సకల వేదాంత సారం భాగవతం - ప్రముఖ పండితులు శంకర శర్మ

On
సకల వేదాంత సారం భాగవతం - ప్రముఖ పండితులు శంకర శర్మ

సకల వేదాంత సారం భాగవతం
- ప్రముఖ పండితులు శంకర శర్మ

 రామ కిష్టయ్య సంగన భట్ల
      9440595494

"సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే, తద్రసామృత తృప్తస్య నాస్యత్ర స్యాద్రతి క్వచిత్", శ్రీమత్ మహాభాగవతం..."సకల వేదాంత సారం. భాగవత రసామృ తాన్ని పానం చేసిన వారికి మరే ఇత రములు రుచించవు. భాగవతం పురాణాలలో ముఖ్య స్థానాన్ని సంతరించుకుందని ఉద్ఘాటించారు ధర్మపురి క్షేత్రస్థ ప్రాచ్య డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, భగవత్ సేవా పరాయణులు పెండ్యాల శంకర శర్మ. 

ప్రాచీన ఆర్ష విజ్ఞా నానికి, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మయై, వేద వేదాంగ శాస్త్రాగమ, సకల కళలకు, 
సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమై, పుణ్యభూమిగా వెలుగొందుతున్న భారతావనికి చరిత్రకు అందనంత పూర్వమైన, ఉజ్వల సాంస్కృతిక, వైదిక, తాత్త్విక, పౌరా ణిక, ఐతిహాసిక, చారిత్రక వారసత్వం కలిగిన ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శేషప్ప కళా వేదిక పై అంతర్జాతీయ ఇస్కాన్ సంస్థ
(అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం)
 ఆధ్వర్యంలో మంగళ వారం 
 నిర్వహించిన భాగవత వ్యాఖ్యాన యుక్త 18 గ్రంథాల సెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పండితులు పెండ్యాల శంకర శర్మ ప్రధాన ప్రాసంగికునిగా భాగవతాన్ని గురించి వివరిస్తూ...
భగవంతుని, భగవద్భక్తుల కథలు గాను, భక్తి యోగాన్ని చాటి చెపుతున్న ప్రాచీన గాధ. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముక్తిలతో కూడుకున్నదే భాగవతం అని వివరించారు.
 భాగవతంలో వివిధ భాగాలను స్కంధాలు అంటారని వివిధ స్కంధాలలో విష్ణువు అవతారాలు, కార్యాలు, భక్తుల గాధలు, తత్వ బోధనలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మిక సంబంధ సంవాదాలు, భగవంతుని లీలలు, సవివర వర్ణనలతో ఉన్నాయని వివరించారు. ఇలాంటి భాగవత గొప్పతనాన్ని హిందూ బంధువులకు తెలియచేసి, అధ్యయనం, పారాయణ కోసం వ్యాఖ్యానం తో కూడి ప్రచురించి వితరణ చేస్తున్న ఇస్కాన్ సంస్థ సేవలను అభినందించారు. 
ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కవి, పండితులు, వ్యాఖ్యాత పెండ్యాల మహేందర్ శర్మ తన సుదీర్ఘ ప్రసంగంలో అపర శుక మహర్షి గుండి రాజన్న శాస్త్రి గురించి వివరించారు. భాగవతాన్ని పూర్వం పరీక్షిత్తుకు శ్రీశుక యోగీశ్వరుడు వివరించిన నేపథ్యం ఆధారంగా గుండి రాజన్న శాస్త్రి నిత్యం ప్రవచించడం, సాంప్రదాయాచరణాసక్తులైన భక్తులు క్రమం తప్పకుండా శ్రవణం గావించడంనేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ప్రవీణ్ ప్రభు, ఇషావతార దాస్, మాధవ గోపీనాథ్ దాస్, కె వి సుబ్బారావు, రంగతీర్త దాస్ పాల్గొని తమ సంస్థ స్థాపన నిర్వహణా ఉద్దేశాలను వివరించారు. గచ్చిబౌలి భక్తి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 
..పెండ్యాల శంకర శర్మ, మహేందర్, బొజ్జా రమేశ్, రాజేశ్, నర్సయ్య పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు. 50మంది పండితులను సంస్థ పక్షాన సన్మానించి, భాగవతం గ్రంథాలను అందజేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

సుప్రీం కోర్టు తీర్పు: గవర్నర్–ముఖ్యమంత్రి అధికారాలపై దేశవ్యాప్త చర్చ

సుప్రీం కోర్టు తీర్పు: గవర్నర్–ముఖ్యమంత్రి అధికారాలపై దేశవ్యాప్త చర్చ సుప్రీం కోర్టు గవర్నర్–ముఖ్యమంత్రి అధికార తీర్పు | Article 200, 201, 145(3) పూర్తి విశ్లేషణ (అవగాహన కొరకు మాత్రమే) (సిహెచ్ వి ప్రభాకర్ రావు) తమిళనాడు ముఖ్యమంత్రి–గవర్నర్ మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ తీర్పు వెనుక ఉన్న ప్రధాన రాజ్యాంగ...
Read More...
Local News 

చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి : MLA సంజయ్

చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి : MLA సంజయ్ హైదరాబాద్‌ నవంబర్ 21 (ప్రజా మంటలు):జగిత్యాల అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు త్వరలో వెల్లువడనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో కలిసి, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వినతిపత్రం సమర్పించారు.   చెరువుల మరమ్మత్తులకు నిధుల అభ్యర్థన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపిన వివరాల...
Read More...
Local News  State News 

చిరు ఉద్యోగుల పెద్ద మనసు....ప్రతి నెల వేతనం నుంచి కొంత భాగం సేవ పనులకు..

చిరు ఉద్యోగుల పెద్ద మనసు....ప్రతి నెల వేతనం నుంచి కొంత భాగం సేవ పనులకు.. సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) : ఆర్‌ఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ ఉద్యోగులు కృష్ణజ్యోతి, కీర్తిల ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రి ఎంసీహెచ్‌ విభాగంలో చికిత్స పొందుతున్న బాలింతలు, గర్భిణీలకు శుక్రవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సేవలో భాగంగా ఉద్యోగులు తమ వేతనంలో కొంతభాగాన్ని ప్రతి...
Read More...
Local News 

శిశు సంరక్షణపై మరింత అవగాహన పెంచుకోవాలి.. గాంధీలో న్యూ బోర్న్ బేబీ వారోత్సవాలు..

శిశు సంరక్షణపై మరింత అవగాహన పెంచుకోవాలి.. గాంధీలో న్యూ బోర్న్ బేబీ వారోత్సవాలు.. సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) : నవ జాత శిశు సంరక్షణపై తల్లులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. గాంధీ మదర్‌ అండ్‌ చైల్డ్ కేర్‌ ఆస్పత్రి (ఎంసీహెచ్) లో గైనకాలజీ, పిడియాట్రిక్‌ విభాగాల సంయుక్త నేతృత్వంలో న్యూబోర్న్‌ బేబీ వారోత్సవాలను పురష్కరించుకుని శుక్రవారం పలు అవేర్నెస్ కార్యక్రమాలు...
Read More...
Local News  Spiritual  

దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ

దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ ఇబ్రహీంపట్నం నవంబర్ 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):  ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్ష కొండ గ్రామంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శ్రీ పిస్క శ్రీనివాస్-లత దంపతులు ఎలక్ట్రానిక్ గుడి గంటను బహుకరించారు. ఈ గంట ప్రతి గంట, ప్రతి గంటకు టైం చెప్పడంతో పాటు, ఒక భగవద్గీత శ్లోకం  మరియు భక్తి గీతం...
Read More...

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి  అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత ధర్మపురి నవంబర్ 21(ప్రజా మంటలు) కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత అన్నారు.  శుక్రవారం ధర్మపురి  మండలం రాజారాం , దమ్మన్నపేట్ మరియు దుబ్బల గూడెం   గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) మాట్లాడుతూ...
Read More...
National  State News 

రాష్ట్రపతికి రేవంత్ రెడ్డి స్వాగతం

రాష్ట్రపతికి రేవంత్ రెడ్డి స్వాగతం హైదరాబాద్‌, నవంబర్ 21 (ప్రజా మంటలు): భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్   జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి    రాష్ట్రపతి ని ఆహ్వానించారు. రాష్ట్రపతి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవం – రెండవ...
Read More...
Local News 

క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి  : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ 

క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి  : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్  మెట్టుపల్లి నవంబర్ 21(ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మెట్టుపల్లి పట్టణ పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో  పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా విద్యాధికారి రాము గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...
Read More...
Local News 

కౌన్సిలింగ్ తో  వృద్ధుల కేసులు పరిష్కారం..    

కౌన్సిలింగ్ తో  వృద్ధుల కేసులు పరిష్కారం..     జగిత్యాల నవంబర్ 21 (ప్రజా మంటలు): తల్లిదండ్రులను నిరాదరిస్తున్న  కొడుకులు, కోడళ్ళకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రానికి జిల్లా లోని జగిత్యాల పట్టణం, బీర్పూర్, మల్యాల, పెగడపల్లి, గొల్ల పల్లి...
Read More...

దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్

దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్ దుబాయ్‌, నవంబర్ 21 (ప్రజా మంటలు): దుబాయ్‌ ఎయిర్‌ షోలో భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, బెంగళూరు హెచ్‌.ఏ‌.ఎల్‌ (HAL) సంస్థలో తయారైన ఈ లైట్​ కాంబాట్​ ఎయిర్‌క్రాఫ్ట్‌ మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఆకస్మికంగా కుప్పకూలింది. విమానం కూలిన వెంటనే అక్కడ భారీగా ...
Read More...

కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ

 కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ గొల్లపల్లి, నవంబర్ 21 (ప్రజా మంటలు): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రాఘవపట్నంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గతంలో కట్టుకున్న ముడుపును ఈరోజు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన దేవాలయ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహాయం...
Read More...

ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్?

ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్? హైదరాబాద్‌, నవంబర్‌ 21 (ప్రజా మంటలు): తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్​ సమర్పించనున్న నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణల ప్రకారం, గత ఎన్నికలలో...
Read More...