ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం

పెద్దపల్లిలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ సభ

On
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం - రేవంత్ రెడ్డి 

ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ సభ

పెద్దపల్లి డిసెంబర్ 04:

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం, రైతాంగానికి అండగా నిలవడం, మహిళలను ప్రగతి పథంలో నడిపించడమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.

సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి సమగ్రంగా వివరించారు. 

ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క,శ్రీధర్ బాబుతో పాటు మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. 

🔹 ఈ వేదికగా.. TGPSC ద్వారా గ్రూప్ IV కేటగిరీ కింద కొత్తగా ఎంపికైన 8,084 మందికి, సింగరేణి సంస్థలో నియమితులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను లాంఛనంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించారు. పెద్దపల్లి జిల్లాలో దాదాపు 1035 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు.

🔹 SkillsUniversity తో కలిసి పని చేయడానికి సంబంధించి 7 ఏజెన్సీలతో ఇదే వేదికగా ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. అలాగే, అత్యంత కీలకమైన Digital Employment Exchange of Telangana (DEET) ఏర్పాటును ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే CM’s Cup -2024 ట్రోఫీని ఆవిష్కరించారు. 

🔹 అనంతరం సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. గడిచిన పదేండ్లలో అభివృద్ధికి నోచుకోని ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళా సంఘాల్లో 67 లక్షల మంది ఉండగా, కోటి మందిని చేర్చి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. 

🔹 తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి సాధన కోసం జరిగిన నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే శాఖల వారిగా మొత్తం 55,143 ఉద్యోగ నియామకాలు చేసి దేశంలోనే తెలంగాణ రికార్డు నెలకొల్పిన విషయాన్ని వివరించారు.

🔹 ప్రభుత్వ ఫలాలు సక్రమంగా అందాలని, బీసీలకు సరైన వాటా దక్కాలన్న ఉద్దేశంతోనే కులగణన చేపట్టినట్టు తెలిపారు. 

🔹 నిరుపేదల బిడ్డల చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతోనే పదేళ్లుగా పెంచని డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని గుర్తుచేశారు.

🔹 కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీకి ఒక ఇంజనీరింగ్, ఒక లా కాలేజీ మంజూరు చేస్తామని చెప్పారు.

🔹 పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు సాధించడం ప్రజా విజయంగా అభివర్ణించారు. 

🔹 కాళేశ్వరం నుంచి చుక్కనీరు వినియోగించకుండా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి చరిత్ర రికార్డు సాధించాం. ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం.

🔹 గత ప్రభుత్వం చెల్లించని రైతు బంధు 7500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేశాం. తొలి సంవత్సరంలో 21 వేల కోట్లతో 25 లక్షల రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర సృష్టించాం. 

🔹 నిర్భందాల మధ్య సాగిన పదేండ్ల పాలన నుంచి స్వేచ్ఛ కల్పించామని పలు సందర్భాలు, సంఘటనలను ఉదహరించారు.  
 
🔹 ఒక్కరోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి గారు వివరించారు.

కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ గడ్డం వంశీ గారు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ గారు, స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన గౌరవ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

ఎయిడ్స్ కు చికిత్స కంటే నివారణే మేలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్

ఎయిడ్స్ కు చికిత్స కంటే నివారణే మేలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్ జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)ఎయిడ్స్ కు చికిత్స కంటే .. నివారణే మేలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజ గౌడ్ అన్నారు యువత ఎట్టి పరిస్థితుల్లోని ఎయిడ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనీ    సోమవారం రోజున ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ...
Read More...

గీతా భవన్ లో ఘనంగా గీత జయంతి వేడుకలు

గీతా భవన్ లో ఘనంగా గీత జయంతి వేడుకలు   జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక  కేంద్రం గీత భవన్ లో గీతా జయంతి పురస్కరించుకొని గీతా సత్సంగం 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఉదయం  సంపూర్ణ సామూహిక శ్రీలక్ష్మి అష్టోత్తర సహిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, మరియు శ్రీమద్భవద్గీత 18...
Read More...

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారుప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా   జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 5 మంది  అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని...
Read More...

పట్టణ అభివ్రుద్ది కి నిరంతరం కృషి చేస్తా_ రోగం వచ్చిన తర్వాత చికిత్స  కన్నా ముందస్తు జాగ్రత్తలు ముఖ్యం  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

పట్టణ అభివ్రుద్ది కి నిరంతరం కృషి చేస్తా_ రోగం వచ్చిన తర్వాత చికిత్స  కన్నా ముందస్తు జాగ్రత్తలు ముఖ్యం  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్    జగిత్యాల డిసెంబర్ 1(ప్రజా మంటలు)పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్పట్టణ 11 వ వార్డులో 11 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణ 11వ వార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గాంధీనగర్ ను సందర్శించి...
Read More...

సీఎం కు, మంత్రులకు ఎన్నికల కోడ్ వర్తించదా?  ఎలక్షన్ కమిషన్ స్పందించి సీఎం పర్యటనను నిలిపివెయ్యాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

సీఎం కు, మంత్రులకు ఎన్నికల కోడ్ వర్తించదా?   ఎలక్షన్ కమిషన్ స్పందించి సీఎం పర్యటనను నిలిపివెయ్యాలి  జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్    జగిత్యాల డిసెంబర్ 1(ప్రజా మంటలు)  రాష్ట్ర ముఖ్యమంత్రి కి, రాష్ట్రంలోని మంత్రులకు ఎన్నికల కమిషన్ నియమావలి వర్తించద అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో వసంత  మాట్లాడుతూ నవంబర్ 26 సాయంత్రం కోడ్ అమలుపై ఎలక్షన్ కమిషన్...
Read More...

24 గంటల్లో దారిదోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

24 గంటల్లో దారిదోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు జగిత్యాల నవంబర్ 30 (ప్రజా మంటలు)దారి దోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలను అరెస్ట్‌ చేసినట్లు    డీఎస్పీ రఘు చందర్‌ తెలిపారు.. శనివారం అర్ధరాత్రి జగిత్యాల పట్టణ శివారులోని గాంధీ నగర్ వద్ద  ... మంచిర్యాల జిల్లాకు చెందిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ శనివారం అర్ధరాత్రి  జగిత్యాల శివారులో గాంధీనగర్ వద్ద డీసీఎం వ్యాన్‌ పార్క్...
Read More...

కొండగట్టు షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

కొండగట్టు షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్    కొండగట్టు నవంబర్ 30 (ప్రజా మంటలు)శనివారం రాత్రి 11.30 ప్రాంతంలో మల్యాల మండలం కొండగట్టులోని సుమారు 30 దుకాణాలు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరగగా ఆదివారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదానికి జరిగిన కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన వారికి తక్షణ సహాయం కటుంబానికి...
Read More...
Local News  Crime 

దొంగ మల్లన్న జాతరలో అందరు బహార్ బెట్టింగ్ గ్యాబ్లింగ్ ఆట 

దొంగ మల్లన్న జాతరలో అందరు బహార్ బెట్టింగ్ గ్యాబ్లింగ్ ఆట  (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 30 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని శ్రీ మల్లికార్జున మల్లన్న పేట  దొంగ మల్లన్న జాతర బెట్టింగ్ టోకెన్స్ ద్వారా గ్యాంబ్లింగ్ (అందర్ బహార్) ఆట నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి  అతని వద్దనుండి నుండి 4000 నగదు తొ పాటు మూడు బెట్టింగ్ టోకన్ స్వాధీనం చేసుకుని కేసు...
Read More...
National  State News  International  

కేలిఫోర్నియాలో బ్యాంక్వెట్ హాల్‌లో కాల్పులు: 4 గురు మృతి, 10 మందికి గాయాలు

 కేలిఫోర్నియాలో బ్యాంక్వెట్ హాల్‌లో కాల్పులు: 4 గురు మృతి, 10 మందికి గాయాలు స్టాక్‌టన్ (కేలిఫోర్నియా), నవంబర్ 30: అమెరికా కేలిఫోర్నియా రాష్ట్రంలోని స్టాక్‌టన్ నగరంలో ఉన్న ఒక బ్యాంక్వెట్ హాల్‌లో, శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో నాలుగు మంది మృతి, పది మంది గాయపడిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి జరిగిన ఈ కాల్పుల ఘటనపై సాన్ జోక్విన్ కౌంటీ శెరీఫ్ కార్యాలయం అత్యవసర ప్రకటన...
Read More...
Local News 

కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌కు వివిధ కుల సంఘాల నాయకుల అభినందనలు

కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌కు వివిధ కుల సంఘాల నాయకుల అభినందనలు కరీంనగర్, నవంబర్ 30 (ప్రజా మంటలు): కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ నేడు నగరంలోని పలువురు ప్రముఖులను, వివిధ కుల సంఘాల అధ్యక్షులు మరియు రాజకీయ నేతలను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. అంజన్ కుమార్‌ను కలిసిన వారిలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,...
Read More...
State News 

జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4 నుంచి తిరిగి ప్రారంభం

జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4 నుంచి తిరిగి ప్రారంభం హైదరాబాద్ నవంబర్ 30 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 25న నిజామాబాద్‌లో ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికే 11 జిల్లాల్లో పూర్తి చేశారు — మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్–హన్మకొండ, నల్గొండ, మెదక్,...
Read More...
State News 

కొండగట్టు అగ్నిప్రమాదంపై కల్వకుంట్ల కవిత ఆందోళన

కొండగట్టు అగ్నిప్రమాదంపై కల్వకుంట్ల కవిత ఆందోళన హైదరాబాద్ నవంబర్ 30 (ప్రజా మంటలు): కొండగట్టు బస్టాండ్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో 35 దుకాణాలు దగ్ధమై, చిరువ్యాపారులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్న విషయం మనసును కలచివేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మక్క జాతర సందర్భంలో భక్తుల రద్దీ దృష్ట్యా పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన బొమ్మలు,...
Read More...