డిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక
మండల అధ్యక్షుడిగా దాసరి రవీందర్, కార్యదర్శిగా మాడుగుల నవీన్ కుమార్
భీమదేవరపల్లి ప్రజామంటలు ఫిబ్రవరి 12
తేది.11.02.2025 మంగళవారం రోజున డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భీమదేవరపల్లి మండల శాఖ సర్వ సభ్య సమావేశం మండల శాఖ అధ్యక్షులు దాసరి రవీందర్ అధ్యక్షతన బాలుర ఉన్నత పాఠశాల మల్కనూరు లో జరిగింది.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బత్తుల అశోక్ కుమార్ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టగా సభ్యులు చర్చించి ఆమోదించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ గత సంవత్సరం విద్యారంగానికి కేవలం 7.3% నిధులు మాత్రమే కేటాయించిందని ఈ సంవత్సరం బడ్జెట్లో కనీసం 15% విద్యారంగానికి నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగుల పిఆర్సి నివేదికను కమిషన్ నుండి వెంటనే తెప్పించుకొని 01.07.2023 నుండి అమలు చేయాలని, పెండింగ్ డి.ఎ లు విడుదల చేయాలని, సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి అర్హులైన ఉపాధ్యాయులకు పర్యవేక్షక పోస్టుల పదోన్నతులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిటిఎఫ్ సీనియర్ నాయకులు నోముల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుంటేనే సమాజానికి మేలు జరుగుతుందని,తద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలకు న్యాయం జరుగుతుందని అన్నారు.ఉపాధ్యాయులు కూడా అంకిత భావంతో పనిచేసి పాఠశాలల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. అనంతరం డి టి ఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. *అధ్యక్షులుగా దాసరి రవీందర్( ముల్కనూర్),* *ప్రధాన కార్యదర్శిగా మాడుగుల నవీన్ కుమార్(గట్ల నర్శింగాపూర్)* ఉపాధ్యక్షులుగా పి .శ్రీకాంత్ (భీమదేవరపల్లి) ,జె.స్వప్న(కొత్తకొండ),కార్యదర్శులుగా బి. ప్రేమ్ కుమార్(ధర్మారం) కె. రాజ్ కుమార్(వంగర) సిహెచ్ కిరణ్(కొత్తకొండ)జిల్లా కౌన్సిలర్లుగా ఏ శ్రీనివాస్ రెడ్డి(గట్ల నరసింగాపుర్ )సునీతాదేవి(రత్నగిరి) డాక్టర్ ఎ .కిషన్(మల్లారం) గొర్రె చిరంజీవి(వంగర) ఆడిట్ కమిటీ కన్వీనర్ బి. అశోక్ కుమార్(గట్ల నరసింగపూర్)సభ్యులుగా జె. ప్రవళిక(గాంధీ నగర్) ఎం. కమలాకర్(మల్లారం) లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా నోముల శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులుగా అటుకుల శ్రీనివాస్ రెడ్డిలు వ్యవహరించడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
నిజామాబాద్, ఆగస్టు 13 (ప్రజా మంటలు):
అప్పుల బాధతో నిజామాబాద్లో ఓ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నరేష్ (38), భార్య మేఘన (34), పిల్లలు అయాన్ష్ (9), మిథున్ (7)తో కలిసి నివసిస్తున్నాడు.... ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్
హైదరాబాద్ ఆగస్టు 12 (ప్రజా మంటలు):
ఆటో కార్మికుల జీవితాలను దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్టీయూ) అనుబంధ ఆటో కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడపాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు.
ఆటో కార్మికులకు... ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి: CM రేవంత్
హైదరాబాద్, ఆగస్టు 12 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి యువ క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలకు అవసరమైన మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.... గొల్లపల్లిలో అలరించిన సాధనాసురుల విన్యాసాలు
ఆకట్టుకున్న ప్రాచీన జానపద ఇంద్రజాల ప్రదర్శనలు
గొల్లపల్లి, ఆగస్టు 09 (ప్రజా మంటలు):గొల్లపల్లి మండల కేంద్రంలో సాధనాసురులు (సాధన శూరులు) నిర్వహించిన ప్రాచీన జానపద కళా ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తరతరాలుగా పద్మశాలి సమాజానికి చెందిన కళాకారులు తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఈ అరుదైన కళను పరిరక్షిస్తూ వస్తున్నారు. సాధనాసురుల కళాకారులు... వెల్ నెస్ బై హార్ట్ ఫుల్నెస్, కన్హా ఆశ్రమం, శ్రీరామచంద్రమిషన్, ఇస్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకఉచితవైద్యశిభిరం
జగిత్యాల ఆగస్ట్ 9(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని క్లబ్ ఆవరణలో ఆదివారం వెల్ నెస్ బై హార్ట్ ఫుల్నెస్, కన్హా ఆశ్రమం, శ్రీరామచంద్రమిషన్, ఇస్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్యశిభిరం నిర్వహించారు.
వెల్ నెస్ బై హార్ట్ ఫుల్నెస్ జనరల్ మేనేజర్ భరద్వాజ్, ఇస్కా ఫౌండేషన్ నిర్వాహకులు మంచాల క్రిష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ... మహిళపై లైంగిక దాడి, బెదిరింపులు.. నలుగురు నిందితుల అరెస్ట్
జగిత్యాల ga, ఆగస్టు 08 (ప్రజా మంటలు):
మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడిన నలుగురు నిందితులను మల్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 3న నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో బాధితురాలు తనకు... హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్రలో భాగంగా మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ను సన్మానించిన డా. బోగ శ్రావణి
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న "హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర" కార్యక్రమంలో భాగంగా, భారత త్రివిధ దళాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ ని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ... బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి కి పోచమ్మ తల్లి బోనాల జాతర ఆహ్వాన పత్రిక అందజేత
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా యూట్యూబర్స్ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణికి బోనాల జాతర వర్కింగ్ కమిటీ సభ్యులు, జగిత్యాల జిల్లా కళాకారులు మర్యాదపూర్వకంగా అందజేశారు.
ఈ సందర్భంగా... తల్లిపాలే శిశువుకు తొలి వరం – మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు )పట్టణంలోని స్థానిక 43వ వార్డు వాణీనగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ సమీండ్ల... విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి – మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)పట్టణంలోని నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన "పరిచయ్–2K26" ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్య జీవితానికి బలమైన పునాది అని, ఈ దశలో విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను... సామాజిక న్యాయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ సంకల్పం
హైదరాబాద్, ఆగస్టు 06 (ప్రజా మంటలు):
సామాజిక న్యాయ తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ నిర్వహించిన **"సామాజిక న్యాయ సంకల్ప సభ"**లో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక ప్రసంగం చేశారు. ఈ సభ దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన వర్గాల జీవితాలను మార్చే ఉద్యమానికి నాంది అవుతుందని ఆమె పేర్కొన్నారు.
తాను బీసీల కోసం... ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి – మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 6(ప్రజా మంటలు)
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కరీంనగర్ రోడ్లోని జయశంకర్ విగ్రహం వద్ద, గొల్లపల్లి రోడ్లోని విగ్రహం వద్ద, అలాగే మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర... 