డిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక
మండల అధ్యక్షుడిగా దాసరి రవీందర్, కార్యదర్శిగా మాడుగుల నవీన్ కుమార్
భీమదేవరపల్లి ప్రజామంటలు ఫిబ్రవరి 12
తేది.11.02.2025 మంగళవారం రోజున డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భీమదేవరపల్లి మండల శాఖ సర్వ సభ్య సమావేశం మండల శాఖ అధ్యక్షులు దాసరి రవీందర్ అధ్యక్షతన బాలుర ఉన్నత పాఠశాల మల్కనూరు లో జరిగింది.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బత్తుల అశోక్ కుమార్ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టగా సభ్యులు చర్చించి ఆమోదించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ గత సంవత్సరం విద్యారంగానికి కేవలం 7.3% నిధులు మాత్రమే కేటాయించిందని ఈ సంవత్సరం బడ్జెట్లో కనీసం 15% విద్యారంగానికి నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగుల పిఆర్సి నివేదికను కమిషన్ నుండి వెంటనే తెప్పించుకొని 01.07.2023 నుండి అమలు చేయాలని, పెండింగ్ డి.ఎ లు విడుదల చేయాలని, సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి అర్హులైన ఉపాధ్యాయులకు పర్యవేక్షక పోస్టుల పదోన్నతులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిటిఎఫ్ సీనియర్ నాయకులు నోముల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుంటేనే సమాజానికి మేలు జరుగుతుందని,తద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలకు న్యాయం జరుగుతుందని అన్నారు.ఉపాధ్యాయులు కూడా అంకిత భావంతో పనిచేసి పాఠశాలల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. అనంతరం డి టి ఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. *అధ్యక్షులుగా దాసరి రవీందర్( ముల్కనూర్),* *ప్రధాన కార్యదర్శిగా మాడుగుల నవీన్ కుమార్(గట్ల నర్శింగాపూర్)* ఉపాధ్యక్షులుగా పి .శ్రీకాంత్ (భీమదేవరపల్లి) ,జె.స్వప్న(కొత్తకొండ),కార్యదర్శులుగా బి. ప్రేమ్ కుమార్(ధర్మారం) కె. రాజ్ కుమార్(వంగర) సిహెచ్ కిరణ్(కొత్తకొండ)జిల్లా కౌన్సిలర్లుగా ఏ శ్రీనివాస్ రెడ్డి(గట్ల నరసింగాపుర్ )సునీతాదేవి(రత్నగిరి) డాక్టర్ ఎ .కిషన్(మల్లారం) గొర్రె చిరంజీవి(వంగర) ఆడిట్ కమిటీ కన్వీనర్ బి. అశోక్ కుమార్(గట్ల నరసింగపూర్)సభ్యులుగా జె. ప్రవళిక(గాంధీ నగర్) ఎం. కమలాకర్(మల్లారం) లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా నోముల శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులుగా అటుకుల శ్రీనివాస్ రెడ్డిలు వ్యవహరించడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ గ్లోబల్ టారిఫ్ 15%: భారత్పై ఎలాంటి ప్రభావం ఎంత?
ట్రంప్ మళ్ళీ 10 నుండి 15% సుంకాల పెంపు ప్రభావం - ఒక విశ్లేషణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గ్లోబల్ టారిఫ్ పెంపు నిర్ణయం భారత్కు గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం (ఫిబ్రవరి 21, 2026) ట్రంప్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలపై విధించదలచుకున్న టారిఫ్ను... హీలింగ్ క్యాపిటల్ గా హైదరాబాద్. - రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్ కేర్... తెలంగాణ మాజీ మంత్రి టి. హరీష్ రావు సమక్షంలో భారతదేశంలో రూఫ్టాప్ సోలార్ వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు 'RENGY' యాప్ ప్రారంభం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 21 ఫిబ్రవరి (ప్రజా మంటలు) :
నివాస గృహాల ఇంధన అవసరాల కోసం డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందిస్తున్న క్లీన్-టెక్ ఎనర్జీ సంస్థ 'రెంజి’ (Rengy) ప్రైవేట్ లిమిటెడ్'.
నేడు (21 ఫిబ్రవరి 2026) తన ప్రతిష్టాత్మక RENGY యాప్ను ప్రారంభించింది తెలంగాణ మాజీ మంత్రి... సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు — జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్
జగిత్యాల, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు):సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అన్నారు.
శనివారం జగిత్యాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు—జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో—ఎమ్మెల్యేను కలిసి... కర్ణాటక రాజకీయాల్లో సంచలం: బీజేపీ ఎమ్మెల్యే డా చంద్రూలమానీ లంచం కేసులో అరెస్ట్
బెంగళూరు ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు):
కర్ణాటక రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే చంద్రూలమానీ లంచం కేసులో అరెస్టయ్యారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రోడ్డు పక్కన రిటెయినింగ్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణ పనుల కేటాయింపుకు గాను రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసిన... స్కూల్ విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు SA-II పరీక్షలు
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి, తరగతులు 1 నుంచి 9 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్-II (SA-II) పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి 20, 2026 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పరీక్షల టైమ్టేబుల్ను SCERT విడుదల చేసింది.ఏప్రిల్ 10,... ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద మృతి
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు-దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాశెట్టి గణేష్కు చెందిన వ్యవసాయ భూమిలో ఎర్రోళ్ల లింబాద్రి (51), తండ్రి గంగారం, నివాసం మొగిలిపేట (మల్లాపూర్ మండలం) మృతదేహం లభ్యమైంది.
మృతుడి తలకు తీవ్ర గాయాలు ఉండటంతో... ట్రేడ్ లేదా ట్రాప్? జపాన్ మార్కెట్లలో ‘టకైచి ప్రభావం’పై పెట్టుబడిదారుల సందేహాలు
టోక్యో ఫిబ్రవరి 21:
జపాన్లో జరిగిన ఎన్నికల్లో సానయే టకైచి ఘన విజయం సాధించడంతో, జపాన్ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకాయి. ముఖ్యంగా నిక్కీ 225 సూచీ ఒక్క వారంలోనే సుమారు 5 శాతం పెరగడం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని పెంచింది.
అయితే ఈ ఉత్సాహం వెనుక ఆందోళన కూడా దాగి ఉందని మార్కెట్ నిపుణులు... జాతీయ స్థాయిలో ‘ఏఐ కౌన్సిల్’, ప్రత్యేక ‘ఏఐ మంత్రిత్వ శాఖ’ ఏర్పాటు చేయాలి.— ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు):
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో, జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో ప్రత్యేకంగా ఒక “ఏఐ కౌన్సిల్” ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. అలాగే జాతీయ... అమెరికా సుప్రీం కోర్ట్ షాక్ – ట్రంప్ టారిఫ్ యుద్ధం కొత్త మలుపు
వసూలు చేసిన టారిఫ్ నిధులు తిరిగి ఇచ్చేయాలా?
హైదరాబాద్ ఫిబ్రవరి 21:
అమెరికా వాణిజ్య విధానాల్లో కీలక మలుపుగా, అమెరికా సుప్రీం కోర్ట్ ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన టారిఫ్లకు చట్టపరమైన బ్రేక్ వేసింది. జాతీయ భద్రత పేరుతో దిగుమతులపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు ఏకపక్షంగా వినియోగించలేడని కోర్ట్ స్పష్టం చేసింది. ఇది... ఇంటర్మీడియట్ బోర్డు ను ముట్టడించిన జాగృతి విద్యార్థి నాయకులు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు):
నాంపల్లిలో ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించిన తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్
నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ముట్టడించారు.అనుమతి లేని ఇంటర్ కాలేజీలకు బోర్డు కొమ్ముకాస్తూ, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విద్యార్థి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.... బిసి రిజర్వేషన్ల ఖరారు తర్వాతనే జెడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్కు బీసీ నాయకులు వినతి
జగిత్యాల ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు) స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల తర్వాతనే జడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికలకు వెళ్ళాలి. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని బీసీ నాయకులు అన్నారు .
రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బిసిలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పి, 42% రిజర్వేషన్లను కల్పించకుండానే సర్పంచ్... 