బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
ఏళ్ళతరబడి పోరాట ఫలితం
బుగ్గారం/జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు జిల్లా ప్రతినిధి) :
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ మూల సుమలత పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రామ పంచాయతీలో భారీగా నిధులు దుర్వినియోగం అయిన కారణంగా చుక్క గంగారెడ్డి పిర్యాదుల మేరకు లోకాయుక్త న్యాయస్థానం యొక్క జస్టిస్ సి. వి.రాములు గత డిసెంబర్ 6న జడ్జిమెంట్ జారీ చేశారు.
బుగ్గారం గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జడ్జిమెంట్ లో ఆదేశించారు. వ్యక్తిగతంగా నిధుల దుర్వినియోగాన్ని పరిశీలించి తగు కఠిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ను లోకాయుక్త జస్టిస్ సి.వి.రాములు జారీ చేసిన ఉత్తర్వులలో ఆదేశించారు.
లోకాయుక్త తీర్పు ప్రకారం నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ బుగ్గారం తాజా మాజీ సర్పంచ్ మూల సుమలత పై క్రిమినల్ కేసు నమోదు చేయుటకు బుగ్గారం మండల పంచాయతీ అధికారికి ఈనెల 10న జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రిమినల్ కేసులపై తీసుకున్న చర్యల వివరాలను ఏడు రోజులలోగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
కాగా... మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా గత వారం రోజుల నుండి కాలక్షేపం చేస్తూ నేటికీ ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయక పోవడం పలు అనుమానాలకు, పలు ఆరోపణలకు దారి తీస్తోంది.
గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో ఎంపీఓ అఫ్జల్ మియా కూడా వాటా దారుడేనని పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి ఆరోపించారు.
గతంలోనే ఎంపీవో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారని ఆయన వివరించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ కు ఎంపిఓ పై ఆధారాలతో సహా పిర్యాదులు కూడా చేయడం జరిగిందని పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)