జైనూర్ అల్లర్ల బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుంది - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
జైనూర్ అల్లర్ల బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుంది - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హన్మకొండ సెప్టెంబర్ 06 :
జైనూర్ లో ఆదివాసీ మహిళపై అత్యాచారం ఘటనపై నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వ వీప్ లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ మరియు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు లతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఇలా చెప్పారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టింది. బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నాం...
మంత్రి సీతక్క రెండు సార్లు బాధితురాలిని పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు..
తక్షణ సాయంగా లక్ష రూపాయలను అందజేశారు.నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
జైనూర్ లో జరిగిన అల్లర్లను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కంట్రోల్ లో ఉంది.
డీజీ స్థాయి అధికారి స్వయంగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.జైనూరు లో జరిగిన సంఘటన ను బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది.
అత్యాచార ఘటనను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు.బాధిత మహిళ కు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు....
ఇది రాజకీయాలకు సమయం కాదు.రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఇబ్బంది లేదు.అంతా ప్రశాంతంగా ఉంది..
హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి కావాలనే ప్రభుత్వంపైన దుష్పచారం చేస్తున్నారు...పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు..
తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను తగ్గించడానికి కుట్రలు చేస్తున్నారు..రాజకీయం కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడం కరెక్ట్ కాదు.
కేసీఆర్ పదేళ్లలో ఎన్ని దారుణాలు జరిగాయో అందరికి తెలుసు. హైదరాబాద్ శివారులో దిశ పైన జరిగిన అత్యాచారం, హత్య ప్రపంచం మొత్తానికి తెలుసు..
కనీసం దిశ కుటుంబాన్ని పలకరించని చరిత్ర కేసీఆర్ ది..హైదరాబాద్ నడిబొడ్డున సింగరేణి బస్తీలో ఆరేళ్ల పాప పైన అత్యాచారం జరిగితే దిక్కు లేదు...జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 లో మైనర్ పైన కారులో అత్యాచారం జరిగిన విషయం హరీష్ రావుకు గుర్తు లేదా..?
చిన్నారులపై ఎన్ని అత్యాచారాలు జరిగాయో లెక్కనే లేదు.. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయి అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి..
మా ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్, గంజాయి పైన సీఎం ఉక్కుపాదం మోపారు...
తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TSNAB) ను పటిష్టం చేశాం...
పదేళ్లలో అనేక చోట్ల అల్లర్లు ,మతకల్లోలాలు చోటు చేసుకున్నాయి..
బైంసా లో ఎన్ని రోజులు కర్ఫ్యూ పెట్టారో అందరికీ తెలుసు...
ఆదిలాబాద్ జిల్లాలో లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చు పెట్టింది మీరు కాదా.అప్పుడు జరిగిన అల్లర్లలో రెండు వైపులా ఎంత నష్టం జరిగిందో తెలియదా..?
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎవరూ మరిచిపోలేదు..
More News...
<%- node_title %>
<%- node_title %>
ఐక్య ఉద్యమాలతోనే పీఆర్సీ సాధ్యం, అశాస్త్రీయమైన టెట్ పరీక్షను రద్దు చేయాలి : జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్
జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ లకు రావాల్సిన పి.ఆర్సి , డి.ఏ లు, పెండింగ్ బకాయిల సమస్యలు ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం తీర్మానించింది. ఆదివారం జగిత్యాల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల సమావేశమందిరంలో ఎస్టీయు తృతీయ కార్యవర్గ... సహస్ర లింగాల దేవాలయంలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు
జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)
రూరల్ పొలాస గ్రామం శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో ఉదయం సంకటహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఆలయంలోని సహస్ర లింగాలకు ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం ఆలయంలోని సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతికి పలు పంచామృతాభిషేకాలను... ఉప్పుమడుగ కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్
రాయికల్, ఆగస్టు 1 (ప్రజా మంటలు):
రాయికల్ మండలం ఉప్పుమడుగ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజన నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. మద్యహ్న భోజనం జ్,, జగిత్యాల,
విద్యార్థుల అభివృద్ధికి నాణ్యమైన విద్య... ఉద్యమాల్లో "యువత" ఎందుకు పాల్గొనరాదు?
*భావ ప్రకటన హక్కు యువతకు లేదా*?(సిరిసిల్ల రాజేంద్ర శర్మ)
*ఉద్యమాల్లో యువత ఎందుకు పాల్గొన రాదని చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం అసలు ఈ ఉద్యమాలు యువత ఎందుకు చేస్తారు ఆలోచించాల్సిందే. యువత చదువుకున్న చదువులకు సరిపడే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా, చిరుద్యోగులుగా జీవితాన్ని వెళ్ళదీస్తూ నిరాశ నిస్పృహలకు లోనై ఉద్యమాలకు శ్రీకారం చుడతారు.
ప్రజాస్వామ్య... జగిత్యాల జిల్లాలో పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష
జగిత్యాల: జూలై 29 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోక్సో కేసులో నిందితుడు రాజేష్కు జగిత్యాల పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే నిందితుడికి ₹6,500 జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.అదేవిధంగా బాధిత... నంది మేడారం పంప్హౌస్లో నాలుగు బాహుబలి పంపులు ప్రారంభం
కరీంనగర్, జూలై 29 (ప్రజా మంటలు):
కాళేశ్వరం ద్వారా 12,600 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలుఎడతెరిపి వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని పెద్దపల్లి జిల్లా నంది మేడారం పంప్హౌస్లో నాలుగు బాహుబలి పంపులను అధికారులు బుధవారం ప్రారంభించారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం నాలుగు పంపులతో 12,600 క్యూసెక్కుల... కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో రాష్ట్ర మంత్రుల గిరి ప్రదక్షిణ
సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని వరుణ పూజలుకొండగట్టు, జూలై 29 (ప్రజా మంటలు):
గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్,... పదోన్నతి పొందిన ఎస్.ఐ వెంకటేశ్వర్లకు ఎస్పీ శుభాకాంక్షలు
జగిత్యాల జూలై 29 ( ప్రజా మంటలు)టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహించి ఎస్.ఐ గా పదోన్నతి పొందిన వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెంకటేశ్వర్లుకు ఎస్ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు.... చదువునే ఆయుధంగా మలుచుకొని ఉన్నత స్థితికి ఎదగాలి. జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్.
జగిత్యాల, జులై 29(ప్రజా మంటలు) చదువునే ఆయుధంగా మలుచుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ కమిటీ చైర్మన్, అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని... నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి - కల్వకుంట్ల కవిత
సిరిసిల్ల జూలై 28(ప్రజా మంటలు):సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన పోలీసుల దాష్టీకం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని, ఇతర బాధితులను పరామర్శించిన ఆమె, గత ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ కోరారు. ఘటనకు బాధ్యులైన... హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్
హైదరాబాద్, జూలై 28:
హైడ్రా (HYDRA) వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, అక్రమ నిర్మాణాలు, చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైడ్రా ప్రభుత్వ తీసుకొచ్చిన అత్యంత పెద్ద పరిపాలనా సంస్కరణల్లో ఒకటని పేర్కొన్నారు.సీఎం... జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు
హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థ అభివృద్ధిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మల్యే డా. సంహ పాల్గొని, జిల్లా వైద్య రంగానికి సంబంధించిన పలు కీలక... 