ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం

పెద్దపల్లిలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ సభ

On
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం - రేవంత్ రెడ్డి 

ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ సభ

పెద్దపల్లి డిసెంబర్ 04:

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం, రైతాంగానికి అండగా నిలవడం, మహిళలను ప్రగతి పథంలో నడిపించడమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.

సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి సమగ్రంగా వివరించారు. 

ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క,శ్రీధర్ బాబుతో పాటు మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. 

🔹 ఈ వేదికగా.. TGPSC ద్వారా గ్రూప్ IV కేటగిరీ కింద కొత్తగా ఎంపికైన 8,084 మందికి, సింగరేణి సంస్థలో నియమితులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను లాంఛనంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించారు. పెద్దపల్లి జిల్లాలో దాదాపు 1035 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు.

🔹 SkillsUniversity తో కలిసి పని చేయడానికి సంబంధించి 7 ఏజెన్సీలతో ఇదే వేదికగా ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. అలాగే, అత్యంత కీలకమైన Digital Employment Exchange of Telangana (DEET) ఏర్పాటును ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే CM’s Cup -2024 ట్రోఫీని ఆవిష్కరించారు. 

🔹 అనంతరం సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. గడిచిన పదేండ్లలో అభివృద్ధికి నోచుకోని ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళా సంఘాల్లో 67 లక్షల మంది ఉండగా, కోటి మందిని చేర్చి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. 

🔹 తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి సాధన కోసం జరిగిన నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే శాఖల వారిగా మొత్తం 55,143 ఉద్యోగ నియామకాలు చేసి దేశంలోనే తెలంగాణ రికార్డు నెలకొల్పిన విషయాన్ని వివరించారు.

🔹 ప్రభుత్వ ఫలాలు సక్రమంగా అందాలని, బీసీలకు సరైన వాటా దక్కాలన్న ఉద్దేశంతోనే కులగణన చేపట్టినట్టు తెలిపారు. 

🔹 నిరుపేదల బిడ్డల చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతోనే పదేళ్లుగా పెంచని డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని గుర్తుచేశారు.

🔹 కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీకి ఒక ఇంజనీరింగ్, ఒక లా కాలేజీ మంజూరు చేస్తామని చెప్పారు.

🔹 పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు సాధించడం ప్రజా విజయంగా అభివర్ణించారు. 

🔹 కాళేశ్వరం నుంచి చుక్కనీరు వినియోగించకుండా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి చరిత్ర రికార్డు సాధించాం. ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం.

🔹 గత ప్రభుత్వం చెల్లించని రైతు బంధు 7500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేశాం. తొలి సంవత్సరంలో 21 వేల కోట్లతో 25 లక్షల రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర సృష్టించాం. 

🔹 నిర్భందాల మధ్య సాగిన పదేండ్ల పాలన నుంచి స్వేచ్ఛ కల్పించామని పలు సందర్భాలు, సంఘటనలను ఉదహరించారు.  
 
🔹 ఒక్కరోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి గారు వివరించారు.

కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ గడ్డం వంశీ గారు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ గారు, స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన గౌరవ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National 

బెంగాల్ లో SIR భయం.. ఎనిమిది మంది ఆత్మహత్యలు: TMC ఆరోపణ

బెంగాల్ లో SIR భయం.. ఎనిమిది మంది ఆత్మహత్యలు: TMC ఆరోపణ కోల్‌కతా, నవంబర్ 05: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్‌ జాబితా ప్రత్యేక పునర్విమర్శ (SIR) నేపథ్యంలో ఆందోళన పెరుగుతోంది. ఈ భయంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని టీమ్‌సీ (TMC) ఆరోపించింది. తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాంగర్ ప్రాంతానికి చెందిన సఫికుల్ గాజీ (57) అనే వ్యక్తి తన అత్తింటి వద్ద...
Read More...
National  State News 

 “హర్యానా ఎన్నికల్లో లక్షల ఫేక్ ఓట్లు”: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

 “హర్యానా ఎన్నికల్లో లక్షల ఫేక్ ఓట్లు”: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు నవంబర్ 05, న్యూఢిల్లీ (ప్రజా మంటలు): హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత స్థాయిలో ఓటర్ల మోసం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బ్రెజిల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఒక మహిళా ఫోటోను వాడి, అదే చిత్రం 22 మంది ఓటర్లుగా ఎన్నికల జాబితాలో కనిపించిందని ఆయన వెల్లడించారు. రాహుల్ గాంధీ...
Read More...

కడుపుతో ఉన్న కూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు – ప్రేమ వివాహం నేపథ్యంగా ఉద్రిక్తత

కడుపుతో ఉన్న కూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు – ప్రేమ వివాహం నేపథ్యంగా ఉద్రిక్తత జగిత్యాల నవంబర్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో తల్లిదండ్రులే కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది. ప్రియాంక తన తల్లిదండ్రులు, అక్క భర్త గుంజే కుమార్‌ మీద కిడ్నాప్ ప్రయత్నం మరియు మరణ బెదిరింపులపై ఫిర్యాదు చేసింది. తానూ తన భర్త రాకేష్ కూడా ప్రాణభయంతో ఉన్నామని,...
Read More...
Local News 

ఆలూరు గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు కోసం జీవన్ రెడ్డి కి వినతి

ఆలూరు గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు కోసం జీవన్ రెడ్డి కి వినతి ముదిరాజ్ వృత్తి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మాజీ మంత్రి కలెక్టర్ కు లేఖ  జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో రాయికల్ మండలం, ఆలూరు రెవెన్యూ గ్రామ పరిధిలో మత్స్య పారిశ్రామిక (ముదిరాజ్) సహకార సంఘం ఏర్పాటు కోసం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డికి...
Read More...
Local News  Spiritual  

పోల్ బాల్ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

పోల్ బాల్ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు సికింద్రాబాద్,నవంబర్ 05 (ప్రజా మంటలు):  కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని శ్రీ పోల్ బాల్ హనుమాన్ శివాలయంలో భక్తులు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. పవిత్ర కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించడం ఎంతో విశేషమైన భాగ్యం అని వేద...
Read More...

జగిత్యాల శ్రీ కోదండ రామాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ zp ఛైర్పర్సన్ దావా వసంత ప్రత్యేక పూజలు

జగిత్యాల శ్రీ కోదండ రామాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ zp ఛైర్పర్సన్ దావా వసంత ప్రత్యేక పూజలు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో స్వామి వారికి వెండి ఆభరణాల సమర్పణ జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావా వసంత సురేష్  ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా...
Read More...

సిక్కింకు ప్రత్యామ్నాయ హైవే ప్రణాళిక – ఎంఫీ ఇంద్రా హాంగ్ సుబ్బా, BRO చర్చలు

సిక్కింకు ప్రత్యామ్నాయ హైవే ప్రణాళిక – ఎంఫీ ఇంద్రా హాంగ్ సుబ్బా, BRO చర్చలు సిక్కింకు ప్రత్యామ్నాయ హైవే మార్గంపై చర్చ – ఎంఫీ ఇంద్రా హాంగ్ సుబ్బా, BRO డైరెక్టర్ జనరల్ సమావేశం ఉత్తర సిక్కింకు నిరంతర రవాణా, భద్రతా బలపాటుకు ప్రాధాన్యత గ్యాంగ్‌టాక్: నవంబర్ 05 : సిక్కింకు చెందిన లోక్‌సభ సభ్యుడు ఇంద్రా హాంగ్ సుబ్బా రాష్ట్రంలోని కీలక రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాధాన్యతలపై బోర్డర్...
Read More...
National  Opinion 

రేపిస్టులపై శిక్ష  సమాజం ఇంకా కఠినత కోరుతున్నదా?

రేపిస్టులపై శిక్ష  సమాజం ఇంకా కఠినత కోరుతున్నదా? రేపిస్టులకు ఏ శిక్ష సరైనది? జయలలిత ప్రతిపాదన నుంచి నేటి సమాజ ఆలోచనలు   చెన్నై / హైదరాబాద్ నవంబర్ 0 5: సమాజాన్ని కుదిపేసే అత్యాచార ఘటనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కోయంబత్తూరులో 20 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం మళ్లీ ఒక ప్రశ్నను ముందుకు తెచ్చింది — రేపిస్టులకు సరైన శిక్ష ఏది?...
Read More...
National  Crime  State News 

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు తెలంగాణవాసుల మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు తెలంగాణవాసుల మృతి హల్లిఖేడ్ సమీపంలో వ్యాను, కారు ఢీకొన్న ఘటన బెలగావి జిల్లా, కర్ణాటక నవంబర్ 05: కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లా హల్లిఖేడ్ సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృతి చెందారు. సమాచారం ప్రకారం, హైదరాబాద్‌ నుండి గోవా వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న వ్యాను ఢీకొట్టడంతో ప్రమాదం...
Read More...

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుయో మోటో కేసు

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుయో మోటో కేసు అధికారుల నిర్లక్ష్యం, రోడ్డు భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేసిన కమిషన్ హైదరాబాద్: నవంబర్ 05 (ప్రజా మంటలు): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషాద ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుయో మోటో కేసు (HRC...
Read More...

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం — సంస్కరణల కమిటీ ఏర్పాటుకు జీవో జారీ

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం — సంస్కరణల కమిటీ ఏర్పాటుకు జీవో జారీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ కోదండరాంలకు స్థానం హైదరాబాద్, నవంబర్ 04: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంలో సంస్కరణలు చేపట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంబంధంగా మంగళవారం ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో జాప్యాలు తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంస్కరణల...
Read More...

ఈశాన్య రాజకీయాల్లో కొత్త మార్పు సంకేతం — హిమంత బిశ్వ శర్మకు సవాల్‌ విసిరిన కొత్త మైత్రి కూటమి!

ఈశాన్య రాజకీయాల్లో కొత్త మార్పు సంకేతం — హిమంత బిశ్వ శర్మకు సవాల్‌ విసిరిన కొత్త మైత్రి కూటమి! కొత్త రాజకీయ కూటమి అవతరించిన ఈశాన్య భారతదేశంలో, NEDA భవిష్యత్తుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని కూటమికి ఇది పెద్ద సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. న్యూఢిల్లీ, నవంబర్‌ 04: ఈశాన్య భారత రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని **నార్త్...
Read More...