తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు
తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు
హైదరాబాద్ జనవరి 20:
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ‘తీన్మార్ సంక్రాంతి’గా మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికో లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి ప్రారంభించగా, గుప్తేశ్వరి వాసుపిల్లి, శ్రీమతి పద్మజ వరదా, సమత కాకర్ల, కస్తూరి ఛటర్జీ మరియు మాధురి చాతరాజు జ్యోతి ప్రజ్వలన చేయగా, శ్రీతన్ పూల మరియు ఆర్యన్ పూల గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.
ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీస్ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాన్సీ డ్రెస్, డ్రాయింగ్, ముగ్గులు మరియు వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను గుప్తేశ్వరి వాసుపిల్లి పర్యవేక్షించారు. 
కార్యక్రమంలో భాగంగా వందమందికి పైగా చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వచనాలను అందించారు. అలాగే TCA స్పాన్సర్ NCPL అధినేత రాంబాబు వాసుపిల్లిచే 2025 టోరెంటో తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలని మరియు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు. శ్రీనివాస్ మన్నెం ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవముతో’ అనే విధముగా తెలంగాణ కెనడా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.
తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీమతి శ్రీరంజని కందూరి గారు, రాహుల్ బాలనేని మరియు మాధురి చాతరాజు నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి ఈవెంట్ స్పాన్సర్గా వ్యవహరించిన NCPL అధినేత శ్రీ రాంబాబు వాసుపిల్లి గారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు.
ఈ ఉత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. వేడుకలో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. ఫ్యాన్సీ డ్రెస్ బహుమతి స్పాన్సర్గా వ్యవహరించిన విభూతి ఫాబ్ స్టూడియో వారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు TCA లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు శంతన్ నారెళ్ళపల్లి, కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి ప్రణీత్ పాలడుగు, కోశాధికారి రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీరంజని కందూరి, శ్రీ కోటేశ్వర్ చెటిపెల్లి, శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు రాహుల్ బాలనేని, పవన్ కుమార్ పెనుమచ్చ, రాము బుధారపు, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ హరి రావుల్, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, అతిక్ పాషా, కలీముద్దీన్ మొహమ్మద్, అఖిలేష్ బెజ్జంకి, శ్రీనివాస తిరునగరి, సంతోష్ గజవాడ, వేణుగోపాల్ రోకండ్ల, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురం మరియు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శంతన్ నారెళ్ళపల్లి కృతజ్ఞతా వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలను ఘనంగా ముగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సుప్రీం కోర్టు తీర్పు: గవర్నర్–ముఖ్యమంత్రి అధికారాలపై దేశవ్యాప్త చర్చ
చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి : MLA సంజయ్
హైదరాబాద్ నవంబర్ 21 (ప్రజా మంటలు):జగిత్యాల అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు త్వరలో వెల్లువడనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో కలిసి, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వినతిపత్రం సమర్పించారు.
చెరువుల మరమ్మత్తులకు నిధుల అభ్యర్థన
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపిన వివరాల... చిరు ఉద్యోగుల పెద్ద మనసు....ప్రతి నెల వేతనం నుంచి కొంత భాగం సేవ పనులకు..
సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) :
ఆర్ఎన్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ఉద్యోగులు కృష్ణజ్యోతి, కీర్తిల ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రి ఎంసీహెచ్ విభాగంలో చికిత్స పొందుతున్న బాలింతలు, గర్భిణీలకు శుక్రవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సేవలో భాగంగా ఉద్యోగులు తమ వేతనంలో కొంతభాగాన్ని ప్రతి... శిశు సంరక్షణపై మరింత అవగాహన పెంచుకోవాలి.. గాంధీలో న్యూ బోర్న్ బేబీ వారోత్సవాలు..
సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) :
నవ జాత శిశు సంరక్షణపై తల్లులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. గాంధీ మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆస్పత్రి (ఎంసీహెచ్) లో గైనకాలజీ, పిడియాట్రిక్ విభాగాల సంయుక్త నేతృత్వంలో న్యూబోర్న్ బేబీ వారోత్సవాలను పురష్కరించుకుని శుక్రవారం పలు అవేర్నెస్ కార్యక్రమాలు... దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ
ఇబ్రహీంపట్నం నవంబర్ 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్ష కొండ గ్రామంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శ్రీ పిస్క శ్రీనివాస్-లత దంపతులు ఎలక్ట్రానిక్ గుడి గంటను బహుకరించారు.
ఈ గంట ప్రతి గంట, ప్రతి గంటకు టైం చెప్పడంతో పాటు, ఒక భగవద్గీత శ్లోకం మరియు భక్తి గీతం... ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత
ధర్మపురి నవంబర్ 21(ప్రజా మంటలు)
కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత అన్నారు.
శుక్రవారం ధర్మపురి మండలం రాజారాం , దమ్మన్నపేట్ మరియు దుబ్బల గూడెం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) మాట్లాడుతూ... రాష్ట్రపతికి రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ని ఆహ్వానించారు.
రాష్ట్రపతి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవం – రెండవ... క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
మెట్టుపల్లి నవంబర్ 21(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్టుపల్లి పట్టణ పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా విద్యాధికారి రాము గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కౌన్సిలింగ్ తో వృద్ధుల కేసులు పరిష్కారం..
జగిత్యాల నవంబర్ 21 (ప్రజా మంటలు):
తల్లిదండ్రులను నిరాదరిస్తున్న కొడుకులు, కోడళ్ళకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రానికి జిల్లా లోని జగిత్యాల పట్టణం, బీర్పూర్, మల్యాల, పెగడపల్లి, గొల్ల పల్లి... దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్
దుబాయ్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
దుబాయ్ ఎయిర్ షోలో భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, బెంగళూరు హెచ్.ఏ.ఎల్ (HAL) సంస్థలో తయారైన ఈ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఆకస్మికంగా కుప్పకూలింది.
విమానం కూలిన వెంటనే అక్కడ భారీగా ... కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ
గొల్లపల్లి, నవంబర్ 21 (ప్రజా మంటలు):
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రాఘవపట్నంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గతంలో కట్టుకున్న ముడుపును ఈరోజు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన దేవాలయ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహాయం... ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్?
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణల ప్రకారం, గత ఎన్నికలలో... 