డిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

మండల అధ్యక్షుడిగా దాసరి రవీందర్, కార్యదర్శిగా మాడుగుల నవీన్ కుమార్

On
డిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

భీమదేవరపల్లి ప్రజామంటలు ఫిబ్రవరి 12

తేది.11.02.2025 మంగళవారం రోజున డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భీమదేవరపల్లి మండల శాఖ సర్వ సభ్య సమావేశం మండల శాఖ అధ్యక్షులు దాసరి రవీందర్ అధ్యక్షతన బాలుర ఉన్నత పాఠశాల మల్కనూరు లో జరిగింది.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బత్తుల అశోక్ కుమార్ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టగా సభ్యులు చర్చించి ఆమోదించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ గత సంవత్సరం విద్యారంగానికి కేవలం 7.3% నిధులు మాత్రమే కేటాయించిందని ఈ సంవత్సరం బడ్జెట్లో కనీసం 15% విద్యారంగానికి నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగుల పిఆర్సి నివేదికను కమిషన్ నుండి వెంటనే తెప్పించుకొని 01.07.2023 నుండి అమలు చేయాలని, పెండింగ్ డి.ఎ లు విడుదల చేయాలని, సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి అర్హులైన ఉపాధ్యాయులకు పర్యవేక్షక పోస్టుల పదోన్నతులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిటిఎఫ్ సీనియర్ నాయకులు నోముల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుంటేనే సమాజానికి మేలు జరుగుతుందని,తద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలకు న్యాయం జరుగుతుందని అన్నారు.ఉపాధ్యాయులు కూడా అంకిత భావంతో పనిచేసి పాఠశాలల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. అనంతరం డి టి ఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. *అధ్యక్షులుగా దాసరి రవీందర్( ముల్కనూర్),* *ప్రధాన కార్యదర్శిగా మాడుగుల నవీన్ కుమార్(గట్ల నర్శింగాపూర్)* ఉపాధ్యక్షులుగా పి .శ్రీకాంత్ (భీమదేవరపల్లి) ,జె.స్వప్న(కొత్తకొండ),కార్యదర్శులుగా బి. ప్రేమ్ కుమార్(ధర్మారం) కె. రాజ్ కుమార్(వంగర) సిహెచ్ కిరణ్(కొత్తకొండ)జిల్లా కౌన్సిలర్లుగా ఏ శ్రీనివాస్ రెడ్డి(గట్ల నరసింగాపుర్ )సునీతాదేవి(రత్నగిరి) డాక్టర్ ఎ .కిషన్(మల్లారం) గొర్రె చిరంజీవి(వంగర) ఆడిట్ కమిటీ కన్వీనర్ బి. అశోక్ కుమార్(గట్ల నరసింగపూర్)సభ్యులుగా జె. ప్రవళిక(గాంధీ నగర్) ఎం. కమలాకర్(మల్లారం) లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా నోముల శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులుగా అటుకుల శ్రీనివాస్ రెడ్డిలు వ్యవహరించడం జరిగింది.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

మంత్రి దామోదర రాజనర్సింహ కు జోగిపేట లో చుక్కెదురు.

మంత్రి దామోదర రాజనర్సింహ కు జోగిపేట లో చుక్కెదురు. (సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జోగిపేట 21 జనవరి (ప్రజా మంటలు) :  మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన ఇందిరమ్మ చీర తీసుకోవడానికి నిరాకరించిన మహిళలు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ నిలదీసిన మహిళలు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఒక కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ...
Read More...
National  State News 

చరిత్రలో ఈరోజు జనవరి 21.

చరిత్రలో ఈరోజు జనవరి 21. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  చరిత్రలో ఈరోజు జనవరి 21  సంఘటనలు :  1972: త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. జననాలు : 1910: బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1995) 1915: పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు 1939: సత్యమూర్తి, వ్యంగ్య...
Read More...

సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్

సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్ హైదరాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు)సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి సంఘీభావం తెలిపి అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్...
Read More...

450 పడకల ఆసుపత్రికి భూమి పూజ పాల్గొన్న ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్

450 పడకల ఆసుపత్రికి భూమి పూజ పాల్గొన్న ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్    జగిత్యాల జనవరి 20 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో 235 కోట్ల తో  నిర్మించనున్న 450 పడకల ఆసుపత్రి కి భూమిపూజ చేసి,23.5 కోట్ల తో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ,3 కోట్ల తో  నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ,1.5 కోట్ల తో టి ఆర్ నగర్ లో...
Read More...

15, 28 వార్డుకు చెందిన పలువురు బిజెపిలో చేరిక

15, 28 వార్డుకు చెందిన పలువురు బిజెపిలో చేరిక    జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)పట్టణ 15వ వార్డ్ కి చెందిన న్యాయవాది అవుసం భాగ్యశ్రీ మరియు 28వ వార్డ్ కి చెందిన అడ్డగట్ల అక్షయ్ కుమార్-మాధురి  మరియు 28వ,15వ వార్డ్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగిత్యాల పట్టణ...
Read More...

బిజెపి నూతన జాతీయ అధ్యక్షుని ఎన్నిక నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

బిజెపి నూతన జాతీయ అధ్యక్షుని ఎన్నిక నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)  భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన  నితిన్ నబీన్  ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా భారతీయ జనత పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు...
Read More...
Local News  State News 

తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీల ప్రాథమిక నివేదిక 

తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీల ప్రాథమిక నివేదిక  హైదరాబాద్, జనవరి 20 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, అలాగే రాష్ట్ర వనరుల సమర్థ వినియోగంపై లోతైన అధ్యయనం కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 అధ్యయన కమిటీల సభ్యులతో బంజారాహిల్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి...
Read More...

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా ప్రారంభమైన శివ మహాపురాణం

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా ప్రారంభమైన శివ మహాపురాణం జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)   జిల్లా కేంద్రం గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో, భాగవత సప్తాహ ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర, బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ చే, శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఘనంగా ప్రారంభమైంది. గుట్టపై రాజేశ్వరుని దర్శించి, ప్రత్యేక పూజలు...
Read More...

మౌని అమావాస్య ఘటనపై అభిముక్తానంద శంకరాచార్య నిరసన దీక్ష

మౌని అమావాస్య ఘటనపై అభిముక్తానంద శంకరాచార్య నిరసన దీక్ష ప్రయాగ్‌రాజ్ / ఉత్తరప్రదేశ్ జనవరి 20: మౌని అమావాస్య (ఆదివారం, జనవరి 18), మాఘమేళ సందర్భంగా, తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా అభిముక్తానంద శంకరాచార్య ఈ రోజు నిరసన దీక్ష చేపట్టారు. పవిత్ర స్నానాలు, ధార్మిక కార్యక్రమాలకు సంబంధించిన సందర్భంలో పోలీసులు తనను అడ్డుకోవడం, అవమానకరంగా వ్యవహరించడం జరిగిందని ఆయన ఆరోపించారు. జరిగిన...
Read More...

:కేనాల్ లో బోల్తాపడ్డ క్వాలిస్, 14 మందికి గాయాలు కొండగట్టుకు వెళ్తుండగా ఘటన

:కేనాల్ లో బోల్తాపడ్డ క్వాలిస్, 14 మందికి గాయాలు కొండగట్టుకు వెళ్తుండగా ఘటన కొడిమ్యాల జనవరి 20(ప్రజా మంటలు)   హైదరాబాదు కు చెందిన ఓ కుటుంబం   వేములవాడ లో దర్శనం చేసుకొని కొండగట్టు వెళ్తుండగా ఈ  ఘటన చోటు చేసుకుంది. జేఎన్టీయూ సమీపంలో క్వాలిస్ బ్రేకులు ఫెయిల్ కావడంతో కినాల్ లో పడిపోయింది.  క్వాలిస్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులకు ఐదుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా...
Read More...
Crime  State News 

నిత్యశ్రీ–చైత్ర మృతుల విచారణ రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేయాలి: BSP

నిత్యశ్రీ–చైత్ర మృతుల విచారణ రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేయాలి: BSP మహబూబాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామం ఇటుకల గడ్డ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ వల్ల మృతి చెందిన నాలుగేళ్ల చిన్నారులు చైత్ర, నిత్యశ్రీల మృతిపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రిపోర్ట్‌ను వెంటనే బహిర్గతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర...
Read More...
State News 

WEF–2026: స్విట్జర్లాండ్ చేరుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం లో CM రేవంత్ రెడ్డి

WEF–2026: స్విట్జర్లాండ్ చేరుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం లో CM రేవంత్ రెడ్డి జ్యూరిచ్ / దావోస్ జనవరి 20: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సు–2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సారధ్యంలోని ఈ ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు....
Read More...