సకల వేదాంత సారం భాగవతం - ప్రముఖ పండితులు శంకర శర్మ

On
సకల వేదాంత సారం భాగవతం - ప్రముఖ పండితులు శంకర శర్మ

సకల వేదాంత సారం భాగవతం
- ప్రముఖ పండితులు శంకర శర్మ

 రామ కిష్టయ్య సంగన భట్ల
      9440595494

"సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే, తద్రసామృత తృప్తస్య నాస్యత్ర స్యాద్రతి క్వచిత్", శ్రీమత్ మహాభాగవతం..."సకల వేదాంత సారం. భాగవత రసామృ తాన్ని పానం చేసిన వారికి మరే ఇత రములు రుచించవు. భాగవతం పురాణాలలో ముఖ్య స్థానాన్ని సంతరించుకుందని ఉద్ఘాటించారు ధర్మపురి క్షేత్రస్థ ప్రాచ్య డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, భగవత్ సేవా పరాయణులు పెండ్యాల శంకర శర్మ. 

ప్రాచీన ఆర్ష విజ్ఞా నానికి, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మయై, వేద వేదాంగ శాస్త్రాగమ, సకల కళలకు, 
సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమై, పుణ్యభూమిగా వెలుగొందుతున్న భారతావనికి చరిత్రకు అందనంత పూర్వమైన, ఉజ్వల సాంస్కృతిక, వైదిక, తాత్త్విక, పౌరా ణిక, ఐతిహాసిక, చారిత్రక వారసత్వం కలిగిన ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శేషప్ప కళా వేదిక పై అంతర్జాతీయ ఇస్కాన్ సంస్థ
(అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం)
 ఆధ్వర్యంలో మంగళ వారం 
 నిర్వహించిన భాగవత వ్యాఖ్యాన యుక్త 18 గ్రంథాల సెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పండితులు పెండ్యాల శంకర శర్మ ప్రధాన ప్రాసంగికునిగా భాగవతాన్ని గురించి వివరిస్తూ...
భగవంతుని, భగవద్భక్తుల కథలు గాను, భక్తి యోగాన్ని చాటి చెపుతున్న ప్రాచీన గాధ. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముక్తిలతో కూడుకున్నదే భాగవతం అని వివరించారు.
 భాగవతంలో వివిధ భాగాలను స్కంధాలు అంటారని వివిధ స్కంధాలలో విష్ణువు అవతారాలు, కార్యాలు, భక్తుల గాధలు, తత్వ బోధనలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మిక సంబంధ సంవాదాలు, భగవంతుని లీలలు, సవివర వర్ణనలతో ఉన్నాయని వివరించారు. ఇలాంటి భాగవత గొప్పతనాన్ని హిందూ బంధువులకు తెలియచేసి, అధ్యయనం, పారాయణ కోసం వ్యాఖ్యానం తో కూడి ప్రచురించి వితరణ చేస్తున్న ఇస్కాన్ సంస్థ సేవలను అభినందించారు. 
ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కవి, పండితులు, వ్యాఖ్యాత పెండ్యాల మహేందర్ శర్మ తన సుదీర్ఘ ప్రసంగంలో అపర శుక మహర్షి గుండి రాజన్న శాస్త్రి గురించి వివరించారు. భాగవతాన్ని పూర్వం పరీక్షిత్తుకు శ్రీశుక యోగీశ్వరుడు వివరించిన నేపథ్యం ఆధారంగా గుండి రాజన్న శాస్త్రి నిత్యం ప్రవచించడం, సాంప్రదాయాచరణాసక్తులైన భక్తులు క్రమం తప్పకుండా శ్రవణం గావించడంనేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ప్రవీణ్ ప్రభు, ఇషావతార దాస్, మాధవ గోపీనాథ్ దాస్, కె వి సుబ్బారావు, రంగతీర్త దాస్ పాల్గొని తమ సంస్థ స్థాపన నిర్వహణా ఉద్దేశాలను వివరించారు. గచ్చిబౌలి భక్తి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 
..పెండ్యాల శంకర శర్మ, మహేందర్, బొజ్జా రమేశ్, రాజేశ్, నర్సయ్య పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు. 50మంది పండితులను సంస్థ పక్షాన సన్మానించి, భాగవతం గ్రంథాలను అందజేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

యుద్ధానికి ముగింపు కోసం పుతిన్‌తో భేటీ: ట్రంప్ ప్రకటన

యుద్ధానికి ముగింపు కోసం పుతిన్‌తో భేటీ: ట్రంప్ ప్రకటన డావోస్ | జనవరి 22 : ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు తీసుకురావడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను త్వరలోనే కలవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. స్విట్జర్లాండ్‌లోని డావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొన్న ట్రంప్, మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్...
Read More...
National  State News 

బీఎంసీ మేయర్ ఎంపికపై బీజేపీలో అసంతృప్తి తేజస్వి గోసాల్కర్‌కు పదవి… మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమా?

బీఎంసీ మేయర్ ఎంపికపై బీజేపీలో అసంతృప్తి తేజస్వి గోసాల్కర్‌కు పదవి… మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమా? ముంబై జనవరి 22: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కొత్త మేయర్‌గా బీజేపీ నేత తేజస్వి గోసాల్కర్ ఎన్నిక కావడంతో ముంబై రాజకీయాల్లోనే కాదు, బీజేపీ అంతర్గత వర్గాల్లోనూ చర్చలు, అసంతృప్తి మొదలైంది. ఈ ఎన్నిక బీజేపీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు పార్టీ లోపల నుంచే వినిపిస్తున్నాయి. తేజస్వి గోసాల్కర్ ఇటీవల జరిగిన...
Read More...
National  State News 

మీర-భాయందర్‌కు తొలి బెంగాలీ మేయర్? జయ దత్త పేరుతో బీజేపీ ఆలోచన… ఎంఎన్‌ఎస్ తీవ్ర వ్యతిరేకత

మీర-భాయందర్‌కు తొలి బెంగాలీ మేయర్? జయ దత్త పేరుతో బీజేపీ ఆలోచన… ఎంఎన్‌ఎస్ తీవ్ర వ్యతిరేకత ముంబై జనవరి 22:ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో మరోసారి ‘మరాఠీ వర్సెస్ బయటి వారు’ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఈ వివాదానికి కేంద్రంగా మారింది ముంబై సమీపంలోని మీరా-భాయందర్. మేయర్ పదవికి సంబంధించి బీజేపీ తీసుకునే అవకాశమున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మీరా-భాయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (MBMC) తాజా ఎన్నికల్లో...
Read More...

3వ రోజు కొనసాగుతున్న శివ మహాపురాణం

3వ రోజు కొనసాగుతున్న శివ మహాపురాణం జగిత్యాల జనవరి 22 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో, భాగవత సప్తాహ ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర, బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ చే, శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం గురు వారం 3 వ రోజుకు చేరింది. బ్రహ్మశ్రీ భాస్కర...
Read More...

84 లక్షల ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం పున ప్రారంభించిన, ---- ఎస్టి ఎస్సి సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్.

84 లక్షల ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం పున ప్రారంభించిన, ---- ఎస్టి ఎస్సి సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్. వెల్గటూర్ జనవరి 22 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామంలో గతంలో ట్రాన్స్ఫార్మాల  కాపర్ దొంగిలించబడి లిఫ్ట్ నడవక రైతులు నానా ఇబ్బందులకు గురయ్యారు. రైతులు మంత్రి దృష్టికి తీసుకుపోగా ఇబ్బందులను తొలగించడానికి ఇరిగేషన్ మంత్రి ఉత్త కుమార్ రెడ్డి కి ప్రత్యేకంగా విన్నవించి మంజూరు ఇప్పించారు. ఏసంగి పంటకు నీరు...
Read More...

రాయికల్ మున్సిపల్ ను అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్ దే జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత

రాయికల్ మున్సిపల్ ను అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్ దే జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత    రాయికల్ జనవరి 22 ( ప్రజా మంటలు)  పట్టణం లో.బి ఆర్ ఎస్  నాయకులతో కలిసి మీడియా సమావేశం లో పాల్గొన్న జిల్లా తొలి జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా  మాట్లాడుతూ....* గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ ను మున్సిపల్ గా మార్చి 25 కోట్లతో ప్రతి వార్డులో...
Read More...
National  State News 

విజయ్ టీవీకే పార్టీకి ‘విజిల్’ ఎన్నికల గుర్తు కేటాయింపు

విజయ్ టీవీకే పార్టీకి ‘విజిల్’ ఎన్నికల గుర్తు కేటాయింపు చెన్నై జనవరి 22 (ప్రజా మంటలు): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రాజకీయ రంగంలో కీలక అడుగు వేసింది. పార్టీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి ‘విజిల్’ (Whistle) ఎన్నికల...
Read More...

ఇజ్రాయిల్ దాడిలో 3 గురు జర్నలిస్టుల మృతి

ఇజ్రాయిల్ దాడిలో 3 గురు జర్నలిస్టుల మృతి       గాజా, జనవరి 22: ఇజ్రాయెల్–హమాస్ మధ్య అక్టోబర్‌లో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులు కొనసాగిస్తోంది. తాజా ఘటనలో గాజా నగరానికి దక్షిణంగా ప్రయాణిస్తున్న కారుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపి ముగ్గురు జర్నలిస్టులను హతమార్చినట్లు రక్షణ సిబ్బంది మరియు స్థానిక పాత్రికేయులు వెల్లడించారు. సమాచారం సేకరణ కోసం...
Read More...
Crime  State News 

ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం ముగ్గురు మృతి.

ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం ముగ్గురు మృతి. నంద్యాల, జనవరి 23 (ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఏఆర్ బీసీవీఆర్ (AR BCVR) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సుకు భారీగా మంటలు వ్యాపించడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు....
Read More...
Sports  International  

న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

 న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం నాగ్‌పూర్, జనవరి 21:భారత్–న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు...
Read More...
Local News  State News 

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యం :

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యం : కరీంనగర్ జనవరి 21 (ప్రజా మంటలు): పార్లమెంట్ పరిధిలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్ ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. అదేవిధంగా కరీంనగర్...
Read More...
International  

గ్రీన్‌ల్యాండ్‌పై సైనిక చర్య లేదు : డావోస్ WEFలో ట్రంప్ వ్యాఖ్యలు:

గ్రీన్‌ల్యాండ్‌పై సైనిక చర్య లేదు : డావోస్ WEFలో ట్రంప్ వ్యాఖ్యలు: దావోస్ (స్విట్జర్లాండ్) జనవరి 21; డావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను డెన్మార్క్ నుంచి సైనిక బలంతో స్వాధీనం చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. గ్రీన్‌ల్యాండ్ అమెరికా జాతీయ భద్రతకు కీలకమని పేర్కొన్న ట్రంప్, దాని రక్షణ, అభివృద్ధి కోసం అమెరికా యాజమాన్యం అవసరమని...
Read More...