ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)
ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగానంద), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాల సందర్భంగా, దేవస్థానం లోని ప్రధానాలయాలలో సోమ వారం
విధివిదాన సాంప్రదాయ ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన యజ్ఞా చార్యులు కందాల పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, ఆలయాల అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, నేరెళ్ళ శ్రీనివాసా చార్యులు, రమణ, అశ్విన్, వంశీ కృష్ణ, అరుణ్, కిరణ్, మోహన్, వంశీ, విజయ్ వేదోక్త రీతిలో ఉత్సవ ప్రత్యేక అర్చనలు గావించారు. ఆస్థాన అర్చక పురోహితులు సంతోష్, సంపత్, రాజగోపాల్, ప్రవీణ్ నిత్య పూజలతోపాటు ద్వార తోరణాది హవనములు, స్వామికి శక్తిని కలుగజేసేందుకు హోమధూళిచే శక్తి హోమం, నక్షత్ర, నవగ్రహ సప్తజిహ్వ, షడంగ న్యాస, పంచసూక్త, పురుషసూక్త, శ్రీసూక్త, భూసూక్త, నీలాసూక్త, పరివార హోమాలు, సర్వ సస్యాభివృద్ధికై, సర్వదేవతావహన హోమాలు, ఉత్సవాంగ ప్రధాన హోమం, లోక కళ్యాణార్థం రక్షాసు మంత్ర స్మరణం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణాది కార్యక్రమాలను నిర్వహించారు.
గోదావరి నదిలో మంగళ స్నానాలు
సోమవారం బ్రహ్మోత్సవాల సందర్భంగా
ఉదయాత్వూర్వం నుండి గోదావరిలో స్నానాలను సుదూర ప్రాంతాలకు చెందిన అశేష భక్తులు సాంప్రదాయాచరణలో భాగంగా ఆచరించారు. ధర్మపురి నారసింహుడు మహారాష్ట్ర ప్రాంత వాసులకు కులదైవమైన క్రమంలో సుదూర ప్రాంతాల నుండి ప్రైవేటు వాహనాలలో పరంపరానుగత వంశాచారంలో భాగంగా భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాల అనంతర దర్శనాలకై విచ్చేసిన రాష్ట్రేతర భక్తులు, గోదావరి పౌరోహితులచే సంకల్పాది సత్కర్మలను ఆచరించి, దానధర్మాలు చేసుకున్నారు. నది వద్దే వంటలు చేసుకుని, నదీమ తల్లికి నివేదించి, ఆరగించారు.
మొక్కులు తీర్చుకున్న భక్తులు
సుదూర ప్రాంతాల నుండి వంవపారంపర్య సాంప్రదా యాచరణల ప్రకారం అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు, యాత్రికులు గోదావరినదికి నేరుగా వెళ్ళి, మంగళ స్నానాలు ఆచరించి, సంకల్ప దానధర్మాది సత్కర్మలు ఆచరించి, దైవదర్శనాలకై దేవస్థానం వద్ద ఆలయాల ముందు బారులు తీరి నిలుచున్నారు. యోగానంద, ఉగ్ర నారసిం హునికి ముడుపులు చెల్లించి మెక్కులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెల సాఫల్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల నయానికి, మానసిక రుగ్మతల నివారణకు భక్తులు బెల్లం, కొబ్బరి కాయలు, వస్త్రాలు, కోడె ముక్కులు, వల్లు బండ, గండా దీపాది మొక్కులు తీర్చుకున్నారు. సంతానార్థం హోమ గుండంవద్ద ప్రత్యేక పూజలు చేయించు కున్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషప్ప కళా వేదికపై సంగీత రత్న నరహరి శర్మ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు
అలరించాయి. ప్రధానంగా శేషప్ప భక్త మండలి ఆధ్వర్యంలో ఎన్నం బాపురెడ్డి నిర్వహణలో సభ్యులు శేషప్ప విరచిత నరసింహ శతక పద్య గానం చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు గాయకులను సత్కరించారు.
మధు బాపు బృందం, గొల్లపెల్లి రాంకిషన్ బృందం, భక్తి సంగీత విభావరి,చేగొండ పవన్ కుమార్ బృందం శివ తాండవం, మిమిక్రి పితామహ
- గుండి ప్రేమ్ కుమార్, ఓజ్జల పుల్లయ్య శాస్త్రి మిమిక్రీలు, తదితర నృత్య ప్రదర్శనలు, ఆకట్టుకున్నాయి. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, కమిటీ చైర్మన్ రవీందర్, సభ్యులు కళాకారులను సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించి వివిధ పుష్పాలతో మాలలు అల్లి అలంకరించారు .సాయంత్రం మొదటి పాశురం సామూహికంగా... గ్రామపంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మద్దతు తో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పి చైర్పర్సన్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గం లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లను సన్మానించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి డిసెంబర్ 16 (ప్రజా మంటలు) నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూమాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత 10 సంవత్సరాలలో చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందుంచుతాననిఅబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ మీ ప్రభుత్వం అన్నారు.
, మీ నాయకత్వమే., సంక్షేమ శాఖ మంత్రిగా... మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 16( ప్రజా మంటలు)
పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు 163 బి ఎన్ ఎస్ ఎస్(144 సెక్షన్ అమలు) విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు
జిల్లాలో జరగనున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ... దళితుల భూమిని ఆక్రమించి, దారి మూసివేత
ఎల్కతుర్తి డిసెంబర్ 16 (ప్రజా మంటలు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని దండేపల్లి, దగ్గువారి పల్లె మధ్య ఉన్న డిబిఎం 20 ఎస్సారెస్పీ కాలువ ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటూ, దళితుల పొలాలకు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సూరారం గ్రామానికి చెందిన బచ్చు శ్రీనివాస్... ఈనెల 21 న జాతీయ లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోండి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ ఈనెల 21న జాతీయ మెగా లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వి నియోగం చేసుకుని రాజీ కుదుర్చుకోవాలని సూచించారు.
జిల్లాలో సుమారు 18 యేళ్ళనుంచి కేసులు నమోదు అయి... యంగ్ ఇండియా స్కూల్, IIM హైదరాబాద్, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలపై కీలక చర్చలు
న్యూఢిల్లీ డిసెంబర్ 16 (ప్రజా మంటలు):
తెలంగాణలో విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన భేటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు... నేను జీవన్ రెడ్డికి నమ్మిన బంటును జీవన్ రెడ్డికు చెడ్డ పేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా..జగిత్యాల డిసిసి అధ్యక్షుడు ...గాజంగి నందయ్య .
జగిత్యాల డిసెంబర్ 16(ప్రజా మంటలు)నావల్ల కాంగ్రెస్ పార్టీకి, జీవన్ రెడ్డికి చెడ్డపేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా అన్నారు డిసిసి అధ్యక్షులు నందయ్య
జగిత్యాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ కొనసాగుతుండగా
ఎమ్మెల్యే సంజయ్తో నందయ్య సన్నిహితంగా కార్యక్రమాల్లో పాల్గొనడంపై అసంతృప్తి వ్యక్తం చేసిమంత్రి అడ్లూరి లక్ష్మణ్... చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్
చౌలామద్ది డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
ఈరోజు జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌలామద్ది గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, తుల గంగవ్వ స్మారక ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని... గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత
సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్ఓడీ డా. జి. రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థినిగా, అదే కళాశాలలో సేవలందించి పదవీ విరమణ పొందారు.
నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్... తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.
జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు.... 