ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?

On
ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?

ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?
కొందరు బడా జర్నలిస్టులు అనేక చోట్ల లబ్ధి పొందినట్లుగా ఆరోపణలు
సీఎం రేవంత్‌ సార్‌..విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి

(మానసాని కృష్ణరెడ్డి సీనియర్ జర్నలిస్ట్)

జవహర్‌ లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు.వర్కింగ్‌ జర్నలిస్టులందరికి ఎలాంటి వివక్షత లేకుండా, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాల్సిందే.వారికి ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందే.ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇండ్ల జాగల పట్టాలను ఇవ్వడం అభినందించాల్సిందే.ఇందులో రెండో అంశానికి తావు లేదు.అయితే ఒక జర్నలిస్టుకు ఒకసారి మాత్రమే ఇండ్ల జాగలు ఇవ్వాలి.ఇది సహజ ధర్మం.అయితే ఇప్పటికే కొంతమంది రెండు మూడు ప్రదేశాల్లో ఇండ్ల స్థలాలు తీసుకుని ఇప్పుడు జవహర్‌లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలను పొందినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.కొన్ని జిల్లాలో ఇప్పటికే ఇండ్ల జాగలు తీసుకుని లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్లీ ఈ హౌజింగ్‌ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలు పొందినట్లుగా కొన్ని ఆరోపణలు రావడం మరి సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి వెళ్ళిందా ? లేక ఆయనకు తెలియకుండానే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు బడా జర్నలిస్టుల ముసుగులో అటు జిల్లాల్లో లబ్ధి పొంది ఇప్పుడు రాజధానిలో కూడా ఇండ్ల జాగలు దక్కించుకున్నట్లుగా గుసగుసలు విన్పిస్తున్నాయి.వీటన్నింటిపైన సమగ్ర దర్యాప్తు జరిపితే నిజానిజాలు తేలుతాయని అంటున్నారు.అలాగే ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి పంపిణీ చేసిన జర్నలిస్టుల ఇండ్ల జాగలపైన కూడా వివాదం నెలకొన్నదనే సమాచారం ఉన్నది.ఈ జాగ తమ పట్టా భూమి అని కొందరు న్యాయస్థానాలను తాజాగా ఆశ్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ రాష్ట్ర సీఎం పంపిణీ చేసిన జాగ వివాదాస్పద స్థలం కావడంపైన విస్మయం వ్యక్తమవుతోంది.అదేవిధంగా హైదరాబాద్‌లో ఇండ్ల జాగలు పొందిన జర్నలిస్టుల్లో అధిక శాతం పక్కరాష్ట్ర పాత్రికేయులేననే ప్రచారం కూడా ఉన్నది. ఓ వర్గ లాబీమేరకే ప్రభుత్వం ఈ విషయంలో ముందుపడి కార్యక్రమాన్ని పూర్తి చేసిందని అంటున్నారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకుండా, ఇండ్ల జాగలు పొందకుండా ఉన్నారు.ఎన్నో యేండ్లుగా వర్కింగ్‌ జర్నలిస్టులుగా ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదని,కానీ కొందరు మాత్రం రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు దక్కించుకోగలిగారని ఇదెక్కడి న్యాయం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై సీఎం రేవంత్‌ రెడ్డి నిష్పక్షపాతంగా విచారణ చేపడితే అన్ని వ్యవహరాలు బయటపడతాయాని పలువురు జర్నలిస్టులు అంటున్నారు.మరి నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని జర్నలిస్టు సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

-------------------

Tags
Join WhatsApp

More News...

Local News  Spiritual  

పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు తిరుగు ప్రయాణం

పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు తిరుగు ప్రయాణం లక్షలాది భక్తులతో మహాజాతర విజయవంతం ఎల్కతుర్తి జనవరి 31 (ప్రజా మంటలు): ఎల్కతుర్తి మండల కేంద్రంలోని దామేర  బీమదేవరపల్లి  మండలంలో   ముల్కనూర్ ప్రాంతం మరోసారి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. జనవరి 28. 29. 30. ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి కూడా లక్షలాది భక్తులు   తండోప  తండాలుగా  తరలివచ్చారు. గ్రామాల  నలుమూలల నుంచి   మాత్రమే...
Read More...
Local News  Crime 

పొలంలో నాటు వేస్తూ బీహార్ వలస కార్మికుడు మృతి

పొలంలో నాటు వేస్తూ బీహార్ వలస కార్మికుడు మృతి ఎల్కతుర్తి జనవరి 31 (ప్రజా మంటలు) ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ శివారులో విషాదం చోటుచేసుకుంది. పొలంలో నాటు వేస్తూ బీహార్ కు చెందిన ఓ వలస కార్మికుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఉపాధి కోసం తెలంగాణకు వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సదరు వ్యక్తి, శనివారం పనిలో ఉండగానే ప్రాణాలు విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు....
Read More...

గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి

గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ములుగు, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు): గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్యకు మంత్రి సీతక్క నివాళులు అర్పిస్తూ, ఆమె కుటుంబ...
Read More...

ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు: 15 వార్డుల అభ్యర్థుల పేర్ల ప్రకటన

ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు: 15 వార్డుల అభ్యర్థుల పేర్ల ప్రకటన       ధర్మపురి, జనవరి 31 (ప్రజా మంటలు):ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 15 వార్డులకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డుకు ప్రత్యేకంగా ఇంచార్జీలను కూడా నియమించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ...
Read More...

రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శాంతియుత నిరసనలు: కేటీఆర్ పిలుపు

రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శాంతియుత నిరసనలు: కేటీఆర్ పిలుపు హైదరాబాద్, జనవరి 31 (ప్రజా మంటలు): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ, రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ నిరసనలలో భాగంగా రాష్ట్రంలోని 12 వేలకుపైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించనున్నారు. అలాగే...
Read More...
Local News 

PRTU–TS ఆధ్వర్యంలో టెట్ రద్దు కోసం చలో ఢిల్లీ -  పోస్టర్ ఆవిష్కరణ  

PRTU–TS ఆధ్వర్యంలో టెట్ రద్దు కోసం చలో ఢిల్లీ -  పోస్టర్ ఆవిష్కరణ   జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు): ఎఐజాక్ట్ పిలుపు మేరకు, పీఆర్‌టీయూ–టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో టెట్ రద్దు మరియు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న “చలో ఢిల్లీ” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షుడు బోయినిపెల్లి...
Read More...
Local News 

పౌరహక్కుల దినోత్సవానికి పూర్తి స్థాయి అధికారులు గైర్హాజరు

పౌరహక్కుల దినోత్సవానికి పూర్తి స్థాయి అధికారులు గైర్హాజరు గొల్లపల్లి, జనవరి 31 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట్ గ్రామంలో శనివారం నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం కార్యక్రమానికి మండల స్థాయి పూర్తి అధికారుల హాజరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కల్పించాల్సిన కీలక అధికారులు హాజరు కాకపోవడంపై గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పౌరహక్కుల దినోత్సవం వంటి...
Read More...
Local News 

కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు నిరసనగా ఆందోళనలకు పిలుపు

కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు నిరసనగా ఆందోళనలకు పిలుపు జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు): మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారిని సిట్ విచారణకు పిలవడం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజకీయ కక్షసాధింపు చర్యేనని జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ...
Read More...

ఘనంగా జంతు సంక్షేమ పక్షోత్సవంనిర్వహణ

ఘనంగా జంతు సంక్షేమ పక్షోత్సవంనిర్వహణ జగిత్యాల జనవరి 31 ( ప్రజా మంటలు)జంతు సంక్షేమ పక్షోత్సవం కార్యక్రమం లో భాగంగా  జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల పురానిపేట జగిత్యాల లో జరిగిన కార్యక్రమం  అదనపు కలెక్టర్ రెవెన్యూ  బి. ఎస్. లత గారు మరియు జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి.ప్రకాష్  పాల్గొన్నారు...
Read More...

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత  జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత  జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి   జగిత్యాల జనవరి 31 (ప్రజా మంటలు)లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల, మరియు జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు రోజు సందర్భంగా స్థానిక ఆర్డిఓ ఆఫీస్ ముందర హెల్మెట్ పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలను నివారించడo, ప్రజలలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడo,ప్రజలు...
Read More...
Local News  State News 

జగిత్యాల బల్దియా పై కాంగ్రెస్ జండా ఎగరవేయాలి :: mlc వెంకట్

 జగిత్యాల బల్దియా పై కాంగ్రెస్ జండా ఎగరవేయాలి :: mlc వెంకట్ జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర PCC ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్...
Read More...
Opinion  Edit Page Articles 

UGC కుల విచక్షణ నిరోధక రూల్స్ – అగ్రవర్ణ రాజకీయాల అసలు ముఖం

UGC కుల విచక్షణ నిరోధక రూల్స్ – అగ్రవర్ణ రాజకీయాల అసలు ముఖం (ప్రత్యేక వ్యాసం) పూర్వ నేపథ్యం – అమలు కాని న్యాయం 2012లో యూనివర్సిటీల్లో కుల ఆధారిత వివక్షను నిర్మూలించేందుకు UGC ప్రత్యేక రూల్స్ రూపొందించింది. కానీ అవి చట్టాలుగా ఉన్నా, ఆచరణలో అమలుకాకుండా అగ్రవర్ణాల ఒత్తిడితో మూలకు నెట్టబడ్డాయి. దళితులు, BC, ST విద్యార్థులపై అవమానాలు, వేధింపులు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ప్రభుత్వాలు, యూనివర్సిటీ...
Read More...