ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?

On
ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?

ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?
కొందరు బడా జర్నలిస్టులు అనేక చోట్ల లబ్ధి పొందినట్లుగా ఆరోపణలు
సీఎం రేవంత్‌ సార్‌..విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి

(మానసాని కృష్ణరెడ్డి సీనియర్ జర్నలిస్ట్)

జవహర్‌ లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు.వర్కింగ్‌ జర్నలిస్టులందరికి ఎలాంటి వివక్షత లేకుండా, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాల్సిందే.వారికి ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందే.ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇండ్ల జాగల పట్టాలను ఇవ్వడం అభినందించాల్సిందే.ఇందులో రెండో అంశానికి తావు లేదు.అయితే ఒక జర్నలిస్టుకు ఒకసారి మాత్రమే ఇండ్ల జాగలు ఇవ్వాలి.ఇది సహజ ధర్మం.అయితే ఇప్పటికే కొంతమంది రెండు మూడు ప్రదేశాల్లో ఇండ్ల స్థలాలు తీసుకుని ఇప్పుడు జవహర్‌లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలను పొందినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.కొన్ని జిల్లాలో ఇప్పటికే ఇండ్ల జాగలు తీసుకుని లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్లీ ఈ హౌజింగ్‌ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలు పొందినట్లుగా కొన్ని ఆరోపణలు రావడం మరి సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి వెళ్ళిందా ? లేక ఆయనకు తెలియకుండానే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు బడా జర్నలిస్టుల ముసుగులో అటు జిల్లాల్లో లబ్ధి పొంది ఇప్పుడు రాజధానిలో కూడా ఇండ్ల జాగలు దక్కించుకున్నట్లుగా గుసగుసలు విన్పిస్తున్నాయి.వీటన్నింటిపైన సమగ్ర దర్యాప్తు జరిపితే నిజానిజాలు తేలుతాయని అంటున్నారు.అలాగే ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి పంపిణీ చేసిన జర్నలిస్టుల ఇండ్ల జాగలపైన కూడా వివాదం నెలకొన్నదనే సమాచారం ఉన్నది.ఈ జాగ తమ పట్టా భూమి అని కొందరు న్యాయస్థానాలను తాజాగా ఆశ్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ రాష్ట్ర సీఎం పంపిణీ చేసిన జాగ వివాదాస్పద స్థలం కావడంపైన విస్మయం వ్యక్తమవుతోంది.అదేవిధంగా హైదరాబాద్‌లో ఇండ్ల జాగలు పొందిన జర్నలిస్టుల్లో అధిక శాతం పక్కరాష్ట్ర పాత్రికేయులేననే ప్రచారం కూడా ఉన్నది. ఓ వర్గ లాబీమేరకే ప్రభుత్వం ఈ విషయంలో ముందుపడి కార్యక్రమాన్ని పూర్తి చేసిందని అంటున్నారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకుండా, ఇండ్ల జాగలు పొందకుండా ఉన్నారు.ఎన్నో యేండ్లుగా వర్కింగ్‌ జర్నలిస్టులుగా ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదని,కానీ కొందరు మాత్రం రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు దక్కించుకోగలిగారని ఇదెక్కడి న్యాయం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై సీఎం రేవంత్‌ రెడ్డి నిష్పక్షపాతంగా విచారణ చేపడితే అన్ని వ్యవహరాలు బయటపడతాయాని పలువురు జర్నలిస్టులు అంటున్నారు.మరి నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని జర్నలిస్టు సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

-------------------

Tags
Join WhatsApp

More News...

National 

జపాన్‌లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళ యువతి మృతి

జపాన్‌లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళ యువతి మృతి కేరళ, సెప్టెంబర్ 11: జపాన్‌లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళకు చెందిన 22 ఏళ్ల యువతి మృతి చెందింది. ఆసుపత్రిలో నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వీ. దేవిక ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దేవిక మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె...
Read More...
Local News 

మాజీ సర్పంచులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి

మాజీ సర్పంచులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి జగిత్యాల, సెప్టెంబర్‌ 11 (ప్రజా మంటలు): 2023 ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేయడం లేదని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు దేవయ్య విమర్శించారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో జిల్లా స్థాయి మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...
Read More...
State News 

సీఎం ప్రజావాణి స్ఫూర్తిదాయకం: బీహార్ గ్రూప్‌-1 అధికారులు

సీఎం ప్రజావాణి స్ఫూర్తిదాయకం: బీహార్ గ్రూప్‌-1 అధికారులు    బీహార్‌లోనూ ఇదే తరహా విధానం అమలు చేస్తాం ప్రజల వినతులు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (ప్రజా మంటలు):తెలంగాణలో అమలవుతున్న సీఎం ప్రజావాణి కార్యక్రమం తమకు స్ఫూర్తినిచ్చిందని బీహార్‌ రాష్ట్రానికి చెందిన గ్రూప్‌-1 అధికారుల బృందం పేర్కొంది. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడం, వాటిని సంబంధిత శాఖలకు పంపించడం, పరిష్కారాన్ని...
Read More...
Local News 

గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి.  టౌన్ సిఐ కరుణాకర్.

గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి.   టౌన్ సిఐ కరుణాకర్.    జగిత్యాల సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు) గణేష్ మండప నిర్వాహకులు రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రజా జీవనానికి భంగం కలగకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. విద్యుత్ తీగలకు దగ్గరగా గణేష్ మంటపాలను నిర్మించకుండా జాగ్రత్త పడాలని సూచించారు.    ట్రాఫిక్ అంతరాయం లేకుండా మంట పాలను ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ మండపాల్లో భక్తి...
Read More...
National 

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌ను కలిసిన ఉద్యొగ సంఘ నెతలు 

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌ను కలిసిన ఉద్యొగ సంఘ నెతలు  హైదరాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధానంగా పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి...
Read More...
Local News  Crime 

మల్యాలలో వివాహిత ఆత్మహత్య.. కుమారుడి ఆచూకీ కోసం గాలింపు

మల్యాలలో వివాహిత ఆత్మహత్య.. కుమారుడి ఆచూకీ కోసం గాలింపు మల్యాల, సెప్టెంబర్ 10 (ప్రజామంతలు): మల్యాల మండలం ముత్యంపేట శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఓ వివాహిత తన చిన్న కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మల్యాలకు చెందిన గుండేటి కవిత (36) తన భర్త దశరథంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం గుడిపేట శివారులోని వ్యవసాయ...
Read More...
Local News 

*కలెక్టరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*

*కలెక్టరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*    జగిత్యాల, సెప్టెంబర్ 10(ప్రజా మంటలు) తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని, వీరనారి చాకలి ఐలమ్మచిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

"ఫెడరల్ బ్యాంక్ "వారిచే మృత్తిక గణపతి ప్రతిమల వితరణ

  ఈస్ట్ ఆనంద్ బాగ్ సెప్టెంబర్ 10( ప్రజా మంటలు)మేడ్చల్ మల్కాజ్గిరి లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ లో గల "ఫెడరల్ బ్యాంక్" శ్రీ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సమకాలీన స్థితికి అనుకూలంగా ప్రకృతి పరిరక్షణ పేరిట మృత్తిక (మట్టి  ) గణపతి ప్రతిమలను తమ బ్యాంకు ఖాతాదారులకు వితరణ చేయడానికి శ్రీకారం చుట్టారు....
Read More...
Local News 

#Draft: Add Your Titleఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో హరుష్ కు దక్కిన చోటు

#Draft: Add Your Titleఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో హరుష్ కు దక్కిన చోటు   కరీంనగర్ సెప్టెంబర్ 8 (ప్రజా మంటలు) "సాధనాత్ సాధ్యతే" సర్వం అన్నట్లు సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు కరీంనగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి *టి హరుష్* *పరమ శివునికి చెందిన లింగాష్టక స్తోత్రాన్ని 53 సెకండ్లలో ఆలపించి గతంలో లింగాష్టకం పఠించిన వారి రికార్డును బద్దలు కొట్టాడు. చిన్నతనము నుండే హరుష్...
Read More...
State News 

ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇన్గొల్లపల్లి సెప్టెంబర్ 07(ప్రజా మంటలు అంకం భూమయ్య): ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు...
Read More...
Local News 

జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన

జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన జగిత్యాల, సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
Read More...
State News 

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నిరసన

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నిరసన    హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజా మంటలు: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. నల్ల టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం...
Read More...