ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?

On
ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?

ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?
కొందరు బడా జర్నలిస్టులు అనేక చోట్ల లబ్ధి పొందినట్లుగా ఆరోపణలు
సీఎం రేవంత్‌ సార్‌..విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి

(మానసాని కృష్ణరెడ్డి సీనియర్ జర్నలిస్ట్)

జవహర్‌ లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు.వర్కింగ్‌ జర్నలిస్టులందరికి ఎలాంటి వివక్షత లేకుండా, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాల్సిందే.వారికి ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందే.ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇండ్ల జాగల పట్టాలను ఇవ్వడం అభినందించాల్సిందే.ఇందులో రెండో అంశానికి తావు లేదు.అయితే ఒక జర్నలిస్టుకు ఒకసారి మాత్రమే ఇండ్ల జాగలు ఇవ్వాలి.ఇది సహజ ధర్మం.అయితే ఇప్పటికే కొంతమంది రెండు మూడు ప్రదేశాల్లో ఇండ్ల స్థలాలు తీసుకుని ఇప్పుడు జవహర్‌లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలను పొందినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.కొన్ని జిల్లాలో ఇప్పటికే ఇండ్ల జాగలు తీసుకుని లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్లీ ఈ హౌజింగ్‌ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలు పొందినట్లుగా కొన్ని ఆరోపణలు రావడం మరి సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి వెళ్ళిందా ? లేక ఆయనకు తెలియకుండానే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు బడా జర్నలిస్టుల ముసుగులో అటు జిల్లాల్లో లబ్ధి పొంది ఇప్పుడు రాజధానిలో కూడా ఇండ్ల జాగలు దక్కించుకున్నట్లుగా గుసగుసలు విన్పిస్తున్నాయి.వీటన్నింటిపైన సమగ్ర దర్యాప్తు జరిపితే నిజానిజాలు తేలుతాయని అంటున్నారు.అలాగే ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి పంపిణీ చేసిన జర్నలిస్టుల ఇండ్ల జాగలపైన కూడా వివాదం నెలకొన్నదనే సమాచారం ఉన్నది.ఈ జాగ తమ పట్టా భూమి అని కొందరు న్యాయస్థానాలను తాజాగా ఆశ్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ రాష్ట్ర సీఎం పంపిణీ చేసిన జాగ వివాదాస్పద స్థలం కావడంపైన విస్మయం వ్యక్తమవుతోంది.అదేవిధంగా హైదరాబాద్‌లో ఇండ్ల జాగలు పొందిన జర్నలిస్టుల్లో అధిక శాతం పక్కరాష్ట్ర పాత్రికేయులేననే ప్రచారం కూడా ఉన్నది. ఓ వర్గ లాబీమేరకే ప్రభుత్వం ఈ విషయంలో ముందుపడి కార్యక్రమాన్ని పూర్తి చేసిందని అంటున్నారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకుండా, ఇండ్ల జాగలు పొందకుండా ఉన్నారు.ఎన్నో యేండ్లుగా వర్కింగ్‌ జర్నలిస్టులుగా ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదని,కానీ కొందరు మాత్రం రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు దక్కించుకోగలిగారని ఇదెక్కడి న్యాయం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై సీఎం రేవంత్‌ రెడ్డి నిష్పక్షపాతంగా విచారణ చేపడితే అన్ని వ్యవహరాలు బయటపడతాయాని పలువురు జర్నలిస్టులు అంటున్నారు.మరి నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని జర్నలిస్టు సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

-------------------

Tags
Join WhatsApp

More News...

National  Crime 

మలేషియా కాంట్రాక్టర్ లీ సీన్ ఆత్మహత్య - జ్ఞానేశ్ కుమార్ ఆత్మహత్య నోటులో వచ్చిన ఒక పేరు 

మలేషియా కాంట్రాక్టర్ లీ సీన్ ఆత్మహత్య - జ్ఞానేశ్ కుమార్ ఆత్మహత్య నోటులో వచ్చిన ఒక  పేరు  ఇప్పుడు భారత ప్రజాస్వామ్యానికి తలపై కూర్చున్న నీడ భారత ప్రజాస్వామ్యం చాలా పెద్దది అని చెప్తాం.కానీ అది ఎంత బలహీనమో తెలుసుకోవాలంటే —ఒక పేరును మాత్రమే చూడాలి:జ్ఞానేశ్ కుమార్ గుప్తా. 2006లో మలేషియా ఇంజినీర్ Lee See Ben ఆత్మహత్య చేసుకున్నాడు.అతను తన నోట్‌లో స్పష్టంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల ఒత్తిడి...
Read More...
National  International   Crime 

హాంకాంగ్ అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం – 13 మంది మృతి

హాంకాంగ్ అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం – 13 మంది మృతి    హాంకాంగ్ నవంబర్ 26: హాంకాంగ్ నగరంలోని ఒక బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో జరిగిన భయంకర అగ్ని ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అగ్ని ప్రమాదం భవనం 10వ అంతస్తులో ప్రారంభమై క్షణాల్లోనే పై అంతస్తులకు వ్యాపించింది. రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించి చిక్కుకున్నవారిని బయటకు...
Read More...
Local News 

జగిత్యాలలో BRS దీక్ష దివస్ సన్నాహక సమావేశం

జగిత్యాలలో BRS దీక్ష దివస్ సన్నాహక సమావేశం జగిత్యాల, నవంబర్ 26 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా BRS పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న జరగనున్న దీక్ష దివస్ కార్యక్రమం సందర్భంగా సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాయకత్వంలో జరిగిన ఈ సమావేశానికి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ...
Read More...
Local News  State News 

బీసీలకు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ – రిజర్వేషన్లపై  కవిత ఆరోపణలు, తీవ్ర విమర్శలు

బీసీలకు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ – రిజర్వేషన్లపై  కవిత ఆరోపణలు, తీవ్ర విమర్శలు హైదరాబాద్, నవంబర్ 26 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలకు ద్రోహం చేసిన పార్టీగా అభివర్ణించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులో బీసీలను ఉద్దేశపూర్వకంగా మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కులగణనలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు లెక్కలు చూపించడంతో బీసీ రిజర్వేషన్లు భారీగా తగ్గిపోయాయని కవిత...
Read More...
Local News  Crime 

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు – ఇబ్రహీంపట్నంలో వాహన తనిఖీలు

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు – ఇబ్రహీంపట్నంలో వాహన తనిఖీలు ఇబ్రహీంపట్నం, నవంబర్ 26 (ప్రజా మంటలు దగ్గుల అశోక్) స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమలులో భాగంగా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గండి హనుమాన్ చెక్‌పోస్ట్‌లో బుధవారం నుంచి పోలీసులు వాహన తనిఖీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ మాట్లాడుతూ—ఎలాంటి సరైన...
Read More...
Local News  Spiritual  

స్కందగిరి  ఆలయంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి

స్కందగిరి  ఆలయంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి సికింద్రాబాద్  నవంబర్ 26 (ప్రజా మంటలు ) సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా వేలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారి సన్నిధిలో తమ...
Read More...
Local News  State News 

నవంబర్ 28న జగిత్యాలలో వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలు

నవంబర్ 28న జగిత్యాలలో వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలు జగిత్యాల, నవంబర్ 26 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (పాత బస్ స్టాండ్)లో ఈ నెల నవంబర్ 28వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలు, కన్సల్టేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా...
Read More...
Local News 

కట్కాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పక్షాన నిలిచిన జీవన్ రెడ్డి

కట్కాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పక్షాన నిలిచిన జీవన్ రెడ్డి రాయికల్ నవంబర్ 26 (ప్రజా మంటలు): రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామంలో గత 5–6 రోజులుగా వడ్లు తూకం జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని రైతులు మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. జీవన్ రెడ్డి స్వయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి...
Read More...
National  State News 

VIT యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం – క్యాంపస్‌లో ఉద్రిక్తత

VIT యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం – క్యాంపస్‌లో ఉద్రిక్తత సిహోర్ (భోపాల్) నవంబర్ 26 (ప్రజా మంటలు):  మధ్యప్రదేశ్ లోని సిహోర్ లో ఉన్న VIT యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు మంగళవారం రాత్రి తీవ్రరూపం దాల్చాయి. హాస్టల్ సౌకర్యాలు, ఫీజు సమస్యలు, క్యాంపస్‌ నియమావళిపై విద్యార్థుల అసంతృప్తి ఒక్కసారిగా ఉధృతమై, పెద్ద సంఖ్యలో విద్యార్థులు బయటకు వచ్చి నిరసనలు చేపట్టారు. కొంతమంది విద్యార్థులు కోపోద్రిక్తులై వస్తువులు...
Read More...

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి  ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు  రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జగిత్యాల నవంబర్ 26(ప్రజా మంటలు)పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు,...
Read More...

ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్

ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు): సినీ పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి అలియాస్ “ఐబొమ్మ రవి”కి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. రవిని గత వారం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. సోమవారం పోలీసు కస్టడీ గడువు ముగియడంతో అతన్ని కోర్టులో హాజరుపరచగా, జ్యూడిషియల్ రిమాండ్‌కు ఆదేశాలు...
Read More...

ఎన్నికల ప్రవర్తన నియమావలికి లోబడి విధులు నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

ఎన్నికల ప్రవర్తన నియమావలికి లోబడి విధులు నిర్వహించాలి  -జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్       జగిత్యాల నవంబర్ 26( ప్రజా మంటలు) ఎన్నికల ప్రవర్తన నియమాలికి లోబడి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మీ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ మరియు నామినేషన్ పత్రాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం...
Read More...