22 ఏళ్లుగా అద్దెకున్న వృద్ధురాలికి తెలియకుండానే సామాన్లు బయటపడేసిన యజమాని
22 ఏళ్లుగా అద్దెకున్న వృద్ధురాలికి తెలియకుండానే సామాన్లు బయటపడేసిన యజమాని
దోమకొండలో దారుణం - పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు
సహాయం కొరకు ఎదురుచూపులు
కామారెడ్డి ఫిబ్రవరి 03:
ఓకే ఇంట్లో 22 సంవత్సరాలుగా కిరాయి చెల్లిస్తూ, అద్దె కుంటున్న రిటైర్మెంట్ ఉద్యోగి తుమ్మగళ్ళ బాలమణి తన ఇంటి సామాగ్రిని ఇంటి బయట పడవేసి బలవంతంగా ఇల్లు కాళీ చేయించారని వాపోతోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో ఉంటున్న బాలమణి తనకు తెలియకుండానే తను ఉంటున్న ఇంటి సామాగ్రిని ఇంటి యజమాని పోగుల రవి బయట పడవేసి, ఇబ్బందులకు గురి చేస్తున్నదని బలమని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా తుమ్మగల బాలమణి మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ గా విధులు నిర్వహించడం జరిగిందని, అప్పటినుండి ఇంటి యజమాని అయిన వల్ల కట్టి నరసయ్య ముంబైలో ఉంటున్నాడని ఈ ఇంట్లో నేను అద్దెకు ఉండడం జరుగుతుందని, అప్పటినుండి ప్రతినెల అద్దె కూడా కట్టడం జరిగిందని తెలిపారు
నాలుగైదు సంవత్సరాల క్రితం పోగుల రవి అనే వ్యక్తి తనకు (బాలమణి) కొడుకును అవుతానని చెప్పి ఈ ఇల్లును కొనుగోలు చేయడం జరిగిందని, ఇట్టి విషయం పైన బిక్నూర్ పోలీస్ స్టేషన్ సిఐ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. నేనే ఈ ఇల్లును కొనుగోలు చేసుకుంటానని, ఇదివరలో రెండు మూడు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు మరమత్తులు చేసుకోవడం జరిగిందని, కనీసం నేను మనమత్తులు చేసిన డబ్బులు ఇవ్వాలని పోలీస్ స్టేషన్లో కూడా చెప్పడం జరిగిందని అయినా నాకు ఎవ్వరూ న్యాయం చేయడం లేదని విలపించారు.
నేను ఖర్చుపెట్టిన డబ్బులు ఇవ్వకుండానే, తన సొంత సామాగ్రిని మొత్తం ఇంటి బయట పాడేయడం జరిగిందని, జిల్లా అధికారులు తనకు న్యాయం చేయాలని బాలమణి ఆవేదనతో విన్నవించుకొంటున్నది.
గత ఆరు రోజులుగా నా సామాగ్రి మొత్తం ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకొ అంటూ బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దయచేసి నాకు అధికారులు న్యాయం చేయగలరని ఆమె వేడుకుంటున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)