మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్

On
మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్

మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్

ధర్మపురి ఫిబ్రవరి 02: 

ధర్మపురి మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశం ఇస్తేనే అనుమతి ఇస్తామని కళాశాల ప్రిన్సిపాల్, వెనిక్కి పంపివేశారు 

స్వయంగా ప్రిన్సిపాల్ తో ఫోన్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకుల ప్రిన్సిపాల్ తొ మాట్లాడినా ఆయన వీలుకాదని చెప్పారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ,ధర్మపురి పట్టణం కేంద్రంలో మైనార్టీ గురుకుల కళాశాలలో శుక్రవారం జరిగిన ఫుడ్‌ పాయిజన్‌ తొ  అస్వస్థత గురైన ఐదుగురు విద్యార్థిని లను కలిపి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కళాశాలకు వెల్లడంతొ, గేటుకు తాళం వేసి అడ్డుకొన్నడం అప్రజాస్వామికం అని అన్నారు 

కెసిఆర్ పాలనలో అన్ని వర్గాలకు ఉంచితంగా ఒక నాణ్యమైన విద్య ను అందించాలని ఉద్దేశ్యం తో ఆనాడు ఈ రెసిడెన్షియల్ వ్యవస్థ ను బలోపేతం చేయడం తో పాటు దాదాపు ఒక వెయ్యి పైచిలుకు గురుకుల పాఠశాలను స్థాపించిన సంగతి అందిరికీ తెలుసన్నారు..!

కానీ ఈ రోజు దురదృష్టకరం ఏమిటంటే రాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాలు, కళాశాలల్లో ఎస్సీ, ఎస్సీ, బిసి, మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్తమైన పరిస్థితి, నిర్వాహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పారు..!

గురుకుల పాఠశాలల్లో భోజనం బాగా లేదని, పాములు వస్తున్నాయి, ఎలుకలు కురుస్తున్నాయి, తినే ఆహారంలో బల్లులు పడి విద్యార్థులు ఆసుపత్రిలో పలు కావడం జరిగిందని అన్నారు 

రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయని, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం గురుకుల పాఠశాలలో పాము కాటు వేసి ఓ విద్యార్థి మరణించడం జరిగిందని, మళ్ళీ అదే గురుకుల పుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారన్నారు..!

ఇప్పటికే రాష్ట్రంలో 57 మంది గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు.
గతంలో చదువుకు దూరమైన వర్గాలు చదువుకు దూరంగా ఉండొద్దు అని, అన్ని వర్గాలకు సమానంగా విద్యను అందించాలని, కెసిఆర్ ఈ రెసిడెన్షియల్ స్కూల్ లను తీర్చిదిద్దడం జరిగిందని, కాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గురుకుల పాఠశాల వ్యవస్థను కనుమరుగు చేసి ఓ ప్రయత్నం జరుగుతోంది ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని గుర్తు చేశారు..?

కెసిఆర్ ఆనవాళ్లు అంటే గురుకుల పాఠశాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, కెసిఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, పండుగల సందర్భంగా పేద ప్రజలకు దుస్తుల పంపిణీ ఇవ్వన్నీ కెసిఆర్ ఆనవాళ్లే ఇవన్నీ కనుమరుగు చేయడం జరుగుతుంది, అందులో భాగంగానే ఉద్దేశ్యం పూర్వకంగానే గురుకుల పాఠశాలలో సౌకర్యాలు బాగాలేవని, పిల్లలు చనిపోతున్నారని, కాబట్టి పిల్లలను గురుకులకు పంపొద్దని ఒక అభిప్రాయాని తల్లిదండ్రులకు వచ్చే పరిస్థితికి కావాలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.!

గత సంవత్సరం తో పోల్చుకుంటే గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్ధుల అడ్మిషన్ శాతం తగ్గిందని, కెసిఆర్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ల కోసం పోటీ ఉండేది, రాష్ట్రంలో 40 వేల అడ్మిషన్ లు ఉంటే, 4 లక్షల అప్లికేషన్ లు వచ్చేవని గుర్తు చేశారు 

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో గురుకుల పాఠశాలలో చేరే వారి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది, దానికి కారణం ఈ ప్రభుత్వం తల్లిదండ్రులు వారి పిల్లలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు..!

ఈ రోజు గురుకుల పాఠశాల వ్యవస్థ ఒక అనాధ వ్యవస్థల తయారు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని,  ఇవన్నీ చూసి విద్యార్థులు వారి తల్లిదండ్రుల మనసులు చెదిరిపోయినవని ఆవేదన వ్యక్తం చేశారు 

రెండు రోజుల క్రితం ధర్మపురి మైనారిటీ గురుకుల కళాశాలలో భోజనం వికటించి 5 విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారన్నారు,
స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఆందోళన చేస్తే తప్ప చర్యలు తీసుకొని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు..!

ఈరోజు తాము కలుషితమైన ఆహారం తిని చికిత్స పొందిన విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోడానికి ధర్మపురి మైనారిటీ గురుకుల కళాశాల వస్తే లోనికి అనుమతించని పరిస్థితి, ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో గురుకుల నిర్వాహణ అని ఎద్దేవా చేశారు..!

నిరుపేద పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, రానున్న రోజుల్లో గురుకుల కళాశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్నారు‌.!

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు fon CHESI,మేము వచ్చింది ఇక్కడ ఆందోళన చేయడానికి కాదని, ఇక్కడ గురుకుల కళాశాలలో లోపాలను తెలుసుకొని, మళ్లీ మీ

దృష్టికి తీసుకు రావడానికేనని అన్నారు..!

ఇక్కడ జరుగుతున్న విషయాలను పిల్లలతో మాట్లాడనీయకుండా నిర్బంధించి, కలెక్టర్  అనుమతి లేకుండా ఎవరూ రావద్దని ఒక ఆంక్షలు పెట్టడం సరికాదని హెచ్చరించారు..!

ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే గురుకులాల్లోకి ఎవరినైనా అనుమతించి, విద్యార్థులతో మాట్లాడే అవకాశం ఇవ్వాలని, విద్యార్థులు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా వసతులు కల్పిస్తోంది అని చెప్పాలి..!

కాని గేట్ల కు తాళాలు వేసి, ఎవరిని రానివ్వం అని ప్రిన్సిపల్ బెదిరించి ఎవరిని అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు

Tags
Join WhatsApp

More News...

National  Local News  State News 

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన 

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన  ముంబై నవంబర్ 23: భారత్–సౌతాఫ్రికా మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును BCCI ప్రకటించింది. ఈ సిరీస్‌కు కేఎల్‌ రాహుల్ కెప్టెన్‌గా, రిషబ్‌ పంత్ వైస్‌ కెప్టెన్‌గా నియమితులయ్యారు. గాయంతో బాధపడుతున్న శుభ్‌మన్‌ గిల్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్ జట్టు ఇలా ఉంది : బ్యాట్స్‌మెన్: రోహిత్‌ శర్మ, యశస్వి...
Read More...

వనపర్తిలో మాతా–శిశు సంరక్షణ కేంద్రం సందర్శించిన కవిత

వనపర్తిలో మాతా–శిశు సంరక్షణ కేంద్రం సందర్శించిన కవిత వనపర్తి నవంబర్ 23 (ప్రజా మంటలు): వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా–శిశు సంరక్షణ కేంద్రం మరియు ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. జాగృతి "జనంబాట" కార్యక్రమంలో భాగంగా కొత్తకోట ప్రాంతంలో చేనేత కార్మికులతో కూడా ఆమె మాట్లాడి చీరలు, వస్త్రాల నేయడం గురించి వివరాలు తెలుసుకున్నారు. సందర్శన తర్వాత కవిత...
Read More...
Local News 

జగిత్యాలలో కొత్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి అభినందనలు

జగిత్యాలలో కొత్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి అభినందనలు జగిత్యాల (రూరల్) నవంబర్ 23 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన నందన్నను ఘనంగా సత్కరించే కార్యక్రమం ఇందిరా భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్...
Read More...
Local News  Spiritual  

జగిత్యాలలో సత్య సాయి బాబా శతవత్సర వేడుకలు

జగిత్యాలలో సత్య సాయి బాబా శతవత్సర వేడుకలు జగిత్యాల (రూరల్) నవంబర్ 23 (ప్రజా మంటలు):శ్రీ భగవాన్ సత్య సాయి బాబా వారి శతవత్సర వేడుకలు జగిత్యాల సత్యసాయి మందిరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  సత్య సాయి బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత, సత్య సాయి సేవా సమితి...
Read More...
Local News 

జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం

జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం జగిత్యాల (రూరల్ ) నవంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (DRDA) మరియు సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ,...
Read More...
Local News 

చిన్నారుల హక్కులపై అవగాహన కల్పించాలి

చిన్నారుల హక్కులపై అవగాహన కల్పించాలి రాంగోపాల్ పేట లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు) : అప్స స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, సర్వ్ నీడీ సహకారంతో రాంగోపాల్‌పేట డివిజన్‌లోని యూత్ హాస్టల్‌లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. అప్స సంస్థ పని చేస్తున్న 30 బస్తీలలోని   బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్...
Read More...
Local News 

తెలంగాణ ప్రజల హృదయంలో సర్దార్ పటేల్ కు శాశ్వత స్థానం

తెలంగాణ ప్రజల హృదయంలో సర్దార్ పటేల్ కు శాశ్వత స్థానం సికింద్రాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు) : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్బంగా సికింద్రాబాద్‌లో ఆదివారం సర్ధార్ 150 యూనిటీ మార్చ్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సీతాఫల్మండి శివాజీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ, చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్...
Read More...
Local News 

రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు వెల్లుల్ల విద్యార్థి ఎంపిక

రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు వెల్లుల్ల విద్యార్థి ఎంపిక మెట్టుపల్లి నవంబర్ 23(ప్రజ మంటలు దగ్గుల అశోక్)   మెట్టుపల్లి పట్టణ పరిధిలోని  వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థి ఖో ఖో పోటీలకు *నల్ల నవీన్*అండర్-17 బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఆదివారం నుండి మూడు రోజుల పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటిల్లో ఆడనున్నట్టు
Read More...
Local News  State News 

సర్కారు పెద్దలు...! ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి

సర్కారు పెద్దలు...! ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి సికింద్రాబాద్,  నవంబర్ 23 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్‌లోని  పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 289వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాహనంలో నగరంలోని ఫుట్‌పాత్‌లు, సంచారజాతుల ప్రాంతాలను సందర్శించి నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేశారు. ప్రభుత్వం స్పందించి ఫుట్పాత్ పై నివాసం ఉంటున్న వారికి ఉపాధి  ఇచ్చి శాశ్వత ఆవాసం కల్పించాలని...
Read More...
Local News  State News 

యశోద హైటెక్ సిటీలో AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్

యశోద హైటెక్ సిటీలో AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్ హైదరాబాద్, నవంబర్ 23 (ప్రజామంటలు): యశోద హాస్పిటల్స్–హైటెక్ సిటీలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు అత్యాధునిక AI ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్‌ను యశోద మేనేజింగ్ డైరెక్టర్ డా. జి.ఎస్.రావు ప్రారంభించారు. భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించబడటం వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని ఆయన తెలిపారు. సీనియర్ పల్మోనాలజిస్ట్ డా. నాగార్జున మాటూరు మాట్లాడుతూ......
Read More...
National  State News  International  

జాఫ్రీ ఎప్స్టిన్ ఫైళ్లలో మోదీ, మరో మంత్రి :: దేశాన్ని. కుదిపేస్తున్న వార్త

జాఫ్రీ ఎప్స్టిన్ ఫైళ్లలో మోదీ, మరో మంత్రి :: దేశాన్ని. కుదిపేస్తున్న వార్త "Modi on board" అనే మాట ఎం చెబుతుంది ? ఇప్పుడొచ్చిన తాజా ఎపిస్టిన్ ఫైళ్లు (“Epstein Files”)లో భారతీయ రాజకీయ, వ్యాపార వర్గాలకి చెందిన కొన్ని ప్రముఖులతో గది చోటు పొందిన ఫైళ్లు వెళ్లదీయబడ్డాయి. ఈ విషయంపై లోతైన పరిశోధన ఇది ఎవరిని దోషుల గానో, బాధ్యులుగానో చెప్పడానికి కాదు.రాజకీయ,వ్యాపార సంబంధాలు ఎలా...
Read More...
Local News 

ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటారు..? *కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజేశ్వరి విమర్శలు

 ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటారు..?  *కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజేశ్వరి విమర్శలు సికింద్రాబాద్‌, నవంబర్ 23 ( ప్రజా మంటలు):  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖంతో విజయోత్సవాలు జరుపుకుంటోంది, ఎలాంటి నెరవేర్చని హామీలతో ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోంది అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మల్లేశ్వరపు రాజేశ్వరి ప్రశ్నించారు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు మినహా ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు కాలేదని ఆమె విమర్శించారు....
Read More...