జైనూర్ అల్లర్ల బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుంది - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
జైనూర్ అల్లర్ల బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుంది - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హన్మకొండ సెప్టెంబర్ 06 :
జైనూర్ లో ఆదివాసీ మహిళపై అత్యాచారం ఘటనపై నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వ వీప్ లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ మరియు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు లతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఇలా చెప్పారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టింది. బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నాం...
మంత్రి సీతక్క రెండు సార్లు బాధితురాలిని పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు..
తక్షణ సాయంగా లక్ష రూపాయలను అందజేశారు.నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
జైనూర్ లో జరిగిన అల్లర్లను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కంట్రోల్ లో ఉంది.
డీజీ స్థాయి అధికారి స్వయంగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.జైనూరు లో జరిగిన సంఘటన ను బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది.
అత్యాచార ఘటనను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు.బాధిత మహిళ కు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు....
ఇది రాజకీయాలకు సమయం కాదు.రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఇబ్బంది లేదు.అంతా ప్రశాంతంగా ఉంది..
హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి కావాలనే ప్రభుత్వంపైన దుష్పచారం చేస్తున్నారు...పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు..
తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను తగ్గించడానికి కుట్రలు చేస్తున్నారు..రాజకీయం కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడం కరెక్ట్ కాదు.
కేసీఆర్ పదేళ్లలో ఎన్ని దారుణాలు జరిగాయో అందరికి తెలుసు. హైదరాబాద్ శివారులో దిశ పైన జరిగిన అత్యాచారం, హత్య ప్రపంచం మొత్తానికి తెలుసు..
కనీసం దిశ కుటుంబాన్ని పలకరించని చరిత్ర కేసీఆర్ ది..హైదరాబాద్ నడిబొడ్డున సింగరేణి బస్తీలో ఆరేళ్ల పాప పైన అత్యాచారం జరిగితే దిక్కు లేదు...జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 లో మైనర్ పైన కారులో అత్యాచారం జరిగిన విషయం హరీష్ రావుకు గుర్తు లేదా..?
చిన్నారులపై ఎన్ని అత్యాచారాలు జరిగాయో లెక్కనే లేదు.. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయి అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి..
మా ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్, గంజాయి పైన సీఎం ఉక్కుపాదం మోపారు...
తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TSNAB) ను పటిష్టం చేశాం...
పదేళ్లలో అనేక చోట్ల అల్లర్లు ,మతకల్లోలాలు చోటు చేసుకున్నాయి..
బైంసా లో ఎన్ని రోజులు కర్ఫ్యూ పెట్టారో అందరికీ తెలుసు...
ఆదిలాబాద్ జిల్లాలో లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చు పెట్టింది మీరు కాదా.అప్పుడు జరిగిన అల్లర్లలో రెండు వైపులా ఎంత నష్టం జరిగిందో తెలియదా..?
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎవరూ మరిచిపోలేదు..
More News...
<%- node_title %>
<%- node_title %>
సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఖమ్మం వైద్యుడు సజీవ దహనం
సూర్యాపేట, సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు): సూర్యాపేట–ఖమ్మం 365వ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొన్న వోల్వో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో అందులో ఉన్న ఖమ్మంకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కసుకుర్తి జగదీష్ సజీవ దహనమయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే కారు ముందు... పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతి
కోరుట్ల, సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన చిలువేరి మహేష్ గొర్రెల మందపై పిడుగు పడటంతో సుమారు 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం స్పందించి పిడుగుపాటుతో మృతి చెందిన గొర్రెలకు... చర్లపల్లిలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగుల పంపిణీ
జగిత్యాల సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు):
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యావరణ ప్రేమికుడు, ఉద్యమకారుడు నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు.
చర్లపల్లి గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పునర్వినియోగించగల వస్తువులను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని... గొల్లకోటలో సింహాచలం జగన్ కుటుంబానికి రూ.21.36 లక్షల ఆర్థిక సాయం
వెల్గటూర్/గొల్లపల్లి, సెప్టెంబర్ 21 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొల్లకోటకు చెందిన బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు దివంగత సింహాచలం జగన్ కుటుంబానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో రూ.21.36 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
ఇటీవల అకాల మరణం చెందిన జగన్ చిత్రపటానికి నివాళులర్పించిన కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులను... ఘనంగా శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేశ నిమజ్జన శోభాయాత్ర
కీసర సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ నిమజ్జన కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా కొనసాగింది. బ్యాండు మేళ తాళాలతో ప్రత్యేక వాహనంపై స్వామివారిని ఉపస్థితి చేసి శోభాయాత్రగా నిమజ్జనానికి తరలించారు.
కోలాటాలతో భజనలతో శోభాయాత్రగా తటకానికి తరలించి నిమజ్జనం నిర్వహించారు. ఐదు రోజులపాటు... నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా ప్రతినిధి, ( ప్రజా మంటలు) సెప్టెంబర్ 19:
గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో... వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో పెద్ద చెరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను తహసిల్దార్ వరప్రసాద్,ఎస్ఐ నవీన్ పరిశీలించినరు,
గంగమ్మ గుడి కట్టపైన నుండి చిన్న గణపతులు నిమజ్జనం, గంగపుత్ర సంఘ భవనం వద్ద నుండి పెద్ద గణపతులు నిమగ్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు... మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్
మెట్టుపల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
మెట్ పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్, శనివారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే బాలుర హాస్టల్, బీర్పూర్ ఎట్ మెట్ పల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న కిచెన్, బాత్రూం,... చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ
హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు... రేవంత్రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్రెడ్డి
పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్
హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి... కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్
కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్... రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం
కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)::
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు... 