బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం
ఈ నెల 3న "లోకాయుక్త" లో విచారణ
ఈ నెల 3న "లోకాయుక్త" లో విచారణ
బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం
లోకాయుక్త కు కూడా తప్పుడు నివేదికలు అందజేసిన జిల్లా ఉన్నతాధికారులు
బుగ్గారం/ జగిత్యాల అక్టోబర్ 01::
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో జరిగిన "అధికారుల నిర్లక్ష్యం" పై ఈ నెల 3న లోకాయుక్త లో విచారణ జరుగనుంది. ఈ మేరకు లోకాయుక్త రిజిస్ట్రార్ జారీ చేసిన నోటీసులు పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి కి అందాయి. మంగళ వారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులు బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం పై లోకాయుక్త కు కూడా తప్పుడు సమాచారంతో కూడిన నివేదికలు అందజేశారని
ఆరోపించారు.
లోకాయుక్త సూచనల మేరకు అట్టి నివేదికలపై అభ్యంతరాలను ఈ నెల 3న లోకాయుక్త రిజిస్ట్రార్ కు అందజేయనున్నట్లు ఆయన వివరించారు.
2020 నుండి నేటి వరకు జిల్లా, డివిజనల్, మండల పంచాయతీ అధికారులు సాగదీస్తూ చట్టపరంగా సరైన చర్యలు చేపట్టలేదన్నారు. అవినీతి - అక్రమాలకు పాల్పడ్డ
అధికారుల్లో పెరిగిపోయిన నిర్లక్ష్యం వల్లే బుగ్గారం జి.పి.లో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని చుక్క గంగారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు లోకాయుక్త ఆదేశాలను కూడా సక్రమంగా పాటించకుండా తప్పుడు సమాచారంతో కూడిన నివేదికలు అందజేయడం వారి అవినీతికి నిలువెత్తు అద్దం పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఆదేశించి జారీ చేసిన 18 ఆర్డర్లకు కూడా జిల్లా పంచాయతీ అధికారులు సమాచారం ఇవ్వకపోవడం శోషణీయం అన్నారు. అనేక సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జారీ చేయబడిన ఆదేశాలను సైతం జిల్లా పంచాయతీ అధికారులు బే - ఖాతర్ చేశారని ఆరోపించారు. విచారణ అధికారులు రాజకీయాలకు, ఇతర ప్రలోభాలకు లోనై సరైన విధంగా విచారణ జరుపలేదన్నారు. అధికారులు జరిపిన విచారణలో కూడా వాస్తవాలను కప్పి పుచ్చి తప్పుడు సమాచారం అందించారని వివరించారు. నిధుల దుర్వినియోగం పై పోరాటం చేస్తున్న తనపై ఎన్నెన్నో కుట్రలు - కుతంత్రాలు జరిగాయన్నారు. తనను అణగ త్రొక్కేందుకు అనేక ప్రయత్నాలతో పాటు భౌతిక దాడులు కూడా చేసి హత్యాయత్నాలు, సుపారి హత్యకు కూడా తీవ్ర ప్రయత్నాలు కొనసాగించారని తెలిపారు. బుగ్గారం జి.పి. నిధుల దుర్వినియోగంలో పూర్తి స్థాయి న్యాయం జరిగేంత వరకు తన న్యాయ పోరాటం ఆపేది లేదని, గ్రామ ప్రజల ఆశీస్సులు, సంపూర్ణ మద్దతు తనకు ఉందని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత
హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
బోయిన్పల్లి మనోవికాస్ నగర్లోని ఎన్ఐఈపీఐడీలో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లితండ్రులతో తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లితండ్రులకు పెన్షన్తో పాటు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం కల్పించాలని... పార్టీ మారలేదంటే కేసీఆర్ సమావేశానికి రావాలి: దావ వసంత సురేష్
జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పార్టీ మారలేదని చెబుతున్నట్లయితే, రేపు హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే బీఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సవాల్ విసిరారు.
మంత్రి అడ్డూరి లక్ష్మణ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్యలు... నలబైఎళ్లుగా ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి కట్టబెడుతున్న గ్రామస్తులు
మక్తల్ డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
నలభై సంవత్సరాలుగా గ్రామస్తుల విశ్వాసాన్ని సొంతం చేసుకున్న వనజమ్మ కుటుంబానికే ఆ గ్రామ సర్పంచ్ పదవిని కట్టబెట్టడం విశేషం. గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి వరకు ఈ కుటుంబ సభ్యులే బాధ్యతలు చేపట్టుతూ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
ఐక్యతతో ముందుకు... పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి. -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు):
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం టీ.పి.సి.ఏ.ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అసోసియేషన్ కార్యాలయంలో పెన్షన్ నిబంధనలు-ప్రయోజనాలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
అనంతరం 2024... హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్
కోరుట్ల డిసెంబర్ 19|(ప్రజా మంటలు):
కోరుట్లకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ క్యాన్సర్తో మృతి చెందడంపై తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి మాజీ జెడ్పీటీసీ అడ్డగట్ల లలితలతో కలిసి... అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన... ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై ప్రజల సంతృప్తి_ గ్రామపంచాయతీ ఎన్నికల తీర్పు నిదర్శనం
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తున్న తీరుకు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు... భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు, ₹4,000 జరిమానా కీలక తీర్పును వెలువరించిన . జిల్లా సెషన్స్ జడ్జి రత్న పద్మావతి
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లం రాజేశ్వరి అనే మహిళ కు స్టంభంపల్లి గ్రామానికి చెందిన బొల్లం జగదీష్ను 2016 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, బొల్లం... కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు తాత్కాలికంగా రద్దు
న్యూఢిల్లీ డిసెంబర్ 19| (ప్రజా మంటలు):
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ ఏడాది అవార్డుల ప్రకటనకు ముందే అవార్డు జాబితా ఒక ఆంగ్ల పత్రికకు లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గురువారం(18 డిసెంబర్ ),మధ్యాహ్నం జరగాల్సిన సాహిత్య అకాడమీ మీడియా సమావేశాన్ని... ఆర్యుపిపి జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా వేల్పుల స్వామి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల రాజేంద్రప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 19 (|ప్రజా మంటలు):
రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం (ఆర్యుపిపిటీఎస్) ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శానమోని నర్సిములు, రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి సత్తిరాజు శశికుమార్ యాదవ్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా అల్లకట్టు సత్యనారాయణను... 