సకల వేదాంత సారం భాగవతం - ప్రముఖ పండితులు శంకర శర్మ

On
సకల వేదాంత సారం భాగవతం - ప్రముఖ పండితులు శంకర శర్మ

సకల వేదాంత సారం భాగవతం
- ప్రముఖ పండితులు శంకర శర్మ

 రామ కిష్టయ్య సంగన భట్ల
      9440595494

"సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే, తద్రసామృత తృప్తస్య నాస్యత్ర స్యాద్రతి క్వచిత్", శ్రీమత్ మహాభాగవతం..."సకల వేదాంత సారం. భాగవత రసామృ తాన్ని పానం చేసిన వారికి మరే ఇత రములు రుచించవు. భాగవతం పురాణాలలో ముఖ్య స్థానాన్ని సంతరించుకుందని ఉద్ఘాటించారు ధర్మపురి క్షేత్రస్థ ప్రాచ్య డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, భగవత్ సేవా పరాయణులు పెండ్యాల శంకర శర్మ. 

ప్రాచీన ఆర్ష విజ్ఞా నానికి, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మయై, వేద వేదాంగ శాస్త్రాగమ, సకల కళలకు, 
సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమై, పుణ్యభూమిగా వెలుగొందుతున్న భారతావనికి చరిత్రకు అందనంత పూర్వమైన, ఉజ్వల సాంస్కృతిక, వైదిక, తాత్త్విక, పౌరా ణిక, ఐతిహాసిక, చారిత్రక వారసత్వం కలిగిన ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శేషప్ప కళా వేదిక పై అంతర్జాతీయ ఇస్కాన్ సంస్థ
(అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం)
 ఆధ్వర్యంలో మంగళ వారం 
 నిర్వహించిన భాగవత వ్యాఖ్యాన యుక్త 18 గ్రంథాల సెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పండితులు పెండ్యాల శంకర శర్మ ప్రధాన ప్రాసంగికునిగా భాగవతాన్ని గురించి వివరిస్తూ...
భగవంతుని, భగవద్భక్తుల కథలు గాను, భక్తి యోగాన్ని చాటి చెపుతున్న ప్రాచీన గాధ. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముక్తిలతో కూడుకున్నదే భాగవతం అని వివరించారు.
 భాగవతంలో వివిధ భాగాలను స్కంధాలు అంటారని వివిధ స్కంధాలలో విష్ణువు అవతారాలు, కార్యాలు, భక్తుల గాధలు, తత్వ బోధనలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మిక సంబంధ సంవాదాలు, భగవంతుని లీలలు, సవివర వర్ణనలతో ఉన్నాయని వివరించారు. ఇలాంటి భాగవత గొప్పతనాన్ని హిందూ బంధువులకు తెలియచేసి, అధ్యయనం, పారాయణ కోసం వ్యాఖ్యానం తో కూడి ప్రచురించి వితరణ చేస్తున్న ఇస్కాన్ సంస్థ సేవలను అభినందించారు. 
ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కవి, పండితులు, వ్యాఖ్యాత పెండ్యాల మహేందర్ శర్మ తన సుదీర్ఘ ప్రసంగంలో అపర శుక మహర్షి గుండి రాజన్న శాస్త్రి గురించి వివరించారు. భాగవతాన్ని పూర్వం పరీక్షిత్తుకు శ్రీశుక యోగీశ్వరుడు వివరించిన నేపథ్యం ఆధారంగా గుండి రాజన్న శాస్త్రి నిత్యం ప్రవచించడం, సాంప్రదాయాచరణాసక్తులైన భక్తులు క్రమం తప్పకుండా శ్రవణం గావించడంనేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ప్రవీణ్ ప్రభు, ఇషావతార దాస్, మాధవ గోపీనాథ్ దాస్, కె వి సుబ్బారావు, రంగతీర్త దాస్ పాల్గొని తమ సంస్థ స్థాపన నిర్వహణా ఉద్దేశాలను వివరించారు. గచ్చిబౌలి భక్తి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 
..పెండ్యాల శంకర శర్మ, మహేందర్, బొజ్జా రమేశ్, రాజేశ్, నర్సయ్య పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు. 50మంది పండితులను సంస్థ పక్షాన సన్మానించి, భాగవతం గ్రంథాలను అందజేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటా – ఎమ్మెల్యే సంజయ్ కుమార్

పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటా – ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు): జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల విషయంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కౌన్సిలర్‌లుగా గెలిచిన సమీండ్ల వాణి, అడువాల జ్యోతి పేర్లను చైర్‌పర్సన్ అభ్యర్థులుగా ప్రతిపాదించినట్లు తెలిపారు. వీరికి కాంగ్రెస్ పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 30...
Read More...
Local News  Crime 

జగిత్యాల పట్టణంలో దారుణ హత్య: బోరే విశ్వనాథ్ మృతి

జగిత్యాల పట్టణంలో దారుణ హత్య: బోరే విశ్వనాథ్ మృతి జగిత్యాల, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో దారుణ హత్య జరిగింది. జగిత్యాల మండలం పోరండ్ల గ్రామానికి చెందిన బోరే విశ్వనాథ్ (30) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు...
Read More...
State News 

రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి

రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి పాలేరు రిజర్వాయర్‌లో ఘోర ప్రమాదం: ఖమ్మం, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి నేరుగా రిజర్వాయర్‌లోకి దూసుకువెళ్లడంతో, వెనుక సీట్లో ప్రయాణిస్తున్న ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు బొగ్గుల శ్రీనివాస్ (49) నీట...
Read More...

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు): బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 287వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని సేవాలాల్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కవిత...
Read More...

ఢిల్లీలో ఓసిల మహా ధర్నాను విజయవంతం చేయాలి ధర్నా పోస్టరును ఆవిష్కరించిన ఓసి నేతలు

ఢిల్లీలో ఓసిల మహా ధర్నాను విజయవంతం చేయాలి  ధర్నా పోస్టరును ఆవిష్కరించిన ఓసి నేతలు    జగిత్యాల ఫిబ్రవరి 14 ( ప్రజా మంటలు)   ఓసి ల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23 న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద  జాతీయ స్థాయి ఓసి ల మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జగిత్యాల జిల్లా కన్వీనర్ మహంకాళి రాజన్నలు   ఈసందర్భంగా...
Read More...

శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు

శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు సారంగాపూర్ ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు) పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక...
Read More...

భక్తులను ఆకర్షిస్తున్న కలియుగ దైవం సైకత శిల్పం

భక్తులను ఆకర్షిస్తున్న కలియుగ దైవం సైకత శిల్పం   జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గత పది రోజుల క్రితం ప్రతిష్టించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి సైకత శిల్పం, రోజురోజుకు ప్రజలు దర్శించుకోవడం పెరిగిపోయింది. శివ కేశవులు ఒకే చోట ఉండాలనుకున్నారేమో శివరాత్రికి శివుని సైకత లింగం కూడా వెంకటేశ్వర స్వామి ముందు...
Read More...

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ వేడుకలు

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ వేడుకలు జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం అరవింద నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో, శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయార్చకులు రోహిత్ శర్మ, ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశు శర్మ, భరత్ శర్మ, కార్యక్రమ క్రతువు  నిర్వహించారు. అనంతరం మహా అన్న ప్రసాదం భక్తులందరికీ అందించారు....
Read More...

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా రుద్ర హవనం 

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా రుద్ర హవనం  జగిత్యాల ఫిబ్రవరి 14 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రోడ్డులో గల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమడేలే శ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీ గణపతి పూజ, పుణ్యాహవాచనము, నవగ్రహ ఆరాధన, స్థాపితదేవత ఆరాధన నిర్వహించారు. అంతకముందు ఉదయము మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీ రుద్ర...
Read More...
Local News 

లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలపై అవగాహన కార్యక్రమం

లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలపై అవగాహన కార్యక్రమం జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని శ్రీ చైతన్య, శ్రీనిధి విద్యా సంస్థలలో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కల్పించే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రస్థాయి లీడ్ ఇండియా శిక్షణ సమన్వయకర్త తాడూరి శ్రీనివాస్ ఆచార్య మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలకు ఎలా...
Read More...
National 

పోలింగ్ బూత్‌లో మైనర్ ఓటింగ్ ఘటన

పోలింగ్ బూత్‌లో మైనర్ ఓటింగ్ ఘటన ముంబయి, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు): మహారాష్ట్రలో జరిగిన జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లో మైనర్ బాలుడు ప్రవేశించిన ఘటనపై మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు బాధ్యులైన ఒక పోలింగ్ అధికారి, ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది....
Read More...
Filmi News 

మీనా ప్రధాన పాత్రలో ‘రోస్లిన్’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల

మీనా ప్రధాన పాత్రలో ‘రోస్లిన్’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చెన్నై ఫిబ్రవరి 13: థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన కొత్త వెబ్ సిరీస్ రోస్లిన్ ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు జితు జోసెఫ్ షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. సిరీస్‌కు సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహించగా, కథను వినాయక్ శశికుమార్ రచించారు. మాథ్యూ జార్జ్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్‌లో ప్రముఖ నటి మీనా ప్రధాన...
Read More...