డాక్టరేట్ పొందిన తుమ్మనపల్లి వాసి
సన్మానించిన మాజీ సర్పంచ్ గూడూరు ప్రతాపరెడ్డి
హర్షం వ్యక్తం చేసిన తుమ్మనపల్లి గ్రామస్తులు
హుజరాబాద్ సెప్టెంబర్ 7 (ప్రజామంటలు ప్రతినిధి దాసరి కోటేశ్వర్)
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న తుమ్మనపల్లి వాసి గొడిశాల పరమేశ్ కి ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జంతుశాస్త్ర విభాగంలో పీహెచ్డీ డాక్టరేట్ లభించింది. డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూనే పరిశోధన పట్ల ఉన్న ఆసక్తితో 2017 వ సంవత్సరంలో ఉస్మానియాలో పీహెచ్డీ పరిశోధక విద్యార్థిగా చేరారు. “మధ్యతరహా రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తి పెంపుదల ఉన్న అవకాశాలు మరియు సవాళ్లు౼ ఏ కేస్ స్టడీ ఆఫ్ రంగనాయక సాగర్ మరియు మిడ్ మానేర్ డ్యాం” అనే శీర్షికతో సీనియర్ ప్రొఫెసర్ రెడ్యానాయక్ పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధన గ్రంథానికి గాను పీహెచ్డీ పట్టా పొందారు. తుమ్మనపల్లి గ్రామంలో పుట్టి విద్యలో అత్యున్నత స్థాయి పట్టా అందుకున్న పరమేశ్ ను అతని తల్లిదండ్రులు మరియు గ్రామ మాజీ సర్పంచ్ గూడూరు ప్రతాపరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గూడూరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ, పరమేశ్వర్ ను ఆదర్శంగా తీసుకొని గ్రామ విద్యార్థులందరూ ఉన్నత విద్యలు అభ్యసించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ గ్రామస్తులు తనపై చూపిన ప్రేమ ఆదరభిమానాలకు ఆనందం వ్యక్తం చేస్తూ, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తాను ఈరోజు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, తల్లిదండ్రులతోపాటు తన భార్య, అన్నదమ్ములు మిత్రులు కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
.jpg)
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్
