ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

On
 ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)

ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగానంద), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాల సందర్భంగా, దేవస్థానం లోని ప్రధానాలయాలలో సోమ వారం 
విధివిదాన  సాంప్రదాయ ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన యజ్ఞా చార్యులు కందాల పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, ఆలయాల అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, నేరెళ్ళ శ్రీనివాసా చార్యులు, రమణ, అశ్విన్, వంశీ కృష్ణ, అరుణ్, కిరణ్, మోహన్, వంశీ, విజయ్ వేదోక్త రీతిలో ఉత్సవ ప్రత్యేక అర్చనలు గావించారు. ఆస్థాన అర్చక పురోహితులు సంతోష్, సంపత్, రాజగోపాల్, ప్రవీణ్ నిత్య పూజలతోపాటు ద్వార తోరణాది హవనములు, స్వామికి శక్తిని కలుగజేసేందుకు హోమధూళిచే శక్తి హోమం, నక్షత్ర, నవగ్రహ సప్తజిహ్వ, షడంగ న్యాస, పంచసూక్త, పురుషసూక్త, శ్రీసూక్త, భూసూక్త, నీలాసూక్త, పరివార హోమాలు, సర్వ సస్యాభివృద్ధికై, సర్వదేవతావహన హోమాలు, ఉత్సవాంగ ప్రధాన హోమం, లోక కళ్యాణార్థం రక్షాసు మంత్ర స్మరణం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణాది కార్యక్రమాలను నిర్వహించారు.

గోదావరి నదిలో మంగళ స్నానాలు

  సోమవారం బ్రహ్మోత్సవాల సందర్భంగా 
ఉదయాత్వూర్వం నుండి గోదావరిలో స్నానాలను సుదూర ప్రాంతాలకు చెందిన అశేష భక్తులు సాంప్రదాయాచరణలో భాగంగా ఆచరించారు. ధర్మపురి నారసింహుడు మహారాష్ట్ర ప్రాంత వాసులకు కులదైవమైన క్రమంలో సుదూర ప్రాంతాల నుండి ప్రైవేటు వాహనాలలో పరంపరానుగత వంశాచారంలో భాగంగా భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాల అనంతర దర్శనాలకై విచ్చేసిన రాష్ట్రేతర భక్తులు, గోదావరి పౌరోహితులచే సంకల్పాది సత్కర్మలను ఆచరించి, దానధర్మాలు చేసుకున్నారు. నది వద్దే వంటలు చేసుకుని, నదీమ తల్లికి నివేదించి, ఆరగించారు.

మొక్కులు తీర్చుకున్న భక్తులు

  సుదూర ప్రాంతాల నుండి వంవపారంపర్య సాంప్రదా యాచరణల ప్రకారం అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు, యాత్రికులు గోదావరినదికి నేరుగా వెళ్ళి, మంగళ స్నానాలు ఆచరించి, సంకల్ప దానధర్మాది సత్కర్మలు ఆచరించి, దైవదర్శనాలకై దేవస్థానం వద్ద ఆలయాల ముందు బారులు తీరి నిలుచున్నారు. యోగానంద, ఉగ్ర నారసిం హునికి ముడుపులు చెల్లించి మెక్కులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెల సాఫల్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల నయానికి, మానసిక రుగ్మతల నివారణకు భక్తులు బెల్లం, కొబ్బరి కాయలు, వస్త్రాలు, కోడె ముక్కులు, వల్లు బండ, గండా దీపాది మొక్కులు తీర్చుకున్నారు. సంతానార్థం హోమ గుండంవద్ద ప్రత్యేక పూజలు చేయించు కున్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషప్ప కళా వేదికపై సంగీత రత్న నరహరి శర్మ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు
 అలరించాయి. ప్రధానంగా శేషప్ప భక్త మండలి ఆధ్వర్యంలో ఎన్నం బాపురెడ్డి నిర్వహణలో సభ్యులు శేషప్ప విరచిత నరసింహ శతక పద్య గానం చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు గాయకులను సత్కరించారు. 
మధు బాపు బృందం, గొల్లపెల్లి రాంకిషన్ బృందం, భక్తి సంగీత విభావరి,చేగొండ పవన్ కుమార్ బృందం శివ తాండవం, మిమిక్రి పితామహ IMG-20250317-WA0016- గుండి ప్రేమ్ కుమార్, ఓజ్జల పుల్లయ్య శాస్త్రి మిమిక్రీలు, తదితర నృత్య ప్రదర్శనలు, ఆకట్టుకున్నాయి. దేవస్థానం ఈఓ శ్రీనివాస్,  కమిటీ చైర్మన్ రవీందర్, సభ్యులు కళాకారులను సన్మానించారు.

Tags
Join WhatsApp

More News...

Comment 

జిమ్మీ లాయ్ తీర్పు: హాంకాంగ్ స్వేచ్ఛపై వేసిన తుది ముద్ర

జిమ్మీ లాయ్ తీర్పు: హాంకాంగ్ స్వేచ్ఛపై వేసిన తుది ముద్ర హాంకాంగ్ మీడియా దిగ్గజం, ప్రజాస్వామ్య ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన జిమ్మీ లాయ్‌కు కోర్టు దోషిగా తీర్పు ఇవ్వడం ఒక వ్యక్తిపై జరిగిన న్యాయ చర్యగా మాత్రమే చూడటం చరిత్రను చిన్నచూపు చేయడమే. ఇది హాంకాంగ్‌లో భిన్నాభిప్రాయాలకు, స్వతంత్ర మీడియాకు, ప్రజాస్వామ్య రాజకీయాలకు వేసిన చివరి ముద్రగా భావించాల్సిన ఘట్టం. 78 ఏళ్ల జిమ్మీ లాయ్...
Read More...

జగిత్యాల జిల్లాలో మూడవ విడత పోలింగ్ 79.64 శాతం 6 మండలాల్లో ఉత్సాహంగా ఓటింగ్

   జగిత్యాల జిల్లాలో మూడవ విడత పోలింగ్ 79.64 శాతం 6 మండలాల్లో ఉత్సాహంగా ఓటింగ్ జగిత్యాల, డిసెంబర్ 17 (ప్రజా మంటలు): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో నిర్వహించిన మూడవ విడత ఎన్నికల పోలింగ్ శాతం 79.64గా నమోదైంది. మొత్తం 1,71,920 ఓట్లకు గానూ 1,36,917 ఓట్లు పోలయ్యాయి. బుధవారం బుగ్గారం, ధర్మపురి, ఎండపెల్లి, గొల్లపెల్లి, పెగడపెల్లి, వెల్గటూర్ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు...
Read More...
Local News 

జనావాసాల మధ్య మురుగునీరు : పట్టించుకోని మున్సిపల్ సిబ్బందిపై కాలనీవాసుల ఆవేదన

జనావాసాల మధ్య మురుగునీరు : పట్టించుకోని మున్సిపల్ సిబ్బందిపై కాలనీవాసుల ఆవేదన జగిత్యాల (రూరల్) డిసెంబర్ 17 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డు, 1వ వార్డు సీతారాం నగర్ ప్రాంతంలో జనావాసాల మధ్య డ్రైనేజ్ మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాటు ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తుండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన...
Read More...
Local News 

పద్మారావు నగర్ లో ఫుట్ పాత్ దుకాణాలకు మార్కింగ్

పద్మారావు నగర్ లో ఫుట్ పాత్ దుకాణాలకు మార్కింగ్ సికింద్రాబాద్ డిసెంబర్ 17 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ పద్మారావునగర్ పార్కు నుండి సర్దార్ పటేల్ కాలేజ్ వరకు ఉన్న 26 ఫుట్ పాత్ వ్యాపారస్తులకు జిహెచ్ఎంసి అధికారులు బుధవారం మార్కింగ్ వేశారు. ఇకపై తమ పరిధిని దాటి ముందుకు రాకూడదని వారు ఫుట్ పాత్ దుకాణాల  నిర్వాహకులను హెచ్చరించారు. వాహనాల రాకపోకలకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని...
Read More...

పెన్షనర్స్ భవనంలో అదనపు గది,లిఫ్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పెన్షనర్స్ భవనంలో అదనపు గది,లిఫ్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల డిసెంబర్ 17(ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా పెన్షనర్స్  భవన్ లో అదనపు గది మరియు నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను ప్రారంభోత్సవం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం పెన్షనర్స్ డే వేడుకల సందర్భంగా జగిత్యాల పట్టణ  ఫంక్షన్ హాల్ లో...
Read More...

మూడవ విడత వివిధ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మూడవ విడత వివిధ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు) జిల్లాలో 3వ దశ పోలింగ్‌లో భాగంగా ధర్మపురి మండలంలోని జైన, రాజారాం, రాయపట్నం గ్రామాలు, ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి, గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలంలోని నంచర్ల, బతికేపల్లి గ్రామాలు, అలాగే వెల్గటూర్ మరియు గొల్లపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్...
Read More...

ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     *జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు.*జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)మూడవ విడత సర్పంచ్  ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎస్పీ   తెలిపారు.ఎన్నికలు జరుగుతున్న  ఇబ్రహీం నగర్, గొల్లపల్లి, బత్కపల్లి, నంచర్ల, గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా...
Read More...
Local News 

కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన జగిత్యాల నేతలు

కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన జగిత్యాల నేతలు జగిత్యాల, డిసెంబర్ 18 (ప్రజా మంటలు): జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలను జగిత్యాల నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి పనులు కావాలంటే అసెంబ్లీలో మాట్లాడటమే కాకుండా ఉన్నతాధికారులు, మంత్రులతో తరచుగా సమావేశమై ప్రతిపాదనలు తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయంగా...
Read More...
Local News 

లోక్ అదాలత్ కు న్యాయవాదులు సహకరించాలి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు.

లోక్ అదాలత్ కు న్యాయవాదులు సహకరించాలి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు. మెట్టుపల్లి డిసెంబర్ 17 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ )     మెట్టుపల్లి లో బుధవారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 21 రోజున నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లో క్రిమినల్...
Read More...
Local News  State News 

ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపు దారుణం

ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపు దారుణం సికింద్రాబాద్, డిసెంబర్ 17 (ప్రజామంటలు) : ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గా పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును పీసీసీ వైస్‌ప్రెసిడెంట్‌, సనత్‌నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ తీవ్రంగా ఖండించారు. గాంధీజీ ఆలోచనలు, విలువల...
Read More...
Local News  Spiritual  

అడ్డగుట్టలో అయ్యప్ప స్వామి పడిపూజ

అడ్డగుట్టలో అయ్యప్ప స్వామి పడిపూజ సికింద్రాబాద్,  డిసెంబర్ 17 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ ఇంద్రలక్ష్మీనగర్‌లో కాంగ్రెస్ నాయకుడు గంట రాజు సాగర్ నివాసంలో  సాయంత్రం అయ్యప్ప స్వామి పడిపూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శరణుఘోషలతో కాలనీ మారుమోగగా, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కృపకటాక్షాలు ప్రాంత ప్రజలపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పెద్ద...
Read More...

పెన్షనర్లకు సత్వరసేవలు అందిస్తాం.                                  అసిస్టెంట్ ట్రెజరీ అధికారి  ఎస్ .మధు కుమార్.        

పెన్షనర్లకు సత్వరసేవలు అందిస్తాం.                                  అసిస్టెంట్ ట్రెజరీ అధికారి  ఎస్ .మధు కుమార్.                                                   జగిత్యాల డిసెంబర్ 17(ప్రజా మంటలు)పెన్షనర్లకు ట్రెజరీ శాఖ తరపున సత్వర సేవలు అందిస్తామని జిల్లా ట్రెజరీ అధికారి ఎస్.మధు కుమార్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటీజేన్స్ కేంద్రంలో  తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవం వేడుకలు  రాష్ట్ర కార్యదర్శి  హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలోఘనంగా...
Read More...