శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు
జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన, గోవింద మాంబ సమేత శ్రీమద్విరాట్ జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయం లో షష్టమ సంవత్సర వార్షికోత్సవాల్లో భాగంగా,శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మహా వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం వారసులు శ్రీ వీరభద్ర స్వామి, లక్ష్మి భ్రమరాంబిక,దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కళ్యాణం జరిపించారు. అరవింద్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి ఎదురుకోళ్లు కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో వందలాదిమంది మాత లు కోలాటాలు,వేస్తూ, నృత్యాలు చేస్తూ, ఉత్సవమూర్తులను ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి చేర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎదులాపురం సదాశివ ఆచార్యులు, కళ్యాణ కార్యక్రమ క్రతువు బ్రహ్మశ్రీ శ్రీపాద లక్ష్మీనరసింహ శాస్త్రి,,కార్యక్రమం నిర్వహించారు. ఈనాటి కార్యక్రమానికి ప్రముఖ జ్యోతిష్య,పౌరాణిక,వేద, పండితులు శ్రీ మాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక, వేంచేసి మంగళ శాసనాలు అందించారు.
ఈనాటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పి చైర్పర్సన్ దావ సంత, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గిరి నాగభూషణం, మరియు విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు టీవీ సత్యం, టీవీ సూర్యం, పట్టణ జిల్లా మహిళా అధ్యక్షులు గాజోజు రాధ, సంకోజు లక్ష్మి, పట్టణ అధ్యక్షులు సంకోజి రమణ, రామస్వామి, నిరంజనా చారి, మేడం పెళ్లి శ్రీనివాసు, కత్రోజి శ్రీనివాస్,కంపోజి నారాయణ,మద్దుల పల్లి సత్యం, భూమయ్య, గంగారాం, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
