జైనూర్ అల్లర్ల బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుంది - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
జైనూర్ అల్లర్ల బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుంది - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హన్మకొండ సెప్టెంబర్ 06 :
జైనూర్ లో ఆదివాసీ మహిళపై అత్యాచారం ఘటనపై నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వ వీప్ లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ మరియు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు లతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఇలా చెప్పారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టింది. బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నాం...
మంత్రి సీతక్క రెండు సార్లు బాధితురాలిని పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు..
తక్షణ సాయంగా లక్ష రూపాయలను అందజేశారు.నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
జైనూర్ లో జరిగిన అల్లర్లను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కంట్రోల్ లో ఉంది.
డీజీ స్థాయి అధికారి స్వయంగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.జైనూరు లో జరిగిన సంఘటన ను బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది.
అత్యాచార ఘటనను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు.బాధిత మహిళ కు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు....
ఇది రాజకీయాలకు సమయం కాదు.రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఇబ్బంది లేదు.అంతా ప్రశాంతంగా ఉంది..
హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి కావాలనే ప్రభుత్వంపైన దుష్పచారం చేస్తున్నారు...పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు..
తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను తగ్గించడానికి కుట్రలు చేస్తున్నారు..రాజకీయం కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడం కరెక్ట్ కాదు.
కేసీఆర్ పదేళ్లలో ఎన్ని దారుణాలు జరిగాయో అందరికి తెలుసు. హైదరాబాద్ శివారులో దిశ పైన జరిగిన అత్యాచారం, హత్య ప్రపంచం మొత్తానికి తెలుసు..
కనీసం దిశ కుటుంబాన్ని పలకరించని చరిత్ర కేసీఆర్ ది..హైదరాబాద్ నడిబొడ్డున సింగరేణి బస్తీలో ఆరేళ్ల పాప పైన అత్యాచారం జరిగితే దిక్కు లేదు...జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 లో మైనర్ పైన కారులో అత్యాచారం జరిగిన విషయం హరీష్ రావుకు గుర్తు లేదా..?
చిన్నారులపై ఎన్ని అత్యాచారాలు జరిగాయో లెక్కనే లేదు.. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయి అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి..
మా ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్, గంజాయి పైన సీఎం ఉక్కుపాదం మోపారు...
తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TSNAB) ను పటిష్టం చేశాం...
పదేళ్లలో అనేక చోట్ల అల్లర్లు ,మతకల్లోలాలు చోటు చేసుకున్నాయి..
బైంసా లో ఎన్ని రోజులు కర్ఫ్యూ పెట్టారో అందరికీ తెలుసు...
ఆదిలాబాద్ జిల్లాలో లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చు పెట్టింది మీరు కాదా.అప్పుడు జరిగిన అల్లర్లలో రెండు వైపులా ఎంత నష్టం జరిగిందో తెలియదా..?
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎవరూ మరిచిపోలేదు..
More News...
<%- node_title %>
<%- node_title %>
శతాధిక ఆచార్యుని పరమపదం
లక్షెట్టిపేట ఫిబ్రవరి 12 ( ప్రజా మంటలు)ఉభయ వేదాంతులు పౌరాణికులు శ్రీమాన్ మందపల్లి పరాంకుశ ఆచార్య (103) గురువారం ఉదయం హైదరాబాదులో తన చిన్న కుమారుని నివాసంలో పరమపదించారు. ఆయన స్వగృహం లక్షేటిపేట లో ఆయన భౌతిక కాయాన్ని శిష్యులు బంధువుల దర్శనార్థం ఉంచారు.
ఆయన సుమారు ఎనిమిది వందల పైబడి భాగవత సప్తాహాలు... హైదరాబాద్లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి
జగిత్యాల, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్కు చెందిన చేట్పల్లి సంజయ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ యువకుడు హైదరాబాద్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది.
సమాచారం ప్రకారం, సంజయ్ నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని రాత్రి హైదరాబాద్కు బయలుదేరాడు. అయితే... కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనని గ్రామస్థులు
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఎదుల రాజేశం మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో పాడె మోయడానికి గ్రామస్థులు ముందుకు రాకపోవడం కలకలం రేపింది.
గ్రామ సర్పంచ్ మరియు కుల పెద్దలు గ్రామస్తులు, దూరపు బంధువులు ఎవరూ... చీఫ్ మినిస్టర్ కప్ ఎంపిక పోటీలు ప్రారంభించిన అదనపు కలెక్టర్ బిఎస్ లత
జగిత్యాల ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకముగా తల పెట్టిన 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2025 సందర్భముగా జగిత్యాల జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు జిల్లాలోని వివిధ క్రీడా అంశములను జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు ఉదయం 10 గం. ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి... ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత
న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత
బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి... పశ్చిమ దేశాలలో స్టార్మర్ నాయకత్వ సంక్షోభం ప్రభావం
స్టార్మర్ సంక్షోభం – మార్కెట్లపై ప్రభావం
యూకే రాజకీయ పరిణామాలు ఆర్థిక మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితి పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా పాలసీలు వామపక్ష వైపు మళ్లవచ్చనే భయంతో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి.
పౌండ్ యూరోతో పోలిస్తే 0.5% పడిపోయి €1.146... ఇండియా టుడే రౌండ్టేబుల్లో అన్నామలై–కార్తీ చిదంబరం
మర్యాదకు, రాజకీయ పరిణితకు అద్దం
న్యూఢిల్లీ ఫిబ్రవరి 12:
ఇండియా టుడే నిర్వహించిన రౌండ్టేబుల్ చర్చలో తమిళనాడు రాజకీయాలకు చెందిన ప్రముఖ నాయకులు అన్నామలై కుప్పుస్వామి మరియు కార్తీ చిదంబరం పాల్గొన్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ చర్చ రాజకీయ వర్గాల్లో ప్రత్యేకంగా నిలిచింది.
సాధారణంగా టెలివిజన్ డిబేట్లలో కనిపించేలా అసభ్య పదజాలం, వ్యక్తిగత విమర్శలు... ట్రంప్–నేతన్యాహూ సీక్రెట్ మీటింగ్
వాషింగ్టన్ ఫిబ్రవరి 12:
:వైట్ హౌస్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మధ్య దాదాపు మూడు గంటల పాటు జరిగిన గోప్య సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు, మరియు భవిష్యత్ వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.... మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత ఉత్సాహం
జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)
(శ్రీధర గణపతి జగిత్యాల)జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో బుధవారం యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేస్తూ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మీడియా ముందు సంకేతాన్ని ప్రదర్శించారు.
39వ వార్డుకు చెందిన గోలి... డాలర్ బలహీనమైనా రూపాయి ఎందుకు మరింత పడిపోయింది?
న్యూఢిల్లీ ఫిబ్రవరి 12:
జనవరి నెలలో అమెరికా డాలర్ విలువ కొంత బలహీనపడింది. అయితే సాధారణంగా ఒక కరెన్సీ బలహీనపడితే, దాని ఎదురు కరెన్సీలు బలపడటం సహజం. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. డాలర్ బలహీనత కనిపించిన సమయంలోనే భారత రూపాయి మరింత క్షీణించింది. దీని వెనుక పలు కీలక కారణాలు ఉన్నాయి.
1️⃣ ... RBI నివేదిక: తెలంగాణ అప్పుల భారం పెరుగుతోంది
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా విడుదల చేసిన State Finances నివేదికలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గంభీరమైన సూచనలు ఉన్నాయి. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయి మరియు దీనికి గత బడ్జెట్ డేటా కూడా అద్దం పడుతుంది.
1. RBI తెలిపిన... మధ్యప్రదేశ్పై రూ.5.31 లక్షల కోట్ల ప్రజా రుణం – కమల్నాథ్ విమర్శలతో రాజకీయ వేడి
భోపాల్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంపై ప్రజా రుణ భారం రూ.5,31,012.8 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ రుణం మరింత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారీ రుణభారం... 