శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు
జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన, గోవింద మాంబ సమేత శ్రీమద్విరాట్ జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయం లో షష్టమ సంవత్సర వార్షికోత్సవాల్లో భాగంగా,శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మహా వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం వారసులు శ్రీ వీరభద్ర స్వామి, లక్ష్మి భ్రమరాంబిక,దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కళ్యాణం జరిపించారు. అరవింద్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి ఎదురుకోళ్లు కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో వందలాదిమంది మాత లు కోలాటాలు,వేస్తూ, నృత్యాలు చేస్తూ, ఉత్సవమూర్తులను ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి చేర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎదులాపురం సదాశివ ఆచార్యులు, కళ్యాణ కార్యక్రమ క్రతువు బ్రహ్మశ్రీ శ్రీపాద లక్ష్మీనరసింహ శాస్త్రి,,కార్యక్రమం నిర్వహించారు. ఈనాటి కార్యక్రమానికి ప్రముఖ జ్యోతిష్య,పౌరాణిక,వేద, పండితులు శ్రీ మాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక, వేంచేసి మంగళ శాసనాలు అందించారు.
ఈనాటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పి చైర్పర్సన్ దావ సంత, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గిరి నాగభూషణం, మరియు విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు టీవీ సత్యం, టీవీ సూర్యం, పట్టణ జిల్లా మహిళా అధ్యక్షులు గాజోజు రాధ, సంకోజు లక్ష్మి, పట్టణ అధ్యక్షులు సంకోజి రమణ, రామస్వామి, నిరంజనా చారి, మేడం పెళ్లి శ్రీనివాసు, కత్రోజి శ్రీనివాస్,కంపోజి నారాయణ,మద్దుల పల్లి సత్యం, భూమయ్య, గంగారాం, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
