అమెరికాలోని 90 వేల మంది విద్యార్థులను భారత కేంద్ర ప్రభుత్వం కాపాడాలి - సీక్ చాంద్ పాషా

On
అమెరికాలోని 90 వేల మంది విద్యార్థులను భారత కేంద్ర ప్రభుత్వం కాపాడాలి - సీక్ చాంద్ పాషా

 అమెరికాలోని 90 వేల మంది విద్యార్థులను భారత కేంద్ర ప్రభుత్వం కాపాడాలి - సీక్ చాంద్ పాషా

హైదరాబాద్ ఫిబ్రవరి 08:
మారిన అమెరికాలోని పరిస్థితులలో, నరకయాతన అనుభవిస్తున్న బారతీయ విద్యార్థులను స్వయంగా కేంద్రమే విమాన సర్వీసులు ఏర్పాటు చేసి స్వదేశానికి  తీసుకురావాలని, స్వదేశానికి విద్యార్థులు వచ్చేలా కృషి చేయకుంటే ఆందోళనలను కొనసాగిస్తామని
 ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్. టిపిసిసి ప్రతినిధి డాక్టర్ షేక్ చాంద్ పాషా డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ తొ కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు 

 అమెరికాలోనే 90 వేల మంది భారతీయులు విద్యాభ్యాసం, విద్యతోపాటు ఉద్యోగం కోసం వెళ్లిన విద్యార్థిని, విద్యార్థులు గత ఎనిమిది నెలలుగా అక్కడి ప్రభుత్వం చేతిలో ఉగ్రవాదుల కంటే హీనంగా చేతులకు కాళ్లకు బెడీలు వేసి నరకయాతన చూపించి, ఒక తొమ్మిది మందిని మన దేశానికి పంపించిందని, ఇంకా 90 వేల మంది విద్యార్థులను, నెలలుగా అక్కడ నాన నరకయాతన పడుతున్న విద్యార్థులను విడిపించుకు రావడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ విఫలమయ్యారని ఎన్నారై సెల్ కన్వీనర్, టీపీసీసీ ప్రతినిధి డాక్టర్ షేక్ చాంద్ పాషా విలేకరుల సమావేశంలో విమర్శించారు.

అక్కడి ట్రంప్, అమెరికా ప్రభుత్వం, అక్కడి ఎంబసీ అధికారులు, అక్కడ ఉన్నవి అక్రమ విద్యాలయాలు అయితే, అమెరికా ప్రభుత్వం తోపాటు, అక్కడి రాయబార, ఎంబసీ, అధికారులనిర్లక్ష్యం చేసిన వారిపై అమెరికా ప్రభుత్వం, అక్కడి అధికారుల విద్యాలయాల పై చర్యలు చేపట్టాలి కానీ, భారతీయ విద్యార్థులపై చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసం అని, కేంద్ర ప్రభుత్వం 8 నెలలుగా మన కేంద్ర ప్రభుత్వం ఇంత జరుగుతున్న  నిద్రవస్థలో ఉందా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ప్రణ ముఖర్జీ హాయo లో దుబాయిలో ఇలాంటి సంఘటనలు తలెత్తినప్పుడు, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గా ఉమ్మడి ఏపీ తెలంగాణ దివంగత  నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్, అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ సింగ్ కు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కి లేఖలు రాస్తే, వెంటనే వారు స్పందించి ఎన్నారై హై  కమిషన్  వెల్ఫేర్ పాండ్ ఏర్పాటు చేసి దుబాయిలో నుండి తిరిగి భారతీయులను అక్కడి నుండి స్వదేశానికి తీసుకొచ్చారని డాక్టర్ షేక్ చాంద్ పాషా అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో కొంచెం తర్వాత ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ వెల్ఫేర్ పాండు ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ పాండులో వేలకోట్ల డబ్బు ఉందని, అప్పటి కేంద్ర మంత్రి దివంగత నేత సుష్మ స్వరాజ్ స్వయంగా పార్లమెంటులో ఈ విషయం తెలియజేశారని ఆయన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ ఫండ్  ఏమైందని, రద్దు చేశారా, లేదా కొనసాగుతుందా, ఒకవేళ కొనసాగితే, అమెరికాలో నరకయాతన అనుభవిస్తున్న  90 వేల విద్యార్థులను కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ పండు వెల్ఫేర్ వెల్ఫేర్ పండు నుంచి వెల్పేర్ ఫాండ్ లోవేల కోట్ల రూపాయలతో, స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసి, ప్రత్యేక విమానాల ఏర్పాటు చేసి, ఒక విద్యార్థి మిస్ కాకుండా చూసి స్వదేశానికి తీసుకురావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అమెరికాలో 8 నెలలుగా విద్యార్థులకు అనుభవిస్తున్న, జాతీయ పత్రికలు కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజలకు తెలియజేసిన ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయడం ఏమిటని ఎన్నారై సెల్ కన్వీనర్, టీపీసీసీ ప్రతినిధి డాక్టర్ షేక్ చాంద్ పాషా కేంద్ర ప్రభుత్వ తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురుబిజెపి ఎంపీలు అమెరికాలో నరకయాతన అనుభవిస్తున్న విద్యార్థుల  ఎందుకు నోరు మెదపడం లేదు అర్థం కావడం లేదని ఆయన ఆరోపించారు.

కేంద్ర మంత్రి కిసాన్ రెడ్డి సైతం ఎన్నికల్లో కరీంనగర్ కు వచ్చినప్పుడు ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ పాండ్ ఏర్పాటు చేస్తామని హామీని ఇచ్చి మర్చిపోయారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి, అక్కడి ప్రభుత్వంతో చర్చించి, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా విద్యార్థులను స్వదేశానికి తీసుకురావాలని, అక్కడి ఎంబసీ, అక్కడి ఇమిగ్రేషన్, అక్కడి అక్రమ కాలేజీల ఏర్పాటుపై, అమెరికా ట్రంప్ ప్రభుత్వం అక్కడి అధికారులపై చర్యలు చేపట్టాలి కానీ, భారతీయుల విద్యార్థులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, అక్రమంగా నరకయాతన చూపించడం సరైంది కాదని ఆయన అన్నారు.

ఇప్పటికైనా ప్రధాని మోడీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకుని అమెరికాలో నరకయాతన అనుభవిస్తున్న విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి కేంద్ర ప్రభుత్వమే తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు,ఎంపీలు సైతం 90 వేల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం క్షేమంగా అమెరికాలో ఉన్న 90 వేల విద్యార్థులను కేంద్ర ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పించి స్వదేశానికితీసుకురావాలని ఆయన కోరారు. లేనియెడల పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా, విద్యార్థుల తల్లిదండ్రులను, పలు వివిధ పార్టీల, కమ్యూనిస్టు పార్టీల, అన్ని పార్టీల సహకారంతో ఉద్యమాన్ని 90 వేల మంది విద్యార్థులు క్షేమంగా వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్, టీపీసీసీ డాక్టర్ షేక్ చాంద్ పాషా  హెచ్చరించారు.

Tags
Join WhatsApp

More News...

జగిత్యాల 4,6,12,19 వార్డుల్లో ఇంటింట ప్రచార నిర్వహించిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా   వసంత

జగిత్యాల 4,6,12,19 వార్డుల్లో ఇంటింట ప్రచార నిర్వహించిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా   వసంత జగిత్యాల ఫిబ్రవరి 8 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోనీ 4వ వార్డులో బత్తిని ప్రణయ్ కు 6 వ వార్డ్ లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి నీలి ప్రతాప్ కు 12వ వార్డు పంతం అనురాధకు 19వ వార్డు భారతి సంతోష్ కు మద్దతుగా ఇంటింటా తిరిగి...
Read More...

హైదరాబాద్‌లో ముత్యాల హరివిల్లు సంగీత విభావరి – అలరించిన జగిత్యాల వాసి

హైదరాబాద్‌లో ముత్యాల హరివిల్లు సంగీత విభావరి – అలరించిన జగిత్యాల వాసి హైదరాబాద్, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): హైదరాబాద్‌లో జరిగిన సంగీత కార్యక్రమంలో జగిత్యాల వాసుల గళం వినిపించింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు నంబి సత్యనారాయణ చార్య, ఆదివారం హైదరాబాద్‌లోని శ్రీ ముఖ హాల్‌లో నిర్వహించిన ముత్యాల హరివిల్లు సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొని శ్రోతలను అలరించారు. ముళ్లపూడి...
Read More...

జగిత్యాల 39 40 వార్డుల్లో ప్రచారం నిర్వహించిన డా  బోగ శ్రావణి ప్రవీణ్

జగిత్యాల 39 40 వార్డుల్లో ప్రచారం నిర్వహించిన డా  బోగ శ్రావణి ప్రవీణ్ జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల మున్సిపల్ 39వ వార్డ్ అభ్యర్థి సింగం పద్మ,40వ వార్డ్ అభ్యర్థి బోగ మౌనిక రాజ్ కుమార్  మద్దతుగా వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి  ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాత రమేష్,దూరిశెట్టి...
Read More...

జిల్లాల రద్దు లేదు, సింగరేణి మెడికల్ బోర్డు కొనసాగుతుంది: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత

జిల్లాల రద్దు లేదు, సింగరేణి మెడికల్ బోర్డు కొనసాగుతుంది: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత భూపాలపల్లి, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): కొన్ని జిల్లాలను రద్దు చేస్తారన్న ప్రచారం, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారన్న వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ జిల్లాను తొలగించడమో, కొత్త జిల్లాను ఏర్పాటు చేయడమో ప్రభుత్వ పరిశీలనలో లేదని తేల్చి చెప్పారు. “ప్రజా పాలన –...
Read More...
Crime  State News 

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఒక క్రిమినల్, ఒక దొంగ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఎలా ఉంటుందో నిన్న రాజధాని నడిబొడ్డున జరిగిన ఫోరెన్సిక్ ల్యాబ్...
Read More...

బిజెపి అభ్యర్థులకు మద్దతుగా పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించిన డా బోగ శ్రావణి

బిజెపి అభ్యర్థులకు మద్దతుగా పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించిన డా బోగ శ్రావణి జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల్ మున్సిపల్ 25 వ వార్డు అభ్యర్థి గుండేటి యశోద  ,41వ వార్డ్ అభ్యర్థి మ్యాన మహేష్ కు మద్దతుగా వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి  ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కొండ...
Read More...

ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్ ,సారయ్య తో కలిసి పలు వార్డుల కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్ ,సారయ్య తో కలిసి పలు వార్డుల కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్    జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు)పట్టణ 12వ వార్డులో బోయినపల్లి ప్రశాంత్ రావు  37వ వార్డులో కల్లెడ సునీత రాజేంద్ర ప్రసాద్ 39వ  వార్డులో బొలుసాని శ్రీనివాస్,23వ వార్డు రంగు ఉష శ్రీ మహేష్ ,4వ వార్డు క్యాదసు నవీన్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్...
Read More...
Local News  State News 

ఫుట్‌పాత్‌ అనాధలకు 294వ అన్నదానం 

ఫుట్‌పాత్‌ అనాధలకు 294వ అన్నదానం  సికింద్రాబాద్,  ఫిబ్రవరి 08 (ప్రజామంటలు): హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తూ ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ మరోసారి సేవా హస్తం అందించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో సంస్థ ఆధ్వర్యంలో 294వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది పేదలు భోజనం స్వీకరించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు...
Read More...
Local News  State News 

గ్యారంటీల పేర మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించండి - కొప్పుల ఈశ్వర్

గ్యారంటీల పేర మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించండి - కొప్పుల ఈశ్వర్ ధర్మపురి, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు 15, 4, 7, 9, 8, 1 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను...
Read More...

ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మున్సిపల్ పరిధిలో ఓటరు కానీ వ్యక్తులు ఉండరాదు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  

ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మున్సిపల్ పరిధిలో ఓటరు కానీ వ్యక్తులు ఉండరాదు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   జగిత్యాల ఫిబ్రవరి 8 ( ప్రజా మంటలు)  ప్రచారం ముగిసిన అనంతరం సంబంధిత మున్సిపల్ పరిధిలో ఓటర్లు కాని వ్యక్తులు ఎవరూ ఉండరాదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, ప్రచార గడువు ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రచారకులు మున్సిపల్ పరిధిని తక్షణమే విడిచి వెళ్లాలని...
Read More...

జగిత్యాల 9వ వార్డులో బిజెపి అభ్యర్థిగా బొందు కూరి అనంతలక్ష్మి శ్రీనివాస్ ప్రచారం 

జగిత్యాల 9వ వార్డులో బిజెపి అభ్యర్థిగా బొందు కూరి అనంతలక్ష్మి శ్రీనివాస్ ప్రచారం  జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు) మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల తొమ్మిదవ వార్డ్ బిజెపి అభ్యర్థిగా బొందుకూరి అనంతలక్ష్మి శ్రీనివాస్ ఇంటింట ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తమ అమూల్యమైన ఓటు వేసి దీవించాలని ప్రజల్ని అభ్యర్థించారు. వార్డు అభివృద్ధిలో ముందుండి తన వంతు సేవలు అందిస్తానని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో పలువురు...
Read More...
National  State News 

సిక్కిం‌లో స్వల్ప భూకంపం

సిక్కిం‌లో స్వల్ప భూకంపం సిక్కిం ఫిబ్రవరి 08: సిక్కిం రాష్ట్రంలో నిన్న సాయంత్రం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. గ్యాంగ్‌టాక్ సమీప ప్రాంతమే ఎపిసెంటర్‌గా గుర్తించారు. భూకంపం కారణంగా సిక్కిం తో పాటు ఉత్తర బెంగాల్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో స్వల్ప కంపనలు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అధికారులు అప్రమత్తమై...
Read More...