రూ.450కోట్ల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ఐటీ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం
రూ.450కోట్ల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ఐటీ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం
సింగపూర్ జనవరి 19:
సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్లో రూ. 450కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మాణానికి ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్యాండ్ (Capita Land) ముందుకొచ్చింది.
సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచస్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన క్యాపిటల్యాండ్ హైదరాబాద్ నగరంలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్ను అభివృద్ధి చేయనుంది.
ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం క్యాపిటల్యాండ్ ప్రతినిధులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది.
ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, క్యాపిటల్యాండ్ తరఫున ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం గారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ తదితరులు పాల్గొన్నారు.
క్యాపిటల్యాండ్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. క్యాపిటల్యాండ్ గ్రూపు చేపట్టే ఈ కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ను అందుకునేలా అన్ని సౌకర్యాలను క్యాపిటల్యాండ్ నిర్మించే ఐటీ పార్కులో అందుబాటులో ఉంటాయి.
రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించటం ఆనందంగా ఉందని క్యాపిటల్యాండ్ సీఈఓ గౌరీ శంకర్ నాగభూషణం అభిప్రాయపడ్డారు.
క్యాపిటల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ (ITPH), అవాన్స్ హైదరాబాద్, సైబర్పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలోనే అందుబాటులోకి వస్తుంది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
జగిత్యాల డిసెంబర్ 8(ప్రజా మంటలు)
గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 6 గురు అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు IGNITE -2025 రాష్ట్రస్థాయి పోటీలలో అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ వర్షకొండ పూర్వ విద్యార్థి
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 7(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో అక్షర భారతి కాన్వెంట్ స్కూల్లో ఐదవ తరగతి వరకు చదివి, ఆరవ తరగతి కొరకు ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్లో విద్య అభ్యాసిస్తూన్న, విద్యార్థి *పాండ్రవీశం మిట్టూర్తి*, IGNITE -2025 రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రాష్ట్రస్థాయి మోడల్... మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి – 2026 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని ఆనంద్ బాగ్, మల్కాజిగిరి లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపకులు నెమ్మాని విష్ణుమూర్తి శర్మ, అధ్యక్షులు మహాదేవభట్ల లక్ష్మణప్రసాద్ శర్మ, ఉపాధ్యక్షులు దామెర సత్యనారాయణ శర్మ, గణపురం రాంప్రసాద్ శర్మ, ప్రధాన కార్యదర్శి యలమంచి... ఓటరు తస్మాత్ జాగ్రత్త..! మల్లారంలో జాగృతి నాటిక
గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన –
* ప్రశాంత ఎన్నికల పిలుపు కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి: వసంత సురేష్ తీవ్ర విమర్శలు
రాయికల్, డిసెంబర్ 7 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లిన నిర్ణయం బీసీ వర్గాలపై తీవ్ర అన్యాయం చేసిందని, ఆ నిరాశతోనే బీసీ బిడ్డ ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మండిపడ్డారు. రాయికల్... పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సమావేశం. -టీ పి సీ ఏ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 7:పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సోమవారం హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సమావేశం తెలంగాణ పెన్షన ర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ తెలిపారు.ఆదివారం జిల్లా టి. పి. సీ. ఏ. కార్యాలయంలో అయన విలేకరుల తో మాట్లాడుతూ హైదరాబాద్ లోని
ఈ... అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్ద్ర నక్షత్రం సందర్భంగా హరిహరాలయంలో ఫల ,పంచామృత అభిషేకాలు
జగిత్యాల డిసెంబర్ 7 (ప్రజా మంటలు)అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పరమశివునికి పంచామృతాలు ,వివిధ ఫల రసాలతో సూర్యోదయానికి పూర్వమే అభిషేకాలు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు తమ స్వహస్తాలతో సాంబశివుని కి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.... అగ్ని ప్రమాద బాధితులకు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యుల చేయూత
మల్యాల డిసెంబరు 7 ( ప్రజా మంటలు)స్థానిక కొండగట్టు లో ఒక దారుణ అగ్నిప్రమాదంలో దాదాపు 20 చిరువ్యాపారులు చేసుకొనే షాపులు పూర్తిగా కాలిపోయి , కుటుంబాలు అన్ని రోడ్డు మీదకి వచ్చాయి.
ఇతర స్థానిక కుటుంబీకులు సామ శ్రీనాథ్ గారి కుటుంబ సభ్యులు మరియు మహేష్ గారు మన సత్యసాయి సంస్థ ని... ఓటర్లకు భరోసా కల్పిస్తూ ఇబ్రహీంపట్నం లో పోలీసుల ఫ్లాగ్మార్చ్
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 07 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా హామీ ఇవ్వడం కోసం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మెట్టుపల్లి... మహాభారత జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న మహాభారత జ్ఞాన యజ్ఞము రెండవ రోజు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అట్టహాసంగా శనివారం ప్రారంభమైన మహాభారత నవహాన్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం ఆదివారం రెండవ రోజుకు చేరింది.
విశ్వ కళ్యాణర్థం... సిటీలో క్రిస్మస్ ముందస్తు సెలబ్రేషన్స్. : కేక్ మిక్సింగ్..ఫన్ గేమ్స్..శాంతాక్లాజ్ సందడి
సికింద్రాబాద్, డిసెంబర్ 07 (ప్రజామంటలు):
క్రిస్మస్ ముందస్తు సెలబ్రేషన్స్ సిటీలో ఘనంగా మొదలయ్యాయి. బేగంపేట లోని మ్యారీగోల్డ్ హోటల్ లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈసందర్బంగా నీలిమా వేముల నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో మహిళలు మెరిశారు.
ముఖ్య అతిథిగా బేబక్క, స్పీకర్ గా రజిత హాజరయ్యారు. సుధా నాయుడు, లావణ్య, ప్రణతి... మోంబాసా సాటర్ డే క్లబ్ ఫండ్ రైజింగ్లో MOMTA సభ్యుల ప్రదర్శన
సికింద్రాబాద్, డిసెంబర్ 07 ( ప్రజామంటలు) :
కెన్యా లోని మోంబాసా తెలుగు అసోసియేషన్ ( MOMTA) ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కొరకు "సాటర్ డే క్లబ్" నిర్వహించిన అసోసియేషన్ సభ్యుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. బోర్ వెల్లుల ఏర్పాటు, విద్యార్థుల విద్యా సహాయం, భారీ నీటి నిల్వ ట్యాంకుల విరాళం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు... 