బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం

ఈ నెల 3న "లోకాయుక్త" లో విచారణ

On
బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం

ఈ నెల 3న "లోకాయుక్త" లో విచారణ
బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం
 లోకాయుక్త కు కూడా తప్పుడు నివేదికలు అందజేసిన జిల్లా ఉన్నతాధికారులు

బుగ్గారం/ జగిత్యాల అక్టోబర్ 01:: 

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో జరిగిన "అధికారుల నిర్లక్ష్యం" పై ఈ నెల 3న లోకాయుక్త లో విచారణ జరుగనుంది. ఈ మేరకు లోకాయుక్త రిజిస్ట్రార్ జారీ చేసిన నోటీసులు పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి కి అందాయి. మంగళ వారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులు బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం పై లోకాయుక్త కు కూడా తప్పుడు సమాచారంతో కూడిన నివేదికలు అందజేశారని
ఆరోపించారు.
లోకాయుక్త సూచనల మేరకు అట్టి నివేదికలపై అభ్యంతరాలను ఈ నెల 3న లోకాయుక్త రిజిస్ట్రార్ కు అందజేయనున్నట్లు ఆయన వివరించారు.
2020 నుండి నేటి వరకు జిల్లా, డివిజనల్, మండల పంచాయతీ అధికారులు సాగదీస్తూ చట్టపరంగా సరైన చర్యలు చేపట్టలేదన్నారు. అవినీతి - అక్రమాలకు పాల్పడ్డ
అధికారుల్లో పెరిగిపోయిన నిర్లక్ష్యం వల్లే బుగ్గారం జి.పి.లో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని చుక్క గంగారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు లోకాయుక్త ఆదేశాలను కూడా సక్రమంగా పాటించకుండా తప్పుడు సమాచారంతో కూడిన నివేదికలు అందజేయడం వారి అవినీతికి నిలువెత్తు అద్దం పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఆదేశించి జారీ చేసిన 18 ఆర్డర్లకు కూడా జిల్లా పంచాయతీ అధికారులు సమాచారం ఇవ్వకపోవడం శోషణీయం అన్నారు. అనేక సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జారీ చేయబడిన ఆదేశాలను సైతం జిల్లా పంచాయతీ అధికారులు బే - ఖాతర్ చేశారని ఆరోపించారు. విచారణ అధికారులు రాజకీయాలకు, ఇతర ప్రలోభాలకు లోనై సరైన విధంగా విచారణ జరుపలేదన్నారు. అధికారులు జరిపిన విచారణలో కూడా వాస్తవాలను కప్పి పుచ్చి తప్పుడు సమాచారం అందించారని వివరించారు. నిధుల దుర్వినియోగం పై పోరాటం చేస్తున్న తనపై ఎన్నెన్నో కుట్రలు - కుతంత్రాలు జరిగాయన్నారు. తనను అణగ త్రొక్కేందుకు అనేక ప్రయత్నాలతో పాటు భౌతిక దాడులు కూడా చేసి హత్యాయత్నాలు, సుపారి హత్యకు కూడా తీవ్ర ప్రయత్నాలు కొనసాగించారని తెలిపారు. బుగ్గారం జి.పి. నిధుల దుర్వినియోగంలో పూర్తి స్థాయి న్యాయం జరిగేంత వరకు తన న్యాయ పోరాటం ఆపేది లేదని, గ్రామ ప్రజల ఆశీస్సులు, సంపూర్ణ మద్దతు తనకు ఉందని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం... - ఎమ్మెల్యే సంజయ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం...  - ఎమ్మెల్యే సంజయ్ కుమార్    జగిత్యాల ఏప్రిల్ 26 (ప్రజా మంటలు) శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం లో ఆర్య వైశ్య సంఘం ఆద్వర్యం లో జయంతి వేడుకల్లో పాల్గొని పోచమ్మ ఆలయం నుండి వాసవి మాత ఆలయానికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతని పల్లకిలో తీసుకొచ్చే కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోసి ప్రత్యేక...
Read More...
Local News 

ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు

ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు జగిత్యాల ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)  జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో  వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు.*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత మాట్లాడుతూ*  వాసవీ మాత        
Read More...
Local News 

ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు

ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు    బుగ్గారం ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)  సర్పంచ్ లు గ్రామాలలో టామ్ - టామ్ చేయించాలి బుగ్గారం ఎస్సై జి.సతీష్  వేసవి కాలం కదా అని ఈత సరదాతో బావుల్లోకి, చెరువుళ్ళోకి  వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై జి.సతీష్ అన్నారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక...
Read More...
Local News  Crime 

పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి

పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు): పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో...
Read More...
Local News 

ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు . జగిత్యాల ఏప్రిల్ 26( ప్రజా మంటలు)వాల్మీకి ఆవాసం సేవాభారతి అధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆదివారం ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులో గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న  వాల్మీకి ఆవాసంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి...
Read More...
State News 

“తెలంగాణ వాదాన్ని ఎవరు చంపారు? ఎవరు కాపాడుతున్నారు?”

“తెలంగాణ వాదాన్ని ఎవరు చంపారు? ఎవరు కాపాడుతున్నారు?”    హైదరాబాద్, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ టీఆర్ఎస్ నేత నవీన్ ఆచారి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కవిత  ప్రకటించిన “తెలంగాణ రాష్ట్ర సేన” నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారిందని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు రూప్ సింగ్, నవీనాచరి, ఇస్మాయిల్, వరలక్ష్మి, తదితరులు విమర్శించారు....
Read More...
Local News 

ఉద్యమ స్ఫూర్తికి గౌరవం – ఎమ్మెల్సీగా కోదండరాం నియామకంపై శుభాకాంక్షల వెల్లువ

ఉద్యమ స్ఫూర్తికి గౌరవం – ఎమ్మెల్సీగా కోదండరాం నియామకంపై శుభాకాంక్షల వెల్లువ జగిత్యాల, ఏప్రిల్ 25 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్. కోదండరాం ఎమ్మెల్సీగా నియామకం కావడం పట్ల తెలంగాణ జన సమితి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ రథసారధిగా ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లిన ఆయనకు ఈ పదవి లభించడం సముచిత గౌరవమని...
Read More...
National  State News 

మన కేసీఆర్ కాదు… మారిన మనిషి!” – బీఆర్ఎస్‌పై తీవ్ర దాడి, కొత్త పార్టీతో అధికారమే లక్ష్యం

మన కేసీఆర్ కాదు… మారిన మనిషి!” – బీఆర్ఎస్‌పై తీవ్ర దాడి, కొత్త పార్టీతో అధికారమే లక్ష్యం హైదరాబాద్ ఏప్రిల్ 25 (ప్రజా మంటలు); తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపేలా జాగృతి నేత కేసీఆర్‌పై నేరుగా, నిర్భయంగా విరుచుకుపడ్డారు. “ఇవ్వాళ ఉన్నది మన కేసీఆర్ కాదు… మారిన మనిషి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో ప్రజల కోసం పోరాడిన నాయకుడు, ఇప్పుడు ప్రజలను పట్టించుకోని పాలకుడిగా మారిపోయాడని విమర్శించారు.నీళ్లు, నిధులు,...
Read More...
Local News 

ఘనంగా సత్య సాయి ఆరాధన మహోత్సవ వేడుకలు

ఘనంగా సత్య సాయి ఆరాధన మహోత్సవ వేడుకలు   జగిత్యాల ఏప్రిల్ 24 (ప్రజా మంటలు)భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆరాధన ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయము నగర సంకీర్తన అల్పాహార వితరణ రుద్ర పారాయణము రుద్రాభిషేకము మధ్యాహ్నం అర్హులైన వారికి వీల్ చైర్ ల పంపిణీ దుస్తుల...
Read More...
Local News 

జగిత్యాల మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులకు కౌన్సిల్ ఆమోదం

జగిత్యాల మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులకు కౌన్సిల్ ఆమోదం      జగిత్యాల ఏప్రిల్ 24 ( ప్రజా మంటలు)  పురపాలక సంఘం కార్యాలయంలో పురపాలక సంఘ అధ్యక్షురాలు  సమిండ్ల వాణి శ్రీనివాస్ అధ్యక్షతన కో-ఆప్షన్ ఎన్నికకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగినది. ఇట్టి సమావేశము కౌన్సిల్ సమావేశములో వీరబత్తిని పద్మజ, గట్టు సతీష్, తస్లీం సుల్తాన మరియు మహమ్మద్ అబ్దుల్ కదీర్ అలియాస్ ముజ్జు భాయి...
Read More...
Local News 

సహకార సంఘాలపై నామినేటెడ్ విధానం వెనక్కి తీసుకోవాలి: పిఎసిఎస్ మాజీ అధ్యక్షుల డిమాండ్

సహకార సంఘాలపై నామినేటెడ్ విధానం వెనక్కి తీసుకోవాలి: పిఎసిఎస్ మాజీ అధ్యక్షుల డిమాండ్ జగిత్యాల, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (DCCB)లకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానం తీసుకురావడం ప్రజాస్వామ్య విరుద్ధమని పిఎసిఎస్ తాజా మాజీ అధ్యక్షులు తీవ్రంగా విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పోతారం పిఎసిఎస్...
Read More...
Local News 

వరి ధాన్యం కుప్పలను పరిశీలించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

వరి ధాన్యం కుప్పలను పరిశీలించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత    సారంగాపూర్ ఏప్రిల్ 24 (ప్రజా మంటలు)  మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని వరి ధాన్య కుప్పలను రైతులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...నిన్న కురిసిన పడగళ్ల వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించి వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను తొందరగా...
Read More...