తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు
తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు
హైదరాబాద్ జనవరి 20:
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ‘తీన్మార్ సంక్రాంతి’గా మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికో లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి ప్రారంభించగా, గుప్తేశ్వరి వాసుపిల్లి, శ్రీమతి పద్మజ వరదా, సమత కాకర్ల, కస్తూరి ఛటర్జీ మరియు మాధురి చాతరాజు జ్యోతి ప్రజ్వలన చేయగా, శ్రీతన్ పూల మరియు ఆర్యన్ పూల గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.
ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీస్ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాన్సీ డ్రెస్, డ్రాయింగ్, ముగ్గులు మరియు వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను గుప్తేశ్వరి వాసుపిల్లి పర్యవేక్షించారు. 
కార్యక్రమంలో భాగంగా వందమందికి పైగా చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వచనాలను అందించారు. అలాగే TCA స్పాన్సర్ NCPL అధినేత రాంబాబు వాసుపిల్లిచే 2025 టోరెంటో తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలని మరియు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు. శ్రీనివాస్ మన్నెం ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవముతో’ అనే విధముగా తెలంగాణ కెనడా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.
తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీమతి శ్రీరంజని కందూరి గారు, రాహుల్ బాలనేని మరియు మాధురి చాతరాజు నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి ఈవెంట్ స్పాన్సర్గా వ్యవహరించిన NCPL అధినేత శ్రీ రాంబాబు వాసుపిల్లి గారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు.
ఈ ఉత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. వేడుకలో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. ఫ్యాన్సీ డ్రెస్ బహుమతి స్పాన్సర్గా వ్యవహరించిన విభూతి ఫాబ్ స్టూడియో వారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు TCA లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు శంతన్ నారెళ్ళపల్లి, కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి ప్రణీత్ పాలడుగు, కోశాధికారి రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీరంజని కందూరి, శ్రీ కోటేశ్వర్ చెటిపెల్లి, శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు రాహుల్ బాలనేని, పవన్ కుమార్ పెనుమచ్చ, రాము బుధారపు, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ హరి రావుల్, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, అతిక్ పాషా, కలీముద్దీన్ మొహమ్మద్, అఖిలేష్ బెజ్జంకి, శ్రీనివాస తిరునగరి, సంతోష్ గజవాడ, వేణుగోపాల్ రోకండ్ల, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురం మరియు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శంతన్ నారెళ్ళపల్లి కృతజ్ఞతా వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలను ఘనంగా ముగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు గాంధీలో ప్రారంభం
రూ.పది లక్షల ఆపరేషన్ గాంధీలో ఉచితం...
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. చెవి-ముక్కు-గొంతు విభాగం ఆధ్వర్యంలో జీరో నుంచి ఐదేళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ సేవలను అందిస్తున్నారు. ఈమేరకు గాంధీలో తొలిరోజు గురువారం... మల్లాపూర్లో విఏఓ పై కాంగ్రెస్ నాయకుల అరాచకం – సరిత నిరాహార దీక్ష
మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో విఏఓగా విధులు నిర్వర్తిస్తున్న బలహీన వర్గాల మహిళ ఎనుగంటి సరితను లక్ష్యంగా చేసుకుని గ్రామ కాంగ్రెస్ నాయకులు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార దుర్వినియోగంతో ఉద్యోగం నుంచి తొలగించి, ఆర్డర్ కాపీ ఇచ్చినప్పటికీ తిరిగి విధుల్లోకి అనుమతించకపోవడంతో సరిత తీవ్ర... ఆత్మ నిర్భర్ పథక లక్ష్యసాధనకు కృషి చేయాలి
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు)ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్బర్ పథకం అమలు పై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశము స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర పథకం అమలు, మరియు లక్ష్య సాధనకై... తెలంగాణ బీజేపిలో విభేధాలు లేవు: ఈటల రాజేందర్
కరీంనగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
తెలంగాణ బీజేపీలో ఎలాంటి అంతర్గత విభేధాలు లేవని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నది అసత్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పర్యటన అనంతరం కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
“ఏ పార్టీ లోనైనా విభేదాలు సహజమే. కానీ... దళిత యువకుడి కస్టోడియల్ డెత్పై కఠిన చర్యలు తీసుకోవాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
సుర్యాపేటలో కర్ల రాజేశ్ అనే దళిత యువకుడు కస్టడీలో జరిగిన అనుమానాస్పద మరణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోలీసుల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కవిత ఈ ఘటనపై స్పందిస్తూ,“దళిత బిడ్డను పోలీసులు నిర్దాక్ష్యణంగా... అరుదైన ఆపరేషన్ చేసి బాలుడికి పునర్జన్మ ఇచ్చిన గాంధీ వైద్యులు
కిలో కు పైగా బరువు ఉన్న ప్లీహం తొలగింపు
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా 7 ఏళ్ల బాలుడికి ల్యాపరోస్కోపిక్ విధానంలో ప్లీహము తొలగించే శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్,హెచ్ఓడీ డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. మంచిర్యాల జిల్లా అకినేపల్లి... గవర్నర్–రాష్ట్రపతి అధికారాలపై సుప్రీంకోర్టు తాజా తీర్పు: నిజంగా వారి అధికారాలు తగ్గాయా?
– సమగ్ర విశ్లేషణ
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము, రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతుల నిర్ణయాలకు గడువు విధించే ప్రశ్నలను సుప్రీంకోర్టుకు రిఫర్ చేయగా, ఈ విషయం రాజ్యాంగ పరంగా కీలక చర్చకు దారితీసింది. ఈ రిఫరెన్స్పై గురువారం రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.... బి ఆర్ ఎస్ కండువా కప్పుకోవాలి_ లేదా పార్టీకి రాజీనామా చేయాలి....
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు) జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బి ఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోవాలి లేదా పార్టీకి రాజీనామా చేయాలనిజగిత్యాల జిల్లా బి ఆర్ ఎస్పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులుకల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జగిత్యాల జిల్లా... రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కారం చూపాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు స్పందించి అధికారులు పరిష్కారం చూపాలన్నారు జిల్లా కలెక్టర్
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్, రాఘవపేట్ మరియు ఓబులాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం సందర్శించి సమగ్రంగా పరిశీలిచారు.... గ్రామాల అభివ్రుద్ది నా ధ్యేయం ....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ నవంబర్ 20 (ప్రజా మంటలు)గ్రామాలను అభివ్రుద్ది చేయడమే నా ధ్యేయం అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గురువారం నాడుజగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 18 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రాష్ట్రంలోనే అత్యధిక... శ్రీ చక్రపీఠం ఆధ్వర్యంలో ఘనంగా రుద్ర హోమం
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవనంలో, కార్తీక మాసం అమావాస్య పురస్కరించుకొని అద్వైత శ్రీ చక్రపీఠం భవాని నగర్ శ్రీ శ్రీ పాద లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో 27 కుండములు 108 మంది దంపతులు చే విష్ణు సహస్రనామ, మరియు... రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు :సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూ ఢిల్లీ నవంబర్ 20:
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతికి లేదా గవర్నర్లకు పంపించే బిల్లుల విషయంలో గడువు విధించే అధికారం న్యాయస్థానానికి లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము చేసిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్పై గురువారం వెలువరించిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గవర్నర్లు కారణం... 