ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?
ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?
కొందరు బడా జర్నలిస్టులు అనేక చోట్ల లబ్ధి పొందినట్లుగా ఆరోపణలు
సీఎం రేవంత్ సార్..విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి
(మానసాని కృష్ణరెడ్డి సీనియర్ జర్నలిస్ట్)
జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు.వర్కింగ్ జర్నలిస్టులందరికి ఎలాంటి వివక్షత లేకుండా, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాల్సిందే.వారికి ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందే.ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇండ్ల జాగల పట్టాలను ఇవ్వడం అభినందించాల్సిందే.ఇందులో రెండో అంశానికి తావు లేదు.అయితే ఒక జర్నలిస్టుకు ఒకసారి మాత్రమే ఇండ్ల జాగలు ఇవ్వాలి.ఇది సహజ ధర్మం.అయితే ఇప్పటికే కొంతమంది రెండు మూడు ప్రదేశాల్లో ఇండ్ల స్థలాలు తీసుకుని ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలను పొందినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.కొన్ని జిల్లాలో ఇప్పటికే ఇండ్ల జాగలు తీసుకుని లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్లీ ఈ హౌజింగ్ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలు పొందినట్లుగా కొన్ని ఆరోపణలు రావడం మరి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళిందా ? లేక ఆయనకు తెలియకుండానే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు బడా జర్నలిస్టుల ముసుగులో అటు జిల్లాల్లో లబ్ధి పొంది ఇప్పుడు రాజధానిలో కూడా ఇండ్ల జాగలు దక్కించుకున్నట్లుగా గుసగుసలు విన్పిస్తున్నాయి.వీటన్నింటిపైన సమగ్ర దర్యాప్తు జరిపితే నిజానిజాలు తేలుతాయని అంటున్నారు.అలాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేసిన జర్నలిస్టుల ఇండ్ల జాగలపైన కూడా వివాదం నెలకొన్నదనే సమాచారం ఉన్నది.ఈ జాగ తమ పట్టా భూమి అని కొందరు న్యాయస్థానాలను తాజాగా ఆశ్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ రాష్ట్ర సీఎం పంపిణీ చేసిన జాగ వివాదాస్పద స్థలం కావడంపైన విస్మయం వ్యక్తమవుతోంది.అదేవిధంగా హైదరాబాద్లో ఇండ్ల జాగలు పొందిన జర్నలిస్టుల్లో అధిక శాతం పక్కరాష్ట్ర పాత్రికేయులేననే ప్రచారం కూడా ఉన్నది. ఓ వర్గ లాబీమేరకే ప్రభుత్వం ఈ విషయంలో ముందుపడి కార్యక్రమాన్ని పూర్తి చేసిందని అంటున్నారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకుండా, ఇండ్ల జాగలు పొందకుండా ఉన్నారు.ఎన్నో యేండ్లుగా వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదని,కానీ కొందరు మాత్రం రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు దక్కించుకోగలిగారని ఇదెక్కడి న్యాయం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి నిష్పక్షపాతంగా విచారణ చేపడితే అన్ని వ్యవహరాలు బయటపడతాయాని పలువురు జర్నలిస్టులు అంటున్నారు.మరి నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని జర్నలిస్టు సర్కిల్లో చర్చ నడుస్తోంది.
-------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
జింబాబ్వేలో భూస్వాధీనాల బాధిత తెల్లజాతి రైతులు: పరిహారం కోసం అమెరికా జోక్యం కోరుతున్నారా?
జింబాబ్వేలో 2000వ దశకంలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన హింసాత్మక భూస్వాధీన విధానాల వల్ల వేలాది మంది తెల్లజాతి రైతులు తమ భూములు, ఉపాధి కోల్పోయారు. ఈ రైతులకు పరిహారం చెల్లిస్తామని జింబాబ్వే ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు.
ఈ నేపథ్యంలో, బాధిత రైతులు ఇప్పుడు అమెరికా ప్రభుత్వ జోక్యాన్ని కోరుతున్నారు.... ట్రంప్ ఆస్తులపై న్యూయార్క్ కోర్టు జప్తు చర్యలు
న్యూయార్క్ జనవరి 25:
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ఆస్తులను న్యూయార్క్ కోర్టు జప్తు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ట్రంప్ సంస్థలపై నమోదైన భారీ ఆర్థిక మోసం కేసులో కోర్టు పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. అధికారంలో ఉన్న దేశాధ్యక్షుని ఆస్తులు జప్తు చేయాలని కోర్ట్ ప్రకటించడం అమెరికా చరిత్రలోనే... మామల్లపురంలో విజయ్ పార్టీ కార్యకర్తల సమావేశం
చెన్నై / మామల్లపురం జనవరి 25:
తమిళనాడులోని మామల్లపురం (మహాబలిపురం)లో నిర్వహిస్తున్న తన పార్టీ కార్యకర్తల సమావేశంలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు రాబోయే ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చ జరగనుంది.
తాజాగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విజయ్, పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడంపై... జాగ్రత్త! వందేమాతరం గౌరవంలో చిన్న తప్పుకు కూడా భారీ మూల్యం చెల్లించాలి
న్యూఢిల్లీ జనవరి 25 (ప్రజా మంటలు):
భారతదేశంలో త్వరలోనే **జాతీయ గీతం ‘వందేమాతరం’**కు సంబంధించిన నియమాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు జన గణ మన (జాతీయ గీతం) సమయంలో మాత్రమే కఠిన ప్రోటోకాల్, చట్టపరమైన బాధ్యతలు ఉండేవి. అయితే ఇకపై కేంద్ర ప్రభుత్వం వందేమాతరానికి కూడా అదే స్థాయి గౌరవం, చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లు... నిజామాబాద్లో గంజాయి ముఠా దాడి: మహిళా కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం
నిజామాబాద్, జనవరి 25 (ప్రజా మంటలు):
నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో మహిళా కానిస్టేబుల్ సౌమ్యపై గంజాయి ముఠా దారుణంగా దాడి చేసింది. కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను ఆపేందుకు ప్రయత్నించిన సమయంలో నిందితులు సౌమ్యను ఢీకొట్టి, ఆమె కడుపు మీద నుంచి కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో... పాశ్చాత్య ప్రభావంతో లివ్-ఇన్ సంబంధాలు : విఫలం తర్వాత కేసులు
అలహాబాద్, జనవరి 24 ప్రత్యేక ప్రతినిధి):పాశ్చాత్య ఆలోచనల ప్రభావంతో యువత వివాహం లేకుండా లివ్-ఇన్ సంబంధాల్లోకి వెళ్తోందని, అలాంటి సంబంధాలు విఫలమైన తర్వాత అత్యాచారం వంటి కేసులు నమోదు అవుతున్నాయని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'లైవ్ లా' లో ప్రచురించిన కథనం ప్రకారం, మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాల ఆధారంగా... డీఎంకే వైపు ఏఐఏడీఎంకే నేతల వలస
తమిళనాడులోని ముఖ్యమైన పార్టీల గుర్తులు
చెన్నై, జనవరి 24 (ప్రత్యేక ప్రతినిధి):
తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే వైపు ఏఐఏడీఎంకేకు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుతున్నారు. గత ఆరు నెలల్లో మాజీ మంత్రి–ఎంపీ అన్వర్ రాజా, మాజీ ఎంపీ వి. మైత్రేయన్, మాజీ ఎమ్మెల్యే కార్తిక్ తొండైమాన్ సహా,... జపాన్లో ఎన్నికల సమరానికి సానే తకైచి పాంక్నిర్ణయం
టోక్యో జనవరి 24:
జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) నాయకురాలు మరియు 104వ ప్రధాన మంత్రి సానే తకైచి, గత అక్టోబర్లో పదవీ స్వీకరించినప్పటికీ, పార్లమెంట్ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 8, 2026న దేశవ్యాప్త సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
తకైచి... అంతర్జాతీయ భ్రూణ హత్యల నివారణ దినోత్సవ కరపత్ర ఆవిష్కరణ
జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు)అంతర్జాతీయ భృణహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకొని పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం రూపొందించిన, కరపత్రాలను, ప్రముఖ పౌరాణిక పండితులు బుర్రా భాస్కర శర్మ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్, ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బుర్రా భాస్కర శర్మ మాట్లాడుతూ పురి... జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..? ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.
జగిత్యాల, జనవరి 24 (ప్రజా మంటలు)
40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడాన్ని జగిత్యాల బిజెపి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు.
శనివారం బిజెపి సీనియర్ నేతలు సీపెళ్లి రవీందర్, అంకార్ సుధాకర్,... టీ-హబ్ స్టార్టప్ల కేంద్రంగానే కొనసాగాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
టీ-హబ్ను పూర్తిగా స్టార్టప్ల కేంద్రంగా మాత్రమే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్కు మార్చనున్నారన్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు.
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు... నోబెల్ శాంతి బహుమతి నిర్లక్ష్యమే గ్రీన్ల్యాండ్ అంశంపై వ్యాఖ్యలకు కారణమా?
అమెరికా రాజకీయాల్లో మరో వివాదాస్పద ప్రకటన
వాషింగ్టన్ జనవరి 24:
గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న గత వ్యాఖ్యల వెనుక కారణం నోబెల్ శాంతి బహుమతి అందకపోవడంపై అసంతృప్తినేనని అమెరికా మాజీ అధ్యక్షుడు వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యాఖ్యలు మరోసారి ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
తాను అంతర్జాతీయంగా శాంతి స్థాపనకు... 