బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం
ఈ నెల 3న "లోకాయుక్త" లో విచారణ
ఈ నెల 3న "లోకాయుక్త" లో విచారణ
బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం
లోకాయుక్త కు కూడా తప్పుడు నివేదికలు అందజేసిన జిల్లా ఉన్నతాధికారులు
బుగ్గారం/ జగిత్యాల అక్టోబర్ 01::
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో జరిగిన "అధికారుల నిర్లక్ష్యం" పై ఈ నెల 3న లోకాయుక్త లో విచారణ జరుగనుంది. ఈ మేరకు లోకాయుక్త రిజిస్ట్రార్ జారీ చేసిన నోటీసులు పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి కి అందాయి. మంగళ వారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులు బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం పై లోకాయుక్త కు కూడా తప్పుడు సమాచారంతో కూడిన నివేదికలు అందజేశారని
ఆరోపించారు.
లోకాయుక్త సూచనల మేరకు అట్టి నివేదికలపై అభ్యంతరాలను ఈ నెల 3న లోకాయుక్త రిజిస్ట్రార్ కు అందజేయనున్నట్లు ఆయన వివరించారు.
2020 నుండి నేటి వరకు జిల్లా, డివిజనల్, మండల పంచాయతీ అధికారులు సాగదీస్తూ చట్టపరంగా సరైన చర్యలు చేపట్టలేదన్నారు. అవినీతి - అక్రమాలకు పాల్పడ్డ
అధికారుల్లో పెరిగిపోయిన నిర్లక్ష్యం వల్లే బుగ్గారం జి.పి.లో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని చుక్క గంగారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు లోకాయుక్త ఆదేశాలను కూడా సక్రమంగా పాటించకుండా తప్పుడు సమాచారంతో కూడిన నివేదికలు అందజేయడం వారి అవినీతికి నిలువెత్తు అద్దం పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఆదేశించి జారీ చేసిన 18 ఆర్డర్లకు కూడా జిల్లా పంచాయతీ అధికారులు సమాచారం ఇవ్వకపోవడం శోషణీయం అన్నారు. అనేక సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జారీ చేయబడిన ఆదేశాలను సైతం జిల్లా పంచాయతీ అధికారులు బే - ఖాతర్ చేశారని ఆరోపించారు. విచారణ అధికారులు రాజకీయాలకు, ఇతర ప్రలోభాలకు లోనై సరైన విధంగా విచారణ జరుపలేదన్నారు. అధికారులు జరిపిన విచారణలో కూడా వాస్తవాలను కప్పి పుచ్చి తప్పుడు సమాచారం అందించారని వివరించారు. నిధుల దుర్వినియోగం పై పోరాటం చేస్తున్న తనపై ఎన్నెన్నో కుట్రలు - కుతంత్రాలు జరిగాయన్నారు. తనను అణగ త్రొక్కేందుకు అనేక ప్రయత్నాలతో పాటు భౌతిక దాడులు కూడా చేసి హత్యాయత్నాలు, సుపారి హత్యకు కూడా తీవ్ర ప్రయత్నాలు కొనసాగించారని తెలిపారు. బుగ్గారం జి.పి. నిధుల దుర్వినియోగంలో పూర్తి స్థాయి న్యాయం జరిగేంత వరకు తన న్యాయ పోరాటం ఆపేది లేదని, గ్రామ ప్రజల ఆశీస్సులు, సంపూర్ణ మద్దతు తనకు ఉందని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర
తిరుమల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
టీటీడీ ఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న ముద్దాడ రవిచంద్ర తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో వీరభద్రం, సీవీఎస్ఓ మురళీకృష్ణ, సీపీఆర్ఓ రవి స్వాగతం పలికారు.
ఈరోజు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ముద్దాడ రవిచంద్ర అధికారికంగా టీటీడీ ఈఓగా... బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యక్తికి టికెట్ ఎలా?
హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు పిటిషన్ వేసిన బుట్టంగారి మాధవ్ రెడ్డికి బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఇది బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకమన్న స్పష్టమైన సంకేతమని ఆమె వ్యాఖ్యానించారు.
బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం... ఘాజియాబాద్ బాలికల మృతి కేసు: ‘కొరియన్ సంస్కృతి’ నుంచి దూరం చేశారనే వేదనతో లేఖ
ఘాజియాబాద్ ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):
ఘాజియాబాద్లో ముగ్గురు అక్కాచెల్లెలు మృతి చెందిన ఘటనలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. 'ది హిందూ' పత్రిక ప్రచురించిన సమాచారం మేరకు, వారికి లభించిన లేఖ ప్రకారం, తమ మూడేళ్ల చిన్న అర్ధసోదరికి “తమ కొరియన్ సంస్కృతి” నేర్పించనివ్వలేదనే బాధను బాలికలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
లేఖలో,... మునిసిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాం ఎమ్మెల్సీ ఎల్. రమణ
జగిత్యాల ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణంలో పలు వార్డులో BRS పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్సీ ఎల్ రమణ మరియు మాజీ మంత్రి రాజేశం గౌడ్ మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత తో కలిసి ప్రచారం లో గురువారం రాత్రి 7 గంటలకు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ... ఘాజియాబాద్లో ముగ్గురు బాలికల ఆత్మహత్య
ఘాజియాబాద్ / ఢిల్లీ, (ప్రజా మంటలు):
ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ సంఘటన కుటుంబాలు, పాఠశాలలు, మానసిక ఆరోగ్య నిపుణులను కలవరపాటుకు గురి చేసింది.
ఈ ఘటనపై స్పందించిన బాలికల తండ్రి, తమ పిల్లల మృతికి కొరియన్ కల్చర్ ప్రభావమే కారణమని... 39వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొలుసాని శ్రీనివాస్ జోరుగా ప్రచారం
జగిత్యాల ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలోని 39 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోలు సాని శ్రీనివాస్ ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా చేతి గుర్తుపై తనకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు.
స్థానిక సమస్యల పరిష్కారంలో తాను వార్డులోనే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.... వరంగల్–కరీంనగర్ జంట నగరాల అభివృద్ధికి బృహత్ ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):
వరంగల్–కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికను రూపొందించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెండు పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లు పూర్తి చేయడంతో పాటు, వాటిని అనుసంధానించే రహదారులను విస్తరించనున్నట్లు చెప్పారు. రెండు నగరాల మధ్య భారీ డంప్ యార్డు ఏర్పాటు చేసి, అక్కడే విద్యుత్... రాయికల్ పలు వార్డులలో అభ్యర్థులకు మద్దతుగా డా బోగ శ్రావణి ఇంటింట ప్రచారం
రాయికల్ ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మున్సిపల్ 8వ వార్డ్ అభ్యర్థి మచ్చ నారాయణ మరియు 12వ వార్డ్ అభ్యర్థి కల్లెడ చిన్న ధర్మపురి కి మద్దతుగా అదేవిధంగా రాయికల్ పదవ వార్డు అభ్యర్థి ఆడెపు ప్రశాంతి మరియు 11వ వార్డు అభ్యర్థి పుర్రె శ్రీధర్... ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా.
జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ 40వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి
స్థానికంగా ఉంటూ ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటా.. జగిత్యాల పట్టణ 40వ వార్డు తన కుటుంబంగా భావిస్తాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా తక్షణమే స్పదింస్తా.. మరోమారు ఆశీర్వదించండి.... జగిత్యాల పట్టణం 3వ వార్డులో కారు అభ్యర్థికి జోరుగా ప్రచారం
జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)పట్టణం 3వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుమ్మడి సత్యం గౌడ్ కి మద్దతుగా ఇంటింటా తిరిగి ప్రచారం చేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ . ఏ ఇంటి గడప తట్టిన కూడా కేసీఆర్ పై అభిమానం తగ్గలేదని పేద ప్రజల... అనిల్ అంబానీ–ఇప్స్టీన్ ఫైల్ విశ్లేషణ: మోదీ, హార్దీప్ సింగ్ పూరి సంబంధాలు
అనిల్ అంబాని–జెఫ్రీ ఇప్స్టీన్ ఫైల్: మోదీ, హార్దీప్ సింగ్ పూరి సంబంధాలపై సంక్షిప్తంగా, సమగ్ర విశ్లేషణ
గత రెండు మూడు నెలలుగా, అమెరికాకు చెందిన నేరస్తుడు, దళారీ జాఫ్రీ ఎప్స్టీన్ మరియు అనెక మంది దేశాధినేతలతో, పారిశ్రామికవేత్తలతో, ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉన్నాడని, అనేక అరాచకాలు చేశాడని నేరారోపణలు ప్రచారంలో ఉన్నాయి.
.ఇతనికి శిక్ష... న్యాయవాది స్వప్న హత్య నిందితులకు వెంటనే శిక్ష విధించాలి: మెట్పల్లి బార్ అసోసియేషన్
మెట్పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు న్యాయవాది స్వప్న హత్యకు పాల్పడిన నిందితులకు వెంటనే కఠిన శిక్ష విధించాలని మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
స్వప్న హత్యను నిరసిస్తూ గురువారం మెట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అనంతరం... 