బీసీ నాయకుల చే బీసీ కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
కరీంనగర్ నవంబర్ 1 (ప్రజా మంటలు) :
తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ కి మెమోరాండం అఫిడవిట్ సమర్పించిన జగిత్యాల జిల్లా బీసీ నాయకులు...
విషయం: తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు గత 76 సంవత్సరాలుగా వెనుకబడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బి సి లకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బి సి లకు ఇస్తున్న పథకాలకు చట్టబద్ధత కల్పించాలని విన్నపం.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...... తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీల వారితో పోల్చుకుంటే 76 సంవత్సరాలనుండి అన్యాయం జరుగుతున్నది.
ప్రధానంగా గత పది సంవత్సరాల కాలంలో బి సి- ఎం బి సి కార్పొరేషన్ లు ఏర్పాటు చేసినప్పటికీ అమలు విషయానికి వస్తే చాలా అన్యాయం జరుగుతుంది.
బి సి- ఎం బి సి లను బాగుపరుస్తామని చెప్పిన గత ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వకపోవడం తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన కులవృత్తుల వారు నానా ఇబ్బందులకు గురైనారు.
బి సి ల బతుకు దుర్భరంగా మారాయి. కుల వృత్తులకు ఆదరణ కరువైంది. ఇప్పటికైనా మేం ప్రతిపాదిస్తున్న ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకొని వాటి అమలుకు తగు చట్ట పరిధిలో చర్యలు చేపట్టడం ఆదేశించగలరని మా యొక్క అభ్యర్థన.
- తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి చట్టబద్ధత చేయాలి.
- రాష్ట్రంలోని కులవృత్తుల వారికి బి సి కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలి.
- బి సి ఉద్యోగులకు ప్రమోషన్లలో 42% రిజర్వేషన్ కల్పించాలి.
- రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణనను చేపట్టి చట్టబద్ధత కల్పించాలి.
- పార్టీలకు అతీతంగా ఆయా పార్టీలలో పనిచేస్తున్న బి సి నాయకులకు తప్పకుండా వారికి 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు అవకాశం ఇవ్వాలి.
- తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 66% బి సి లము "మేమెంతో మాకంతవాటా" అనే నినాదం అమలు చేయాలి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ, నియోజకవర్గ అధ్యక్షురాలు బిసి సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు గుంటి గంగారాం, బిసి సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు నులుగొండ సురేష్, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాజస్థాన్లో ఇండో-పాక్ సరిహద్దు అలర్ట్: పాకిస్తానీ వ్యక్తి అరెస్ట్
బార్మేర్ జిల్లాలో బీఎస్ఎఫ్ అప్రమత్తతతో పట్టుబడిన ఇన్ట్రూడర్
న్యూ ఢిల్లీ/ బార్మేర్ నవంబర్ 27:
రాజస్థాన్లోని బార్మేర్ జిల్లా ఇండో-పాక్ సరిహద్దు వద్ద పాకిస్తాన్కు చెందిన ఒక వ్యక్తి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం స్థానికులు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని గమనించి, వెంటనే బీఎస్ఎఫ్కు సమాచారం ఇవ్వడంతో అతను... పాత 5 రూపాయల నోట్లకు బంగారుతో సమాన విలువ! మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులే
– ఎలా అంటే?
పాత నోట్లను చాలామంది పెద్దగా పట్టించుకోరు. అవసరం లేని కాగితాల్లా భావించి ఎవరికైనా ఇచ్చేస్తారు లేదా చెత్తబస్తాలో వేసేస్తారు. కానీ మీ దగ్గర ఉన్న కొన్ని ప్రత్యేకమైన పాత నోట్లు ఇప్పుడు మార్కెట్లో లక్షలు తెచ్చిపెడుతున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు.
786 సీరియల్ నంబర్ నోట్లకు గోల్డ్ రేట్!... Mundhra (1958) vs LIC-Adani (2024–25): ఒకే పాత రాజకీయ మూత — ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?
స్వతంత్ర భారతదేశంలో మొదటి అతిపెద్ద స్కాం ఆర్థిక మంత్రి రాజీనామాకు దారితీసింది అప్పుడు. మరి ఇప్పుడో?
ఒకే పేరుతో — ఒక శతాబ్దం తర్వాత అదే కథ: Mundhra (1958) vs LIC-Adani (2024–25) — నల్లజాడలో ప్రభుత్వ మూత
1958 ముద్ర LIC స్కాం
1958లో జరిగిన Mundhra అవినీతి-కుంభకోణం మన చరిత్రలో ఒక... UK బడ్జెట్ ఆన్లైన్లో ముందే లీక్ – బ్రిటన్ పార్లమెంట్లో రాజకీయ కలకలం
లండన్, నవంబర్ 27:
బ్రిటన్లో 2025–26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రకటనకు కేవలం 40 నిమిషాల ముందే ఆర్థిక అంచనాల పూర్తి పత్రాలు అధికారిక వెబ్సైట్లో కనిపించడంతో భారీ వివాదం చెలరేగింది. సాధారణంగా పార్లమెంట్లో ఛాన్స్లర్ బడ్జెట్ ప్రసంగం చేసిన తర్వాతే ఈ పత్రాలు విడుదల కావాలి.
అయితే Office for Budget Responsibility (OBR)... ఆలయ పరిసరప్రాంతంలో విద్యుత్ షాక్ తో బాలిక మృతి
(అంకం భూమయ్య )
గొల్లపల్లి నవంబర్ 26 (ప్రజా మంటలు):
కొడిమ్యాల గ్రామానికి చెందిన తిప్పరవేణి నాగరాజు సం (38) కొడిమ్యాల పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశారు.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, నవంబర్ 25, రాత్రి సమయంలో కొడిమ్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం కార్యక్రమంలో కుమార్తె... మలేషియా కాంట్రాక్టర్ లీ సీన్ ఆత్మహత్య - జ్ఞానేశ్ కుమార్ ఆత్మహత్య నోటులో వచ్చిన ఒక పేరు
ఇప్పుడు భారత ప్రజాస్వామ్యానికి తలపై కూర్చున్న నీడ
భారత ప్రజాస్వామ్యం చాలా పెద్దది అని చెప్తాం.కానీ అది ఎంత బలహీనమో తెలుసుకోవాలంటే —ఒక పేరును మాత్రమే చూడాలి:జ్ఞానేశ్ కుమార్ గుప్తా.
2006లో మలేషియా ఇంజినీర్ Lee See Ben ఆత్మహత్య చేసుకున్నాడు.అతను తన నోట్లో స్పష్టంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల ఒత్తిడి... హాంకాంగ్ అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం – 13 మంది మృతి
హాంకాంగ్ నవంబర్ 26:
హాంకాంగ్ నగరంలోని ఒక బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లో జరిగిన భయంకర అగ్ని ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అగ్ని ప్రమాదం భవనం 10వ అంతస్తులో ప్రారంభమై క్షణాల్లోనే పై అంతస్తులకు వ్యాపించింది. రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించి చిక్కుకున్నవారిని బయటకు... జగిత్యాలలో BRS దీక్ష దివస్ సన్నాహక సమావేశం
జగిత్యాల, నవంబర్ 26 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా BRS పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న జరగనున్న దీక్ష దివస్ కార్యక్రమం సందర్భంగా సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాయకత్వంలో జరిగిన ఈ సమావేశానికి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ... బీసీలకు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ – రిజర్వేషన్లపై కవిత ఆరోపణలు, తీవ్ర విమర్శలు
హైదరాబాద్, నవంబర్ 26 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలకు ద్రోహం చేసిన పార్టీగా అభివర్ణించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులో బీసీలను ఉద్దేశపూర్వకంగా మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కులగణనలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు లెక్కలు చూపించడంతో బీసీ రిజర్వేషన్లు భారీగా తగ్గిపోయాయని కవిత... స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు – ఇబ్రహీంపట్నంలో వాహన తనిఖీలు
ఇబ్రహీంపట్నం, నవంబర్ 26 (ప్రజా మంటలు దగ్గుల అశోక్)
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమలులో భాగంగా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గండి హనుమాన్ చెక్పోస్ట్లో బుధవారం నుంచి పోలీసులు వాహన తనిఖీలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ మాట్లాడుతూ—ఎలాంటి సరైన... స్కందగిరి ఆలయంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి
సికింద్రాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు )
సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా వేలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులు స్వామివారి సన్నిధిలో తమ... నవంబర్ 28న జగిత్యాలలో వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలు
జగిత్యాల, నవంబర్ 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (పాత బస్ స్టాండ్)లో ఈ నెల నవంబర్ 28వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలు, కన్సల్టేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా... 