జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
డిసెంబర్ 28... నేరెళ్ల వేణుమాధవ్ జయంతి
జగమెరిగిన మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
డిసెంబర్ 28... నేరెళ్ల వేణుమాధవ్ జయంతి.
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
...............................
భారత్లో మిమిక్రీ కళకు ఆయన ఆద్యుడు, ఎంతో మంది ప్రముఖుల వందలాదిగా గొంతులను సునాయాసంగా, యథాతథంగా అనుకరించేవాడు. భారత్లో అనుకరించి నవ్వించే కళగా మాత్రమే ఉన్న మిమిక్రీని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించే స్థాయికి తీసుకెళ్లిన గొప్ప కళాకారుడు. రాష్ట్రపతులు, ప్రధానుల నుండి సామాన్యుల వరకూ దేశంలో ఆయన అపూర్వ, అపురూప కళను అభినందించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు గుర్తు పట్టారనుకుంటా. ఆయనే వందలాది గొంతుకల వేణు మాధవుడు.
ధ్వన్యనుకరణ సామ్రాట్ అనే బిరుదును పొందిన తెలంగాణ గర్వించ దగ్గ ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ ( డిసెంబరు 28, 1932 - జూన్ 19, 2018 ) చిన్నప్పుడు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నాడు. అయినా ఆయన అమెరికా, బ్రిటన్ ఇంగ్లిష్ ఉచ్చారణలతో కూడా గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన సొంతంగా ఈ కళను సాధన చేశారు. స్వీయ పరిశీలన, స్వయం అధ్యయనంతో తనను తాను మెరుగు పరచుకుంటూ అత్యున్నత స్థాయిని అందుకున్న ప్రతిభాశాలి.
చిన్నతనంలో చిలకమర్తి
లక్ష్మీనరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నా అప్పటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపాడు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. 1953 లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. కేంద్రప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, జె. ఎన్. టి. యు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌరసన్మానం జరిగాయి. ఆయన స్వయంగా నేరెళ్ళ వేణుమాధవ్ సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి యేటా ఒక కళాకారుడిని సన్మానించాడు. హనుమకొండలో ఆయన పేరు మీదుగా డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం నిర్మించారు.
నేరెళ్ళ వేణుమాధవ్ వరంగల్ పట్టణంలోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు.
పండితుడైన తండ్రి, వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ తన ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తుండగా, అలా వచ్చిన వారిలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి గొప్పవారి సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. సినిమాలంటే ఎంతో ఇష్టం. చిత్తూరు నాగయ్య నటించిన గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి, నాగయ్య కూడా ధ్వన్యనుకరణ చేయగలవారు కావడంతో ఆయన పై అభిమానంతో కేవలం స్వయం పరిశీలనతోనే ఆ రంగంలో ప్రవేశించాడు. అలాగే వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవాడు. అలా మొదలయ్యింది అయన మిమిక్రీ ప్రస్థానం.
1950 లో మెట్రిక్యులేషన్, 1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు, ఇతర లెక్చరర్లు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ కు ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ ( బర్సరీ ) మంజూరు చేశారు. ఆ డబ్బుతో పలు ఇంగ్లీషు సినిమాల్ని చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపిస్తే, రామనర్సు పరమానంద భరితులై "యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్" అని, అయితే నీవు నా రెండవ కుమారుడవు అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే వీరిని 'విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్' గా ఎదిగేలా చేసాయి. 1953 లో ప్రభుత్వ పాఠశాల (జి సి ఎస్ స్కూలు హనుమకొండ) లో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి, ధర్మ సాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. అనంతరకాలంలో ప్రైవేటుగా బీ.ఏ. బీ. కాం పాసయ్యారు.
తొలి ప్రదర్శన 1947 లో ఇచ్చారు. మలి ప్రదర్శన 1953 లో రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ లో బలరాజ సహానీ గారి అధ్యక్షతన, గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు, స్థానం నరసింహారావు, చాగంటి సన్యాసిరాజు గారల సమక్షంలో ఇచ్చారు.
ఆయన ప్రదర్శనలు చూసిన పలువురు రాజకీయ ప్రముఖుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు లాంటి ఎంతోమంది ఉన్నారు.
ఆస్ట్రేలియా,ఫిజీ దీవులు -1965,
సింగపూర్,మలేషియా - 1968
పశ్చిమ జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా, కెనెడా, లెబనాన్ - 1971
ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన - 1971, సింగపూర్,మలేషియా - 1975, అమెరికా, కెనెడా - 1976
దక్షిణాఫ్రికా,మారిషస్,సీషెల్స్ - 1976, సింగపూర్, మలేషియా -1977, అమెరికా, కెనెడా - 1982
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 1987, మారిషస్ - 1990 తదితర దేశాలలో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చాడు.
వేణుమాధవ్ గారు నిర్వహించిన పదవుల్లో ఎం.ఎల్.సీ (1972-78)
ఎఫ్.డీ.సీ డైరెక్టర్ (1976-77)
సంగీత నాటక అకాడమీ సభ్యుడు (1974-78), సౌత్ జోన్ కల్చరల్ కమిటీ, తంజావూరు సభ్యుడు,
దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-94),
టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు (1993-96),
రైల్వే జోనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు (1993-96),
ఎ.పి.లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడు (1972-75), రవీంద్ర భారతి కమిటీ సభ్యుడు (1974-78), ప్రభుత్వ అకాడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడు (1975-76) తదితర పదవులు నిర్వహించాడు.
ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, చుపే రుస్తుం ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళాసరస్వతి, స్వర్ కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ, మున్నగు బిరుదులు వరించాయి. 1977 ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ బిరుదు, 1982 రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, 1987 జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వ విద్యాలయం, 1992 కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు...1997 కనకాభిషేకం, 1998 ఎన్టీఆర్ ఆత్మ గౌరవ పురస్కారం, 2001 పద్మశ్రీ, 2005 తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018లో భాగంగా జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందజేయ బడింది. తిరుపతి పట్టణంలో గజారోహణం, పొరసన్మానం జరిగాయి.
పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ 2018, జూన్ 19వ తేదీ తమ 85వ యేట కన్నుమూశారు. హనుమకొండ పట్టణంలో నిర్మింపబడ్డ 'డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళాప్రాంగణం ' సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని వేదికగా ఉపయోగ పడుతున్నది. నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్' ను స్థాపించి ప్రతియేటా తన పుట్టినరోజైన డిసెంబర్ 28న ప్రముఖ కళాకారులను పదివేల రూపాయల పురస్కారంతో సత్కరిస్తున్నారు.
2017లో నేరెళ్ల వేణుమాధవ్ పేరుతో పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్ను విడుదల చేసింది. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 28వ తేదీని తెలుగు రాష్ట్రాల్లో 'మిమిక్రీ డే'గా జరుపు కుంటారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఐబొమ్మ.. ఇక ‘నో బొమ్మే' నా? వెండితెరకు శని: రవి అరెస్ట్ – అసలు ఏం జరుగుతుంది?
హైదరాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు)
తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పిరేటెడ్ సినిమా సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ సైట్ను నడిపిస్తున్న వ్యక్తిగా భావిస్తున్న **ఇమ్మడి రవి (ఐ రవి)**ను శనివారం ఉదయం కూకట్పల్లి ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని... రాజీ ద్వారానే సత్వర న్యాయం సీనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్.
మెట్టుపల్లి నవంబర్ 15 (ప్రజామంటలు దగ్గుల అశోక్)
పరస్పరం రాజీ పడటం ద్వారానే సత్వర న్యాయం జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘ కాలికాంగ కేసుల్ని కొట్లాడకుండా, రాజీ చేసుకోవడం... ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా శివపార్వతి కళ్యాణం
సికింద్రాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
న్యూ బోయిగూడలోని సెంట్రల్ కోర్టు అపార్టుమెంటు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంటు డాక్టర్ జి. హనుమాన్లు, జి. వనిత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన అభిషేకం కార్యక్రమంలో వందలాదిమంది తమ స్వహస్తాలతో క్షీరాభిషేకం చేశారు. అనంతరం అపార్టుమెంటు దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించి శివపార్వతి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
కార్తీక ఏకాదశి పర్వదినాన... రోటరీ ఇంటర్నేషనల్ యంగ్ అచీవర్ అవార్డు–2025కి ఆకర్షణ
సికింద్రాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
హైదరాబాద్కు చెందిన 14 ఏళ్ల ఆకర్షణ అద్భుత ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆర్టిఎన్. ఫ్రాన్సిస్కో అరెజ్జో చేతుల మీదుగా ఆమె Rotary International Young Achiever Award 2025ను హ్యూమానిటేరియన్ సర్వీస్ విభాగంలో అందుకున్నారు. ఈ అవార్డ్ను పొందిన వారిలో ఆమెనే... వశిష్ట కళాశాలలో బీర్సా ముండా 150వ జయంతి
సికింద్రాబాద్, నవంబర్ 15 ( ప్రజా మంటలు):
ఎబీవీపీ సికింద్రాబాద్ జిల్లా, ఎస్ఆర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో వశిష్ట కళాశాలలో భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు బీర్సా ముండా గాంధీ, నేతాజీ, అల్లూరి, భగత్ సింగ్లతో సమానమైన ఆదివాసి స్వాతంత్ర్య వీరుడని చెప్పారు.... గ్లోబ్ ట్రాటర్ (SSMB29) – మహేష్ బాబు, రాజమౌళి సినిమా టీజర్ విడుదల
హైదరాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
ఎస్.ఎస్. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్–వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘గ్లోబ్ ట్రాటర్’ (వర్కింగ్ టైటిల్ SSMB29), అధికారికంగా ‘వారణాసి’ అనే టైటిల్తో గ్రాండ్ ఈవెంట్లో టీజర్ను ఆవిష్కరించారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫస్ట్... మాధ్యమాలు ఏకపక్షంగా మారాయి: ప్రపంచంలో చెత్త టీవీ న్యూస్ ఛానల్స్లోనే..
“భారత మీడియా విమర్శించే శక్తిని కోల్పోయింది
నితీష్, మోడీ, రాహుల్ – ఎవ్వరూ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు
న్యూఢిల్లీ నవంబర్ 15:
భారత టెలివిజన్ వార్తా ఛానల్స్ నాణ్యతపై ప్రముఖ పాత్రికేయుడు, ది హిందూ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎన్. రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల మీడియా కవరేజ్పై ‘ది వైర్’ కోసం... గౌతమ ఉన్నత పాఠశాలలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు
జగిత్యాల నవంబర్ 15 (ప్రజా మంటలు) గౌతమ ఎడ్యుకేషన్ సొసైటీ విద్యాసంస్థల్లో రెండు రోజులుగా చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
కాగా శనివారం గౌతమ ఉన్నత పాఠశాల లో చిల్డ్రన్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు . సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో... పదేళ్ల బాలికపై లైంగిక దాడి: కేరళలో బీజేపీ నేతకు జీవిత ఖైదు
థలసేరి / కన్నూర్ నవంబర్ 15:
కేరళలోని పలాథాయి పాఠశాలలో 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో బీజేపీ మాజీ నేత కె. పద్మరాజన్ కు థలసేరి POCSO ఫాస్ట్-ట్రాక్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ తీర్పుతో ఐదేళ్లుగా నడుస్తున్న ఈ కీలక కేసు ముగిసింది.
ఘటన ఎలా జరిగింది?
2020... రాజీమార్గమే రాజ మార్గం
జగిత్యాల నవంబర్ 15 (ప్రజా మంటలు)రాజీమార్గమే రాజమార్గమని జిల్లా న్యాయమూర్తి రత్నప్రభవతి అన్నారు .శనివారం చీఫ్ రిజిస్టర్ ఆదేశాలతో జిల్లా కేంద్రంలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పెండింగ్ కేసులు సివిల్ తగాదాలు చెక్ బౌన్స్ మ్యారేజ్ ఇష్యూస్ స్పెషల్ లోక్ అదాలత్ లో పరిశీలించుకోవచ్చునని తెలిపారు. చిన్నచిన్న... నౌగామ్ బ్లాస్ట్: ‘కిటికీ తీసే సరికి పోలీస్ స్టేషన్ మంటల్లో…
శ్రీనగర్/నౌగామ్ (జమ్మూకాశ్మీర్) నవంబర్ 15;
నౌగామ్ సెక్టార్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న భారీ పేలుడు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. అకస్మాత్తుగా వచ్చిన ఈ బ్లాస్ట్తో ప్రాంతమంతా ఒకేసారి షాక్కు గురై, కుటుంబాలు చిన్నపిల్లలతో సహా రాత్రి చీకటి మధ్య ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
స్థానికుల మాటల్లో—“కిటికీ తీసే సరికి... జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక భేటీలు
న్యూ ఢిల్లీ నవంబర్ 15 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ నేతలు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీలను భేటీ అయ్యారు.
ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 98,888... 