బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

On
బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ 

ఏళ్ళతరబడి పోరాట ఫలితం  

బుగ్గారం/జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు జిల్లా ప్రతినిధి) : 

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ మూల సుమలత పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రామ పంచాయతీలో భారీగా నిధులు దుర్వినియోగం అయిన కారణంగా చుక్క గంగారెడ్డి పిర్యాదుల మేరకు లోకాయుక్త న్యాయస్థానం యొక్క జస్టిస్ సి. వి.రాములు గత డిసెంబర్ 6న జడ్జిమెంట్ జారీ చేశారు. 

 బుగ్గారం గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జడ్జిమెంట్ లో ఆదేశించారు.  వ్యక్తిగతంగా నిధుల దుర్వినియోగాన్ని పరిశీలించి తగు కఠిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌, జిల్లా మెజిస్ట్రేట్‌ను లోకాయుక్త జస్టిస్ సి.వి.రాములు జారీ చేసిన ఉత్తర్వులలో ఆదేశించారు.

లోకాయుక్త తీర్పు ప్రకారం నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ బుగ్గారం తాజా మాజీ సర్పంచ్ మూల సుమలత పై క్రిమినల్ కేసు నమోదు చేయుటకు బుగ్గారం మండల పంచాయతీ అధికారికి ఈనెల 10న జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రిమినల్ కేసులపై తీసుకున్న చర్యల వివరాలను ఏడు రోజులలోగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

కాగా... మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా గత వారం రోజుల నుండి కాలక్షేపం చేస్తూ నేటికీ ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయక పోవడం పలు అనుమానాలకు, పలు ఆరోపణలకు దారి తీస్తోంది.

గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో ఎంపీఓ అఫ్జల్ మియా కూడా వాటా దారుడేనని పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి ఆరోపించారు.
 గతంలోనే  ఎంపీవో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారని ఆయన వివరించారు.  స్వయంగా జిల్లా కలెక్టర్ కు ఎంపిఓ పై ఆధారాలతో సహా పిర్యాదులు కూడా చేయడం జరిగిందని పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

నామినేషన్ల కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్ బి. సత్యప్రసాద్

నామినేషన్ల కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి:  కలెక్టర్ బి. సత్యప్రసాద్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి డిసెంబర్ 03 (ప్రజా మంటలు):  గ్రామ పంచాయతీ మూడవ విడత ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా బుధవారం గొల్లపెల్లి మండల కేంద్రం తొ పాటు చిల్వకోడూర్, తిరుమలాపూర్ గ్రామంలో  పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ తీరును...
Read More...
Local News 

గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి గా  నామినేషన్ దాఖలు చేసిన నల్ల నీరజ _సతీశ్ రెడ్డి 

గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి గా  నామినేషన్ దాఖలు చేసిన  నల్ల నీరజ _సతీశ్ రెడ్డి  (అంకం భూమయ్య) గొల్లపల్లి డిసెంబర్  03, (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో  సర్పంచ్ అభ్యర్థిగా నల్ల నీరజ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు  అనంతరం ఆమె మాట్లాడుతూ   నన్ను గెలిపిస్తే ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తా అని  స్థానికంగా తాను ప్రజల్లోనే ఉంటూ గ్రామ యువత సమక్షంలో
Read More...
National  State News 

నిబంధనలు పాటించని స్లీపర్ బస్సుల నిలిపివేయండి NHRC ఆదేశాలు

నిబంధనలు పాటించని స్లీపర్ బస్సుల నిలిపివేయండి NHRC ఆదేశాలు ప్రైవేటు స్లీపర్ బస్సులకు గట్టి దెబ్బ — అన్ని రాష్ట్రాలకు NHRC కీలక ఆదేశాలు ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో చోటుచేసుకుంటున్న ఘోర ప్రమాదాలు అనేక కుటుంబాలను దుఃఖంలో ముంచాయి. ఈ నేపథ్యంలో జాతీయ...
Read More...
Crime  State News 

చాంద్రాయణగుట్టలో రెండు మృతదేహాలు కలకలం — డ్రగ్స్ అధిక మోతాదే కారణమా?

చాంద్రాయణగుట్టలో రెండు మృతదేహాలు కలకలం — డ్రగ్స్ అధిక మోతాదే కారణమా? హైదరాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం హడలెత్తించింది. రోమన్ హోటల్ ఎదుట నిలిపివున్న ఓ ఆటోలో ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించగా, మృతులను జహంగీర్ (24), **ఇర్ఫాన్ (25)**గా గుర్తించారు....
Read More...
Local News  State News 

నిజాయితీకి నిదర్శనం: రోడ్డుపై దొరికిన రూ.400ను పోలీసులకు అప్పగించిన ఇద్దరు విద్యార్థులు

నిజాయితీకి నిదర్శనం: రోడ్డుపై దొరికిన రూ.400ను పోలీసులకు అప్పగించిన ఇద్దరు విద్యార్థులు హన్మకొండ, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): హన్మకొండ నగరంలోని పెగడపల్లి డబ్బాలు జంక్షన్ వద్ద ఇద్దరు చిన్నారులు చూపించిన నిజాయితీ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఏకశిల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పూజిత మరియు లిథివిక్ తమ బడికి వెళ్లే మార్గంలో రహదారిపై పడిఉన్న రూ.400 నగదు కనిపించడంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడే...
Read More...

ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సంజయ్ సావంత్ మృతి

ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సంజయ్ సావంత్ మృతి హైదరాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో విషాదం నెలకొంది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై సంజయ్ సావంత్ (58) సోమవారం ఉదయం అనూహ్యంగా మృతి చెందారు. ఉదయం తన పనిఘంటలు ప్రారంభించకముందు మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు స్టేషన్ సిబ్బంది గమనించారు. వెంటనే సహచర పోలీసులు...
Read More...
National  Comment 

"చల్ ఉరుకుండ్రి..! వాస్తవ కథనం

అల్లే రమేష్.సిరిసిల్ల  :సెల్: 9030391963.               కుర్చిలకుసోనిబాపు సోచైస్తుండు.ఇంతాజేసిన వంగుతలేరు.ఎంత మర్శిపోధమన్నా కోడి కండ్ల ముందే మెదులుతుంది.బాపు గిట్ల జేస్తుండేదని కిందోల్లంతా మాడుపు మొకాం పెట్టుకున్నారు. ఎన్నిజేయల్నో అన్ని జేసిన ఇగ ఇప్పుడు ఏం జేయలే...అసలే ముంగిట  పెద్దుర్ల్ల జాతరలు ఉ ఉన్నాయీ బాపు మనుసుల లేదు.ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.ఇంతట్ల చేయికింది ఉత్తయ్యి ఉరుకుంటొచ్చిండు. బాపు                   మునుపటి...
Read More...
Local News 

వంగర పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ వార్షిక తనిఖీలు

వంగర పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ వార్షిక తనిఖీలు స్వాగతం పలికిన ఎస్సై దివ్య
Read More...
Local News 

పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి 

పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి  (అంకం భూమయ్య)    గొల్లపల్లి డిసెంబర్   02 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలంలో మూడో విడత  జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు మండల ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి  పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు జరగాలంటే ప్రతి ఓటరు...
Read More...

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్దవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్_ 7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ  నేటితో ముగింపు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్దవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్_  7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ  నేటితో ముగింపు రాయికల్ డిసెంబర్ 2 (ప్రజా మంటలు)-నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్     .  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలు నోటీస్ బోర్డుపై సక్రమంగా ప్రదర్శించబడ్డాయా అనే  విషయాన్ని జిల్లా కలెక్టర్  పరిశీలించారు. ప్రస్తుతం వరకు ఎన్ని నామినేషన్లు స్వీకరించబడ్డాయి, అలాగే నామినేషన్ల...
Read More...

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు  ఆర్థిక సహాయం అందజేసి దాతృత్వం చాటుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ జగిత్యాల హోల్ సేల్ అండ్ కిరాణా వర్తక సంఘం

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు  ఆర్థిక సహాయం అందజేసి దాతృత్వం చాటుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ జగిత్యాల హోల్ సేల్ అండ్ కిరాణా వర్తక సంఘం కొండగట్టు డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)    ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి దురదృష్టకర సంఘటన బాధాకరమైన విషయమని మాకు చేతనైన సహాయాన్ని అందజేస్తున్నామని మేము అందజేసిన నగదు ద్వారా మళ్లీ చిరు వ్యాపారాన్ని కొనసాగించుకొని వారి జీవితాలను ముందుకు సాగించుకునే ప్రక్రియ కు తోడ్పడాలని కోరుకుంటూ ప్రజలంతా ఆన్లైన్ వ్యాపారాలను ప్రోత్సహించకుండా...
Read More...

రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ నియామకం

రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ నియామకం    మెట్ పెల్లి డిసెంబర్ 2(ప్రజా మంటలు)(సౌడాల కమలాకర్) రెడ్ కో జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ ను ప్రభుత్వం నియమించింది. కాగా  ఈ పదవిలో అతను ఏడాదికాలం పాటు కొనసాగుతారు. విద్యుత్ సంస్థలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన అనుభవం, వినియోగదారులు, రైతులతో విస్తృత పరిచయాలు ఉండటం వల్ల హరిత ఇంధన ఉత్పత్తి...
Read More...