ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం
పెద్దపల్లిలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ సభ
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం - రేవంత్ రెడ్డి
ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ సభ
పెద్దపల్లి డిసెంబర్ 04:
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం, రైతాంగానికి అండగా నిలవడం, మహిళలను ప్రగతి పథంలో నడిపించడమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.
సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి సమగ్రంగా వివరించారు.
ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క,శ్రీధర్ బాబుతో పాటు మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
🔹 ఈ వేదికగా.. TGPSC ద్వారా గ్రూప్ IV కేటగిరీ కింద కొత్తగా ఎంపికైన 8,084 మందికి, సింగరేణి సంస్థలో నియమితులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను లాంఛనంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించారు. పెద్దపల్లి జిల్లాలో దాదాపు 1035 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు.
🔹 SkillsUniversity తో కలిసి పని చేయడానికి సంబంధించి 7 ఏజెన్సీలతో ఇదే వేదికగా ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. అలాగే, అత్యంత కీలకమైన Digital Employment Exchange of Telangana (DEET) ఏర్పాటును ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే CM’s Cup -2024 ట్రోఫీని ఆవిష్కరించారు.
🔹 అనంతరం సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. గడిచిన పదేండ్లలో అభివృద్ధికి నోచుకోని ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళా సంఘాల్లో 67 లక్షల మంది ఉండగా, కోటి మందిని చేర్చి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.
🔹 తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి సాధన కోసం జరిగిన నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే శాఖల వారిగా మొత్తం 55,143 ఉద్యోగ నియామకాలు చేసి దేశంలోనే తెలంగాణ రికార్డు నెలకొల్పిన విషయాన్ని వివరించారు.
🔹 ప్రభుత్వ ఫలాలు సక్రమంగా అందాలని, బీసీలకు సరైన వాటా దక్కాలన్న ఉద్దేశంతోనే కులగణన చేపట్టినట్టు తెలిపారు.
🔹 నిరుపేదల బిడ్డల చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతోనే పదేళ్లుగా పెంచని డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని గుర్తుచేశారు.
🔹 కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీకి ఒక ఇంజనీరింగ్, ఒక లా కాలేజీ మంజూరు చేస్తామని చెప్పారు.
🔹 పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు సాధించడం ప్రజా విజయంగా అభివర్ణించారు.
🔹 కాళేశ్వరం నుంచి చుక్కనీరు వినియోగించకుండా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి చరిత్ర రికార్డు సాధించాం. ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం.
🔹 గత ప్రభుత్వం చెల్లించని రైతు బంధు 7500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేశాం. తొలి సంవత్సరంలో 21 వేల కోట్లతో 25 లక్షల రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర సృష్టించాం.
🔹 నిర్భందాల మధ్య సాగిన పదేండ్ల పాలన నుంచి స్వేచ్ఛ కల్పించామని పలు సందర్భాలు, సంఘటనలను ఉదహరించారు.
🔹 ఒక్కరోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి గారు వివరించారు.
కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ గడ్డం వంశీ గారు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ గారు, స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన గౌరవ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల బీజేపీలో అసమ్మతి సెగలు
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల, ఆగస్టు 29:జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మూడు దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు తమకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోరుట్ల సమీపంలోని ఓ... తెలుగు భాషా ఫోరం ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలు
జగిత్యాల ఆగస్ట్ 29(ప్రజా మంటలు)జిల్లా భాషోపాధ్యాయులు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు ఆయుపట్టు పద్యం. తెలుగు భాషా సొగసుకు శిఖరాగ్రమైన ప్రక్రియ పద్య సాహిత్యం. పై అంశాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా డీఈవో కె.రాము అనుమతి తీసుకుని, తెలుగు భాషా ఫోరం లెటర్ ప్యాడ్... డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
కరీంనగర్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న తమ్ముడి వద్దకు వెళ్లిన అక్క రోడ్డుపైనే బస్సును ఆపించి రాఖీ కట్టింది.గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజు తిమ్మాపూర్ మండలం రేణికుంట... వైకుంఠ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
నాంపల్లిలోని రామ్ ప్రతాప్ పిట్టి భవన్లో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి బాలాజీ మందిరంలో ప్రముఖ వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఉత్సవాల్లో మాజీ సీనియర్ మంత్రి, మాజీ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గోడిసెల రాజేశం గౌడ్ పాల్గొన్నారు. ఆగస్టు 25 నుంచి 30వ... వేతన చెల్లింపులో జాప్యంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం
ఫారమ్–16 జారీ, జాప్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సిఫార్సు
హైదరాబాద్ ఆగస్ట్ 28 (ప్రజా మంటలు):
ఉద్యోగికి సకాలంలో వేతనం చెల్లించకపోవడం, ఆదాయపు పన్నుకు సంబంధించిన పత్రాలు అందించడంలో జాప్యం చేయడం మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశమేనని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది.... అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ
జగిత్యాల ఆగస్టు 28(ప్రజా మంటలు)శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఆవరణలో గల తిరుమల తిరుపతి దేవస్థానం ధ్యాన మందిరంలో ఉపాకర్మ కార్యక్రమం నిర్వహించారు. దేవతర్పణము ఋషితర్పణము పితృతర్పణాల అనంతరం హోమము నిర్వహించారు. .
నూతన యజ్ఞోపవీత ధారణ అనంతరం సభాపతి తిగుళ్ళ విశ్వనాథ శర్మ ఉపాకర్మ ప్రత్యేకత... గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ వేడుకలు
జగిత్యాల ఆగస్టు 28 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల శ్రీ రామాలయంలో విద్యానగర్ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉపాకర్మ ఘనంగా నిర్వహించారు. హోమము తర్పణాలు నిర్వహించి నూతన యజ్ఞోపవీత ధారణ చేశారు.
కార్యక్రమంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొలిచాల రవీందర్ వైదిక క్రతువు అన్యారంభట్ల నారాయణ... సోదర సోదరి అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్
జగిత్యాల ఆగస్టు 27 (ప్రజా మంటలు) రక్షాబంధన్ పండుగ శ్రావణమాసం పౌర్ణమిలో జరుపుకుంటాము. వైదికంగా జంధ్యాల పౌర్ణమిగా దీనినే రాఖీ పౌర్ణమి గా భావిస్తారు. రాఖీ పౌర్ణమి కి ప్రత్యేక విశిష్టత ఉంది. సోదరీలు తమ సోదరులకు రక్షాబంధనం చేసి తమ ఆత్మీయతను ఆవిష్కరిస్తారు.
పౌర్ణమి శుక్రవారం ఉన్నప్పటికీ తక్కువ సమయం ఉండడం అదేవిధంగా... ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.. జగిత్యాల రూరల్ సిఐ దామెర సుధాకర్.
జగిత్యాల, ఆగస్టు 27( ప్రజా మంటలు) ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
కృషి పట్టుదల ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని జగిత్యాల రూరల్ సిఐ దామెర సుధాకర్ అన్నారు.వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత పోలీసు శిక్షణ శిబిరాన్ని రూరల్ సీఐ సుధాకర్ సందర్శించి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ... మౌంట్ కార్మెల్ హైస్కూల్ లో ఘనంగా రక్ష బంధన్ వేడుకలు
జగిత్యాల ఆగస్ట్ 27(ప్రజా మంటలు)
ధరూర్ లోని *మౌంట్ కార్మెల్ హైస్కూల్* లో రక్ష బంధన్ వేడుకలు అత్యంత ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో పాఠశాల యాజమాన్యం నిర్వహించారుఈ సందర్భంగా పాఠశాల బాలికలు పాఠశాలలోని బాలురకి రాఖీలు కట్టి *నువ్వు నాకూ రక్ష నేను నీకు రక్ష మనం దేశానికి రక్ష* అని నినదించారు.
పాఠశాల... ఘనంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసునీ కళ్యాణం జగిత్యాల ఆగస్టు 26 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుని కళ్యాణం వైభవో పెతంగా ఘనంగా జరిగింది .ఉదయం నుండి భక్తులు తండోపతండాలుగా ఆలయానికి చేరుకొని స్వాములను దర్శించుకున్నారు. కళ్యాణానికి వందలాది మంది భక్తులు హాజరైనారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ, నిర్వాహకులు అన్న ప్రసాదం అందించారు.... మా స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఎంఎస్ ఆర్ డి ఎఫ్) ఆధ్వర్యంలో 200 మొక్కలు నాటే కార్యక్రమం
సారంగాపూర్ 26(ప్రజా మంటలు)పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సారంగాపూర్ రంగపేట గ్రామంలో మా స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఎం ఆర్ ఎస్ డి ఎఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన 200 మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో, విజయవంతంగా ముగిసింది. ఈ హరిత యజ్ఞంలో ఫారెస్ట్ అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు... 