ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

On
 ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)

ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగానంద), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాల సందర్భంగా, దేవస్థానం లోని ప్రధానాలయాలలో సోమ వారం 
విధివిదాన  సాంప్రదాయ ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన యజ్ఞా చార్యులు కందాల పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, ఆలయాల అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, నేరెళ్ళ శ్రీనివాసా చార్యులు, రమణ, అశ్విన్, వంశీ కృష్ణ, అరుణ్, కిరణ్, మోహన్, వంశీ, విజయ్ వేదోక్త రీతిలో ఉత్సవ ప్రత్యేక అర్చనలు గావించారు. ఆస్థాన అర్చక పురోహితులు సంతోష్, సంపత్, రాజగోపాల్, ప్రవీణ్ నిత్య పూజలతోపాటు ద్వార తోరణాది హవనములు, స్వామికి శక్తిని కలుగజేసేందుకు హోమధూళిచే శక్తి హోమం, నక్షత్ర, నవగ్రహ సప్తజిహ్వ, షడంగ న్యాస, పంచసూక్త, పురుషసూక్త, శ్రీసూక్త, భూసూక్త, నీలాసూక్త, పరివార హోమాలు, సర్వ సస్యాభివృద్ధికై, సర్వదేవతావహన హోమాలు, ఉత్సవాంగ ప్రధాన హోమం, లోక కళ్యాణార్థం రక్షాసు మంత్ర స్మరణం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణాది కార్యక్రమాలను నిర్వహించారు.

గోదావరి నదిలో మంగళ స్నానాలు

  సోమవారం బ్రహ్మోత్సవాల సందర్భంగా 
ఉదయాత్వూర్వం నుండి గోదావరిలో స్నానాలను సుదూర ప్రాంతాలకు చెందిన అశేష భక్తులు సాంప్రదాయాచరణలో భాగంగా ఆచరించారు. ధర్మపురి నారసింహుడు మహారాష్ట్ర ప్రాంత వాసులకు కులదైవమైన క్రమంలో సుదూర ప్రాంతాల నుండి ప్రైవేటు వాహనాలలో పరంపరానుగత వంశాచారంలో భాగంగా భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాల అనంతర దర్శనాలకై విచ్చేసిన రాష్ట్రేతర భక్తులు, గోదావరి పౌరోహితులచే సంకల్పాది సత్కర్మలను ఆచరించి, దానధర్మాలు చేసుకున్నారు. నది వద్దే వంటలు చేసుకుని, నదీమ తల్లికి నివేదించి, ఆరగించారు.

మొక్కులు తీర్చుకున్న భక్తులు

  సుదూర ప్రాంతాల నుండి వంవపారంపర్య సాంప్రదా యాచరణల ప్రకారం అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు, యాత్రికులు గోదావరినదికి నేరుగా వెళ్ళి, మంగళ స్నానాలు ఆచరించి, సంకల్ప దానధర్మాది సత్కర్మలు ఆచరించి, దైవదర్శనాలకై దేవస్థానం వద్ద ఆలయాల ముందు బారులు తీరి నిలుచున్నారు. యోగానంద, ఉగ్ర నారసిం హునికి ముడుపులు చెల్లించి మెక్కులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెల సాఫల్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల నయానికి, మానసిక రుగ్మతల నివారణకు భక్తులు బెల్లం, కొబ్బరి కాయలు, వస్త్రాలు, కోడె ముక్కులు, వల్లు బండ, గండా దీపాది మొక్కులు తీర్చుకున్నారు. సంతానార్థం హోమ గుండంవద్ద ప్రత్యేక పూజలు చేయించు కున్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషప్ప కళా వేదికపై సంగీత రత్న నరహరి శర్మ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు
 అలరించాయి. ప్రధానంగా శేషప్ప భక్త మండలి ఆధ్వర్యంలో ఎన్నం బాపురెడ్డి నిర్వహణలో సభ్యులు శేషప్ప విరచిత నరసింహ శతక పద్య గానం చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు గాయకులను సత్కరించారు. 
మధు బాపు బృందం, గొల్లపెల్లి రాంకిషన్ బృందం, భక్తి సంగీత విభావరి,చేగొండ పవన్ కుమార్ బృందం శివ తాండవం, మిమిక్రి పితామహ IMG-20250317-WA0016- గుండి ప్రేమ్ కుమార్, ఓజ్జల పుల్లయ్య శాస్త్రి మిమిక్రీలు, తదితర నృత్య ప్రదర్శనలు, ఆకట్టుకున్నాయి. దేవస్థానం ఈఓ శ్రీనివాస్,  కమిటీ చైర్మన్ రవీందర్, సభ్యులు కళాకారులను సన్మానించారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

పారాక్వాట్ విషం తాగిన 12 ఏండ్ల బాలుడు -రక్షించిన వైద్యులు

పారాక్వాట్ విషం తాగిన 12 ఏండ్ల బాలుడు -రక్షించిన వైద్యులు యశోదా ఆసుపత్రి వైద్య నిపుణుల అరుదైన విజయం
Read More...
Local News  State News  Crime 

సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు

సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు సికింద్రాబాద్, నవంబర్ 18 (ప్రజామంటలు) :   సికింద్రాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో  మంగళవారం అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పిర్యాదు దారుడిని నుంచి రూఒక లక్ష లంచం సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా మండల సర్వేయర్ కలువ కిరణ్ కుమార్, చైన్ మెన్ గా పనిచేస్తున్న మేకల వివరాలు...
Read More...
National  State News 

హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్‌ బెదిరింపులపై కఠిన చర్యలు తప్పవు : కమిషనర్‌ సజ్జనార్

హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్‌ బెదిరింపులపై కఠిన చర్యలు తప్పవు : కమిషనర్‌ సజ్జనార్ “క్రమబద్ధమైన ఆన్‌లైన్‌ వేధింపుల ముఠా పని చేస్తోంది” — మహిళా జర్నలిస్ట్ లు ఫిర్యాదులు స్వీకరించిన సిటీ పోలీస్ కమిషనర్ — వీడియోలు, లింకులు అందించైనా జర్నలిస్టులు హైదరాబాద్‌ నవంబర్ 18 (ప్రజా మంటలు): మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌, బెదిరింపులు, అసభ్య వ్యాఖ్యలపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ వి.సి....
Read More...
Local News  State News 

సాంఘీక దురాచారాలపై సంఘటితంగా పోరాడాలి 

సాంఘీక దురాచారాలపై సంఘటితంగా పోరాడాలి  ప్రజా భవన్ లో సీఎం ప్రజావాణి లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమం  రాష్ట్ర వ్యాప్తంగా 55 బాధిత కుటుంబాల హాజరు హైదరాబాద్ నవంబర్ 28 (ప్రజా మంటలు):   శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకుని వెళ్తున్న ప్రస్తుత ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్షత కొనసాగడం బాధాకరమని, సాంఘిక దురాచారాలపై సంఘటితంగా పోరాడాల్సిన       రాష్ట్ర...
Read More...
Local News 

డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు వాడకూడదు..

డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు వాడకూడదు.. సికింద్రాబాద్, నవంబర్ 18 (ప్రజామంటలు): డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా , నేరుగా మందులు కొనుక్కొని వేసుకోకూడదని వైద్య నిపుణులు సూచించారు. వరల్డ్ యాంటీబయాటిక్ వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి  ప్రసంగించారు వివిధ రోగాల ట్రీట్మెంట్ కు...
Read More...
Local News 

శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం సందర్శించిన భద్రత ఏర్పాట్లు ను పరిశీలించిన డిఎస్పి,రఘు చందర్ 

శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం సందర్శించిన భద్రత ఏర్పాట్లు ను పరిశీలించిన డిఎస్పి,రఘు చందర్  (అంకం భూమయ్య)  గొల్లపల్లి నవంబర్ 18 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని శ్రీ మల్లికార్జునస్వామి   దేవాలయం ను జగిత్యాల డిఎస్పి సందర్శించి రాబోయే ఏడువారాల జాతరకు  జాతర ఏర్పాట్ల  పర్యవేక్షించారు ఆయన వెంట ధర్మపురి సిఐ,రామ్ నరసింహారెడ్డి ఈ సందర్భంగా డిఎస్పి , రఘు చందర్ మాట్లాడుతూ    జాతరకు  తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్ల  ట్రాఫిక్...
Read More...

కలెక్టరేట్లో 'నషా ముక్త్ భారత్ ' అభియాన్ ప్రతిజ్ఞ డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ పాటుపడలి –జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) బి. రాజ గౌడ్

కలెక్టరేట్లో 'నషా ముక్త్ భారత్ ' అభియాన్ ప్రతిజ్ఞ   డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ పాటుపడలి –జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) బి. రాజ గౌడ్   జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా అధికారులు ,కలెక్టరేట్ సిబ్బంది , విద్యార్థులచే మాదక ద్రవ్య నిరోధక ప్రతిజ్ఞ డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి  ఒక్కరూ పాటుపడాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ పేర్కొన్నారు.  మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశమందిరంలో...
Read More...

అంగరంగ వైభవంగా శ్రీ ధనలక్ష్మి సమేత ధన్వంతర స్వామి కళ్యాణ వేడుకలు

అంగరంగ వైభవంగా శ్రీ ధనలక్ష్మి సమేత ధన్వంతర స్వామి కళ్యాణ వేడుకలు జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని   శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయము  లో ఘనంగా   శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.   మంగళ వారం  కార్తీక  మాసం  శుక్ల పక్షం త్రయోదశి  ఉ.  సుప్రభాత సేవ మరియు మూలవిరాట్టుకు అభిషేకములు నిర్వహించారు. భక్తులు...
Read More...

ప్రజల్లో చైతన్యం కోసం పోలీసుల కళా ప్రదర్శనలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  గ్రామీణ ప్రాంతాలలో విస్తృత కార్యక్రమాలతో సామాజిక అంశాల పై అవగాహన

ప్రజల్లో చైతన్యం కోసం పోలీసుల కళా ప్రదర్శనలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   గ్రామీణ ప్రాంతాలలో విస్తృత కార్యక్రమాలతో సామాజిక అంశాల పై అవగాహన   జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సత్ఫలితాలిస్తున్న అవగాహన కార్యక్రమాలు- మూఢ విశ్వాసాల పై ప్రజలలో కనిపిస్తున్న మార్పు జగిత్యాల జిల్లా ప్రజల్లో సామాజిక అంశాల పై  చైతన్యం పెంపొందించేందుకు పోలీసులు నిరంతరం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  తెలిపారు. 2016 నుoడి  జగిత్యాల పోలీస్ కళా బృందం జిల్లా వ్యాప్తంగా...
Read More...

మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు హిడ్మా ఎన్‌కౌంటర్

మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు హిడ్మా ఎన్‌కౌంటర్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లీ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి. హిడ్మా భార్య, కీలక నాయకులు, PLGA సభ్యుల మరణం. AP ఇంటెలిజెన్స్ ధృవీకరణతో పూర్తి వివరాలు.
Read More...

హరిహరాలయంలో కార్తీక సోమవారం ఘనంగా పరమ శివునికి అభిషేకాలు 

హరిహరాలయంలో కార్తీక సోమవారం ఘనంగా పరమ శివునికి అభిషేకాలు  జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు)జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో కార్తీక సోమవారం చివరి సోమవారం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి చేరుకొని పరమ శివునికి పంచామృతాలతో అభిషేకించి కార్తీకదీపంలు వెలిగించారు. ఈ సందర్భంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆలయ అధ్యక్షులు చాకుంట వేణుమాధవ రావు దంపతులు సాంబశివునికి వివిధ...
Read More...
Local News  State News 

ఖమ్మం జిల్లా లో–జాగృతి జనంబాట పర్యటనలో మాడల్ స్కూల్ ను సందర్శించిన కవిత

ఖమ్మం జిల్లా లో–జాగృతి జనంబాట పర్యటనలో మాడల్ స్కూల్ ను సందర్శించిన కవిత ఖమ్మం నవంబర్ 18 (ప్రజా మంటలు): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలోని మోడల్ స్కూల్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  ఈరోజు సందర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. స్కూల్ హాస్టల్ భవనంలో పెచ్చులూడిన గోడలు, పైకప్పు ఊడిపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితి నెలకొన్నట్లు...
Read More...