బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం

ఈ నెల 3న "లోకాయుక్త" లో విచారణ

On
బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం

ఈ నెల 3న "లోకాయుక్త" లో విచారణ
బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం
 లోకాయుక్త కు కూడా తప్పుడు నివేదికలు అందజేసిన జిల్లా ఉన్నతాధికారులు

బుగ్గారం/ జగిత్యాల అక్టోబర్ 01:: 

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో జరిగిన "అధికారుల నిర్లక్ష్యం" పై ఈ నెల 3న లోకాయుక్త లో విచారణ జరుగనుంది. ఈ మేరకు లోకాయుక్త రిజిస్ట్రార్ జారీ చేసిన నోటీసులు పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి కి అందాయి. మంగళ వారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులు బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం పై లోకాయుక్త కు కూడా తప్పుడు సమాచారంతో కూడిన నివేదికలు అందజేశారని
ఆరోపించారు.
లోకాయుక్త సూచనల మేరకు అట్టి నివేదికలపై అభ్యంతరాలను ఈ నెల 3న లోకాయుక్త రిజిస్ట్రార్ కు అందజేయనున్నట్లు ఆయన వివరించారు.
2020 నుండి నేటి వరకు జిల్లా, డివిజనల్, మండల పంచాయతీ అధికారులు సాగదీస్తూ చట్టపరంగా సరైన చర్యలు చేపట్టలేదన్నారు. అవినీతి - అక్రమాలకు పాల్పడ్డ
అధికారుల్లో పెరిగిపోయిన నిర్లక్ష్యం వల్లే బుగ్గారం జి.పి.లో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని చుక్క గంగారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు లోకాయుక్త ఆదేశాలను కూడా సక్రమంగా పాటించకుండా తప్పుడు సమాచారంతో కూడిన నివేదికలు అందజేయడం వారి అవినీతికి నిలువెత్తు అద్దం పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఆదేశించి జారీ చేసిన 18 ఆర్డర్లకు కూడా జిల్లా పంచాయతీ అధికారులు సమాచారం ఇవ్వకపోవడం శోషణీయం అన్నారు. అనేక సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జారీ చేయబడిన ఆదేశాలను సైతం జిల్లా పంచాయతీ అధికారులు బే - ఖాతర్ చేశారని ఆరోపించారు. విచారణ అధికారులు రాజకీయాలకు, ఇతర ప్రలోభాలకు లోనై సరైన విధంగా విచారణ జరుపలేదన్నారు. అధికారులు జరిపిన విచారణలో కూడా వాస్తవాలను కప్పి పుచ్చి తప్పుడు సమాచారం అందించారని వివరించారు. నిధుల దుర్వినియోగం పై పోరాటం చేస్తున్న తనపై ఎన్నెన్నో కుట్రలు - కుతంత్రాలు జరిగాయన్నారు. తనను అణగ త్రొక్కేందుకు అనేక ప్రయత్నాలతో పాటు భౌతిక దాడులు కూడా చేసి హత్యాయత్నాలు, సుపారి హత్యకు కూడా తీవ్ర ప్రయత్నాలు కొనసాగించారని తెలిపారు. బుగ్గారం జి.పి. నిధుల దుర్వినియోగంలో పూర్తి స్థాయి న్యాయం జరిగేంత వరకు తన న్యాయ పోరాటం ఆపేది లేదని, గ్రామ ప్రజల ఆశీస్సులు, సంపూర్ణ మద్దతు తనకు ఉందని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  Sports  International  

మూడు టీ20 మ్యాచ్‌ల్లో  అభిషేక్ శర్మ వరుసగా డక్ అవుట్

మూడు టీ20 మ్యాచ్‌ల్లో  అభిషేక్ శర్మ వరుసగా డక్ అవుట్ అహ్మదాబాద్ ఫిబ్రవరి 18: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో శూన్య పరుగులకే అవుట్ కావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆయా మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి: 1️⃣ భారత్ – అమెరికా వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం ఎవరి బౌలింగ్‌లో: షాడ్లీ వాన్ షాల్క్విక్ ఎన్ని బంతులు:...
Read More...
National  Local News  International  

ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ.. ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు బ్రిటిష్ పౌరుడు

ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ.. ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు బ్రిటిష్ పౌరుడు సికింద్రాబాద్‌, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు): 130 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌లో మరణించిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఇంగ్లండ్‌కు చెందిన రాబిన్ డిక్సన్ హైదరాబాద్‌కు వచ్చారు. దాదాపు 19 ఏళ్ల అన్వేషణ ఎట్టకేలకు ఫలించడంతో, పూర్వీకుడి సమాధి వద్ద భావోద్వేగంతో నివాళులర్పించారు. రాబిన్ డిక్సన్ తన కుటుంబ పాత దస్త్రాల ద్వారా తన ముత్తాత...
Read More...
Crime  State News 

చంచల్‌గూడా జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి

చంచల్‌గూడా జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు): ఐబొమ్మ వ్యవహారంలో అరెస్టై సుమారు 90 రోజులుగా జైలులో ఉన్న ఐబొమ్మ రవి కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ ఉత్తర్వుల నేపథ్యంలో రవిని చంచల్‌గూడా జైలు అధికారులు విడుదల చేశారు. ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వహణకు సంబంధించి రవిపై మొత్తం ఐదు...
Read More...
National  Spiritual  

నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు): పవిత్ర రంజాన్ నెలవంక భారత్‌లో నిన్న దర్శనమివ్వడంతో, ముస్లిం సోదరులు ఈరోజు (గురువారం) నుంచి రంజాన్ ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. నెల రోజుల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసాలు పాటిస్తూ, అల్లాహ్‌కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. రంజాన్ మాసం ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది....
Read More...
Local News 

నియోజకవర్గ సర్పంచులకు న్యాక్ కేంద్రంలో దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నియోజకవర్గ సర్పంచులకు న్యాక్ కేంద్రంలో దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 18 ( ప్రజా మంటలు)తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆద్వర్యం లో జగిత్యాల న్యాక్ కేంద్రం లో జగిత్యాల నియోజకవర్గ సర్పంచుల ఓరియంటేషన్ 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులకు దిశానిర్దేశం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ...
Read More...
Crime  State News 

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ – మార్చి 3 వరకు రిమాండ్

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ – మార్చి 3 వరకు రిమాండ్ క్యాతనపల్లి, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు): మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను క్యాతనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎంపిక సందర్భంగా జరిగిన గందరగోళంలో పోలీసులపై దాడి చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం, చైర్మన్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు...
Read More...
National  State News 

బయోఏషియా–2026 వేదికగా హైదరాబాద్‌ను ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

బయోఏషియా–2026 వేదికగా హైదరాబాద్‌ను ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను ఇకపై ప్రపంచ జీవవిజ్ఞాన (Life Sciences) రాజధానిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. BioAsia–2026 అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన 23వ బయోఏషియా సదస్సును పరిశ్రమల శాఖ మంత్రి ...
Read More...
State News 

తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16 నుంచి పాఠశాలలను ఒంటిపూటగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తించనుంది. అధికారుల ప్రకారం ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం...
Read More...
Local News  State News 

ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికలకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి : మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికలకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి : మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
Read More...
State News 

చిన్న పత్రికలపై వివక్షపై నిరసన : సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన

చిన్న పత్రికలపై వివక్షపై నిరసన : సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ గుర్తింపు ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు, ఎంప్యానల్‌మెంట్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. టీడబ్ల్యూజేఎఫ్ ఇచ్చిన “ఛలో సమాచార భవన్” పిలుపు...
Read More...
Local News 

జగిత్యాలలో అర్ధరాత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు

జగిత్యాలలో అర్ధరాత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు    జగిత్యాల, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):జిల్లాకేంద్రంలోని టవర్ సర్కిల్‌తో పాటు పలు ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 72వ జన్మదిన వేడుకలు, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు టవర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి...
Read More...
Local News 

కేసీఆర్ జన్మదినం సందర్భంగా జగిత్యాలలో సేవా కార్యక్రమాలు

కేసీఆర్ జన్మదినం సందర్భంగా జగిత్యాలలో సేవా కార్యక్రమాలు జగిత్యాల ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ధరూర్ క్యాంప్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్...
Read More...