తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు "రిటర్న్ గిఫ్ట్" సీనియర్ సిటిజన్ యాక్ట్*
భీమదేవరపల్లి నవంబర్ 4 (ప్రజామంటలు) :
తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోని కొడుకులకు సీనియర్ సిటిజన్ యాక్ట్ రిటర్న్ గిఫ్టు లాంటిది. ఆధునిక సమాజంలో నేటి యువత మానవ సంబంధాలు మంటగలుపుతున్న నేపథ్యంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సీనియర్ సిటిజెన్ యాక్ట్ ఒక వరం. వివరాల్లోకి వెళితే భీమదేవరపల్లి మండలంలోని ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజ కొమురయ్య తన ఒక్కగానొక్క కొడుకు రవికి 4.12 ఎకరాల భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. కొంతకాలం తర్వాత తండ్రి బాగోగులు చూడడం మానేసి, మానసికంగా వేధించడం, చేయి చేసుకోవడంతో రాజ కొమురయ్య కలత చెంది ఓ రైస్ మిల్లులో వాచ్మెన్ గా పనిచేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. సీనియర్ సిటిజన్ ఆక్ట్ ద్వారా స్థానిక తాసిల్దార్ కు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా భీమదేవరపల్లి తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, విచారణ అనంతరం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దుచేసి సంబంధిత ధ్రువపత్రాలను తండ్రి రాజకొమురయ్యకు అప్పగించినట్లు తెలిపారు. తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఎవరైనా సీనియర్ సిటిజన్ యాక్ట్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
