తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు "రిటర్న్ గిఫ్ట్" సీనియర్ సిటిజన్ యాక్ట్*
భీమదేవరపల్లి నవంబర్ 4 (ప్రజామంటలు) :
తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోని కొడుకులకు సీనియర్ సిటిజన్ యాక్ట్ రిటర్న్ గిఫ్టు లాంటిది. ఆధునిక సమాజంలో నేటి యువత మానవ సంబంధాలు మంటగలుపుతున్న నేపథ్యంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సీనియర్ సిటిజెన్ యాక్ట్ ఒక వరం. వివరాల్లోకి వెళితే భీమదేవరపల్లి మండలంలోని ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజ కొమురయ్య తన ఒక్కగానొక్క కొడుకు రవికి 4.12 ఎకరాల భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. కొంతకాలం తర్వాత తండ్రి బాగోగులు చూడడం మానేసి, మానసికంగా వేధించడం, చేయి చేసుకోవడంతో రాజ కొమురయ్య కలత చెంది ఓ రైస్ మిల్లులో వాచ్మెన్ గా పనిచేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. సీనియర్ సిటిజన్ ఆక్ట్ ద్వారా స్థానిక తాసిల్దార్ కు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా భీమదేవరపల్లి తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, విచారణ అనంతరం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దుచేసి సంబంధిత ధ్రువపత్రాలను తండ్రి రాజకొమురయ్యకు అప్పగించినట్లు తెలిపారు. తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఎవరైనా సీనియర్ సిటిజన్ యాక్ట్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
