ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)
ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగానంద), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాల సందర్భంగా, దేవస్థానం లోని ప్రధానాలయాలలో సోమ వారం
విధివిదాన సాంప్రదాయ ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన యజ్ఞా చార్యులు కందాల పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, ఆలయాల అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, నేరెళ్ళ శ్రీనివాసా చార్యులు, రమణ, అశ్విన్, వంశీ కృష్ణ, అరుణ్, కిరణ్, మోహన్, వంశీ, విజయ్ వేదోక్త రీతిలో ఉత్సవ ప్రత్యేక అర్చనలు గావించారు. ఆస్థాన అర్చక పురోహితులు సంతోష్, సంపత్, రాజగోపాల్, ప్రవీణ్ నిత్య పూజలతోపాటు ద్వార తోరణాది హవనములు, స్వామికి శక్తిని కలుగజేసేందుకు హోమధూళిచే శక్తి హోమం, నక్షత్ర, నవగ్రహ సప్తజిహ్వ, షడంగ న్యాస, పంచసూక్త, పురుషసూక్త, శ్రీసూక్త, భూసూక్త, నీలాసూక్త, పరివార హోమాలు, సర్వ సస్యాభివృద్ధికై, సర్వదేవతావహన హోమాలు, ఉత్సవాంగ ప్రధాన హోమం, లోక కళ్యాణార్థం రక్షాసు మంత్ర స్మరణం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణాది కార్యక్రమాలను నిర్వహించారు.
గోదావరి నదిలో మంగళ స్నానాలు
సోమవారం బ్రహ్మోత్సవాల సందర్భంగా
ఉదయాత్వూర్వం నుండి గోదావరిలో స్నానాలను సుదూర ప్రాంతాలకు చెందిన అశేష భక్తులు సాంప్రదాయాచరణలో భాగంగా ఆచరించారు. ధర్మపురి నారసింహుడు మహారాష్ట్ర ప్రాంత వాసులకు కులదైవమైన క్రమంలో సుదూర ప్రాంతాల నుండి ప్రైవేటు వాహనాలలో పరంపరానుగత వంశాచారంలో భాగంగా భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాల అనంతర దర్శనాలకై విచ్చేసిన రాష్ట్రేతర భక్తులు, గోదావరి పౌరోహితులచే సంకల్పాది సత్కర్మలను ఆచరించి, దానధర్మాలు చేసుకున్నారు. నది వద్దే వంటలు చేసుకుని, నదీమ తల్లికి నివేదించి, ఆరగించారు.
మొక్కులు తీర్చుకున్న భక్తులు
సుదూర ప్రాంతాల నుండి వంవపారంపర్య సాంప్రదా యాచరణల ప్రకారం అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు, యాత్రికులు గోదావరినదికి నేరుగా వెళ్ళి, మంగళ స్నానాలు ఆచరించి, సంకల్ప దానధర్మాది సత్కర్మలు ఆచరించి, దైవదర్శనాలకై దేవస్థానం వద్ద ఆలయాల ముందు బారులు తీరి నిలుచున్నారు. యోగానంద, ఉగ్ర నారసిం హునికి ముడుపులు చెల్లించి మెక్కులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెల సాఫల్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల నయానికి, మానసిక రుగ్మతల నివారణకు భక్తులు బెల్లం, కొబ్బరి కాయలు, వస్త్రాలు, కోడె ముక్కులు, వల్లు బండ, గండా దీపాది మొక్కులు తీర్చుకున్నారు. సంతానార్థం హోమ గుండంవద్ద ప్రత్యేక పూజలు చేయించు కున్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషప్ప కళా వేదికపై సంగీత రత్న నరహరి శర్మ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు
అలరించాయి. ప్రధానంగా శేషప్ప భక్త మండలి ఆధ్వర్యంలో ఎన్నం బాపురెడ్డి నిర్వహణలో సభ్యులు శేషప్ప విరచిత నరసింహ శతక పద్య గానం చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు గాయకులను సత్కరించారు.
మధు బాపు బృందం, గొల్లపెల్లి రాంకిషన్ బృందం, భక్తి సంగీత విభావరి,చేగొండ పవన్ కుమార్ బృందం శివ తాండవం, మిమిక్రి పితామహ
- గుండి ప్రేమ్ కుమార్, ఓజ్జల పుల్లయ్య శాస్త్రి మిమిక్రీలు, తదితర నృత్య ప్రదర్శనలు, ఆకట్టుకున్నాయి. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, కమిటీ చైర్మన్ రవీందర్, సభ్యులు కళాకారులను సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి పనులు ఆగబోవని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్రెడ్డి చేసిన విమర్శలకు స్పందించారు.... రోగుల సహాయకులకు పదేళ్లుగా ఉచిత అన్నప్రసాదం
జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):
జగిత్యాల సత్యసాయి సేవా సమితి, సత్యసాయి నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా పథకం 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోగుల సహాయకులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్న ఈ కార్యక్రమానికి జగిత్యాల... జగిత్యాల బీజేపీలో అసమ్మతి సెగలు
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల, ఆగస్టు 29:జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మూడు దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు తమకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోరుట్ల సమీపంలోని ఓ... తెలుగు భాషా ఫోరం ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలు
జగిత్యాల ఆగస్ట్ 29(ప్రజా మంటలు)జిల్లా భాషోపాధ్యాయులు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు ఆయుపట్టు పద్యం. తెలుగు భాషా సొగసుకు శిఖరాగ్రమైన ప్రక్రియ పద్య సాహిత్యం. పై అంశాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా డీఈవో కె.రాము అనుమతి తీసుకుని, తెలుగు భాషా ఫోరం లెటర్ ప్యాడ్... డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
కరీంనగర్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న తమ్ముడి వద్దకు వెళ్లిన అక్క రోడ్డుపైనే బస్సును ఆపించి రాఖీ కట్టింది.గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజు తిమ్మాపూర్ మండలం రేణికుంట... వైకుంఠ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
నాంపల్లిలోని రామ్ ప్రతాప్ పిట్టి భవన్లో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి బాలాజీ మందిరంలో ప్రముఖ వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఉత్సవాల్లో మాజీ సీనియర్ మంత్రి, మాజీ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గోడిసెల రాజేశం గౌడ్ పాల్గొన్నారు. ఆగస్టు 25 నుంచి 30వ... వేతన చెల్లింపులో జాప్యంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం
ఫారమ్–16 జారీ, జాప్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సిఫార్సు
హైదరాబాద్ ఆగస్ట్ 28 (ప్రజా మంటలు):
ఉద్యోగికి సకాలంలో వేతనం చెల్లించకపోవడం, ఆదాయపు పన్నుకు సంబంధించిన పత్రాలు అందించడంలో జాప్యం చేయడం మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశమేనని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది.... అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ
జగిత్యాల ఆగస్టు 28(ప్రజా మంటలు)శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఆవరణలో గల తిరుమల తిరుపతి దేవస్థానం ధ్యాన మందిరంలో ఉపాకర్మ కార్యక్రమం నిర్వహించారు. దేవతర్పణము ఋషితర్పణము పితృతర్పణాల అనంతరం హోమము నిర్వహించారు. .
నూతన యజ్ఞోపవీత ధారణ అనంతరం సభాపతి తిగుళ్ళ విశ్వనాథ శర్మ ఉపాకర్మ ప్రత్యేకత... గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ వేడుకలు
జగిత్యాల ఆగస్టు 28 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల శ్రీ రామాలయంలో విద్యానగర్ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉపాకర్మ ఘనంగా నిర్వహించారు. హోమము తర్పణాలు నిర్వహించి నూతన యజ్ఞోపవీత ధారణ చేశారు.
కార్యక్రమంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొలిచాల రవీందర్ వైదిక క్రతువు అన్యారంభట్ల నారాయణ... సోదర సోదరి అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్
జగిత్యాల ఆగస్టు 27 (ప్రజా మంటలు) రక్షాబంధన్ పండుగ శ్రావణమాసం పౌర్ణమిలో జరుపుకుంటాము. వైదికంగా జంధ్యాల పౌర్ణమిగా దీనినే రాఖీ పౌర్ణమి గా భావిస్తారు. రాఖీ పౌర్ణమి కి ప్రత్యేక విశిష్టత ఉంది. సోదరీలు తమ సోదరులకు రక్షాబంధనం చేసి తమ ఆత్మీయతను ఆవిష్కరిస్తారు.
పౌర్ణమి శుక్రవారం ఉన్నప్పటికీ తక్కువ సమయం ఉండడం అదేవిధంగా... ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.. జగిత్యాల రూరల్ సిఐ దామెర సుధాకర్.
జగిత్యాల, ఆగస్టు 27( ప్రజా మంటలు) ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
కృషి పట్టుదల ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని జగిత్యాల రూరల్ సిఐ దామెర సుధాకర్ అన్నారు.వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత పోలీసు శిక్షణ శిబిరాన్ని రూరల్ సీఐ సుధాకర్ సందర్శించి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ... మౌంట్ కార్మెల్ హైస్కూల్ లో ఘనంగా రక్ష బంధన్ వేడుకలు
జగిత్యాల ఆగస్ట్ 27(ప్రజా మంటలు)
ధరూర్ లోని *మౌంట్ కార్మెల్ హైస్కూల్* లో రక్ష బంధన్ వేడుకలు అత్యంత ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో పాఠశాల యాజమాన్యం నిర్వహించారుఈ సందర్భంగా పాఠశాల బాలికలు పాఠశాలలోని బాలురకి రాఖీలు కట్టి *నువ్వు నాకూ రక్ష నేను నీకు రక్ష మనం దేశానికి రక్ష* అని నినదించారు.
పాఠశాల... 