ఇంకెన్నాళ్లీ అంతర్యుద్ధం? కాంగ్రెస్ vs కాంగ్రెస్ — జగిత్యాల వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు

On
ఇంకెన్నాళ్లీ అంతర్యుద్ధం? కాంగ్రెస్ vs కాంగ్రెస్ — జగిత్యాల వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు

176193767687145 ఏళ్ళ రాజకీయ జీవితం అర్ధంతరంగా ముగిసినా?
పార్టీలో పట్టుకోల్పోతున్నారా?
పదేళ్ల నాయకుడు సంజయ్ తో పోటీ పడలేకపోతున్నారా?

 

జగిత్యాల, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధానికి వేదికగా మారింది. అధికారపక్షంలో ఇలాంటి అంతర్గత యుద్ధం జరగడం కార్య‌కర్త‌ల‌లో, నాయకులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఒకదశలో రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు ఇస్తానన్న, తీసుకొనే ధైర్యం చేయని జీవన్ రెడ్డి, ఎప్పుడూ జగిత్యాల విడువని జీవన్ రెడ్డి ప్రభ మసకబారిపోతుందా? అని ఆయన అనుచరులే ప్రశ్నించుకొంటున్నారు. 

ఆయన తన 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, రెండుసార్లు మంత్రిగా ఉన్నా, ఆయన ఒక కొత్త నాయకుణ్ణి తయారు చేయకపోవడమే కాకుండా, ప్రక్కవారినే నమ్మలేని, అభద్రతకు గురవుతూ ఉంటాడని ఆయన అనుచరులే అనుకొంటారు. 

రాష్ట్ర స్థాయిలో అందరికీ పరిచయమే అయినా, అతన్ని అనుసరించే వారు, అతను అనుసరించే నాయకులు లేకపోవడం విశేషం.ఆయన జీవితంలో డిల్లీ కాంగ్రెస్ ఆఫీసు కు వెళ్లిన సందర్భం ఒక్కటే. ఇక ఆయన గాంధీభవన్ దిక్కే చూడరు. అసెంబ్లీ మీడియా పెయింట్ తప్ప, బహుశా ఆయనకు ఇతర ప్రాంతాలతో, నాయకులతో పనిలేనట్లు వ్యవహరిస్తారు. అందుకేనేమో, జగిత్యాల MLA సంజయ్ కుమార్ బిఆర్ఎస్ నుండి గెలిచి, కాంగ్రెస్ లో చేరిన విషయం, పార్టీ ఈయనకు ఏమాత్రం చెప్పలేదు. రాజీనామా చేస్తా అని వేఫిరిస్తే, రెండు రోజుల డ్రామా తరువాత అంతా మరిచిపోయారు.

ఈ నేపథ్యంలో యువతతో పాటు, నిన్నటి వరకు జీవన్ రెడ్డితో ఉన్న, 50 ఏళ్ళక్రితం కాంగ్రెస్ నాయకులు కూడా,ఇప్పుడు సంజయ్ తో కలిసిపోయారు.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ, జగిత్యాలలో మాత్రం మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఓడిపోవడం అనేక ప్రశ్నలను రేకెత్తించింది. ప్రజల సెంటిమెంట్, స్థానిక రాజకీయ విభజనలు, అంతర్గత పోటీలు అన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలహీనపరిచాయి.

image (17)

⚔️ జీవన్ రెడ్డి vs డా. సంజయ్ కుమార్ — కాంగ్రెస్‌లో రెండు శక్తులు

బిఆర్ఎస్ పార్టీలో, 2014లో ఎన్నికలకు రెండువారాల ముందు పార్టీలో చేరి, తిక్కట్టు సంపాదించుకొన్న, డా.సంజయ్, అనుభవ రాహిత్యంతో ఓడిపోయినా, రాష్ట్రంలో బి ఆర్ ఎస్ అధికారంలోకి రావడం, నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత గెలవడంతో, స్థానికంగా సంజయ్ బలపడ్డాడు. అధికారిక ప్రొటోకాల్ లేదనే కానీ ఆ ఐదేళ్లు అనధికార ఎమ్మెల్యే గానే అధికారులు పరిగణించారు.

ఆతరువాత, 2018 లో జరిగిన ఎన్నికల్లో కవిత సహకారంతో గెలిచాడు. కానీ ఆమె ఆధిపత్యధోరానిని భరించలేని సంజయ్, కొద్దికొద్దిగా ఆమెకు దూరం అయ్యాడు. అలాగే మిగతా ఎమ్మెల్యేలతో కూడి, ఆమె ఓటమికి తన వంతు పత్రపిషించి, తనకు రాజకీయాలు తెలుసని నిరూపించుకున్నాడు.

ఇక 2023లో, మళ్ళీ టిక్కట్టు పొంది గెలిచినా, పార్టీతో అంతకు ముట్టకుగానే ఉన్నాడు. కవితతో ఉన్న విభేదాల కాల్ కూడా ఈయన బి ఆర్ ఎస్ నుండి బయటకు వచ్చాడని అంటారు. అలాగే 

గత ప్రభుత్వ కాలంలో ఈయన వర్గీయులు చేసిన కాంట్రాక్టులకు సంబంధించి, దాదాపు 350 కోట్ల బిల్లులు పెండింగులో ఉండడం కూడా ,ఈయన్ను కాంగ్రెస్ వైపు మళ్లించాయని ప్రచారం.ఇప్పుడు జగిత్యాలకు మకుటంలేని మహారాజుల, అన్ని తానై రాజకీయాలు చేస్తున్నారు.

1761937676871

కాంగ్రెస్ లో ప్రతిపక్ష ఎమ్మెల్యే సంజయ్ 

ఎన్నికల్లో బి ఆర్ఎస్ టికెట్‌తో గెలిచిన డా. సంజయ్ కుమార్, తరువాత కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని ప్రకటించినా, పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇంకా స్పష్టతకు రాలేదు.
డా. సంజయ్ మాట్లాడుతూ,“ప్రజల అభివృద్ధే నా లక్ష్యం. పార్టీ పద్ధతులు కంటే ప్రజల అవసరాలు ముఖ్యం,” అని అంటున్నారు.

అయితే ఇది మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి మింగుడుపడని అంశంగా మారింది. ఆయన పరోక్షంగానే కాకుండా బహిరంగంగానూ సంజయ్ పై విమర్శలు చేస్తున్నారు.
ఇక నియోజకవర్గ స్థాయిలో అధికారులు, ప్రజలు, కార్యకర్తలు డా. సంజయ్‌ను అసలైన అధికారపక్ష ఎమ్మెల్యేగా చూస్తుండడం జీవన్ రెడ్డి స్థాయిని తగ్గించింది.

🧩 అధిష్టానం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు?

జగిత్యాలలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.

కాంగ్రెస్ హైకమాండ్ ఈ వివాదంపై ఇప్పటివరకు మౌనం పాటిస్తోంది.ప్రధాన కారణం — డా. సంజయ్ కాంగ్రెస్ అధికారిక సభ్యత్వం రుజువు కాలేదు.
స్పీకర్ ముందు ఆయన ఇంకా బి ఆర్ఎస్ ఎమ్మెల్యేగా నమోదై ఉన్నారు.
అందువల్ల, సాంకేతికంగా కాంగ్రెస్ జోక్యం చేసుకునే స్థితిలో లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం జగిత్యాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ డా. సంజయ్‌కు పరోక్ష ప్రోత్సాహం ఇస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ లోపల విస్తరిస్తోంది.

🧨స్థానిక రాజకీయాలు వేడెక్కుతున్నాయి

ఈ అంతర్యుద్ధం కారణంగా పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లు ఇద్దరు నేతల వర్గాలకు దూరంగా ఉండి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలా కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బలమైన దెబ్బ తగలే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


🔮 భవిష్యత్ దిశ — జీవన్ రెడ్డి & డా. సంజయ్ కుమార్

విశ్లేషకుల అంచనా ప్రకారం:

  • డా. సంజయ్ కుమార్ స్థానికంగా ప్రజా మద్దతు పెంచుకుంటున్నారు. పార్టీ మారకపోయినా, అధికారానుకూల వైఖరి కారణంగా ప్రజా చైతన్యాన్ని నిలబెట్టుకుంటున్నారు.
  • జీవన్ రెడ్డి వర్గం అయితే, ఈ అంతర్యుద్ధం కారణంగా క్రమంగా క్షీణిస్తోంది.
  • కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకోకపోతే, ఈ విభేదాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.

రేపటి రోజుల్లో బి ఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన ఇతర ఎమ్మెల్యేలు కూడా పదవి కోల్పోతే, జగిత్యాల మోడల్ పునరావృతం కావచ్చని పర్యవేక్షకులు చెబుతున్నారు — అంతర్గత విభేదాలు, అధిష్టాన అస్పష్టత, స్థానిక అసంతృప్తి కలిపి కాంగ్రెస్‌కు సవాలుగా మారవచ్చు.

 

Join WhatsApp

More News...

National  State News 

వరద ప్రభావిత ప్రాంతాల సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల సీఎం రేవంత్ రెడ్డి పర్యటన   – బాధితులకు భరోసా, జిల్లాల వారీగా నష్టం నివేదికలు సమర్పించాలన్న ఆదేశాలు హనుమకొండ నవంబర్ 01 (ప్రజా మంటలు):భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం జరిగిన ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేసిన అనంతరం, సమ్మయ్యనగర్‌, కాపువాడ, పోతననగర్‌ ప్రాంతాల్లో బాధితులను...
Read More...

జగిత్యాల వ్యాపారవేత్త బట్టు సుధాకర్ మృతి

జగిత్యాల వ్యాపారవేత్త బట్టు సుధాకర్ మృతి   – కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్): నవంబర్ 01 (ప్రజా మంటలు): పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బట్టు సుధాకర్ మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ...
Read More...
Local News  State News 

బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో వర్షిత మృతి – ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్

బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో వర్షిత మృతి – ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ వర్షిత మృతి అనుమానాస్పదం – కవిత 110 మంది పిల్లలు ఏడాదిన్నరలో చనిపోయారని ఆవేదన స్పెషల్ ఎంక్వైరీ, సిట్ వేయాలని డిమాండ్ ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని విజ్ఞప్తి రాంపూర్,హుజురాబాద్ నవంబర్ 01 (ప్రజా మంటలు):: బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో అనుమానాస్పదంగా మృతిచెందిన శ్రీ వర్షిత కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు....
Read More...
National  Comment  State News 

ఇంకెన్నాళ్లీ అంతర్యుద్ధం? కాంగ్రెస్ vs కాంగ్రెస్ — జగిత్యాల వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు

ఇంకెన్నాళ్లీ అంతర్యుద్ధం? కాంగ్రెస్ vs కాంగ్రెస్ — జగిత్యాల వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు 45 ఏళ్ళ రాజకీయ జీవితం అర్ధంతరంగా ముగిసినా? పార్టీలో పట్టుకోల్పోతున్నారా? పదేళ్ల నాయకుడు సంజయ్ తో పోటీ పడలేకపోతున్నారా?    జగిత్యాల, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):జగిత్యాల నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధానికి వేదికగా మారింది. అధికారపక్షంలో ఇలాంటి అంతర్గత యుద్ధం జరగడం కార్య‌కర్త‌ల‌లో, నాయకులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకదశలో రాష్ట్ర...
Read More...

చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించుకుందాం — కల్వకుంట్ల కవిత

చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించుకుందాం — కల్వకుంట్ల కవిత కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ పర్యటనలో పాల్గొన్న సందర్భంగా జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మలు, బోనాలు, ఒగ్గుడోలు, డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా ఆమెను ఆహ్వానించారు. అల్గునూరు చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, భారీ ర్యాలీగా తెలంగాణ అమరవీరుల...
Read More...
Local News  Spiritual  

కొత్త గుడిలో భక్తులకు  దర్శనమిచ్చిన వెంకన్న స్వామి

కొత్త గుడిలో భక్తులకు  దర్శనమిచ్చిన వెంకన్న స్వామి శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పున:ప్రారంభించిన పీఠాధిపతులు పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల రాక సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) : సీతాఫల్మండి డివిజన్ శ్రీనివాస్ నగర్ లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం  జీర్ణోద్దరణ పూర్వక మహా  సంప్రోక్షణ, అష్ట బంధన మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించి, ఆలయాన్ని పున ప్రారంభించారు. కంచి...
Read More...
Local News  Spiritual  

నేటి నుంచి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ 150వ వార్షికోత్సవాలు 

నేటి నుంచి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ 150వ వార్షికోత్సవాలు  సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు): సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి 150వ వార్షికోత్సవాలను నవంబర్ 1వ తేదీ నుంచి ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్టాండింగ్ కమిటీ, జూబ్లీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ రాబర్ట్ సూర్య ప్రకాష్ తెలిపారు. శుక్రవారం చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చర్చి సీనియర్ పాస్టర్ డాక్టర్...
Read More...
Local News 

కోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రి క్యాంటీన్ ను సీజ్ చేసిన అధికారులు

కోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రి క్యాంటీన్ ను సీజ్ చేసిన అధికారులు సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) : గాంధీ ఆస్పత్రి ఆవరణలోని  పెషీ కేఫ్‌ను కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఆస్పత్రి అధికారులు సీజ్‌చేశారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో గాంధీ హాస్పిటల్‌డెవలప్‌మెంట్‌సొసైటీ (హెచ్‌డీఎస్‌) తరఫున అధికారులు కేఫ్‌ లోని సామాన్లు బయటకు తీయించి తాళం వేశారు. ఓపీ బ్లాక్‌ఎదురుగా ఉన్న ఈ కేఫ్‌కాంట్రాక్టు గడువు 2018లో ముగిసినప్పటికీ,...
Read More...
Local News  Spiritual  

స్కందగిరిలో స్వర్ణరథాన్ని ఆవిష్కరించిన కంచి పీఠాధిపతి

స్కందగిరిలో స్వర్ణరథాన్ని ఆవిష్కరించిన కంచి పీఠాధిపతి సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) : పద్మారావు నగర్ లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో భక్తుల విరాళాలతో రూపొందించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి స్వర్ణ రథాన్ని శుక్రవారం రాత్రి కంచి కామకోటి పీఠాధిపతి శంకరా చార్య శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి  ప్రారంభించారు. వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వర్ణ...
Read More...
Local News 

గొల్లపల్లి మండలం పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ 

గొల్లపల్లి మండలం పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ  (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 31 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని  రన్ ఫర్ యూనిటీ ఐక్యత  కార్యక్రమం ఎస్ఐ కృష్ణా సాగర్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు పోలీస్ సిబ్బంది,ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, క్రీడాకారులు, ,  యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల...
Read More...
Local News 

బుగ్గారం  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ 

బుగ్గారం  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ  (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 31 (ప్రజా మంటలు): బుగ్గారం మండలంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ (ఐక్యత పరుగు) కార్యక్రమం  ఎస్ఐ ,జి సతీష్ , ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజా ప్రతినిధులు, మరియు యువత ఉత్సాహంగా...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా  " ఫ్రెషర్స్ డే " వేడుకలు

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా   ఇబ్రహీంపట్నం అక్టోబర్ 31 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం రోజున  " ప్రెషర్స్ డే" వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం మండల తహసిల్దార్ వరప్రసాద్  హాజరై,మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య అనేది చాలా కీలకమైనదని ఈ దశలో విద్యార్థులు ఒక పద్ధతి ప్రకారం...
Read More...