రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి - ఎమ్మెల్సీ కవిత
రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి
లబ్దీదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదు
- ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ జనవరి 19:
పథకాల అమలుపై నిజామాబాద్ జిల్లా కలక్టరేట్ లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై కీలక అంశాలను ఎమ్మెల్సీ కవిత లేవనెత్తారు.నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం 1.2 లక్షల మంది మీ సేవ ద్వారా దరఖాస్తు చేశారు
కానీ కులగణన ఆధారంగా కేవలం 26 వేల మందికే రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణం.కేవలం 20 శాతం మందికే రేషన్ కార్డులు ఇస్తామనడం అన్యాయంఅని ఆమె అన్నారు.
రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి. రేషన్ కార్డుల ఆదాయపు పరిమితిని గ్రామీణ ప్రాంతాలల్లో 2.5 లక్షలకు, పట్టణ ప్రాంతాలో 3.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలి.
ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఆగిపోయిన ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాలి. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయాలి.
4.43 లక్షలకుపై రైతు కూలీలు ఉంటే... ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కేవలం 41 వేల మందికే పథకం వర్తింస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కేవలం 10 శాతం భూమి లేని రైతు కూలీలకు ఇవ్వడం సరికాదు. కేవలం కంటితుడుపుగా పథకం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది
పేదల పట్ల సానుభూతితో ప్రభుత్వం ఆలోచించాలి.ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు విడుదల చేయాలని రైతు భరోసా పథకాన్ని శాస్త్రీయంగా అమలు చేయాలని,ఏ రైతుకు రైతు భరోసా నిధులను ఎగవేసే ప్రయత్నం చేయవద్దని,రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15 వేల ఇస్తామని... 12 వేలకు ప్రభుత్వం కుదించిందని ఆమె అన్నారు.
ఇచ్చిన హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 40 శాతమే అమలు చేసినట్లు లెక్క. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కౌలు రైతుల సంబంధించిన లెక్కలు తీశారా ?
కౌలు రైతులకు సాయం చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా ?అన్ని పథకాలకు లబ్దీదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలి
లబ్దీదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదు
గ్రామ సభల ద్వారా లబ్దీదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాబట్టి గ్రామ సభల సమావేశం సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలి
నిజామాబాద్ జిల్లాలో మైనారిటీల పథకాలను అమలు చేయడం లేదు.కాళేశ్వరం ప్యాకేజీ 21ఏ పనులను పూర్తి చేయాలి.
దాశరథి శతజయంతి ప్రభుత్వమే నిర్వహించాలి
దాశరథి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి.దాశరథిని పెట్టిన నిజామాబాద్ పాత జైలులో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. పోలీస్ కమిషనర్ లేక నిజామాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.శాంతి భద్రతల విషయంలో రాజీపడడం సరికాదు.
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
