డిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

మండల అధ్యక్షుడిగా దాసరి రవీందర్, కార్యదర్శిగా మాడుగుల నవీన్ కుమార్

On
డిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

భీమదేవరపల్లి ప్రజామంటలు ఫిబ్రవరి 12

తేది.11.02.2025 మంగళవారం రోజున డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భీమదేవరపల్లి మండల శాఖ సర్వ సభ్య సమావేశం మండల శాఖ అధ్యక్షులు దాసరి రవీందర్ అధ్యక్షతన బాలుర ఉన్నత పాఠశాల మల్కనూరు లో జరిగింది.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బత్తుల అశోక్ కుమార్ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టగా సభ్యులు చర్చించి ఆమోదించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ గత సంవత్సరం విద్యారంగానికి కేవలం 7.3% నిధులు మాత్రమే కేటాయించిందని ఈ సంవత్సరం బడ్జెట్లో కనీసం 15% విద్యారంగానికి నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగుల పిఆర్సి నివేదికను కమిషన్ నుండి వెంటనే తెప్పించుకొని 01.07.2023 నుండి అమలు చేయాలని, పెండింగ్ డి.ఎ లు విడుదల చేయాలని, సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి అర్హులైన ఉపాధ్యాయులకు పర్యవేక్షక పోస్టుల పదోన్నతులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిటిఎఫ్ సీనియర్ నాయకులు నోముల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుంటేనే సమాజానికి మేలు జరుగుతుందని,తద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలకు న్యాయం జరుగుతుందని అన్నారు.ఉపాధ్యాయులు కూడా అంకిత భావంతో పనిచేసి పాఠశాలల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. అనంతరం డి టి ఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. *అధ్యక్షులుగా దాసరి రవీందర్( ముల్కనూర్),* *ప్రధాన కార్యదర్శిగా మాడుగుల నవీన్ కుమార్(గట్ల నర్శింగాపూర్)* ఉపాధ్యక్షులుగా పి .శ్రీకాంత్ (భీమదేవరపల్లి) ,జె.స్వప్న(కొత్తకొండ),కార్యదర్శులుగా బి. ప్రేమ్ కుమార్(ధర్మారం) కె. రాజ్ కుమార్(వంగర) సిహెచ్ కిరణ్(కొత్తకొండ)జిల్లా కౌన్సిలర్లుగా ఏ శ్రీనివాస్ రెడ్డి(గట్ల నరసింగాపుర్ )సునీతాదేవి(రత్నగిరి) డాక్టర్ ఎ .కిషన్(మల్లారం) గొర్రె చిరంజీవి(వంగర) ఆడిట్ కమిటీ కన్వీనర్ బి. అశోక్ కుమార్(గట్ల నరసింగపూర్)సభ్యులుగా జె. ప్రవళిక(గాంధీ నగర్) ఎం. కమలాకర్(మల్లారం) లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా నోముల శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులుగా అటుకుల శ్రీనివాస్ రెడ్డిలు వ్యవహరించడం జరిగింది.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

ప్రభుత్వం సహకరిస్తే కుటీర పరిశ్రమలతో నిరాశ్రయులకు తోడ్పాటు

ప్రభుత్వం సహకరిస్తే కుటీర పరిశ్రమలతో నిరాశ్రయులకు తోడ్పాటు సికింద్రాబాద్, అక్టోబర్ 26 (ప్రజామంటలు) : స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 287వ అన్నదాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై నివసిస్తున్న అనాథలు, నిరాశ్రయులకు ఆహారం, బట్టలు, వైద్యం అందించారు. ప్రభుత్వం సహకరిస్తే, కుటీర పరిశ్రమల ద్వారా వీరికి జీవనోపాధి కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వై.సంజీవ్‌కుమార్ తెలిపారు. ఈ...
Read More...
Local News  Spiritual  

శ్రీలక్ష్మీ నారాయణ స్వామి టెంపుల్ లో అన్నకోటి

శ్రీలక్ష్మీ నారాయణ స్వామి టెంపుల్ లో అన్నకోటి సికింద్రాబాద్, అక్టోబర్ 26 (ప్రజామంటలు): సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో నిర్వహించే అన్నకోటి కార్యక్రమం ఈసారి కూడ ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈసందర్బంగా మాజీ మంత్రి, ఎన్డీఎంఏ మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు  మర్రి శశిధర్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...
Read More...

అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌పై విమర్శలు – ట్రంప్, మార్కెట్ల మధ్య సంతులనం కొనసాగింపు

అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌పై విమర్శలు – ట్రంప్, మార్కెట్ల మధ్య సంతులనం కొనసాగింపు వాషింగ్టన్‌ అక్టోబర్ 26: అమెరికా ట్రెజరీ (ధన) కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఇటీవల ఆర్థిక విధానాలపై తీసుకున్న నిర్ణయాల వల్ల వివాదాస్పదంగా మారారు. ముఖ్యంగా అర్జెంటీనాకు బిలియన్ల డాలర్ల విలువైన ఆర్థిక సహాయ ప్యాకేజ్‌ను సమన్వయం చేయడం ఆయనపై ప్రధాన విమర్శగా మారింది. ఈ ప్యాకేజ్‌ ద్వారా అమెరికా ఆర్థిక శాఖను “రాజకీయంగా ప్రభావితమైన సంస్థగా...
Read More...
Local News  Spiritual  

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత విజయవాడ పీఠాధిపతులు సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి     శ్రీగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో  మహా కుంభాభిషేకం పూజలు సికింద్రాబాద్, అక్టోబర్ 26 (ప్రజామంటలు) : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని విజయవాడ పీఠాధిపతులు సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి పేర్కొన్నారు. సీతాఫల్ మండి...
Read More...

ఉత్సాహంగా సాగిన  పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

ఉత్సాహంగా సాగిన  పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్   క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   జగిత్యాల, అక్టోబర్ 26 (ప్రజా మంటలు): పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో  పోలీస్ ప్రెస్ - ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో ఉత్సాహంగా కొనసాగింది. జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం...
Read More...
National  International   State News 

టిక్‌టాక్‌ అమ్మకానికి మార్గం సాఫీ - అమెరికా–చైనా ఒప్పందం ఫైనల్‌

టిక్‌టాక్‌ అమ్మకానికి మార్గం సాఫీ - అమెరికా–చైనా ఒప్పందం ఫైనల్‌    వాషింగ్టన్‌ అక్టోబర్ 26:అమెరికా మరియు చైనా ప్రభుత్వాలు చివరికి టిక్‌టాక్‌ అమెరికా వెర్షన్‌ విక్రయంపై ఒప్పందానికి వచ్చాయి. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ ఆదివారం ప్రకటించారు. ప్రధాన అంశాలు: అమెరికా–చైనా మధ్య టిక్‌టాక్‌ అమ్మకంపై తుది ఒప్పందం ట్రంప్‌, షీ జిన్‌పింగ్‌ గురువారం బుసాన్‌లో సమావేశం అమెరికా వెర్షన్‌...
Read More...
Local News  State News 

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు భారీ స్పందన – 2,620 షాపులకు 95 వేల దరఖాస్తులు

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు భారీ స్పందన – 2,620 షాపులకు 95 వేల దరఖాస్తులు హైదరాబాద్, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల లైసెన్స్‌ల కేటాయింపుపై అపారమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ సారి ప్రభుత్వం లాటరీ పద్ధతిలో లైసెన్స్‌లను కేటాయించగా, దరఖాస్తుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం షాపుల కోసం 95,137 దరఖాస్తులు అందాయి. రేపు (అక్టోబర్ 27) జిల్లాల...
Read More...
Local News 

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు మందుల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు మందుల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 26 (ప్రజా మంటలు)పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 14 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .అనంతరం వారికి ఉచిత కంటి అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డా.విజయ్,నాయకులు...
Read More...
Local News 

ఉత్సాహంగా సాగిన  పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ఉత్సాహంగా సాగిన  పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల అక్టోబర్ 26 ( ప్రజా మంటలు)  విజేతగా నిలిచిన పోలీస్ టీం. జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం  ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఆదివారం జిల్లా లోని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా...
Read More...

కోనసీమలో వినూత్న బస్‌షెల్టర్‌ – ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న నిర్మాణం

కోనసీమలో వినూత్న బస్‌షెల్టర్‌ – ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న నిర్మాణం రాజమండ్రి అక్టోబర్ 26: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని మండపేట సమీపంలోని పెదకాలువ వంతెన వద్ద కొత్తగా నిర్మించిన బస్‌షెల్టర్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ షెల్టర్‌ ప్రత్యేకత ఏమిటంటే — ఇది కేవలం ప్రయాణికుల కోసం విశ్రాంతి స్థలం మాత్రమే కాకుండా, మత ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక కళాఖండంగా...
Read More...
Local News 

సువర్ణ దుర్గ సేవా సమితి అమ్మవారి ఒడిబియ్యం భోజన కార్యక్రమం

సువర్ణ దుర్గ సేవా సమితి అమ్మవారి ఒడిబియ్యం భోజన కార్యక్రమం   జగిత్యాల అక్టోబర్ 26 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం ధరూర్ క్యాంపు శ్రీ కోదండ రామాలయం ఆలయ ఆవరణ శ్రీరామచంద్ర  కళ్యాణమండపంలో సువర్ణ దుర్గ అమ్మవారి ఒడిబియ్యం భోజన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది .   మాతలు భక్తులు శ్రీ లలితా సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణన, శ్రీ లలితా చాలీసా, తదితర శ్లోకాలు భక్తులు...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా ఎస్టియు అధ్యక్షులుగా బైరం హరికిరణ్

జగిత్యాల జిల్లా ఎస్టియు అధ్యక్షులుగా బైరం హరికిరణ్ ఎస్టియు జిల్లా ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జగిత్యాల అక్టోబర్ 26 (ప్రజా మంటలు):   స్టేట్ టీచర్స్ యూనియన్ ( ఎస్టీయూ)  జగిత్యాల జిల్లా అధ్యక్షులు గా బైరం హరికిరణ్, ప్రధాన కార్యదర్శి గా పాలెపు శివరామకృష్ణ, ఆర్థిక కార్యదర్శి గా మేకల ప్రవీణ్, రాష్ట్ర కౌన్సిలర్లు గా మచ్చ శంకర్, సీర్ణంచ ఆదివారం...
Read More...