రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి - ఎమ్మెల్సీ కవిత 

On
రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి   - ఎమ్మెల్సీ కవిత 

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి

లబ్దీదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదు

- ఎమ్మెల్సీ కవిత 

నిజామాబాద్ జనవరి 19:

పథకాల అమలుపై నిజామాబాద్ జిల్లా కలక్టరేట్ లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై కీలక అంశాలను  ఎమ్మెల్సీ కవిత లేవనెత్తారు.నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం 1.2 లక్షల మంది మీ సేవ ద్వారా దరఖాస్తు చేశారు

కానీ కులగణన ఆధారంగా కేవలం 26 వేల మందికే రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణం.కేవలం 20 శాతం మందికే రేషన్ కార్డులు ఇస్తామనడం అన్యాయంఅని ఆమె అన్నారు.

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి. రేషన్ కార్డుల ఆదాయపు పరిమితిని గ్రామీణ ప్రాంతాలల్లో 2.5 లక్షలకు, పట్టణ ప్రాంతాలో 3.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలి. 

ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఆగిపోయిన ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాలి. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయాలి. 

4.43 లక్షలకుపై రైతు కూలీలు ఉంటే... ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కేవలం 41 వేల మందికే పథకం వర్తింస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కేవలం 10 శాతం భూమి లేని రైతు కూలీలకు ఇవ్వడం సరికాదు. కేవలం కంటితుడుపుగా పథకం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది

పేదల పట్ల సానుభూతితో ప్రభుత్వం ఆలోచించాలి.ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు విడుదల చేయాలని రైతు భరోసా పథకాన్ని శాస్త్రీయంగా అమలు చేయాలని,ఏ రైతుకు రైతు భరోసా నిధులను ఎగవేసే ప్రయత్నం చేయవద్దని,రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15 వేల ఇస్తామని... 12 వేలకు ప్రభుత్వం కుదించిందని ఆమె అన్నారు.

ఇచ్చిన హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 40 శాతమే అమలు చేసినట్లు లెక్క. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కౌలు రైతుల సంబంధించిన లెక్కలు తీశారా ?

కౌలు రైతులకు సాయం చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా ?అన్ని పథకాలకు లబ్దీదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలి

లబ్దీదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదు

గ్రామ సభల ద్వారా లబ్దీదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాబట్టి గ్రామ సభల సమావేశం సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలి

నిజామాబాద్ జిల్లాలో మైనారిటీల పథకాలను అమలు చేయడం లేదు.కాళేశ్వరం ప్యాకేజీ 21ఏ పనులను పూర్తి చేయాలి.

దాశరథి శతజయంతి ప్రభుత్వమే నిర్వహించాలి 

దాశరథి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి.దాశరథిని పెట్టిన నిజామాబాద్ పాత జైలులో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. పోలీస్ కమిషనర్ లేక నిజామాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.శాంతి భద్రతల విషయంలో రాజీపడడం సరికాదు.

అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పసుపు బోర్డు ప్రారంభోత్సవ  కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి

Tags
Join WhatsApp

More News...

జగిత్యాల శ్రీ కోదండ రామాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ zp ఛైర్పర్సన్ దావా వసంత ప్రత్యేక పూజలు

జగిత్యాల శ్రీ కోదండ రామాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ zp ఛైర్పర్సన్ దావా వసంత ప్రత్యేక పూజలు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో స్వామి వారికి వెండి ఆభరణాల సమర్పణ జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావా వసంత సురేష్  ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా...
Read More...

సిక్కింకు ప్రత్యామ్నాయ హైవే ప్రణాళిక – ఎంఫీ ఇంద్రా హాంగ్ సుబ్బా, BRO చర్చలు

సిక్కింకు ప్రత్యామ్నాయ హైవే ప్రణాళిక – ఎంఫీ ఇంద్రా హాంగ్ సుబ్బా, BRO చర్చలు సిక్కింకు ప్రత్యామ్నాయ హైవే మార్గంపై చర్చ – ఎంఫీ ఇంద్రా హాంగ్ సుబ్బా, BRO డైరెక్టర్ జనరల్ సమావేశం ఉత్తర సిక్కింకు నిరంతర రవాణా, భద్రతా బలపాటుకు ప్రాధాన్యత గ్యాంగ్‌టాక్: నవంబర్ 05 : సిక్కింకు చెందిన లోక్‌సభ సభ్యుడు ఇంద్రా హాంగ్ సుబ్బా రాష్ట్రంలోని కీలక రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాధాన్యతలపై బోర్డర్...
Read More...
National  Opinion 

రేపిస్టులపై శిక్ష  సమాజం ఇంకా కఠినత కోరుతున్నదా?

రేపిస్టులపై శిక్ష  సమాజం ఇంకా కఠినత కోరుతున్నదా? రేపిస్టులకు ఏ శిక్ష సరైనది? జయలలిత ప్రతిపాదన నుంచి నేటి సమాజ ఆలోచనలు   చెన్నై / హైదరాబాద్ నవంబర్ 0 5: సమాజాన్ని కుదిపేసే అత్యాచార ఘటనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కోయంబత్తూరులో 20 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం మళ్లీ ఒక ప్రశ్నను ముందుకు తెచ్చింది — రేపిస్టులకు సరైన శిక్ష ఏది?...
Read More...
National  Crime  State News 

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు తెలంగాణవాసుల మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు తెలంగాణవాసుల మృతి హల్లిఖేడ్ సమీపంలో వ్యాను, కారు ఢీకొన్న ఘటన బెలగావి జిల్లా, కర్ణాటక నవంబర్ 05: కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లా హల్లిఖేడ్ సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృతి చెందారు. సమాచారం ప్రకారం, హైదరాబాద్‌ నుండి గోవా వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న వ్యాను ఢీకొట్టడంతో ప్రమాదం...
Read More...

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుయో మోటో కేసు

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుయో మోటో కేసు అధికారుల నిర్లక్ష్యం, రోడ్డు భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేసిన కమిషన్ హైదరాబాద్: నవంబర్ 05 (ప్రజా మంటలు): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషాద ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుయో మోటో కేసు (HRC...
Read More...

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం — సంస్కరణల కమిటీ ఏర్పాటుకు జీవో జారీ

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం — సంస్కరణల కమిటీ ఏర్పాటుకు జీవో జారీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ కోదండరాంలకు స్థానం హైదరాబాద్, నవంబర్ 04: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంలో సంస్కరణలు చేపట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంబంధంగా మంగళవారం ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో జాప్యాలు తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంస్కరణల...
Read More...

ఈశాన్య రాజకీయాల్లో కొత్త మార్పు సంకేతం — హిమంత బిశ్వ శర్మకు సవాల్‌ విసిరిన కొత్త మైత్రి కూటమి!

ఈశాన్య రాజకీయాల్లో కొత్త మార్పు సంకేతం — హిమంత బిశ్వ శర్మకు సవాల్‌ విసిరిన కొత్త మైత్రి కూటమి! కొత్త రాజకీయ కూటమి అవతరించిన ఈశాన్య భారతదేశంలో, NEDA భవిష్యత్తుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని కూటమికి ఇది పెద్ద సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. న్యూఢిల్లీ, నవంబర్‌ 04: ఈశాన్య భారత రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని **నార్త్...
Read More...

కోయంబత్తూర్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు — ముగ్గురు నిందితులు అరెస్ట్‌

కోయంబత్తూర్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు — ముగ్గురు నిందితులు అరెస్ట్‌ కోయంబత్తూర్‌, తమిళనాడు నవంబర్‌ 04:  కోయంబత్తూర్‌లో జరిగిన ఘోరమైన గ్యాంగ్‌ రేప్‌ హత్యాయత్నం కేసు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. 20 ఏళ్ల పీజీ విద్యార్థిని తన బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి కారులో వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు బలవంతంగా అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ సంఘటన విమానాశ్రయం సమీపంలోని బ్రిందావన్‌నగర్‌ వద్ద చోటుచేసుకుంది....
Read More...
National  Sports  International   State News 

ఏషియా కప్ వివాదం: సూర్యకుమార్ యాదవ్‌, హారిస్ రౌఫ్ లపై క్రమశిక్షణ

ఏషియా కప్ వివాదం: సూర్యకుమార్ యాదవ్‌, హారిస్ రౌఫ్ లపై క్రమశిక్షణ   సూర్యకుమార్ యాదవ్‌కు 30% మ్యాచ్ ఫీ జరిమానా – హారిస్ రౌఫ్‌కు రెండు మ్యాచ్‌ల నిషేధం దుబాయ్, నవంబర్ 4 (ప్రజా మంటలు): ఏషియా కప్ సందర్భంగా జరిగిన ఉద్రిక్త ఘటనలపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు పాకిస్తాన్ వేగవంతమైన బౌలర్ హారిస్ రౌఫ్ పై ఐసీసీ (ICC) క్రమశిక్షణా చర్యలు...
Read More...

దుబాయ్ సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు

దుబాయ్ సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరిన TPCC NRI సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా హైదరాబాద్, నవంబర్ 4 (ప్రజా మంటలు): దుబాయ్‌లో సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణకు చెందిన యువకుడు అనిల్ (s/o బాలయ్య, చిర్లవంచ గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా) కేసు విషయాన్ని, TPCC...
Read More...

“సామాజిక తెలంగాణ సాధనయే మా లక్ష్యం” :కవిత

“సామాజిక తెలంగాణ సాధనయే మా లక్ష్యం” :కవిత జాగృతి జనం బాట ఆదిలాబాద్‌లో కల్వకుంట్ల కవిత నిరుద్యోగుల సమస్యలపై మండిపాటు – జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి తలమడుగులో రైతు కుటుంబాన్ని పరామర్శించిన కవిత ఆదిలాబాద్ నవంబర్ 4 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్‌లో “జాగృతి జనం బాట” కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునే భాగంగా 33...
Read More...

జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు పెండింగ్ టాక్స్ వసూలు

జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు పెండింగ్ టాక్స్ వసూలు – పత్రాలు లేని వాహనాలకు హెచ్చరిక జగిత్యాల, నవంబర్ 4 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారులు వాహనాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలను మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (MVI) షేక్ రియాజ్ స్వయంగా పర్యవేక్షించారు. తనిఖీలలో భాగంగా పలు వాహనాల పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలించారు....
Read More...