సకల వేదాంత సారం భాగవతం - ప్రముఖ పండితులు శంకర శర్మ

On
సకల వేదాంత సారం భాగవతం - ప్రముఖ పండితులు శంకర శర్మ

సకల వేదాంత సారం భాగవతం
- ప్రముఖ పండితులు శంకర శర్మ

 రామ కిష్టయ్య సంగన భట్ల
      9440595494

"సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే, తద్రసామృత తృప్తస్య నాస్యత్ర స్యాద్రతి క్వచిత్", శ్రీమత్ మహాభాగవతం..."సకల వేదాంత సారం. భాగవత రసామృ తాన్ని పానం చేసిన వారికి మరే ఇత రములు రుచించవు. భాగవతం పురాణాలలో ముఖ్య స్థానాన్ని సంతరించుకుందని ఉద్ఘాటించారు ధర్మపురి క్షేత్రస్థ ప్రాచ్య డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, భగవత్ సేవా పరాయణులు పెండ్యాల శంకర శర్మ. 

ప్రాచీన ఆర్ష విజ్ఞా నానికి, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మయై, వేద వేదాంగ శాస్త్రాగమ, సకల కళలకు, 
సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమై, పుణ్యభూమిగా వెలుగొందుతున్న భారతావనికి చరిత్రకు అందనంత పూర్వమైన, ఉజ్వల సాంస్కృతిక, వైదిక, తాత్త్విక, పౌరా ణిక, ఐతిహాసిక, చారిత్రక వారసత్వం కలిగిన ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శేషప్ప కళా వేదిక పై అంతర్జాతీయ ఇస్కాన్ సంస్థ
(అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం)
 ఆధ్వర్యంలో మంగళ వారం 
 నిర్వహించిన భాగవత వ్యాఖ్యాన యుక్త 18 గ్రంథాల సెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పండితులు పెండ్యాల శంకర శర్మ ప్రధాన ప్రాసంగికునిగా భాగవతాన్ని గురించి వివరిస్తూ...
భగవంతుని, భగవద్భక్తుల కథలు గాను, భక్తి యోగాన్ని చాటి చెపుతున్న ప్రాచీన గాధ. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముక్తిలతో కూడుకున్నదే భాగవతం అని వివరించారు.
 భాగవతంలో వివిధ భాగాలను స్కంధాలు అంటారని వివిధ స్కంధాలలో విష్ణువు అవతారాలు, కార్యాలు, భక్తుల గాధలు, తత్వ బోధనలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మిక సంబంధ సంవాదాలు, భగవంతుని లీలలు, సవివర వర్ణనలతో ఉన్నాయని వివరించారు. ఇలాంటి భాగవత గొప్పతనాన్ని హిందూ బంధువులకు తెలియచేసి, అధ్యయనం, పారాయణ కోసం వ్యాఖ్యానం తో కూడి ప్రచురించి వితరణ చేస్తున్న ఇస్కాన్ సంస్థ సేవలను అభినందించారు. 
ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కవి, పండితులు, వ్యాఖ్యాత పెండ్యాల మహేందర్ శర్మ తన సుదీర్ఘ ప్రసంగంలో అపర శుక మహర్షి గుండి రాజన్న శాస్త్రి గురించి వివరించారు. భాగవతాన్ని పూర్వం పరీక్షిత్తుకు శ్రీశుక యోగీశ్వరుడు వివరించిన నేపథ్యం ఆధారంగా గుండి రాజన్న శాస్త్రి నిత్యం ప్రవచించడం, సాంప్రదాయాచరణాసక్తులైన భక్తులు క్రమం తప్పకుండా శ్రవణం గావించడంనేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ప్రవీణ్ ప్రభు, ఇషావతార దాస్, మాధవ గోపీనాథ్ దాస్, కె వి సుబ్బారావు, రంగతీర్త దాస్ పాల్గొని తమ సంస్థ స్థాపన నిర్వహణా ఉద్దేశాలను వివరించారు. గచ్చిబౌలి భక్తి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 
..పెండ్యాల శంకర శర్మ, మహేందర్, బొజ్జా రమేశ్, రాజేశ్, నర్సయ్య పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు. 50మంది పండితులను సంస్థ పక్షాన సన్మానించి, భాగవతం గ్రంథాలను అందజేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

నీట్–ఎస్ఎస్ ప్రవేశాలపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

నీట్–ఎస్ఎస్ ప్రవేశాలపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు   చెన్నై, ఫిబ్రవరి 19: నీట్–ఎస్ఎస్ 2024–25 ప్రవేశాల విషయంలో కీలక తీర్పు వెలువడింది. కౌన్సెలింగ్‌కు నిర్ణయించిన గడువు ముగిసిన తర్వాత ఖాళీ సీట్లు ఉన్నాయనే కారణంతో అదనపు మాప్-అప్ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వడం సరికాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం...
Read More...
National  State News 

రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన: తెలంగాణ అభివృద్ధి రోడ్‌మ్యాప్‌పై జాతీయ నేతలతో చర్చ

రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన: తెలంగాణ అభివృద్ధి రోడ్‌మ్యాప్‌పై జాతీయ నేతలతో చర్చ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు): తెలంగాణ అభివృద్ధి దిశను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులు హాజరయ్యారు. ప్రతినిధి బృందం మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీలను కలిసి తెలంగాణ...
Read More...
Local News  State News 

బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు నిజామాబాద్ ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):: బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా పార్టీని లోపల నుంచే పీడిస్తున్న వారు ఇకనైనా పార్టీని విడిచిపెట్టాలని అన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఎదిగిందని పేర్కొన్న అర్వింద్, దక్షిణ తెలంగాణలో పార్టీని మరింత...
Read More...
Local News 

నూతన కౌన్సిలర్లను సత్కరించిన మెట్‌పల్లి పట్టణ బీఆర్ఎస్ యూత్ నాయకులు

నూతన కౌన్సిలర్లను సత్కరించిన మెట్‌పల్లి పట్టణ బీఆర్ఎస్ యూత్ నాయకులు    మెట్‌పల్లి, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించిన నూతన కౌన్సిలర్లను మెట్‌పల్లి పట్టణ బీఆర్ఎస్ యూత్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మార్గదర్శకత్వంలో, కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్...
Read More...
Local News 

మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ లకు బీసీ సంఘం వారిచే ఘనంగా సన్మానం 

మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ లకు బీసీ సంఘం వారిచే ఘనంగా సన్మానం     జగిత్యాల ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు) జగిత్యాల  మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన సమిండ్ల వాణి శ్రీనివాస్ లను బీసీ సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోగురువారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర కార్యదర్శి ముసి పట్ల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ, బిసిల సమస్యలపై దృష్టిసారించి చేతి వృత్తుల వారికి ఉపాధి...
Read More...
Local News  State News 

హనుమకొండ దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ పునరుద్ధరించాలి: TGHRC ఆదేశాలు

హనుమకొండ దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ పునరుద్ధరించాలి: TGHRC ఆదేశాలు హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు): హనుమకొండ చెరబండ రాజు నగర్‌లోని దళిత కుటుంబాలకు తక్షణమే తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఆదేశించింది. SR నంబర్లు 593, 663 / 2026 కింద నమోదైన ఫిర్యాదులపై కమిషన్ చైర్‌పర్సన్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో మధ్యంతర...
Read More...
Local News 

బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్‌జెట్‌కు బంగ్లాదేశ్ గగనతల వినియోగంపై నిషేధం

బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్‌జెట్‌కు బంగ్లాదేశ్ గగనతల వినియోగంపై నిషేధం న్యూఢిల్లీ / కోల్‌కతా ఫిబ్రవరి 19: భద్రతా రుసుములు, ఎయిర్‌స్పేస్ వినియోగానికి సంబంధించిన బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్‌జెట్ విమానాలు బంగ్లాదేశ్ గగనతలాన్ని వినియోగించకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో కోల్‌కతా నుంచి ఈశాన్య భారత రాష్ట్రాలకు వెళ్లే కొన్ని విమానాలు పొడవైన మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ప్రధానంగా కోల్‌కతా–గువాహటి, కోల్‌కతా–ఇంఫాల్ వంటి రూట్లలో...
Read More...
Local News 

ఇందాపూర్ డెయిరీ చంద్రబాబుదే – టీటీడీ నెయ్యి స్కాంపై ఆధారాలతో జగన్ సంచలన ఆరోపణలు

ఇందాపూర్ డెయిరీ చంద్రబాబుదే – టీటీడీ నెయ్యి స్కాంపై ఆధారాలతో జగన్ సంచలన ఆరోపణలు అమరావతి ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు): తిరుపతి లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యి వెనుక పెద్ద స్కాం దాగి ఉందని, ఇందాపూర్ డెయిరీ పూర్తిగా చంద్రబాబుకు చెందినదేనని వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలను ప్రజల ముందుంచుతూ, నిజాలు బయటకు వచ్చాక ప్రజలే ఆలోచించాలని వ్యాఖ్యానించారు. హెరిటేజ్...
Read More...
Local News 

జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ నూతన చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్

జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ నూతన చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్    జగిత్యాల ఫిబ్రవరి 19 ( ప్రజా మంటలు)జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ని,అదనపు కలెక్టర్ బి ఎస్ లత,అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ రాజ గౌడ్ ని వారి ఛాంబర్ లో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి...
Read More...
National  State News 

విజయకాంత్.డీఎండీకే పార్టీ డీఎంకే కూటమిలో తొలిసారి చేరిక

 విజయకాంత్.డీఎండీకే పార్టీ  డీఎంకే కూటమిలో తొలిసారి చేరిక చెన్నై, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు): తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ డీఎంకే కూటమిలో చేరని డీఎండీకే, తొలిసారిగా డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎండీకే, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా పోటీ చేయనుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు...
Read More...
National  International   State News 

ఏఐ ని ప్రజాస్వామ్యీకరించాలి – గ్లోబల్ సౌత్‌కు సాధికారత సాధనంగా మారాలి

ఏఐ ని ప్రజాస్వామ్యీకరించాలి – గ్లోబల్ సౌత్‌కు సాధికారత సాధనంగా మారాలి న్యూఢిల్లీ ఫిబ్రవరి 19: కృత్రిమ మేధ (ఏఐ)ని ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరం ఉందని, అది ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ దేశాలకు సమావేశం, సాధికారతకు మాధ్యమంగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏఐ ఇంపాక్ట్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన ప్రధాని, ఏఐ అభివృద్ధి కొద్ది దేశాలు, కొద్ది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికతను...
Read More...
State News 

బడ్జెట్ సమావేశాల్లో హామీల అమలు చేయాలి – ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

బడ్జెట్ సమావేశాల్లో హామీల అమలు చేయాలి – ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు): ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఎన్నికల హామీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని, ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు...
Read More...