ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం

పెద్దపల్లిలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ సభ

On
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం - రేవంత్ రెడ్డి 

ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ సభ

పెద్దపల్లి డిసెంబర్ 04:

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం, రైతాంగానికి అండగా నిలవడం, మహిళలను ప్రగతి పథంలో నడిపించడమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.

సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి సమగ్రంగా వివరించారు. 

ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క,శ్రీధర్ బాబుతో పాటు మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. 

🔹 ఈ వేదికగా.. TGPSC ద్వారా గ్రూప్ IV కేటగిరీ కింద కొత్తగా ఎంపికైన 8,084 మందికి, సింగరేణి సంస్థలో నియమితులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను లాంఛనంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించారు. పెద్దపల్లి జిల్లాలో దాదాపు 1035 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు.

🔹 SkillsUniversity తో కలిసి పని చేయడానికి సంబంధించి 7 ఏజెన్సీలతో ఇదే వేదికగా ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. అలాగే, అత్యంత కీలకమైన Digital Employment Exchange of Telangana (DEET) ఏర్పాటును ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే CM’s Cup -2024 ట్రోఫీని ఆవిష్కరించారు. 

🔹 అనంతరం సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. గడిచిన పదేండ్లలో అభివృద్ధికి నోచుకోని ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళా సంఘాల్లో 67 లక్షల మంది ఉండగా, కోటి మందిని చేర్చి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. 

🔹 తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి సాధన కోసం జరిగిన నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే శాఖల వారిగా మొత్తం 55,143 ఉద్యోగ నియామకాలు చేసి దేశంలోనే తెలంగాణ రికార్డు నెలకొల్పిన విషయాన్ని వివరించారు.

🔹 ప్రభుత్వ ఫలాలు సక్రమంగా అందాలని, బీసీలకు సరైన వాటా దక్కాలన్న ఉద్దేశంతోనే కులగణన చేపట్టినట్టు తెలిపారు. 

🔹 నిరుపేదల బిడ్డల చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతోనే పదేళ్లుగా పెంచని డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని గుర్తుచేశారు.

🔹 కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీకి ఒక ఇంజనీరింగ్, ఒక లా కాలేజీ మంజూరు చేస్తామని చెప్పారు.

🔹 పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు సాధించడం ప్రజా విజయంగా అభివర్ణించారు. 

🔹 కాళేశ్వరం నుంచి చుక్కనీరు వినియోగించకుండా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి చరిత్ర రికార్డు సాధించాం. ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం.

🔹 గత ప్రభుత్వం చెల్లించని రైతు బంధు 7500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేశాం. తొలి సంవత్సరంలో 21 వేల కోట్లతో 25 లక్షల రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర సృష్టించాం. 

🔹 నిర్భందాల మధ్య సాగిన పదేండ్ల పాలన నుంచి స్వేచ్ఛ కల్పించామని పలు సందర్భాలు, సంఘటనలను ఉదహరించారు.  
 
🔹 ఒక్కరోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి గారు వివరించారు.

కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ గడ్డం వంశీ గారు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ గారు, స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన గౌరవ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

State News 

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గా సంఘనబట్ల దినేష్ నియామకం 

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గా సంఘనబట్ల దినేష్ నియామకం  ధర్మపురి, మార్చ్ 28 (ప్రజా మంటలు): ధర్మపురికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సంఘనబట్ల దినేష్‌కు కీలక పదవి దక్కింది. తెలంగాణ పబ్లిక్ లైబ్రరీల చట్టం, 1960 ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు, ఆయనను జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ (జిల్లా గ్రంథాలయ సమస్థ) చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి....
Read More...
Local News 

జగిత్యాలలో హజ్ యాత్రికులకు వాక్సినేషన్ ప్రారంభం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలన

జగిత్యాలలో హజ్ యాత్రికులకు వాక్సినేషన్ ప్రారంభం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలన జగిత్యాల మార్చ్ 28 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని మాతా శిశు హాస్పిటల్‌లో హజ్ యాత్రికులకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో జరుగుతున్న సేవలను పరిశీలిస్తూ, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను సమీక్షించారు. ఇటీవల ప్రారంభించిన క్రిటికల్ కేర్ యూనిట్ హాస్పిటల్‌ను కూడా సందర్శించి...
Read More...
National  Local News  International   Social  State News 

పోలాండ్ దేశ దేవుడు మన భారత దేశ రాజు. - అతనిని దూషిస్తే మరణ శిక్ష !!!

పోలాండ్ దేశ దేవుడు మన భారత దేశ రాజు. - అతనిని దూషిస్తే మరణ శిక్ష !!! (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113).  హైదరాబాద్ 27 మార్చి (ప్రజా మంటలు) :  పోలాండ్ కు భారతదేశం పై అంత మమకారం ఎందుకు?  పోలాండ్లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్ష. మన దేశపు రాజు, పోలాండ్ దేశపు దేవుడు శ్రీ శ్రీ రాజా  సాహబ్ దిగ్విజయ్ సింగ్.  కానీ భారతీయులకు...
Read More...
Local News 

ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య మృతి.. కేసీఆర్, కవిత సంతాపం

ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య మృతి.. కేసీఆర్, కవిత సంతాపం జగిత్యాల, మార్చి 27 (ప్రజా మంటలు): ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ జైశెట్టి రమణయ్య (85) అనారోగ్యంతో మరణించారు. ఆదివారం 29 వ తేదీన జగిత్యాల లలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.   జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మంచాలబీసీ...
Read More...
National  State News 

ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన – తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశ?

ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన – తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశ? నిజామాబాద్, మార్చ్ 27 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలుకుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. తమ సంస్థ అయిన తెలంగాణ జాగృతి త్వరలో రాజకీయ పార్టీగా మారబోతోందని వెల్లడించారు.ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ వేదికగా పార్టీ జెండా, అజెండాను అధికారికంగా ప్రకటించనున్నట్లు...
Read More...
Local News 

టి జి ఆర్ ఎస్ ఏ జగిత్యాల జిల్లా  అణిముత్యాలు  దొంతి రాజేశ్వరి గీర్దావర్  మరియు పంగరాజేశం జిపిఓ కు ఘన సన్మానము

టి జి ఆర్ ఎస్ ఏ జగిత్యాల జిల్లా  అణిముత్యాలు  దొంతి రాజేశ్వరి గీర్దావర్  మరియు పంగరాజేశం జిపిఓ కు ఘన సన్మానము    జగిత్యాల మార్చి 26 (ప్రజా మంటలు) దొంత రాజేశ్వరి గిర్ధవర్ ఆర్చరికి ఘన సన్మానం దొంత రాజేశ్వరి గిర్దావర్ వెల్గటూర్        మండలం   ఓపెన్ మాస్టర్ గేమ్స్ 2025 లో నేషనల్ గేమ్స్ గోవా : బంగారు పథకం ఉత్తరఖాండు :బంగారు పథకం హిమాచల్ ప్రదేశ్ : బంగారు పథకం సౌత్ కొరియ : 2023 లో...
Read More...
Local News 

మరణానంతరం కూడా ప్రాణదాతగా నిలిచిన  మానవత్వానికి నిలువుటద్దం హెడ్ కానిస్టేబుల్ నల్లాల లక్ష్మీరాజం”*

మరణానంతరం కూడా ప్రాణదాతగా నిలిచిన  మానవత్వానికి నిలువుటద్దం హెడ్ కానిస్టేబుల్ నల్లాల లక్ష్మీరాజం”* *“ జగిత్యాల మార్చి 26 ప్రజా మంటలు)  జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నల్లాల లక్ష్మీరాజం ఆకస్మిక మరణం జిల్లా పోలీస్ శాఖకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పోలీస్ అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు విధి నిర్వహణలోనే కాకుండా, మరణానంతరం కూడా తన అవయవాలను దానం చేసి మరో...
Read More...
Crime  State News 

జగిత్యాల నుండి బయలుదేరిన బస్సు మార్కాపురం వద్ద ప్రమాదం: 13 మందికి మృతి

జగిత్యాల నుండి బయలుదేరిన బస్సు మార్కాపురం వద్ద ప్రమాదం: 13 మందికి మృతి మార్కాపురం, మార్చి 26 (ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది ప్రాణాలను బలిగొంది. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన సెమీ-స్లీపర్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.జగిత్యాల నుండి కనిగిరి/పామూరు వైపు సుమారు 40–45 మంది ప్రయాణికులతో బయలుదేరిన...
Read More...
National  State News 

లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీకి సిద్ధం

లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీకి సిద్ధం న్యూ ఢిల్లీ, మార్చి 25 (ప్రజా మంటలు): రాబోయే స్థానిక సంస్థల, కార్పొరేషన్  ఎన్నికల్లో లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ తమ పార్టీ గుర్తుపై స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై జరిగిన చర్చల అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ విషయాన్ని...
Read More...
State News 

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా: జగిత్యాలలో భావోద్వేగ తుఫాన్, కార్యకర్తల సామూహిక రాజీనామాలు

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా: జగిత్యాలలో భావోద్వేగ తుఫాన్, కార్యకర్తల సామూహిక రాజీనామాలు జగిత్యాల, మార్చ్ 25 (ప్రజా మంటలు): కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేయడం జగిత్యాల రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా భావోద్వేగభరితంగా మారింది.“ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ” అంటూ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం...
Read More...
State News 

కవి, రచయిత నల్లాల లక్ష్మి రాజం అకాల మృతి

కవి, రచయిత నల్లాల లక్ష్మి రాజం అకాల మృతి కరీంనగర్ జిల్లా నుండి ఎదిగిన ప్రముఖ రచయిత, దళిత సాహితీవేత్త నల్లాల లక్ష్మి రాజం అకాల మరణం పట్ల సాహితీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ప్రముఖ రచయిత బి.ఎస్. రాములు తన సంతాపాన్ని తెలియజేస్తూ, ఇది సాహిత్య రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.కథా రచయితగా, నాటకకర్తగా, పాటల కవిగా నల్లాల లక్ష్మి...
Read More...
Local News 

శానిటేషన్ వాహనములు ట్రాక్టర్లు ఆటోలు పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి

శానిటేషన్ వాహనములు ట్రాక్టర్లు ఆటోలు పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి జగిత్యాల మార్చి 24 ( ప్రజా మంటలు)కొత్త బస్టాండ్ వాటర్ ట్యాంక్ దగ్గర శానిటేషన్ వాహనములు ట్రాక్టర్లు, ఆటోలు పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్  ఈ సందర్భంగా మాట్లాడుతూ తరచు వాహనములు మరమ్మతుకు గురవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయిల్ చేంజ్ సకాలంలో చేస్తూ మెయింటెనెన్స్ చేయాలని ఆదేశించారు. పట్టణ...
Read More...