంగంలో ప్రవేశించాడు. అలాగే వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవాడు. అలా మొదలయ్యింది అయన మిమిక్రీ ప్రస్థానం.
1950 లో మెట్రిక్యులేషన్, 1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు, ఇతర లెక్చరర్లు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ కు ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ ( బర్సరీ ) మంజూరు చేశారు. ఆ డబ్బుతో పలు ఇంగ్లీషు సినిమాల్ని చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపిస్తే, రామనర్సు పరమానంద భరితులై "యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్" అని, అయితే నీవు నా రెండవ కుమారుడవు అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే వీరిని 'విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్' గా ఎదిగేలా చేసాయి. 1953 లో ప్రభుత్వ పాఠశాల (జి సి ఎస్ స్కూలు హనుమకొండ) లో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి, ధర్మ సాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. అనంతరకాలంలో ప్రైవేటుగా బీ.ఏ. బీ. కాం పాసయ్యారు.
తొలి ప్రదర్శన 1947 లో ఇచ్చారు. మలి ప్రదర్శన 1953 లో రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ లో బలరాజ సహానీ గారి అధ్యక్షతన, గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు, స్థానం నరసింహారావు, చాగంటి సన్యాసిరాజు గారల సమక్షంలో ఇచ్చారు.
ఆయన ప్రదర్శనలు చూసిన పలువురు రాజకీయ ప్రముఖుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు లాంటి ఎంతోమంది ఉన్నారు.
ఆస్ట్రేలియా,ఫిజీ దీవులు -1965,
సింగపూర్,మలేషియా - 1968
పశ్చిమ జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా, కెనెడా, లెబనాన్ - 1971
ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన - 1971, సింగపూర్,మలేషియా - 1975, అమెరికా, కెనెడా - 1976
దక్షిణాఫ్రికా,మారిషస్,సీషెల్స్ - 1976, సింగపూర్, మలేషియా -1977, అమెరికా, కెనెడా - 1982
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 1987, మారిషస్ - 1990 తదితర దేశాలలో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చాడు.
వేణుమాధవ్ గారు నిర్వహించిన పదవుల్లో ఎం.ఎల్.సీ (1972-78)
ఎఫ్.డీ.సీ డైరెక్టర్ (1976-77)
సంగీత నాటక అకాడమీ సభ్యుడు (1974-78), సౌత్ జోన్ కల్చరల్ కమిటీ, తంజావూరు సభ్యుడు,
దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-94),
టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-96),
రైల్వే జోనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు (1993-96),
ఎ.పి.లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడు (1972-75), రవీంద్ర భారతి కమిటీ సభ్యుడు (1974-78), ప్రభుత్వ అకాడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడు (1975-76) తదితర పదవులు నిర్వహించాడు.
ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, చుపే రుస్తుం ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళాసరస్వతి, స్వర్ కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ, మున్నగు బిరుదులు వరించాయి. 1977 ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ బిరుదు, 1982 రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, 1987 జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వ విద్యాలయం, 1992 కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు...1997 కనకాభిషేకం, 1998 ఎన్టీఆర్ ఆత్మ గౌరవ పురస్కారం, 2001 పద్మశ్రీ, 2005 తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018లో భాగంగా జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందజేయ బడింది. తిరుపతి పట్టణంలో గజారోహణం, పొరసన్మానం జరిగాయి.
పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ 2018, జూన్ 19వ తేదీ తమ 85వ యేట కన్నుమూశారు. హనుమకొండ పట్టణంలో నిర్మింపబడ్డ 'డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళాప్రాంగణం ' సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని వేదికగా ఉపయోగ పడుతున్నది. నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్' ను స్థాపించి ప్రతియేటా తన పుట్టినరోజైన డిసెంబర్ 28న ప్రముఖ కళాకారులను పదివేల రూపాయల పురస్కారంతో సత్కరిస్తున్నారు.
2017లో నేరెళ్ల వేణుమాధవ్ పేరుతో పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్ను విడుదల చేసింది. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 28వ తేదీని తెలుగు రాష్ట్రాల్లో 'మిమిక్రీ డే'గా జరుపు కుంటారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి – 2026 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని ఆనంద్ బాగ్, మల్కాజిగిరి లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపకులు నెమ్మాని విష్ణుమూర్తి శర్మ, అధ్యక్షులు మహాదేవభట్ల లక్ష్మణప్రసాద్ శర్మ, ఉపాధ్యక్షులు దామెర సత్యనారాయణ శర్మ, గణపురం రాంప్రసాద్ శర్మ, ప్రధాన కార్యదర్శి యలమంచి... ఓటరు తస్మాత్ జాగ్రత్త..! మల్లారంలో జాగృతి నాటిక
గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన –
* ప్రశాంత ఎన్నికల పిలుపు కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి: వసంత సురేష్ తీవ్ర విమర్శలు
రాయికల్, డిసెంబర్ 7 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లిన నిర్ణయం బీసీ వర్గాలపై తీవ్ర అన్యాయం చేసిందని, ఆ నిరాశతోనే బీసీ బిడ్డ ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మండిపడ్డారు. రాయికల్... పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సమావేశం. -టీ పి సీ ఏ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 7:పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సోమవారం హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సమావేశం తెలంగాణ పెన్షన ర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ తెలిపారు.ఆదివారం జిల్లా టి. పి. సీ. ఏ. కార్యాలయంలో అయన విలేకరుల తో మాట్లాడుతూ హైదరాబాద్ లోని
ఈ... అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్ద్ర నక్షత్రం సందర్భంగా హరిహరాలయంలో ఫల ,పంచామృత అభిషేకాలు
జగిత్యాల డిసెంబర్ 7 (ప్రజా మంటలు)అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పరమశివునికి పంచామృతాలు ,వివిధ ఫల రసాలతో సూర్యోదయానికి పూర్వమే అభిషేకాలు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు తమ స్వహస్తాలతో సాంబశివుని కి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.... అగ్ని ప్రమాద బాధితులకు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యుల చేయూత
మల్యాల డిసెంబరు 7 ( ప్రజా మంటలు)స్థానిక కొండగట్టు లో ఒక దారుణ అగ్నిప్రమాదంలో దాదాపు 20 చిరువ్యాపారులు చేసుకొనే షాపులు పూర్తిగా కాలిపోయి , కుటుంబాలు అన్ని రోడ్డు మీదకి వచ్చాయి.
ఇతర స్థానిక కుటుంబీకులు సామ శ్రీనాథ్ గారి కుటుంబ సభ్యులు మరియు మహేష్ గారు మన సత్యసాయి సంస్థ ని... ఓటర్లకు భరోసా కల్పిస్తూ ఇబ్రహీంపట్నం లో పోలీసుల ఫ్లాగ్మార్చ్
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 07 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా హామీ ఇవ్వడం కోసం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మెట్టుపల్లి... మహాభారత జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న మహాభారత జ్ఞాన యజ్ఞము రెండవ రోజు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అట్టహాసంగా శనివారం ప్రారంభమైన మహాభారత నవహాన్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం ఆదివారం రెండవ రోజుకు చేరింది.
విశ్వ కళ్యాణర్థం... సిటీలో క్రిస్మస్ ముందస్తు సెలబ్రేషన్స్. : కేక్ మిక్సింగ్..ఫన్ గేమ్స్..శాంతాక్లాజ్ సందడి
సికింద్రాబాద్, డిసెంబర్ 07 (ప్రజామంటలు):
క్రిస్మస్ ముందస్తు సెలబ్రేషన్స్ సిటీలో ఘనంగా మొదలయ్యాయి. బేగంపేట లోని మ్యారీగోల్డ్ హోటల్ లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈసందర్బంగా నీలిమా వేముల నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో మహిళలు మెరిశారు.
ముఖ్య అతిథిగా బేబక్క, స్పీకర్ గా రజిత హాజరయ్యారు. సుధా నాయుడు, లావణ్య, ప్రణతి... మోంబాసా సాటర్ డే క్లబ్ ఫండ్ రైజింగ్లో MOMTA సభ్యుల ప్రదర్శన
సికింద్రాబాద్, డిసెంబర్ 07 ( ప్రజామంటలు) :
కెన్యా లోని మోంబాసా తెలుగు అసోసియేషన్ ( MOMTA) ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కొరకు "సాటర్ డే క్లబ్" నిర్వహించిన అసోసియేషన్ సభ్యుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. బోర్ వెల్లుల ఏర్పాటు, విద్యార్థుల విద్యా సహాయం, భారీ నీటి నిల్వ ట్యాంకుల విరాళం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు... కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సత్యసాయి సేవా సమితి చేయూత
కొండగట్టు, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):స్థానికంగా జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 20 మంది చిరు వ్యాపారుల షాపులు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. పరిస్థితి తెలుసుకున్న భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల తరఫున తక్షణ సహాయం అందించారు.
సామ శ్రీనాథ్ కుటుంబ సభ్యులు, మహేష్ మొదలైన వారు... కాసేపు హాయిగా నవ్వుకోండి..చాలా సీరియస్ అంశం?
నేటి సామాజిక ఆలోచనలపై వ్యంగ్య రచన
(జర్నలిస్ట్ నాగ్ రాజ్ FB నుండి)
ఇందాక ఆకలేసి, దారిలో పంచెకట్టు దోశ సెంటర్ కనిపిస్తే వెళ్లా.
మెనూ చెక్ చేసి,"ఓ ఘీంకారం దోశ.. టోకెన్ ఇవ్వు" అనడిగా.
(అంటే ఏనుగు అరుపు కాదు) -ed
"అది ఘీంకారం కాదు, ఘీ కారం" అన్నాడాయన కోపంగా.
"ఓహ్,... 