ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?

On
ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?

ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?
కొందరు బడా జర్నలిస్టులు అనేక చోట్ల లబ్ధి పొందినట్లుగా ఆరోపణలు
సీఎం రేవంత్‌ సార్‌..విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి

(మానసాని కృష్ణరెడ్డి సీనియర్ జర్నలిస్ట్)

జవహర్‌ లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు.వర్కింగ్‌ జర్నలిస్టులందరికి ఎలాంటి వివక్షత లేకుండా, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాల్సిందే.వారికి ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందే.ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇండ్ల జాగల పట్టాలను ఇవ్వడం అభినందించాల్సిందే.ఇందులో రెండో అంశానికి తావు లేదు.అయితే ఒక జర్నలిస్టుకు ఒకసారి మాత్రమే ఇండ్ల జాగలు ఇవ్వాలి.ఇది సహజ ధర్మం.అయితే ఇప్పటికే కొంతమంది రెండు మూడు ప్రదేశాల్లో ఇండ్ల స్థలాలు తీసుకుని ఇప్పుడు జవహర్‌లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలను పొందినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.కొన్ని జిల్లాలో ఇప్పటికే ఇండ్ల జాగలు తీసుకుని లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్లీ ఈ హౌజింగ్‌ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలు పొందినట్లుగా కొన్ని ఆరోపణలు రావడం మరి సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి వెళ్ళిందా ? లేక ఆయనకు తెలియకుండానే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు బడా జర్నలిస్టుల ముసుగులో అటు జిల్లాల్లో లబ్ధి పొంది ఇప్పుడు రాజధానిలో కూడా ఇండ్ల జాగలు దక్కించుకున్నట్లుగా గుసగుసలు విన్పిస్తున్నాయి.వీటన్నింటిపైన సమగ్ర దర్యాప్తు జరిపితే నిజానిజాలు తేలుతాయని అంటున్నారు.అలాగే ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి పంపిణీ చేసిన జర్నలిస్టుల ఇండ్ల జాగలపైన కూడా వివాదం నెలకొన్నదనే సమాచారం ఉన్నది.ఈ జాగ తమ పట్టా భూమి అని కొందరు న్యాయస్థానాలను తాజాగా ఆశ్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ రాష్ట్ర సీఎం పంపిణీ చేసిన జాగ వివాదాస్పద స్థలం కావడంపైన విస్మయం వ్యక్తమవుతోంది.అదేవిధంగా హైదరాబాద్‌లో ఇండ్ల జాగలు పొందిన జర్నలిస్టుల్లో అధిక శాతం పక్కరాష్ట్ర పాత్రికేయులేననే ప్రచారం కూడా ఉన్నది. ఓ వర్గ లాబీమేరకే ప్రభుత్వం ఈ విషయంలో ముందుపడి కార్యక్రమాన్ని పూర్తి చేసిందని అంటున్నారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకుండా, ఇండ్ల జాగలు పొందకుండా ఉన్నారు.ఎన్నో యేండ్లుగా వర్కింగ్‌ జర్నలిస్టులుగా ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదని,కానీ కొందరు మాత్రం రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు దక్కించుకోగలిగారని ఇదెక్కడి న్యాయం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై సీఎం రేవంత్‌ రెడ్డి నిష్పక్షపాతంగా విచారణ చేపడితే అన్ని వ్యవహరాలు బయటపడతాయాని పలువురు జర్నలిస్టులు అంటున్నారు.మరి నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని జర్నలిస్టు సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

-------------------

Tags
Join WhatsApp

More News...

మకర సంక్రాంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్

మకర సంక్రాంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్, జనవరి 15 (ప్రజా మంటలు): మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ ప్రాంతంలో గల గిద్దె పెరుమాండ్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఉదయం 8:30 గంటలకు దేవస్థానానికి చేరుకున్న మంత్రి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు....
Read More...

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 3 నగరాలు, 38 పురపాలికలు

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 3 నగరాలు, 38 పురపాలికలు హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర పురపాలక శాఖ 10 నగరపాలక సంస్థలు, 121 పురపాలక సంఘాలకు సంబంధించి మేయర్లు, ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల అమలులో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది....
Read More...

ధర్మపురిలో కాంగ్రెస్‌లో చేరికలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో బీఆర్ఎస్ నేతల పార్టీలో చేరిక

ధర్మపురిలో కాంగ్రెస్‌లో చేరికలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో బీఆర్ఎస్ నేతల పార్టీలో చేరిక ధర్మపురి, జనవరి 15 (ప్రజా మంటలు): ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ధర్మపురి పట్టణ మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్నతో పాటు మాజీ కౌన్సిలర్లు మయూరి వేణు, యూనుస్, సాంబు, స్తంభంకాడి రమేష్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి...
Read More...
State News 

ఫిరాయింపు కేసుల్లో కీలక మలుపు: పోచారం, కాలే యాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్

ఫిరాయింపు కేసుల్లో కీలక మలుపు: పోచారం, కాలే యాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్ హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం తుది తీర్పు వెలువరించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్...
Read More...
National  Filmi News 

‘జన నాయగన్’ కు ఎదురుదెబ్బ: నిర్మాత పిటిషన్‌ను స్వీకరించని సుప్రీంకోర్టు

‘జన నాయగన్’ కు ఎదురుదెబ్బ: నిర్మాత పిటిషన్‌ను స్వీకరించని సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, జనవరి 15 (ప్రజా మంటలు): విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా సర్టిఫికేషన్ అంశానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఈ సినిమా నిర్మాతలు తమపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడిందని, “తాము పూర్తిగా నష్టపోయాం...
Read More...
Local News 

సంక్రాంతి సెలవుల్లో కర్ణాటక రాష్ట్ర పర్యటన చేసిన విద్యార్థులు

సంక్రాంతి సెలవుల్లో కర్ణాటక రాష్ట్ర పర్యటన చేసిన విద్యార్థులు మెట్టుపల్లి, జనవరి 15 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్) సంక్రాంతి సెలవుల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల విద్యార్థులు విద్యా, వైజ్ఞానిక, విహార యాత్రలో భాగంగా ఈ నెల 10 నుంచి ఆరు రోజుల పాటు కర్ణాటక రాష్ట్ర పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ...
Read More...

జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు 

జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు  జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను అలంకరింపజేసి ఉత్సవ మూర్తులను వేదికపై ఉంచి కళ్యాణాన్ని...
Read More...

ఎన్ టివి జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ జగిత్యాలలో నిరసన

ఎన్ టివి జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ జగిత్యాలలో నిరసన జగిత్యాల  జనవరి 14 (ప్రజా మంటలు) ఎన్ టివి ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్‌, రిపోర్టర్లు చారి, సుధీర్‌లను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ జగిత్యాల పట్టణంలో  టి యు డబ్ల్యూ జే (ఐ జె యు) ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ...
Read More...
Local News  Crime 

గంజాయి పట్టివేత యువత పై కేసు నమోదు

గంజాయి పట్టివేత యువత పై కేసు నమోదు గొల్లపల్లి జనవరి 14  (ప్రజా మంటలు )   గొల్లపల్లి మండలం లోనీ చందోలి గ్రామ శివారులో యువకుడు గంజాయితో వెళుతున్నాడని పక్క సమాచారం మేరకు చందోలి శివారులో పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా  యువకుడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద 89 గ్రాముల గంజాయి లభించగా వివరాల్లోకెళ్తే వెల్గటూర్ మండలo
Read More...
Local News 

ఆకట్టుకున్న సందేశాత్మక ముగ్గు

ఆకట్టుకున్న సందేశాత్మక ముగ్గు జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం జగిత్యాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జగిత్యాల‌కు చెందిన యూట్యూబ్ స్టార్ దేశవేని మమత వేసిన సందేశాత్మక ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “రైతు లేనిదే రాజ్యం లేదు… జవాన్ లేకపోతే దేశానికి రక్షణ లేదు” అనే నినాదంతో, పలు రకాల అందమైన రంగులను...
Read More...

హైదరాబాద్‌లో జర్నలిస్టుల అరెస్టులు

హైదరాబాద్‌లో జర్నలిస్టుల అరెస్టులు హైదరాబాద్ జనవరి 14 (ప్రజా మంటలు): హైదరాబాద్‌లో జర్నలిస్టుల వరుస అరెస్టుల వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్ రావు డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు. పండుగ పూట అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా, చట్టపరమైన ప్రొసీజర్ అనుసరించకుండా జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదని హరీశ్...
Read More...
Local News  State News 

జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో కలకలం

జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో కలకలం జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో విద్యార్థినుల మొబైల్ ఫోన్లు లాక్కొని, సంక్రాంతి పండుగకు ఇంటికి పంపించకుండా గదుల్లో నిర్బంధించారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌లో సెలవులపై ముందస్తు ప్రకటన లేకుండా విద్యార్థినుల వ్యక్తిగత కమ్యూనికేషన్‌ను ఆపివేయడం,...
Read More...