22 ఏళ్లుగా అద్దెకున్న వృద్ధురాలికి తెలియకుండానే సామాన్లు బయటపడేసిన యజమాని
22 ఏళ్లుగా అద్దెకున్న వృద్ధురాలికి తెలియకుండానే సామాన్లు బయటపడేసిన యజమాని
దోమకొండలో దారుణం - పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు
సహాయం కొరకు ఎదురుచూపులు
కామారెడ్డి ఫిబ్రవరి 03:
ఓకే ఇంట్లో 22 సంవత్సరాలుగా కిరాయి చెల్లిస్తూ, అద్దె కుంటున్న రిటైర్మెంట్ ఉద్యోగి తుమ్మగళ్ళ బాలమణి తన ఇంటి సామాగ్రిని ఇంటి బయట పడవేసి బలవంతంగా ఇల్లు కాళీ చేయించారని వాపోతోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో ఉంటున్న బాలమణి తనకు తెలియకుండానే తను ఉంటున్న ఇంటి సామాగ్రిని ఇంటి యజమాని పోగుల రవి బయట పడవేసి, ఇబ్బందులకు గురి చేస్తున్నదని బలమని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా తుమ్మగల బాలమణి మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ గా విధులు నిర్వహించడం జరిగిందని, అప్పటినుండి ఇంటి యజమాని అయిన వల్ల కట్టి నరసయ్య ముంబైలో ఉంటున్నాడని ఈ ఇంట్లో నేను అద్దెకు ఉండడం జరుగుతుందని, అప్పటినుండి ప్రతినెల అద్దె కూడా కట్టడం జరిగిందని తెలిపారు
నాలుగైదు సంవత్సరాల క్రితం పోగుల రవి అనే వ్యక్తి తనకు (బాలమణి) కొడుకును అవుతానని చెప్పి ఈ ఇల్లును కొనుగోలు చేయడం జరిగిందని, ఇట్టి విషయం పైన బిక్నూర్ పోలీస్ స్టేషన్ సిఐ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. నేనే ఈ ఇల్లును కొనుగోలు చేసుకుంటానని, ఇదివరలో రెండు మూడు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు మరమత్తులు చేసుకోవడం జరిగిందని, కనీసం నేను మనమత్తులు చేసిన డబ్బులు ఇవ్వాలని పోలీస్ స్టేషన్లో కూడా చెప్పడం జరిగిందని అయినా నాకు ఎవ్వరూ న్యాయం చేయడం లేదని విలపించారు.
నేను ఖర్చుపెట్టిన డబ్బులు ఇవ్వకుండానే, తన సొంత సామాగ్రిని మొత్తం ఇంటి బయట పాడేయడం జరిగిందని, జిల్లా అధికారులు తనకు న్యాయం చేయాలని బాలమణి ఆవేదనతో విన్నవించుకొంటున్నది.
గత ఆరు రోజులుగా నా సామాగ్రి మొత్తం ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకొ అంటూ బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దయచేసి నాకు అధికారులు న్యాయం చేయగలరని ఆమె వేడుకుంటున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్
హైదరాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు)సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి సంఘీభావం తెలిపి అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్... 450 పడకల ఆసుపత్రికి భూమి పూజ పాల్గొన్న ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్
జగిత్యాల జనవరి 20 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో 235 కోట్ల తో నిర్మించనున్న 450 పడకల ఆసుపత్రి కి భూమిపూజ చేసి,23.5 కోట్ల తో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ,3 కోట్ల తో నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ,1.5 కోట్ల తో టి ఆర్ నగర్ లో... 15, 28 వార్డుకు చెందిన పలువురు బిజెపిలో చేరిక
జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)పట్టణ 15వ వార్డ్ కి చెందిన న్యాయవాది అవుసం భాగ్యశ్రీ మరియు 28వ వార్డ్ కి చెందిన అడ్డగట్ల అక్షయ్ కుమార్-మాధురి మరియు 28వ,15వ వార్డ్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగిత్యాల పట్టణ... బిజెపి నూతన జాతీయ అధ్యక్షుని ఎన్నిక నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన నితిన్ నబీన్ ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా భారతీయ జనత పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు... తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీల ప్రాథమిక నివేదిక
హైదరాబాద్, జనవరి 20 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, అలాగే రాష్ట్ర వనరుల సమర్థ వినియోగంపై లోతైన అధ్యయనం కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 అధ్యయన కమిటీల సభ్యులతో బంజారాహిల్స్లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి... శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా ప్రారంభమైన శివ మహాపురాణం
జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో, భాగవత సప్తాహ ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర, బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ చే, శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఘనంగా ప్రారంభమైంది.
గుట్టపై రాజేశ్వరుని దర్శించి, ప్రత్యేక పూజలు... మౌని అమావాస్య ఘటనపై అభిముక్తానంద శంకరాచార్య నిరసన దీక్ష
ప్రయాగ్రాజ్ / ఉత్తరప్రదేశ్ జనవరి 20:
మౌని అమావాస్య (ఆదివారం, జనవరి 18), మాఘమేళ సందర్భంగా, తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా అభిముక్తానంద శంకరాచార్య ఈ రోజు నిరసన దీక్ష చేపట్టారు. పవిత్ర స్నానాలు, ధార్మిక కార్యక్రమాలకు సంబంధించిన సందర్భంలో పోలీసులు తనను అడ్డుకోవడం, అవమానకరంగా వ్యవహరించడం జరిగిందని ఆయన ఆరోపించారు.
జరిగిన... :కేనాల్ లో బోల్తాపడ్డ క్వాలిస్, 14 మందికి గాయాలు కొండగట్టుకు వెళ్తుండగా ఘటన
కొడిమ్యాల జనవరి 20(ప్రజా మంటలు)
హైదరాబాదు కు చెందిన ఓ కుటుంబం వేములవాడ లో దర్శనం చేసుకొని కొండగట్టు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
జేఎన్టీయూ సమీపంలో క్వాలిస్ బ్రేకులు ఫెయిల్ కావడంతో కినాల్ లో పడిపోయింది.
క్వాలిస్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులకు ఐదుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను జగిత్యాల ఏరియా... నిత్యశ్రీ–చైత్ర మృతుల విచారణ రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేయాలి: BSP
మహబూబాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు):
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామం ఇటుకల గడ్డ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ వల్ల మృతి చెందిన నాలుగేళ్ల చిన్నారులు చైత్ర, నిత్యశ్రీల మృతిపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రిపోర్ట్ను వెంటనే బహిర్గతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర... WEF–2026: స్విట్జర్లాండ్ చేరుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం లో CM రేవంత్ రెడ్డి
జ్యూరిచ్ / దావోస్ జనవరి 20:
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సు–2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సారధ్యంలోని ఈ ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు.... తమిళనాడు గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసన సభ నుంచి వెళ్లిపోయారు
చెన్నై, జనవరి 20:
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఈ రోజు శాసన సభలో ప్రసంగించకుండానే బయటకు వెళ్లిపోయారు. సాధారణంగా శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యే రోజున గవర్నర్ ప్రసంగం చేయాలి. కానీ ఈసారి అది జరగలేదు.
సభ ప్రారంభ సమయంలో జాతీయ గీతం పాడలేదని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కారణంతోనే... బొగ్గు కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే హరీష్ రావుపై కక్ష సాధింపు _ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 19 జనవరి (ప్రజా మంటలు) :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిన బొగ్గు కుంభకోణం బయటపడటంతోనే, దాని నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులు ఇచ్చి 'అటెన్షన్ డైవర్షన్' రాజకీయాలకు... 