ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?

On
ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?

ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?
కొందరు బడా జర్నలిస్టులు అనేక చోట్ల లబ్ధి పొందినట్లుగా ఆరోపణలు
సీఎం రేవంత్‌ సార్‌..విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి

(మానసాని కృష్ణరెడ్డి సీనియర్ జర్నలిస్ట్)

జవహర్‌ లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు.వర్కింగ్‌ జర్నలిస్టులందరికి ఎలాంటి వివక్షత లేకుండా, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాల్సిందే.వారికి ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందే.ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇండ్ల జాగల పట్టాలను ఇవ్వడం అభినందించాల్సిందే.ఇందులో రెండో అంశానికి తావు లేదు.అయితే ఒక జర్నలిస్టుకు ఒకసారి మాత్రమే ఇండ్ల జాగలు ఇవ్వాలి.ఇది సహజ ధర్మం.అయితే ఇప్పటికే కొంతమంది రెండు మూడు ప్రదేశాల్లో ఇండ్ల స్థలాలు తీసుకుని ఇప్పుడు జవహర్‌లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలను పొందినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.కొన్ని జిల్లాలో ఇప్పటికే ఇండ్ల జాగలు తీసుకుని లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్లీ ఈ హౌజింగ్‌ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలు పొందినట్లుగా కొన్ని ఆరోపణలు రావడం మరి సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి వెళ్ళిందా ? లేక ఆయనకు తెలియకుండానే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు బడా జర్నలిస్టుల ముసుగులో అటు జిల్లాల్లో లబ్ధి పొంది ఇప్పుడు రాజధానిలో కూడా ఇండ్ల జాగలు దక్కించుకున్నట్లుగా గుసగుసలు విన్పిస్తున్నాయి.వీటన్నింటిపైన సమగ్ర దర్యాప్తు జరిపితే నిజానిజాలు తేలుతాయని అంటున్నారు.అలాగే ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి పంపిణీ చేసిన జర్నలిస్టుల ఇండ్ల జాగలపైన కూడా వివాదం నెలకొన్నదనే సమాచారం ఉన్నది.ఈ జాగ తమ పట్టా భూమి అని కొందరు న్యాయస్థానాలను తాజాగా ఆశ్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ రాష్ట్ర సీఎం పంపిణీ చేసిన జాగ వివాదాస్పద స్థలం కావడంపైన విస్మయం వ్యక్తమవుతోంది.అదేవిధంగా హైదరాబాద్‌లో ఇండ్ల జాగలు పొందిన జర్నలిస్టుల్లో అధిక శాతం పక్కరాష్ట్ర పాత్రికేయులేననే ప్రచారం కూడా ఉన్నది. ఓ వర్గ లాబీమేరకే ప్రభుత్వం ఈ విషయంలో ముందుపడి కార్యక్రమాన్ని పూర్తి చేసిందని అంటున్నారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకుండా, ఇండ్ల జాగలు పొందకుండా ఉన్నారు.ఎన్నో యేండ్లుగా వర్కింగ్‌ జర్నలిస్టులుగా ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదని,కానీ కొందరు మాత్రం రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు దక్కించుకోగలిగారని ఇదెక్కడి న్యాయం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై సీఎం రేవంత్‌ రెడ్డి నిష్పక్షపాతంగా విచారణ చేపడితే అన్ని వ్యవహరాలు బయటపడతాయాని పలువురు జర్నలిస్టులు అంటున్నారు.మరి నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని జర్నలిస్టు సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

-------------------

Tags
Join WhatsApp

More News...

Crime 

జగిత్యాల జిల్లాలో పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష

జగిత్యాల జిల్లాలో పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష జగిత్యాల: జూలై 29  (ప్రజా మంటలు): జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోక్సో కేసులో నిందితుడు రాజేష్‌కు జగిత్యాల పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే నిందితుడికి ₹6,500 జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.అదేవిధంగా బాధిత...
Read More...
State News 

నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులు ప్రారంభం

నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులు ప్రారంభం కరీంనగర్, జూలై 29  (ప్రజా మంటలు):   కాళేశ్వరం ద్వారా 12,600 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలుఎడతెరిపి వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని పెద్దపల్లి జిల్లా నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులను అధికారులు బుధవారం ప్రారంభించారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం నాలుగు పంపులతో 12,600 క్యూసెక్కుల...
Read More...
State News 

కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో రాష్ట్ర మంత్రుల గిరి ప్రదక్షిణ

కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో రాష్ట్ర మంత్రుల గిరి ప్రదక్షిణ సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని వరుణ పూజలుకొండగట్టు, జూలై 29 (ప్రజా మంటలు): గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్,...
Read More...
Local News 

పదోన్నతి పొందిన ఎస్‌.ఐ వెంకటేశ్వర్లకు ఎస్పీ శుభాకాంక్షలు

పదోన్నతి పొందిన ఎస్‌.ఐ వెంకటేశ్వర్లకు ఎస్పీ శుభాకాంక్షలు    జగిత్యాల జూలై 29 ( ప్రజా మంటలు)టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించి ఎస్‌.ఐ గా పదోన్నతి పొందిన వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  వెంకటేశ్వర్లుకు ఎస్‌ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు....
Read More...
Local News 

చదువునే ఆయుధంగా మలుచుకొని ఉన్నత స్థితికి ఎదగాలి.  జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్. 

చదువునే ఆయుధంగా మలుచుకొని ఉన్నత స్థితికి ఎదగాలి.    జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్.  జగిత్యాల, జులై 29(ప్రజా మంటలు) చదువునే ఆయుధంగా మలుచుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు.   మహిళ శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ కమిటీ చైర్మన్, అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని...
Read More...
State News 

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి -  కల్వకుంట్ల కవిత

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి -  కల్వకుంట్ల కవిత    సిరిసిల్ల జూలై 28(ప్రజా మంటలు):సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన పోలీసుల దాష్టీకం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని, ఇతర బాధితులను పరామర్శించిన ఆమె, గత ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ కోరారు. ఘటనకు బాధ్యులైన...
Read More...
State News 

హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్

హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్ హైదరాబాద్, జూలై 28: హైడ్రా (HYDRA) వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, అక్రమ నిర్మాణాలు, చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైడ్రా ప్రభుత్వ తీసుకొచ్చిన అత్యంత పెద్ద పరిపాలనా సంస్కరణల్లో ఒకటని పేర్కొన్నారు.సీఎం...
Read More...
State News 

జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు

 జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థ అభివృద్ధిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మల్యే  డా. సంహ పాల్గొని, జిల్లా వైద్య రంగానికి సంబంధించిన పలు కీలక...
Read More...
Filmi News  State News 

సినీ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు చిత్రసీమలో విషాదం

సినీ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు చిత్రసీమలో విషాదం హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు): ప్రముఖ సీనియర్ సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (73) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటుకు గురికావడంతో వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు....
Read More...
Local News 

రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి. టౌన్ సిఐ కరుణాకర్ 

రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి.  టౌన్ సిఐ కరుణాకర్     జగిత్యాల జూలై 27 (ప్రజా మంటలు) కూరగాయలు విక్రయించే రైతులు రైతు బజార్ లోపలే తమ కూరగాయలను విక్రయించాలని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. రైతు బజార్ ఎదుట రహదారికి రెండు వైపులా కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల ఫిర్యాదు మేరకు  జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ ట్రాఫిక్...
Read More...
National 

బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్

బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్ జగిత్యాల, జూలై 27 (ప్రజా మంటలు): బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు. మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లో...
Read More...
Local News  State News 

ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్.

ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్. సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113.  జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) :  జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల...
Read More...