సైబర్ మోసాల,ట్రాఫిక్ నియమాలపై, విద్యార్థులకు అవగాహన సదస్సు
సైబర్ మోసాల,ట్రాఫిక్ నియమాలపై, విద్యార్థులకు అవగాహన సదస్సు
గొల్లపల్లి డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గొల్లపల్లి మండల లోని చిల్వకోడూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థులకు షీ టీం, కళాబృందం లతో ట్రాఫిక్ నియమాలు, గంజాయి వల్ల కలిగే అనర్ధాలు, సైబర్ మోసాల, నూతన చట్టాలు గురించి గొల్లపల్లి సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్.సతీష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ సిహెచ్ సతీష్, మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యం గా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఫొటో లు, వీడియోలు పోస్టుచేసే ముందు వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసు కోవాలని సూచించారు. విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ నియమాలు తెలిసినప్పుడే రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించగలుగుతామని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయని వీటిపై అవగాహన కలిగి వుండాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీబాయి హెడ్ కానిస్టేబుల్ తుమ్మ గణేష్ ,చంద్రయ్య పోలీసు సిబ్బంది, షీ టీమ్, కళాబృందం సభ్యులు విద్యార్థిని విద్యార్ధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
