ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?
ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?
కొందరు బడా జర్నలిస్టులు అనేక చోట్ల లబ్ధి పొందినట్లుగా ఆరోపణలు
సీఎం రేవంత్ సార్..విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి
(మానసాని కృష్ణరెడ్డి సీనియర్ జర్నలిస్ట్)
జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు.వర్కింగ్ జర్నలిస్టులందరికి ఎలాంటి వివక్షత లేకుండా, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాల్సిందే.వారికి ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందే.ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇండ్ల జాగల పట్టాలను ఇవ్వడం అభినందించాల్సిందే.ఇందులో రెండో అంశానికి తావు లేదు.అయితే ఒక జర్నలిస్టుకు ఒకసారి మాత్రమే ఇండ్ల జాగలు ఇవ్వాలి.ఇది సహజ ధర్మం.అయితే ఇప్పటికే కొంతమంది రెండు మూడు ప్రదేశాల్లో ఇండ్ల స్థలాలు తీసుకుని ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలను పొందినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.కొన్ని జిల్లాలో ఇప్పటికే ఇండ్ల జాగలు తీసుకుని లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్లీ ఈ హౌజింగ్ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలు పొందినట్లుగా కొన్ని ఆరోపణలు రావడం మరి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళిందా ? లేక ఆయనకు తెలియకుండానే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు బడా జర్నలిస్టుల ముసుగులో అటు జిల్లాల్లో లబ్ధి పొంది ఇప్పుడు రాజధానిలో కూడా ఇండ్ల జాగలు దక్కించుకున్నట్లుగా గుసగుసలు విన్పిస్తున్నాయి.వీటన్నింటిపైన సమగ్ర దర్యాప్తు జరిపితే నిజానిజాలు తేలుతాయని అంటున్నారు.అలాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేసిన జర్నలిస్టుల ఇండ్ల జాగలపైన కూడా వివాదం నెలకొన్నదనే సమాచారం ఉన్నది.ఈ జాగ తమ పట్టా భూమి అని కొందరు న్యాయస్థానాలను తాజాగా ఆశ్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ రాష్ట్ర సీఎం పంపిణీ చేసిన జాగ వివాదాస్పద స్థలం కావడంపైన విస్మయం వ్యక్తమవుతోంది.అదేవిధంగా హైదరాబాద్లో ఇండ్ల జాగలు పొందిన జర్నలిస్టుల్లో అధిక శాతం పక్కరాష్ట్ర పాత్రికేయులేననే ప్రచారం కూడా ఉన్నది. ఓ వర్గ లాబీమేరకే ప్రభుత్వం ఈ విషయంలో ముందుపడి కార్యక్రమాన్ని పూర్తి చేసిందని అంటున్నారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకుండా, ఇండ్ల జాగలు పొందకుండా ఉన్నారు.ఎన్నో యేండ్లుగా వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదని,కానీ కొందరు మాత్రం రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు దక్కించుకోగలిగారని ఇదెక్కడి న్యాయం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి నిష్పక్షపాతంగా విచారణ చేపడితే అన్ని వ్యవహరాలు బయటపడతాయాని పలువురు జర్నలిస్టులు అంటున్నారు.మరి నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని జర్నలిస్టు సర్కిల్లో చర్చ నడుస్తోంది.
-------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
జగిత్యాల డిసెంబర్ 8(ప్రజా మంటలు)
గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 6 గురు అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు IGNITE -2025 రాష్ట్రస్థాయి పోటీలలో అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ వర్షకొండ పూర్వ విద్యార్థి
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 7(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో అక్షర భారతి కాన్వెంట్ స్కూల్లో ఐదవ తరగతి వరకు చదివి, ఆరవ తరగతి కొరకు ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్లో విద్య అభ్యాసిస్తూన్న, విద్యార్థి *పాండ్రవీశం మిట్టూర్తి*, IGNITE -2025 రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రాష్ట్రస్థాయి మోడల్... మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి – 2026 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని ఆనంద్ బాగ్, మల్కాజిగిరి లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపకులు నెమ్మాని విష్ణుమూర్తి శర్మ, అధ్యక్షులు మహాదేవభట్ల లక్ష్మణప్రసాద్ శర్మ, ఉపాధ్యక్షులు దామెర సత్యనారాయణ శర్మ, గణపురం రాంప్రసాద్ శర్మ, ప్రధాన కార్యదర్శి యలమంచి... ఓటరు తస్మాత్ జాగ్రత్త..! మల్లారంలో జాగృతి నాటిక
గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన –
* ప్రశాంత ఎన్నికల పిలుపు కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి: వసంత సురేష్ తీవ్ర విమర్శలు
రాయికల్, డిసెంబర్ 7 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లిన నిర్ణయం బీసీ వర్గాలపై తీవ్ర అన్యాయం చేసిందని, ఆ నిరాశతోనే బీసీ బిడ్డ ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మండిపడ్డారు. రాయికల్... పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సమావేశం. -టీ పి సీ ఏ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 7:పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సోమవారం హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సమావేశం తెలంగాణ పెన్షన ర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ తెలిపారు.ఆదివారం జిల్లా టి. పి. సీ. ఏ. కార్యాలయంలో అయన విలేకరుల తో మాట్లాడుతూ హైదరాబాద్ లోని
ఈ... అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్ద్ర నక్షత్రం సందర్భంగా హరిహరాలయంలో ఫల ,పంచామృత అభిషేకాలు
జగిత్యాల డిసెంబర్ 7 (ప్రజా మంటలు)అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పరమశివునికి పంచామృతాలు ,వివిధ ఫల రసాలతో సూర్యోదయానికి పూర్వమే అభిషేకాలు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు తమ స్వహస్తాలతో సాంబశివుని కి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.... అగ్ని ప్రమాద బాధితులకు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యుల చేయూత
మల్యాల డిసెంబరు 7 ( ప్రజా మంటలు)స్థానిక కొండగట్టు లో ఒక దారుణ అగ్నిప్రమాదంలో దాదాపు 20 చిరువ్యాపారులు చేసుకొనే షాపులు పూర్తిగా కాలిపోయి , కుటుంబాలు అన్ని రోడ్డు మీదకి వచ్చాయి.
ఇతర స్థానిక కుటుంబీకులు సామ శ్రీనాథ్ గారి కుటుంబ సభ్యులు మరియు మహేష్ గారు మన సత్యసాయి సంస్థ ని... ఓటర్లకు భరోసా కల్పిస్తూ ఇబ్రహీంపట్నం లో పోలీసుల ఫ్లాగ్మార్చ్
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 07 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా హామీ ఇవ్వడం కోసం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మెట్టుపల్లి... మహాభారత జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న మహాభారత జ్ఞాన యజ్ఞము రెండవ రోజు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అట్టహాసంగా శనివారం ప్రారంభమైన మహాభారత నవహాన్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం ఆదివారం రెండవ రోజుకు చేరింది.
విశ్వ కళ్యాణర్థం... సిటీలో క్రిస్మస్ ముందస్తు సెలబ్రేషన్స్. : కేక్ మిక్సింగ్..ఫన్ గేమ్స్..శాంతాక్లాజ్ సందడి
సికింద్రాబాద్, డిసెంబర్ 07 (ప్రజామంటలు):
క్రిస్మస్ ముందస్తు సెలబ్రేషన్స్ సిటీలో ఘనంగా మొదలయ్యాయి. బేగంపేట లోని మ్యారీగోల్డ్ హోటల్ లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈసందర్బంగా నీలిమా వేముల నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో మహిళలు మెరిశారు.
ముఖ్య అతిథిగా బేబక్క, స్పీకర్ గా రజిత హాజరయ్యారు. సుధా నాయుడు, లావణ్య, ప్రణతి... మోంబాసా సాటర్ డే క్లబ్ ఫండ్ రైజింగ్లో MOMTA సభ్యుల ప్రదర్శన
సికింద్రాబాద్, డిసెంబర్ 07 ( ప్రజామంటలు) :
కెన్యా లోని మోంబాసా తెలుగు అసోసియేషన్ ( MOMTA) ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కొరకు "సాటర్ డే క్లబ్" నిర్వహించిన అసోసియేషన్ సభ్యుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. బోర్ వెల్లుల ఏర్పాటు, విద్యార్థుల విద్యా సహాయం, భారీ నీటి నిల్వ ట్యాంకుల విరాళం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు... 