ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?

On
ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?

ఒక జర్నలిస్టుకి రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు ఇస్తారా?
కొందరు బడా జర్నలిస్టులు అనేక చోట్ల లబ్ధి పొందినట్లుగా ఆరోపణలు
సీఎం రేవంత్‌ సార్‌..విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి

(మానసాని కృష్ణరెడ్డి సీనియర్ జర్నలిస్ట్)

జవహర్‌ లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు.వర్కింగ్‌ జర్నలిస్టులందరికి ఎలాంటి వివక్షత లేకుండా, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాల్సిందే.వారికి ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందే.ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇండ్ల జాగల పట్టాలను ఇవ్వడం అభినందించాల్సిందే.ఇందులో రెండో అంశానికి తావు లేదు.అయితే ఒక జర్నలిస్టుకు ఒకసారి మాత్రమే ఇండ్ల జాగలు ఇవ్వాలి.ఇది సహజ ధర్మం.అయితే ఇప్పటికే కొంతమంది రెండు మూడు ప్రదేశాల్లో ఇండ్ల స్థలాలు తీసుకుని ఇప్పుడు జవహర్‌లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలను పొందినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.కొన్ని జిల్లాలో ఇప్పటికే ఇండ్ల జాగలు తీసుకుని లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్లీ ఈ హౌజింగ్‌ సొసైటీ ద్వారా ఇండ్ల పట్టాలు పొందినట్లుగా కొన్ని ఆరోపణలు రావడం మరి సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి వెళ్ళిందా ? లేక ఆయనకు తెలియకుండానే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు బడా జర్నలిస్టుల ముసుగులో అటు జిల్లాల్లో లబ్ధి పొంది ఇప్పుడు రాజధానిలో కూడా ఇండ్ల జాగలు దక్కించుకున్నట్లుగా గుసగుసలు విన్పిస్తున్నాయి.వీటన్నింటిపైన సమగ్ర దర్యాప్తు జరిపితే నిజానిజాలు తేలుతాయని అంటున్నారు.అలాగే ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి పంపిణీ చేసిన జర్నలిస్టుల ఇండ్ల జాగలపైన కూడా వివాదం నెలకొన్నదనే సమాచారం ఉన్నది.ఈ జాగ తమ పట్టా భూమి అని కొందరు న్యాయస్థానాలను తాజాగా ఆశ్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ రాష్ట్ర సీఎం పంపిణీ చేసిన జాగ వివాదాస్పద స్థలం కావడంపైన విస్మయం వ్యక్తమవుతోంది.అదేవిధంగా హైదరాబాద్‌లో ఇండ్ల జాగలు పొందిన జర్నలిస్టుల్లో అధిక శాతం పక్కరాష్ట్ర పాత్రికేయులేననే ప్రచారం కూడా ఉన్నది. ఓ వర్గ లాబీమేరకే ప్రభుత్వం ఈ విషయంలో ముందుపడి కార్యక్రమాన్ని పూర్తి చేసిందని అంటున్నారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకుండా, ఇండ్ల జాగలు పొందకుండా ఉన్నారు.ఎన్నో యేండ్లుగా వర్కింగ్‌ జర్నలిస్టులుగా ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదని,కానీ కొందరు మాత్రం రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల జాగలు దక్కించుకోగలిగారని ఇదెక్కడి న్యాయం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై సీఎం రేవంత్‌ రెడ్డి నిష్పక్షపాతంగా విచారణ చేపడితే అన్ని వ్యవహరాలు బయటపడతాయాని పలువురు జర్నలిస్టులు అంటున్నారు.మరి నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని జర్నలిస్టు సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

-------------------

Tags

More News...

Local News 

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష  ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం  ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ ధర్మపురి సెప్టెంబర్ 17(ప్రజా మంటలు) ధర్మపురిలో పలు ప్రాంతాలను పరిశీలించిన దేవదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ 2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దేవదాయ కమిషనర్ శైలజ రామయ్యార్ అధికారులను ఆదేశించారు.  ఈ సందర్బంగా ధర్మపురి పట్టణానికి విచ్చేసిన దేవదాయ కమిషనర్...
Read More...
Local News  State News 

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి (రామ కిష్టయ్య సంగన భట్ల - 9440595494) ధర్మపురి సెప్టెంబర్ 15: 2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను కుంభ మేళా తరహాలో నిర్వహించాలని, అందుకు, వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...
Read More...
Local News 

మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా 

మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా  (రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494) సౌమ్య బొజ్జా ‘మిసెస్ చికాగో యూనివర్స్ 2026’ కిరీటాన్ని సొంతం చేసుకుని తెలుగు ప్రజలకు గర్వకారణమయ్యారు. అమెరికా న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ వేదికగా సెప్టెంబర్ 12, 2025న నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీలో ఆమె విజయం సాధించడం విశేషం. చికాగోలో...
Read More...
Local News  State News 

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్ న్యూఢిల్లీ సెప్టెంబర్ 17: చాలా రాష్ట్రాల్లోని సగం కంటే ఎక్కువ మంది ఓటర్లు SIRలో ఎటువంటి పత్రాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చునని EC అధికారులు తెలిపారు.చాలా రాష్ట్రాలు 2002 మరియు 2004 మధ్య ఓటర్ల జాబితా యొక్క చివరి స్పెషల్ ఇంటెన్సివ్ సవరణను కలిగి ఉన్నాయని వారు తెలిపారు.ఆ సంవత్సరం తదుపరి SIR కోసం...
Read More...
Local News 

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ  జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్   జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు) జిల్లా సమీకృత భవన సముదాయం లో శిల్పకళ, వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా బిసి కమిషన్ చైర్మన్  జి. నిరంజన్,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం...
Read More...
Local News 

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు)ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల లో ఎన్సిసి లెఫ్ట్నెంట్ అధికారిగా జంతుశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బోధన విధులు నిర్వహిస్తున్న పర్లపల్లి రాజుకు తెలంగాణ రాష్ట్ర గౌరవ  ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా సెప్టెంబర్ 5వ తేదీన...
Read More...
Local News 

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు): హైదరాబాద్ విముక్తి దినోత్సవం,విశ్వకర్మ జయంతి సందర్భంగా బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.మొదటగా నిజాం పాలన నుండి విముక్తి సాధించిన ఘనతను స్మరించుకుంటూ జాతీయ జెండా ఆవిష్కరణ జరగగా, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ    సికింద్రాబాద్‌, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు) : వృత్తి నిబద్ధతతో చేసే సేవలే అధికారులకు శాశ్వత గుర్తింపునిస్తాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వాణి అన్నారు. గాంధీ ఆస్పత్రి సెమినార్‌ హాలులో బుధవారం రంగారెడ్డి జిల్లా ఫార్మసీ ఆఫీసర్‌గా పదోన్నతి పొందిన మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు, అభినందన సభ ఉత్సాహంగా జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ వాణి...
Read More...
Local News 

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన గౌడ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం జగిత్యాల మోతే తిమ్మాపూర్ సభ్యులు. సెప్టెంబర్ 24వ తేదీన గౌడ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపనకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేసి,గౌడ పారిశ్రామిక సహకార సంఘం, వనదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ...
Read More...
Local News 

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్*ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు వెంకటరమణ, రఘు చందర్, రాములు, ఇన్స్పెక్టర్ లు ఆరిఫ్ అలీ ఖాన్,అనిల్ కుమార్, రామ్ నరసింహారెడ్డి,సుధాకర్, కరుణాకర్ ఆర్.ఐ...
Read More...
Local News 

స్టైఫండ్ ల విడుదలలో  జాప్యం నివారించండి

స్టైఫండ్ ల విడుదలలో  జాప్యం నివారించండి తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ఆందోళన సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు):తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ( టీ జూడా) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ, డెంటల్ పీజీలు, హౌస్ సర్జన్లు, నర్సింగ్ విద్యార్థుల తరఫున తమ  ఆందోళనను వ్యక్తం చేసింది. వేతన భత్యాల...
Read More...
Local News 

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ 

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ  సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు):  గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ వెలుగు చూసింది.  చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ సిబ్బందికి మెయిన్ గేటు వద్ద పడి ఉన్న గుర్తు తెలియని మహిళ డెడ్ బాడీ ( దాదాపు  45-50 ఏళ్ల వయసు) కనిపించింది....
Read More...