సకల వేదాంత సారం భాగవతం - ప్రముఖ పండితులు శంకర శర్మ
సకల వేదాంత సారం భాగవతం
- ప్రముఖ పండితులు శంకర శర్మ
రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494
"సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే, తద్రసామృత తృప్తస్య నాస్యత్ర స్యాద్రతి క్వచిత్", శ్రీమత్ మహాభాగవతం..."సకల వేదాంత సారం. భాగవత రసామృ తాన్ని పానం చేసిన వారికి మరే ఇత రములు రుచించవు. భాగవతం పురాణాలలో ముఖ్య స్థానాన్ని సంతరించుకుందని ఉద్ఘాటించారు ధర్మపురి క్షేత్రస్థ ప్రాచ్య డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, భగవత్ సేవా పరాయణులు పెండ్యాల శంకర శర్మ.
ప్రాచీన ఆర్ష విజ్ఞా నానికి, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మయై, వేద వేదాంగ శాస్త్రాగమ, సకల కళలకు,
సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమై, పుణ్యభూమిగా వెలుగొందుతున్న భారతావనికి చరిత్రకు అందనంత పూర్వమైన, ఉజ్వల సాంస్కృతిక, వైదిక, తాత్త్విక, పౌరా ణిక, ఐతిహాసిక, చారిత్రక వారసత్వం కలిగిన ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శేషప్ప కళా వేదిక పై అంతర్జాతీయ ఇస్కాన్ సంస్థ
(అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం)
ఆధ్వర్యంలో మంగళ వారం
నిర్వహించిన భాగవత వ్యాఖ్యాన యుక్త 18 గ్రంథాల సెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పండితులు పెండ్యాల శంకర శర్మ ప్రధాన ప్రాసంగికునిగా భాగవతాన్ని గురించి వివరిస్తూ...
భగవంతుని, భగవద్భక్తుల కథలు గాను, భక్తి యోగాన్ని చాటి చెపుతున్న ప్రాచీన గాధ. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముక్తిలతో కూడుకున్నదే భాగవతం అని వివరించారు.
భాగవతంలో వివిధ భాగాలను స్కంధాలు అంటారని వివిధ స్కంధాలలో విష్ణువు అవతారాలు, కార్యాలు, భక్తుల గాధలు, తత్వ బోధనలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మిక సంబంధ సంవాదాలు, భగవంతుని లీలలు, సవివర వర్ణనలతో ఉన్నాయని వివరించారు. ఇలాంటి భాగవత గొప్పతనాన్ని హిందూ బంధువులకు తెలియచేసి, అధ్యయనం, పారాయణ కోసం వ్యాఖ్యానం తో కూడి ప్రచురించి వితరణ చేస్తున్న ఇస్కాన్ సంస్థ సేవలను అభినందించారు.
ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కవి, పండితులు, వ్యాఖ్యాత పెండ్యాల మహేందర్ శర్మ తన సుదీర్ఘ ప్రసంగంలో అపర శుక మహర్షి గుండి రాజన్న శాస్త్రి గురించి వివరించారు. భాగవతాన్ని పూర్వం పరీక్షిత్తుకు శ్రీశుక యోగీశ్వరుడు వివరించిన నేపథ్యం ఆధారంగా గుండి రాజన్న శాస్త్రి నిత్యం ప్రవచించడం, సాంప్రదాయాచరణాసక్తులైన భక్తులు క్రమం తప్పకుండా శ్రవణం గావించడంనేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ప్రవీణ్ ప్రభు, ఇషావతార దాస్, మాధవ గోపీనాథ్ దాస్, కె వి సుబ్బారావు, రంగతీర్త దాస్ పాల్గొని తమ సంస్థ స్థాపన నిర్వహణా ఉద్దేశాలను వివరించారు. గచ్చిబౌలి భక్తి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో
..పెండ్యాల శంకర శర్మ, మహేందర్, బొజ్జా రమేశ్, రాజేశ్, నర్సయ్య పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు. 50మంది పండితులను సంస్థ పక్షాన సన్మానించి, భాగవతం గ్రంథాలను అందజేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా... మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్ రమేష్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
టీఎన్జీవో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్ పల్లాటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్పాత్లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ... ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000... బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు
ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది.
ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల... భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్కు తరలింపు
గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో... ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం
జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర... మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు) పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు.
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు భారత సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య, సామాజిక సంస్కరణల మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన ఆలోచనలు చాలా ముందుచూపుతో కూడినవిఅన్నారు.
ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు) ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం.. జీవన్ రెడ్డి పై మంత్రి మరో మారు ఫైర్..
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ... కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు
కరీంనగర్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై, నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాతవాహన... దేశంలోనే ప్రథమ స్థానం సాధించిన కోనేరుపల్లె గ్రామం
చొప్పదండి, ఏప్రిల్ 10 (ప్రజా మంటలు):
చొప్పదండి మండలంలోని కోనేరుపల్లె గ్రామం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజు “క్రీడా మిత్ర పంచాయతీ” ప్రణాళికలో భాగంగా యువతను క్రీడల వైపు మళ్లించే దిశగా చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది.క్వాలిటీ... జగిత్యాల సభకు భారీ ఏర్పాట్లు… కేసీఆర్ హాజరు ఖాయం
జగిత్యాల, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
ఈ నెల 20న నిర్వహించనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బహిరంగ సభకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డు పక్కనున్న స్థలాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తదితర నాయకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని,... 