బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
ఏళ్ళతరబడి పోరాట ఫలితం
బుగ్గారం/జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు జిల్లా ప్రతినిధి) :
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ మూల సుమలత పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రామ పంచాయతీలో భారీగా నిధులు దుర్వినియోగం అయిన కారణంగా చుక్క గంగారెడ్డి పిర్యాదుల మేరకు లోకాయుక్త న్యాయస్థానం యొక్క జస్టిస్ సి. వి.రాములు గత డిసెంబర్ 6న జడ్జిమెంట్ జారీ చేశారు.
బుగ్గారం గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జడ్జిమెంట్ లో ఆదేశించారు. వ్యక్తిగతంగా నిధుల దుర్వినియోగాన్ని పరిశీలించి తగు కఠిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ను లోకాయుక్త జస్టిస్ సి.వి.రాములు జారీ చేసిన ఉత్తర్వులలో ఆదేశించారు.
లోకాయుక్త తీర్పు ప్రకారం నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ బుగ్గారం తాజా మాజీ సర్పంచ్ మూల సుమలత పై క్రిమినల్ కేసు నమోదు చేయుటకు బుగ్గారం మండల పంచాయతీ అధికారికి ఈనెల 10న జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రిమినల్ కేసులపై తీసుకున్న చర్యల వివరాలను ఏడు రోజులలోగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
కాగా... మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా గత వారం రోజుల నుండి కాలక్షేపం చేస్తూ నేటికీ ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయక పోవడం పలు అనుమానాలకు, పలు ఆరోపణలకు దారి తీస్తోంది.
గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో ఎంపీఓ అఫ్జల్ మియా కూడా వాటా దారుడేనని పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి ఆరోపించారు.
గతంలోనే ఎంపీవో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారని ఆయన వివరించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ కు ఎంపిఓ పై ఆధారాలతో సహా పిర్యాదులు కూడా చేయడం జరిగిందని పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల లో సినీ హీరో అర్జున్ సందడి…
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణంలో సినీ హీరో అర్జున్ సందడి చేశారు. స్థానిక శ్రీనివాస థియేటర్లో అర్జున్ మరియు ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించిన సీతా పయనం చిత్రం ప్రదర్శింపబడుతున్న సందర్భంగా, మ్యాట్నీ షో సమయంలో థియేటర్ను సందర్శించి ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ,... గాంధీ ఆసుపత్రి ఆవరణలో నిరాశ్రయుల దుర్బర జీవితం…
సికింద్రాబాద్, ఫిబ్రవరి 16 ( ప్రజామంటలు): గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఆశ్రయం లేక జీవనం సాగిస్తున్న నిరాశ్రయుల జీవితాలు గుండెల్ని పిండేసే దృశ్యాలుగా మారుతున్నాయి. ఎవరి ఆదరణ లేక, కనీస సౌకర్యాలు లేక కొందరు ఫుట్పాత్లనే ఇంటిగా మార్చుకుని రోజులు గడుపుతున్నారు. అన్నదానాల కోసం చేరిన వారు, కాలక్రమేణా అక్కడే జీవితం గడపాల్సిన పరిస్థితికి చేరుకున్నారు.అనారోగ్యంతో... న్యాయవాది ఖాదీర్ హత్య నిందితులకు కఠిన శిక్షలు విధించాలి
మెట్టుపల్లి ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్)
రంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు యండి. ఖాదీర్పై దాడి చేసి హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మెట్టుపల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
సోమవారం మెట్టుపల్లి కోర్టులో న్యాయవాదులు ఖాదీర్ హత్యకు... హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా దండి లక్ష్మీ కొమురయ్య
హుస్నాబాద్ | ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నేడు జరిగిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. 14వ వార్డు సభ్యులు దండి లక్ష్మీ కొమురయ్యను హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా, 7వ వార్డు సభ్యులు చిత్తారి పద్మ రవీందర్ను వైస్ చైర్పర్సన్గా... రాయికల్ మున్సిపల్ పీఠంపై ఎగిరిన గులాబీ జెండా
ఐదు సీట్లు గెలుచుకున్న బీజేపీ లో నిరాశ
రాయికల్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ పట్టణ మున్సిపాలిటీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పట్టు సాధించింది. మొత్తం 7 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది.
▪️ మున్సిపల్ చైర్మన్గా కట్కం రవీందర్ ఎన్నిక▪️ వైస్ చైర్మన్గా... ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్గా వేముల నాగలక్ష్మి (కాంగ్రెస్) ఎన్నిక
ధర్మపురి | ఫిబ్రవరి 16 – ప్రజా మంటలు
ధర్మపురి మున్సిపల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్గా వేముల నాగలక్ష్మిను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక చేశారు. అదే సమయంలో, వైస్ చైర్మన్గా ఇందారపు రామన్నను తిరిగి నియమించారు.
▪️ మొదటినుంచి ప్రచారంలో ఉన్న అభ్యర్థి కాకుండా కొత్త అభ్యర్థికి... జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక: గెలిచింది సంజయ్ వర్గమా? లేక రేవంత్ రాజకీయ పంతమా?
జగిత్యాల రాజకీయాల్లో సంచలన మార్పు: కొత్త సమీకరణలు ?
(ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం)
జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నిక కావడం కేవలం స్థానిక పదవి మార్పు కాదు. ఇది కాంగ్రెస్ లోపలి శక్తి సమీకరణాల్లో ఒక కీలక మలుపు.
బయటికి చూస్తే ఇది👉 సంజయ్ కుమార్ వర్గ విజయం... బ్రేకింగ్ న్యూస్: జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నిక
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నికఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం పట్టు సాధించింది
▪️ మాజీ మంత్రి వర్గానికి మొండిచేయి
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
▪️ వైస్ చైర్పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన జీనత్ పర్వీన్ (మున్నా) ఎంపిక▪️ మాజీ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్కు నిరాశ▪️... కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకే? బీఆర్ఎస్ తప్పుకోవడంతో రాజకీయ ఉత్కంఠకు తెర
కరీంనగర్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు చివరి నిమిషంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మొత్తం 66 డివిజన్లలో
భారతీయ జనతా... రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో కీలక మలుపు: చైర్మన్ పీఠం బీఆర్ఎస్కేనా?
రాయికల్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని వింత, కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి..రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఏకంకవలనే ప్రయత్నం ఆశ్చర్య పరుస్తోంది. అధిక సంఖ్యలో సీట్లు గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లాంటి వారు... భారత్ పేరు ప్రస్తావించని తారిక్ రెహ్మాన్ – సమతుల్య విదేశాంగ విధాన సంకేతాలు
న్యూఢిల్లీ ఫిబ్రవరి 16:
బంగ్లాదేశ్లో జరిగిన జాతీయ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత, ప్రధాని-నియమితుడిగా బాధ్యతలు స్వీకరించనున్న Tarique Rahman తన తొలి మీడియా సమావేశంలో దేశ విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.తన ప్రభుత్వం ఏ ఒక్క దేశం పక్షాన నిలిచే విధానాన్ని కాకుండా, “బంగ్లాదేశ్ ప్రయోజనాలే కేంద్రంగా... దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంపై రాజకీయ రంగుల వివాదం – భక్తుల విశ్వాసాలపై దాడేనా?
భక్తుల విశ్వాసాలపై దాడేనా?
–(కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)
జగిత్యాల జిల్లా, సారంగాపూర్ మండలం, పెంబట్ల కోనాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం ప్రస్తుతం తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా అపారమైన ఖ్యాతి పొందిన ఈ ఆలయంలో మహాశివరాత్రి జాతర... 