తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు 

On
తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు 

తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు 

హైదరాబాద్ జనవరి 20:

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ‘తీన్మార్ సంక్రాంతి’గా మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికో లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి  శంకర్ భరద్వాజ పోపూరి  ప్రారంభించగా, గుప్తేశ్వరి వాసుపిల్లి, శ్రీమతి పద్మజ వరదా, సమత కాకర్ల, కస్తూరి ఛటర్జీ మరియు మాధురి చాతరాజు జ్యోతి ప్రజ్వలన చేయగా, శ్రీతన్ పూల మరియు ఆర్యన్ పూల గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.

ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీస్ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఫ్యాన్సీ డ్రెస్, డ్రాయింగ్, ముగ్గులు మరియు వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను  గుప్తేశ్వరి వాసుపిల్లి పర్యవేక్షించారు. imresizer-1737364287825

కార్యక్రమంలో భాగంగా వందమందికి పైగా చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వచనాలను అందించారు. అలాగే TCA స్పాన్సర్ NCPL అధినేత రాంబాబు వాసుపిల్లిచే 2025 టోరెంటో తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు. 

తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలని మరియు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి  దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు.    శ్రీనివాస్ మన్నెం ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా  ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవముతో’ అనే విధముగా తెలంగాణ కెనడా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.

తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీమతి శ్రీరంజని కందూరి గారు,  రాహుల్ బాలనేని మరియు మాధురి చాతరాజు నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి ఈవెంట్ స్పాన్సర్గా వ్యవహరించిన NCPL అధినేత శ్రీ రాంబాబు వాసుపిల్లి గారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు.

ఈ ఉత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. వేడుకలో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. ఫ్యాన్సీ డ్రెస్ బహుమతి స్పాన్సర్గా వ్యవహరించిన విభూతి ఫాబ్ స్టూడియో వారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం  శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు TCA లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.

 కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు  శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు  శంతన్ నారెళ్ళపల్లి, కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి,  సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి  ప్రణీత్ పాలడుగు, కోశాధికారి రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీరంజని కందూరి, శ్రీ కోటేశ్వర్ చెటిపెల్లి, శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు రాహుల్ బాలనేని, పవన్ కుమార్ పెనుమచ్చ, రాము బుధారపు, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్  హరి రావుల్, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, అతిక్ పాషా, కలీముద్దీన్ మొహమ్మద్, అఖిలేష్ బెజ్జంకి, శ్రీనివాస తిరునగరి, సంతోష్ గజవాడ, వేణుగోపాల్ రోకండ్ల, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురం మరియు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శంతన్ నారెళ్ళపల్లి కృతజ్ఞతా వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలను ఘనంగా ముగించారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

తలసాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీఎస్ లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

తలసాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీఎస్ లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు సికింద్రాబాద్,  జనవరి 13 ( ప్రజామంటలు ):  బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బన్సీలాల్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు.తలసాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్న కాంగ్రెస్ నేతలు, వాటిని...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కారాలు

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కారాలు జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు): తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో   వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన సీనియర్ సిటీజెన్లకు  సంక్రాంతి పురస్కారాలను , ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మంగళవారం జిల్లా సీనియర్ సిటీజేన్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే

   మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే హైదరాబాద్, జనవరి 13 (ప్రజా మంటలు): ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియం మంజూరైనప్పటికీ...
Read More...
National  Opinion  Spiritual  

సంక్రాంతి – ముగ్గులు ::సంప్రదాయం, శాస్త్రం, స్త్రీశక్తి

సంక్రాంతి – ముగ్గులు ::సంప్రదాయం, శాస్త్రం, స్త్రీశక్తి ముగ్గులు ఏ ప్రదేశాన్నైనా సౌందర్యవంతంగా మార్చడమే కాక, ఆ ఇంటిని లక్ష్మీ నివాసంగా మలిచే పవిత్ర చిహ్నాలు. రంగురంగుల డిజైన్లు మాత్రమే కాదు, ప్రతి ముగ్గు వెనుక దాగి ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మిక భావన, సామాజిక ఉద్దేశం చాలా లోతైనవి. రోజూ మనం చూసే ఒక సాధారణ ముగ్గుకే ప్రత్యేక అర్థం ఉంది. ఆ అర్థం,...
Read More...

సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన దావ వసంత

సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన దావ వసంత జగిత్యాల, జనవరి 13 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం సన్నిధిలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొని విజేతలకు జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తెలుగువారి ప్రత్యేక పండుగలలో ఒకటని తెలిపారు. సంక్రాంతి...
Read More...
Local News 

వైద్య విద్యార్థిని శ్రీనితకు సత్కారం

వైద్య విద్యార్థిని శ్రీనితకు సత్కారం జగిత్యాల, జనవరి 13 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ పాత్రికేయుడు అంజయ్య కుమార్తె బొడ్డుపల్లి శ్రీనిత సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రామగుండం వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి ఫ్రీ సీట్ సాధించిన సందర్భంగా ఆమెకు అభినందన సత్కారం నిర్వహించారు. కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం, జగిత్యాల అధినేత గుండేటి...
Read More...
Local News 

కట్కాపూర్‌లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు

కట్కాపూర్‌లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు రాయికల్, జనవరి 13 (ప్రజా మంటలు): కట్కాపూర్ గ్రామంలో సంక్రాంతి శుభ సందర్భంగా గ్రామ సర్పంచ్ పడాల పూర్ణిమ తిరుపతి గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగింది. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా మొత్తం 50 మంది ముగ్గులు వేశారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన ...
Read More...
National  State News 

ఇస్రో ప్రయోగం విఫలం – 16 ఉపగ్రహాలు సముద్రంలో పతనం

ఇస్రో ప్రయోగం విఫలం – 16 ఉపగ్రహాలు సముద్రంలో పతనం శ్రీహరికోట జనవరి 13, (ప్రజా మంటలు): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన తాజా ఉపగ్రహ ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా విఫలమైంది. ఈ ప్రయోగంలో అంతరిక్షంలోకి పంపాల్సిన 16 చిన్న ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించలేక సముద్రంలో పడిపోయినట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన...
Read More...
State News 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కిట్ నాణ్యతపై రాజీ వద్దు : సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కిట్ నాణ్యతపై రాజీ వద్దు : సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, జనవరి 13 (ప్రజా మంటలు): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్ విషయంలో నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు స్పష్టం చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి...
Read More...
State News 

రోడ్డు భద్రతకు ప్రాధాన్యత – సీఎం రేవంత్ రెడ్డి

రోడ్డు భద్రతకు ప్రాధాన్యత – సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు): రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సూచించారు. యూసుఫ్‌గూడలో జరిగిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, మైనర్లు వాహనాలు నడపడం, డ్రంకెన్ డ్రైవింగ్‌పై...
Read More...
State News 

మండలాలు–జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతస్థాయి కమిషన్ :ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

మండలాలు–జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతస్థాయి కమిషన్ :ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 👇       హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు): మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో సమగ్ర అధ్యయనం కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిషన్‌ను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ కమిషన్ ప్రజల అభిప్రాయాలను సేకరించి నివేదికను అసెంబ్లీ ముందు...
Read More...
State News 

గొప్ప కళాఖండాల కేంద్రంగా ఆర్ట్స్ ఎగ్జిబిషన్

గొప్ప కళాఖండాల కేంద్రంగా ఆర్ట్స్ ఎగ్జిబిషన్ హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఆర్ట్స్ ఎగ్జిబిషన్ గొప్ప కళాఖండాల కేంద్రంగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. కళాకారుల ప్రతిభ స్లాఘనీయమని ఆయన కొనియాడారు. సోమవారం ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని డా. చిన్నారెడ్డి ప్రారంభించారు....
Read More...