ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)
ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగానంద), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాల సందర్భంగా, దేవస్థానం లోని ప్రధానాలయాలలో సోమ వారం
విధివిదాన సాంప్రదాయ ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన యజ్ఞా చార్యులు కందాల పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, ఆలయాల అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, నేరెళ్ళ శ్రీనివాసా చార్యులు, రమణ, అశ్విన్, వంశీ కృష్ణ, అరుణ్, కిరణ్, మోహన్, వంశీ, విజయ్ వేదోక్త రీతిలో ఉత్సవ ప్రత్యేక అర్చనలు గావించారు. ఆస్థాన అర్చక పురోహితులు సంతోష్, సంపత్, రాజగోపాల్, ప్రవీణ్ నిత్య పూజలతోపాటు ద్వార తోరణాది హవనములు, స్వామికి శక్తిని కలుగజేసేందుకు హోమధూళిచే శక్తి హోమం, నక్షత్ర, నవగ్రహ సప్తజిహ్వ, షడంగ న్యాస, పంచసూక్త, పురుషసూక్త, శ్రీసూక్త, భూసూక్త, నీలాసూక్త, పరివార హోమాలు, సర్వ సస్యాభివృద్ధికై, సర్వదేవతావహన హోమాలు, ఉత్సవాంగ ప్రధాన హోమం, లోక కళ్యాణార్థం రక్షాసు మంత్ర స్మరణం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణాది కార్యక్రమాలను నిర్వహించారు.
గోదావరి నదిలో మంగళ స్నానాలు
సోమవారం బ్రహ్మోత్సవాల సందర్భంగా
ఉదయాత్వూర్వం నుండి గోదావరిలో స్నానాలను సుదూర ప్రాంతాలకు చెందిన అశేష భక్తులు సాంప్రదాయాచరణలో భాగంగా ఆచరించారు. ధర్మపురి నారసింహుడు మహారాష్ట్ర ప్రాంత వాసులకు కులదైవమైన క్రమంలో సుదూర ప్రాంతాల నుండి ప్రైవేటు వాహనాలలో పరంపరానుగత వంశాచారంలో భాగంగా భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాల అనంతర దర్శనాలకై విచ్చేసిన రాష్ట్రేతర భక్తులు, గోదావరి పౌరోహితులచే సంకల్పాది సత్కర్మలను ఆచరించి, దానధర్మాలు చేసుకున్నారు. నది వద్దే వంటలు చేసుకుని, నదీమ తల్లికి నివేదించి, ఆరగించారు.
మొక్కులు తీర్చుకున్న భక్తులు
సుదూర ప్రాంతాల నుండి వంవపారంపర్య సాంప్రదా యాచరణల ప్రకారం అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు, యాత్రికులు గోదావరినదికి నేరుగా వెళ్ళి, మంగళ స్నానాలు ఆచరించి, సంకల్ప దానధర్మాది సత్కర్మలు ఆచరించి, దైవదర్శనాలకై దేవస్థానం వద్ద ఆలయాల ముందు బారులు తీరి నిలుచున్నారు. యోగానంద, ఉగ్ర నారసిం హునికి ముడుపులు చెల్లించి మెక్కులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెల సాఫల్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల నయానికి, మానసిక రుగ్మతల నివారణకు భక్తులు బెల్లం, కొబ్బరి కాయలు, వస్త్రాలు, కోడె ముక్కులు, వల్లు బండ, గండా దీపాది మొక్కులు తీర్చుకున్నారు. సంతానార్థం హోమ గుండంవద్ద ప్రత్యేక పూజలు చేయించు కున్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషప్ప కళా వేదికపై సంగీత రత్న నరహరి శర్మ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు
అలరించాయి. ప్రధానంగా శేషప్ప భక్త మండలి ఆధ్వర్యంలో ఎన్నం బాపురెడ్డి నిర్వహణలో సభ్యులు శేషప్ప విరచిత నరసింహ శతక పద్య గానం చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు గాయకులను సత్కరించారు.
మధు బాపు బృందం, గొల్లపెల్లి రాంకిషన్ బృందం, భక్తి సంగీత విభావరి,చేగొండ పవన్ కుమార్ బృందం శివ తాండవం, మిమిక్రి పితామహ
- గుండి ప్రేమ్ కుమార్, ఓజ్జల పుల్లయ్య శాస్త్రి మిమిక్రీలు, తదితర నృత్య ప్రదర్శనలు, ఆకట్టుకున్నాయి. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, కమిటీ చైర్మన్ రవీందర్, సభ్యులు కళాకారులను సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కొండగట్టు జనవరి 2 (ప్రజా మంటలు)1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అశోక్... రాష్ట్ర మంత్రులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు
జగిత్యాల జనవరి 2 (ప్రజా మంటలు)నూతన సంవత్సరం 2026 పురస్కరించుకొని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు ఆడవాళ్ళ జ్యోతి లక్ష్మణ్తెలంగాణ రాష్ట్ర మంత్రులకు పొన్నం ప్రభాకర్ కి, అడ్లూరి లక్ష్మణ్ మరియు శ్రీధర్ బాబులను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్యతో ప్రత్యక్షంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు... హత్యకు పాల్పడ్డ ఇద్దరు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన పట్టణ సిఐ కరుణాకర్
జగిత్యాల జనవరి 2 (ప్రజా మంటలు)పట్టణంలోని గోవిందుపల్లికి చెందిన కొలగాని అంజయ్యను జగిత్యాల పట్టణానికి చెందిన బాసోజి శ్రీనివాస్ ఇతని కొడుకు వేణు, చారి లు కలిసి డిసెంబర్ 31 న దాడి చేసి హత్య చేసినట్టు పట్టణ సిఐ కరుణాకర్ శుక్రవారం మీడియాతో వివరాలు తెలిపారు .
మృతుడు అంజయ్యకు నిందితుడు శ్రీనివాస్... వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలి -జిల్లా రవాణా అధికారి యం. శ్రీనివాస్
జగిత్యాల జనవరి 2 ( ప్రజా మంటలు)జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవల సందర్భంగా జగిత్యాల జిల్లా రవాణా అధికారి యం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద సీట్ బెల్ట్ పై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు
ఈ సందర్భంగా సీట్ బెల్ట్ ధరించిన వారిని గులాబీ పువ్వు... కరీంనగర్ మున్సిపల్ కౌన్సిల్ పై ఎంఐఎం జెండా ఎగురవేస్తాము నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పిలుపు
జగిత్యాల, జనవరి 02(ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న ఎంఐఎం పార్టీదే మాత్రమే సూపర్ పవర్ అని, ఎంఐఎం మద్దతు లేనిదే ఆకు కూడా కదలదని, రాష్ట్ర రాజకీయాల్లో ఎంఐఎం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తులో ఎంఐఎం పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా శ్రమించాలని, హైదరాబాద్ నాంపల్లి ఎమ్మెల్యే, యూత్... రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్, జగిత్యాల క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త కాసుగుంటి సుధాకర్ రావు మృతికి ఘనంగా శ్రద్ధాంజలి
జగిత్యాల జనవరి 2 ( ప్రజా మంటలు)
రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ మరియు జగిత్యాల క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ఆవరణలో .....శుక్రవారం ఉదయం 11 గంటలకు విద్యావేత్త జగిత్యాల క్లబ్ మరియు రోటరీ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు కాసుగంటి సుధాకర్ రావు మృతి పట్ల సంతాప సమావేశం నిర్వహించి ఆయన చిత్రపటానికి పూల... మెడిసిన్ అప్డేట్- 2026 లో డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురణ. జగిత్యాల వైద్యుడికి దక్కిన అరుదైన అవకాశం.
జగిత్యాల. జనవరి 2( ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ భీమనాతిని శంకర్ కు అరుదైన అవకాశం దక్కింది. మెడిసిన్ అప్డేట్ - 2026 వైద్య గ్రంథంలో డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురితమైంది.
వైద్య రంగంలో కొత్త కొత్త అంశాలు, ఆవిష్కరణలతో ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలోని జేపీ బ్రదర్స్... మూసీ పునరుజ్జీవానికి వేగం – మార్చి నాటికి టెండర్లు, త్వరలో పనులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును వేగవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లశాసన సభలో చెప్పారు. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి, కాలుష్య నివారణ, శుద్ధి నీటి ప్రవాహం... కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరు – కవిత
హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ నేత కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరని ఆమె స్పష్టం చేశారు. శాసనమండలి ఆవరణలో పాత్రికేయులతో మాట్లాడుతూ, కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు.
కేసీఆర్ సభకు హాజరై ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, అలా చేయకపోతే... కౌన్సిల్లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటా – కవిత
హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు):
తాను చేసిన రాజీనామాను కౌన్సిల్లో మాట్లాడిన తర్వాతే ఆమోదింప చేయించుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సెప్టెంబర్ 3న రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు దాన్ని ఆమోదించలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం శాసన మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఛైర్మన్ను కోరనున్నట్లు... తుంగురు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
బీర్పూర్ జనవరి 1 (ప్రజా మంటలు)
బీర్పూర్ మండల తుంగూరు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ గ్రామ పంచాయతీ స్టల దాత సర్పంచ్ రాజగోపాల్ రావు స్థలాన్ని అఫిడవిట్ రూపంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పంచాయతీ రాజ్ డి.ఈ. మిలింద్ కి... 