రూ.450కోట్ల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ఐటీ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం
రూ.450కోట్ల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ఐటీ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం
సింగపూర్ జనవరి 19:
సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్లో రూ. 450కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మాణానికి ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్యాండ్ (Capita Land) ముందుకొచ్చింది.
సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచస్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన క్యాపిటల్యాండ్ హైదరాబాద్ నగరంలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్ను అభివృద్ధి చేయనుంది.
ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం క్యాపిటల్యాండ్ ప్రతినిధులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది.
ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, క్యాపిటల్యాండ్ తరఫున ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం గారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ తదితరులు పాల్గొన్నారు.
క్యాపిటల్యాండ్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. క్యాపిటల్యాండ్ గ్రూపు చేపట్టే ఈ కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ను అందుకునేలా అన్ని సౌకర్యాలను క్యాపిటల్యాండ్ నిర్మించే ఐటీ పార్కులో అందుబాటులో ఉంటాయి.
రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించటం ఆనందంగా ఉందని క్యాపిటల్యాండ్ సీఈఓ గౌరీ శంకర్ నాగభూషణం అభిప్రాయపడ్డారు.
క్యాపిటల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ (ITPH), అవాన్స్ హైదరాబాద్, సైబర్పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలోనే అందుబాటులోకి వస్తుంది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
నాలుగవ రోజుకు చేరుకున్న మహాభారతం ప్రవచనం
జగిత్యాల డిసెంబర్ 9 ( ప్రజా మంటలు)స్థానిక ధరూర్ శివారు కరీం నగర్ రోడ్డు లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో గత 4 రోజులుగా అత్యంత వైభవవో పేతంగా సాగిపోతున్న మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఉర్రూతలూగిస్తూ సాగిపోతుంది.
కళ్యాణమండపం భక్తులతో కిక్కిరిసిపోయి జనసంద్రం లాగ కనిపిస్తుందని సామాజిక కార్యకర్త తవుటు... గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ
గ్రామాల్లో మర్ఫింగ్ వీడియోల కలకలం
* ఏఐ మార్ఫింగ్తో ప్రత్యర్థులపై దుష్ప్రచారం
* గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ
* ఏఐ మార్ఫింగ్తో ఓటర్లలో అయోమయం
భీమదేవరపల్లి డిసెంబర్ 10 (ప్రజామంటలు) :
మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఏఐ సిత్రాలు, మర్ఫింగ్ వీడియోలు కలకలం రేపుతున్నాయి.... ట్రాఫిక్ నిబంధనల పై యమధర్మరాజు అవగాహన : ట్రాఫిక్ పోలీసులతో కలిసిరోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు) : రోడ్డు ప్రమాదాల పై అవగాహన కలిగించేందుకు నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతివేగం, రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా యమధర్మ రాజు వేషదారితో ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనదారులకు అవగాహన కలిగిస్తున్నారు.... చలనచిత్ర రంగ అభివృద్ధికి పూర్తి సహకారం — సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వము పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 రెండో... రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ
హైదరాబాద్ డిసెంబర్ 09 (ప్రజా మంటలు):
భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను విర్చువల్గా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో... గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఎమర్జెన్సీ వార్డు వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 45-50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. అయితే సదరు... పోష్ యాక్ట్–2013పై అవగాహన ర్యాలీ
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు) :
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు కఠినంగా అమలు అవుతున్న పోష్ యాక్ట్–2013 గురించి అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా కమిటీ, యాక్షన్ ఎయిడ్, భరోసా సంయుక్తంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించింది. న్యూ బోయిగూడ నుంచి గాంధీ ఆస్పత్రి ఎదురుగా... రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి.
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 9 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మోడల్ స్కూల్ నందు గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి సందర్శించినారు, మరియు అలాగే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి హనుమాన్ చెక్ పోస్ట్ ని కూడా "అవినీతిని నిర్మూలిద్దాం- దేశాన్ని అభివృద్ధి చేద్దాం’’ 1064 టోల్ ఫ్రీ నెంబర్ తో అవినీతికి అడ్డుకట్ట జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 9 (ప్రజా మంటలు)అవినీతి నిరోధక వారోత్సవాలు పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ అశోక్... ఆదం సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్..
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు):
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, ఇంచార్జీ అదం సంతోష్ కుమార్ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్, పండ్ల పంపిణీ,... బన్సీలాల్ పేట లో సోనియమ్మ 79వ జన్మదిన వేడుకలు
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు):
సికింద్రాబాద్, బన్సీలాల్పేట్ డివిజన్లోని జబ్బర్ కాంప్లెక్స్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దీపక్ జాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఐత చిరంజీవి ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు.... ఎన్నికల కోడ్ నియమాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి :ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 09 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడంతో నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఎస్ఐ,కృష్ణ సాగర్ రెడ్డి మళవారం మండలంలోని రాఘవపట్నం ,గుంజపడుగు, వెలుగుమట్ల ,చందోలి, దమ్మన్నపేట శ్రీరాములపల్లి గ్రామాలలో పర్యటించి ప్రజలకు ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అలాగే ఎన్నికల సమయంలో వాట్స్అప్... 