తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు
తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు
హైదరాబాద్ జనవరి 20:
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ‘తీన్మార్ సంక్రాంతి’గా మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికో లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి ప్రారంభించగా, గుప్తేశ్వరి వాసుపిల్లి, శ్రీమతి పద్మజ వరదా, సమత కాకర్ల, కస్తూరి ఛటర్జీ మరియు మాధురి చాతరాజు జ్యోతి ప్రజ్వలన చేయగా, శ్రీతన్ పూల మరియు ఆర్యన్ పూల గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.
ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీస్ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాన్సీ డ్రెస్, డ్రాయింగ్, ముగ్గులు మరియు వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను గుప్తేశ్వరి వాసుపిల్లి పర్యవేక్షించారు. 
కార్యక్రమంలో భాగంగా వందమందికి పైగా చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వచనాలను అందించారు. అలాగే TCA స్పాన్సర్ NCPL అధినేత రాంబాబు వాసుపిల్లిచే 2025 టోరెంటో తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలని మరియు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు. శ్రీనివాస్ మన్నెం ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవముతో’ అనే విధముగా తెలంగాణ కెనడా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.
తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీమతి శ్రీరంజని కందూరి గారు, రాహుల్ బాలనేని మరియు మాధురి చాతరాజు నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి ఈవెంట్ స్పాన్సర్గా వ్యవహరించిన NCPL అధినేత శ్రీ రాంబాబు వాసుపిల్లి గారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు.
ఈ ఉత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. వేడుకలో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. ఫ్యాన్సీ డ్రెస్ బహుమతి స్పాన్సర్గా వ్యవహరించిన విభూతి ఫాబ్ స్టూడియో వారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు TCA లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు శంతన్ నారెళ్ళపల్లి, కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి ప్రణీత్ పాలడుగు, కోశాధికారి రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీరంజని కందూరి, శ్రీ కోటేశ్వర్ చెటిపెల్లి, శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు రాహుల్ బాలనేని, పవన్ కుమార్ పెనుమచ్చ, రాము బుధారపు, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ హరి రావుల్, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, అతిక్ పాషా, కలీముద్దీన్ మొహమ్మద్, అఖిలేష్ బెజ్జంకి, శ్రీనివాస తిరునగరి, సంతోష్ గజవాడ, వేణుగోపాల్ రోకండ్ల, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురం మరియు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శంతన్ నారెళ్ళపల్లి కృతజ్ఞతా వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలను ఘనంగా ముగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత్–అమెరికా మధ్య అంతరిమ వాణిజ్య ఒప్పందం: కీలకాంశాలు
ఇదిగో మీ వెబ్సైట్ “ప్రజా మంటలు” కోసం, పూర్తి స్థాయి **తెలుగు సమగ్ర నివేదిక (Comprehensive Report)**తో పాటు SEO Meta Title, Description కూడా ఇస్తున్నాను. వార్తా శైలి, విశ్లేషణ, ఉపశీర్షికలతో సిద్ధంగా ఉంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):
భారత్–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలకు కొత్త దిశ చూపించేలా **అంతరిమ... అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవ వేడుకలు
జగిత్యాల ఫిబ్రవరి 6 (ప్రజా మంటలు)పట్టణంలోని శ్రీ శ్రీనివాసా0 జనేయ భవాని శంకర దేవాలయంలో 66వ ఆలయ వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ శ్రీనివాస పద్మావతి ల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.స్వామివారి నామస్మరణతో ఆలయం అంతా మారుమోగింది.
ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను... డాలర్పై రూపాయి పైచేయి: మూడేళ్లలోనే అతిపెద్ద లాభం, భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావం
న్యూఢిల్లీ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
డాలర్ ముందు రూపాయి తన బలాన్ని చాటింది. గత కొంతకాలంగా డాలర్ కారణంగా రూపాయి ఒత్తిడిని ఎదుర్కొన్నా, గత వారం ఒక్కసారిగా బలపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మూడేళ్లలోనే అత్యధిక లాభాన్ని నమోదు చేసింది. మొత్తం వారంలో రూపాయి 1.4 శాతం బలపడగా, ఇది జనవరి 2023 తర్వాత... షిల్లాంగ్ గని ప్రమాదంలో 25 కు చేరిన మృతుల సంఖ్య
షిల్లాంగ్ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
మెఘాలయ రాష్ట్రంలో నిన్న జరిగిన బొగ్గు గని పేలుడు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. మరో ఏడుగురు మృతదేహాలు వెలికితీయడంతో మరణాల సంఖ్య పెరిగినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఐ. నోంగ్రాంగ్ తెలిపారు. ఇప్పటివరకు 12... జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ లో "స్కూలొంపిక్స్-2026" పేరిట క్రీడా ఉత్సవాలు
జగిత్యాల ఫిబ్రవరి 6 (ప్రజా మంటలు)జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే వార్షిక క్రీడోత్సవాలు ఈ సంవత్సరం *“స్కూలోంపిక్స్ –2026 Annual Sports Meet”* పేరుతో ఘనంగా నిర్వహించబడనున్నాయి.
ఈ క్రీడోత్సవాలు 2026 ఫిబ్రవరి 6, 7 మరియు 8 తేదీలలో జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం గ్రౌండ్... విధి నిర్వహణలో మరణించిన ప్రమోద్, సౌమ్య కుటుంబాలకు ₹ కోటి చెక్కు అందజేసిన సీఎం
నిజామాబాద్ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి, అలాగే గతేడాది కత్తిపోటుతో మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయ చెక్కులు అందజేశారు.
‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్... అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
రాయికల్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
రాయికల్ మండలం ఆలూరు, రాజ్నగర్ గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు కాగా, ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమిపూజ నిర్వహించారు.
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తూ, గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య,... జగిత్యాలలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు
జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్లు నిర్వహించింది. టీఆర్ నగర్లో 10, 11వ వార్డుల అభ్యర్థులు ఎంఏ కాశీం, దేవేందర్ నాయక్కు, బీరయ్య గుడి సమీపంలో 18, 19, 20వ వార్డుల అభ్యర్థులు ఏనుగుల భూమయ్య, భారతి సంతోష్,... యావర్ రోడ్డు విస్తరణ, పట్టణ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
జగిత్యాల మోతే రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే తన లక్ష్యమన్నారు.
2021లో జగిత్యాల పట్టణంలో 12 జోన్ల పరిధిలో 121 సర్వే నంబర్లను మార్చి, యావర్ రోడ్డుపై ఉన్న ప్రాంతాలను రెసిడెన్షియల్,... ఆర్టీఐపై ఐదేళ్ల నిర్లక్ష్యం: సమాచార కమిషన్ ఆదేశాలతో కదిలిన జగిత్యాల జిల్లా యంత్రాంగం
గొల్లపల్లి (బుగ్గారం) ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో గత ఐదేళ్లుగా ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం ఇవ్వని విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చింది. 2022 మే 17న చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఐ దాఖలు చేసినప్పటికీ, ఇప్పటి వరకు సమాచారం అందించకపోవడంతో ఆయన... ఎపిస్టీన్తో లేఖల వ్యవహారం: హరిదీప్ సింగ్ పూరి వివరణపై సందేహాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
జెఫ్రీ ఎపిస్టీన్కు సంబంధించిన కేసు డాక్యుమెంట్లు, ఈమెయిల్ రికార్డులపై తాజాగా బయటకొచ్చిన ఫోటోలు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి గతంలో ఇచ్చిన వివరణలపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. అలాగే మాజీ ప్రధాన సమాచార కమీషనర్ యశ్వర్ధన్ సిన్హా పేరు కూడా బయటపడింది.
మొదటి ఫోటోలో కనిపిస్తున్న ఈమెయిల్ ప్రకారం,... టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర
తిరుమల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
టీటీడీ ఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న ముద్దాడ రవిచంద్ర తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో వీరభద్రం, సీవీఎస్ఓ మురళీకృష్ణ, సీపీఆర్ఓ రవి స్వాగతం పలికారు.
ఈరోజు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ముద్దాడ రవిచంద్ర అధికారికంగా టీటీడీ ఈఓగా... 