దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు
జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)
300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం అంబారి పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు.
శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు అన్య మత ప్రచారం నిషేధం అంటూ బోర్డు ఏర్పాటు చేయగా ఆ బోర్డును తీసివేయాలంటూ ఓ వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు ఆ బోర్డును తొలగించాలని గ్రామస్తులపై ఒత్తిడి చేయడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు గ్రామస్తులందరూ అధికారుల చర్యలను ఖండించారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి కొంతమంది క్రిస్టియన్ మత ప్రచారకులు వచ్చి గ్రామానికి చెందిన మహిళలను మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చారని, ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వారిని గ్రామం నుండి పంపివేశామని తెలిపారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామ సర్పంచ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా పవిత్రమైన దేవాలయం కొండపై గుర్తుతెలియని వ్యక్తులు సిలువ గుర్తు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
ఈ విషయంలో కూడా వివాదం చెలరేగిందని గుర్తు చేశారు. పవిత్రమైన ఆలయం వద్ద అన్యత ప్రచారం, అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదనే ఉద్దేశంతో తాము ఈ బోర్డును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
గ్రామస్తుల మనోభావాలకు వ్యతిరేకంగా కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర మతస్తుల నుండి తమ దేవాలయాన్ని, గ్రామాన్ని రక్షించుకోవడం తమ అందరి బాధ్యత అని ఈ విషయాన్ని అధికారులు అర్థం చేసుకోవాలని కోరారు.
ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘం నాయకులు అక్కడికి చేరుకొని వారికి సంఘీభావం తెలిపిన లింగంపేట శ్రీనివాస్, అంకార్ సుధాకర్, వేముల సంతోష్, జిట్టవేణి అరుణ్ కుమార్ గాజోజు సంతోష్, వారికి సంఘీభావం తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లి మండలంలో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
పంచాయతి ఎన్నికలు -2025 మండలం లోని మూడవ విడతలో 6 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో తేది 3 నుండి 5 వరకు సర్పంచి మరియు వార్డు సభ్యులకు 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గొల్లపల్లి మండలంలోని 27 గ్రామాలను ఆరు క్లస్టర్లుగా 6 కేంద్రాలు విభజించారు.... బాల్య వివాహాలపై అవగాహన సదస్సు.
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 01 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలంలోనీ వర్షకొండ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో బాల్య వివాహం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది హేమశ్రీ మాట్లాడుతూ గ్రామ సభ్యులకు,పాఠశాల విద్యార్థులకు, మరియు తల్లులకు,కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి... ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు చేయూత...
కొండగట్టు డిసెంబర్ 1(ప్రజా మంటలు)ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సోమవారం రూపాయలు 40 వేల విలువగల దుస్తువులను కంపెనీ ప్రతినిధులు అందజేశారు.
ఈ సందర్బంగా కంపెనీ ASM రమేష్ కుమార్ , CFA ఏజెంట్ వూటూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కొండగట్టులోని... హెచ్ఐవీ బాధితులు ఆందోళన చెందొద్దు : సూపరింటెండెంట్ డాక్టర్ వాణి
గాంధీ ఏఆర్టీ సెంటర్ లో అందుబాటులో చక్కటి వైద్యం
సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు) : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాంధీ ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం,ఎ.ఆర్.టి. సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ, అవేర్నెస్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ వాణి హాజరయ్యారు.
అనంతరం ఎ ఆర్... మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 1 (ప్రజా మంటలు)
మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 28 లక్షల విలువగల 136 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ... ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తప్పవు : ఐడీహెచ్ కాలనీలో బోర్డు పెట్టిన రెవిన్యూ సిబ్బంది
సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు):బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడా ఐడిహెచ్ కాలనీ లోని ఉన్న భూమి ప్రభుత్వానికి చెందినదని స్పష్టంచేస్తూ సికింద్రాబాద్ తహాసీల్దార్ కార్యాలయ సిబ్బంది సోమవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
ఈ భూమి ప్రభుత్వానికి చెందిన భూమి...అక్రమంగా ఆక్రమించే వారికి కఠిన చర్యలు తప్పవు.. అని బోర్డుపై పేర్కొన్నారు. సదరు... ఈశ్వరీబాయి పోరాట పటిమ అందరికీ ఆదర్శం : ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్- కంటోన్మెంట్, డిసెంబర్ 01 ( ప్రజా మంటలు):
ఈశ్వరీబాయి 107వ జయంతి వేడుకలు మారేడ్పల్లిలో సోమవారం ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, మాజీ మంత్రి గీతారెడ్డి ఈశ్వరీబాయి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ— మహిళా సాధికారతకు ప్రతీక అయిన ఈశ్వరీబాయి 100 ఏళ్ల క్రితమే లింగ వివక్షను ఎదుర్కొంటూ ఉన్నత... ‘భూతశుద్ధి వివాహం’ అంటే ఏమిటి?
హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
సమంత–రాజ్ నిడిమోరు వివాహం కోయంబత్తూరు ఈషా యోగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో ‘భూతశుద్ధి వివాహం’ పద్ధతిలో జరిగినట్లు ఈషా సంస్థ వెల్లడించింది. ఈ వార్త బయటకు రావడంతో భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి? అనే ఆసక్తి అందరిలో పెరిగింది.
ఈషా నిర్వాహకుల వివరణ ప్రకారం, భూతశుద్ధి వివాహం అనేది... సీనియర్ సిటిజెన్స్ డిమాండ్లు పరిష్కరించాలి. -టాస్కా జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ డిమాండ్లు సత్వరం పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రం లోని టాస్కా కార్యాలయంలో అయన విలేకరులతో మాట్లాడారు.సీనియర్ సిటిజెన్స్ సమస్యలు పరిష్కారం, సంక్షేమం కోసం రాష్ట్ర స్థాయిలో సీనియర్... సినీనటి సమంత–రాజ్ నిడిమోరు వివాహం
కోయంబత్తూరులో
హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
టాలీవుడ్ స్టార్ సమంత రూత్ ప్రభు దర్శకుడు రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ – లింగభైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న ఇద్దరూ, కుటుంబ సభ్యులు–సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయ భూతశుద్ధి వివాహం విధానం ద్వారా... ఎయిడ్స్ కు చికిత్స కంటే నివారణే మేలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)ఎయిడ్స్ కు చికిత్స కంటే .. నివారణే మేలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజ గౌడ్ అన్నారు
యువత ఎట్టి పరిస్థితుల్లోని ఎయిడ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనీ
సోమవారం రోజున ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ... గీతా భవన్ లో ఘనంగా గీత జయంతి వేడుకలు
జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో గీతా జయంతి పురస్కరించుకొని గీతా సత్సంగం 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు.
ఉదయం సంపూర్ణ సామూహిక శ్రీలక్ష్మి అష్టోత్తర సహిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, మరియు శ్రీమద్భవద్గీత 18... 