రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి - ఎమ్మెల్సీ కవిత 

On
రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి   - ఎమ్మెల్సీ కవిత 

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి

లబ్దీదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదు

- ఎమ్మెల్సీ కవిత 

నిజామాబాద్ జనవరి 19:

పథకాల అమలుపై నిజామాబాద్ జిల్లా కలక్టరేట్ లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై కీలక అంశాలను  ఎమ్మెల్సీ కవిత లేవనెత్తారు.నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం 1.2 లక్షల మంది మీ సేవ ద్వారా దరఖాస్తు చేశారు

కానీ కులగణన ఆధారంగా కేవలం 26 వేల మందికే రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణం.కేవలం 20 శాతం మందికే రేషన్ కార్డులు ఇస్తామనడం అన్యాయంఅని ఆమె అన్నారు.

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి. రేషన్ కార్డుల ఆదాయపు పరిమితిని గ్రామీణ ప్రాంతాలల్లో 2.5 లక్షలకు, పట్టణ ప్రాంతాలో 3.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలి. 

ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఆగిపోయిన ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాలి. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయాలి. 

4.43 లక్షలకుపై రైతు కూలీలు ఉంటే... ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కేవలం 41 వేల మందికే పథకం వర్తింస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కేవలం 10 శాతం భూమి లేని రైతు కూలీలకు ఇవ్వడం సరికాదు. కేవలం కంటితుడుపుగా పథకం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది

పేదల పట్ల సానుభూతితో ప్రభుత్వం ఆలోచించాలి.ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు విడుదల చేయాలని రైతు భరోసా పథకాన్ని శాస్త్రీయంగా అమలు చేయాలని,ఏ రైతుకు రైతు భరోసా నిధులను ఎగవేసే ప్రయత్నం చేయవద్దని,రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15 వేల ఇస్తామని... 12 వేలకు ప్రభుత్వం కుదించిందని ఆమె అన్నారు.

ఇచ్చిన హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 40 శాతమే అమలు చేసినట్లు లెక్క. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కౌలు రైతుల సంబంధించిన లెక్కలు తీశారా ?

కౌలు రైతులకు సాయం చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా ?అన్ని పథకాలకు లబ్దీదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలి

లబ్దీదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదు

గ్రామ సభల ద్వారా లబ్దీదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాబట్టి గ్రామ సభల సమావేశం సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలి

నిజామాబాద్ జిల్లాలో మైనారిటీల పథకాలను అమలు చేయడం లేదు.కాళేశ్వరం ప్యాకేజీ 21ఏ పనులను పూర్తి చేయాలి.

దాశరథి శతజయంతి ప్రభుత్వమే నిర్వహించాలి 

దాశరథి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి.దాశరథిని పెట్టిన నిజామాబాద్ పాత జైలులో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. పోలీస్ కమిషనర్ లేక నిజామాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.శాంతి భద్రతల విషయంలో రాజీపడడం సరికాదు.

అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పసుపు బోర్డు ప్రారంభోత్సవ  కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి

Tags
Join WhatsApp

More News...

Local News 

క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం: రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే ప్రశంస.!

క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం: రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే ప్రశంస.! జగిత్యాల ఆగస్ట్ 31(ప్రజా  మంటలు) ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, గుట్కా, తంబాకు వంటి ప్రాణాంతక అలవాట్లకు దూరంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ దాతల సహకారంతో సమకూర్చిన రూ.40,000 ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డా. సంజయ్ కుమార్...
Read More...
Crime  State News 

తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. భద్రత లేని విశ్రాంతి గదులపై తీవ్ర విమర్శలు

తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. భద్రత లేని విశ్రాంతి గదులపై తీవ్ర విమర్శలు హైదరాబాద్‌ ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): తుక్కుగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న 35 ఏళ్ల నర్సు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆస్పత్రి సమీపంలోని మెకానిక్‌ షాపులో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన సైనా ఉల్లా ఖాన్‌ను నిందితుడిగా...
Read More...
Local News 

ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి పనులు ఆగబోవని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి చేసిన విమర్శలకు స్పందించారు....
Read More...
Local News  Spiritual  

రోగుల సహాయకులకు పదేళ్లుగా ఉచిత అన్నప్రసాదం

రోగుల సహాయకులకు పదేళ్లుగా ఉచిత అన్నప్రసాదం జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు): జగిత్యాల సత్యసాయి సేవా సమితి, సత్యసాయి నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా పథకం 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోగుల సహాయకులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్న ఈ కార్యక్రమానికి జగిత్యాల...
Read More...
State News 

జగిత్యాల బీజేపీలో అసమ్మతి సెగలు

జగిత్యాల బీజేపీలో అసమ్మతి సెగలు (సిరిసిల్ల రాజేందర్ శర్మ) జగిత్యాల, ఆగస్టు 29:జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మూడు దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు తమకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోరుట్ల సమీపంలోని ఓ...
Read More...
Local News 

తెలుగు భాషా ఫోరం ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలు 

తెలుగు భాషా ఫోరం ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలు     జగిత్యాల ఆగస్ట్ 29(ప్రజా మంటలు)జిల్లా భాషోపాధ్యాయులు మరో బృహత్తర కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు ఆయుపట్టు పద్యం. తెలుగు భాషా సొగసుకు శిఖరాగ్రమైన ప్రక్రియ పద్య సాహిత్యం. పై అంశాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా డీఈవో కె.రాము అనుమతి తీసుకుని, తెలుగు భాషా ఫోరం లెటర్ ప్యాడ్...
Read More...
State News 

డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క

డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క కరీంనగర్, ఆగస్టు 28 (ప్రజా మంటలు): రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న తమ్ముడి వద్దకు వెళ్లిన అక్క రోడ్డుపైనే బస్సును ఆపించి రాఖీ కట్టింది.గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజు తిమ్మాపూర్ మండలం రేణికుంట...
Read More...
Spiritual   State News 

వైకుంఠ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్

వైకుంఠ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్ హైదరాబాద్, ఆగస్టు 28 (ప్రజా మంటలు): నాంపల్లిలోని రామ్ ప్రతాప్ పిట్టి భవన్‌లో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి బాలాజీ మందిరంలో ప్రముఖ వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఉత్సవాల్లో మాజీ సీనియర్ మంత్రి, మాజీ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గోడిసెల రాజేశం గౌడ్ పాల్గొన్నారు. ఆగస్టు 25 నుంచి 30వ...
Read More...
State News 

వేతన చెల్లింపులో జాప్యంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం

వేతన చెల్లింపులో జాప్యంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం ఫారమ్‌–16 జారీ, జాప్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సిఫార్సు హైదరాబాద్ ఆగస్ట్ 28 (ప్రజా మంటలు): ఉద్యోగికి సకాలంలో వేతనం చెల్లించకపోవడం, ఆదాయపు పన్నుకు సంబంధించిన పత్రాలు అందించడంలో జాప్యం చేయడం మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశమేనని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది....
Read More...
Local News 

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ జగిత్యాల ఆగస్టు 28(ప్రజా మంటలు)శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఆవరణలో గల తిరుమల తిరుపతి దేవస్థానం ధ్యాన మందిరంలో ఉపాకర్మ కార్యక్రమం నిర్వహించారు. దేవతర్పణము ఋషితర్పణము పితృతర్పణాల అనంతరం హోమము నిర్వహించారు. . నూతన యజ్ఞోపవీత ధారణ అనంతరం సభాపతి తిగుళ్ళ విశ్వనాథ శర్మ ఉపాకర్మ ప్రత్యేకత...
Read More...
Local News 

గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ వేడుకలు 

గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ వేడుకలు  జగిత్యాల ఆగస్టు 28 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల శ్రీ రామాలయంలో విద్యానగర్ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉపాకర్మ ఘనంగా నిర్వహించారు. హోమము తర్పణాలు నిర్వహించి నూతన యజ్ఞోపవీత ధారణ చేశారు. కార్యక్రమంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొలిచాల రవీందర్ వైదిక క్రతువు అన్యారంభట్ల నారాయణ...
Read More...
Local News 

సోదర సోదరి అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్

సోదర సోదరి అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్   జగిత్యాల ఆగస్టు 27 (ప్రజా మంటలు) రక్షాబంధన్ పండుగ శ్రావణమాసం పౌర్ణమిలో జరుపుకుంటాము. వైదికంగా జంధ్యాల పౌర్ణమిగా దీనినే రాఖీ పౌర్ణమి గా భావిస్తారు. రాఖీ పౌర్ణమి కి ప్రత్యేక విశిష్టత ఉంది. సోదరీలు తమ సోదరులకు రక్షాబంధనం చేసి తమ ఆత్మీయతను ఆవిష్కరిస్తారు. పౌర్ణమి శుక్రవారం ఉన్నప్పటికీ తక్కువ సమయం ఉండడం అదేవిధంగా...
Read More...