ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
* ప్రైవేట్ స్కూళ్ళ నిర్వహణ సవాళ్ళతో కూడుకున్నది
* కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ మార్చి 16 (ప్రజామంటలు) :
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో మాత్రం రాజీ పడవద్దని, ఈ రోజుల్లో చదువుతోనే పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ముషీరాబాద్ గాంధీ నగర్ సురభి బాలవిహార్ స్కూల్ దగ్గర ఎస్ఆర్కే గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉదాన్ ఉత్సవ్–2025 వార్షికోత్సవ వేడుకలకు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈసందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ...ఈ రోజుల్లో ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ అనేక సవాళ్ళతో కూడుకున్నదన్నారు. ఈ విషయంలో కరస్పాండెంట్లను అభినందిచాలన్నారు. ఓ వైపు తాము ఉపాధి పొందుతూ, నలుగురికి ఉపాధి కల్పిస్తూ , రేపటి భావి భారత పౌరుల తయారీలో ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులది కీలకపాత్ర ఉందన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ..ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదువుకొని భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. రిటైర్ట్ ఐఏఎస్ అధికారి డా.బి.జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ...ప్రస్తుత వ్యవస్థ బాగుపడాలంటే ఎడ్యుకేషన్ ఎంతో అవసరమని, చదువుకున్న పిల్లలే రేపటి భారత దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలిపేవారని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భారత దేశ రక్షణకై త్రివిధ దళాలగా కాన్సెప్ట్ పైన ప్రీ ప్రైమరీ చిల్డ్రన్స్ మరియు భారతదేశ సంస్కృతి పైన ఒకటి నుండి 5వ తరగతి విద్యార్థులు ఆపై తరగతి వాళ్ళు మాతృ ప్రేమ తండ్రికి గౌరవం ఆడపిల్లల్ని ఏ విధంగా అభిమానించాలని చదువు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి ఇందులో ముఖ్యంగా దశావతారాలు కుంభమేళా నవదుర్గ అవతారాల సాంగ్స్ సాంగ్స్ యొక్క నృత్యాలు తల్లిదండ్రులను అలరించినాయి. బీజేపీ మహంకాళి జిల్లా అద్యక్షులు గుండగోని భరత్ గౌడ్, కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, అబ్బాస్, డాక్టర్ ఫణి పవన్, ఎస్ఆర్కే గ్రూఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపాల్ సుజాత, గ్రూఫ్ ఆఫ్ చైర్మన్ శివరామకృష్ణ ఆచార్య, విద్యార్థులు, పేరేంట్స్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
