జైనూర్ అల్లర్ల బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుంది  - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 

On
జైనూర్ అల్లర్ల బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుంది  - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 

జైనూర్ అల్లర్ల బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుంది  - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 

హన్మకొండ సెప్టెంబర్ 06 :

జైనూర్ లో  ఆదివాసీ మహిళపై అత్యాచారం ఘటనపై  నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వ వీప్ లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ మరియు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు లతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.

ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఇలా చెప్పారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టింది. బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నాం...

మంత్రి సీతక్క రెండు సార్లు బాధితురాలిని పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు..

తక్షణ సాయంగా లక్ష రూపాయలను అందజేశారు.నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

జైనూర్ లో జరిగిన అల్లర్లను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కంట్రోల్ లో ఉంది.

డీజీ స్థాయి అధికారి స్వయంగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.జైనూరు లో జరిగిన సంఘటన ను బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది.

అత్యాచార ఘటనను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు.బాధిత మహిళ కు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు....

ఇది రాజకీయాలకు సమయం కాదు.రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఇబ్బంది లేదు.అంతా ప్రశాంతంగా ఉంది..

హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి కావాలనే ప్రభుత్వంపైన దుష్పచారం చేస్తున్నారు...పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు..

తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను తగ్గించడానికి కుట్రలు చేస్తున్నారు..రాజకీయం కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడం కరెక్ట్ కాదు.

కేసీఆర్ పదేళ్లలో ఎన్ని దారుణాలు జరిగాయో అందరికి తెలుసు. హైదరాబాద్ శివారులో దిశ పైన జరిగిన అత్యాచారం, హత్య  ప్రపంచం మొత్తానికి తెలుసు..

కనీసం దిశ కుటుంబాన్ని పలకరించని చరిత్ర కేసీఆర్ ది..హైదరాబాద్ నడిబొడ్డున సింగరేణి బస్తీలో ఆరేళ్ల పాప పైన  అత్యాచారం జరిగితే దిక్కు లేదు...జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 లో మైనర్ పైన కారులో అత్యాచారం జరిగిన విషయం హరీష్ రావుకు గుర్తు లేదా..? 

చిన్నారులపై ఎన్ని అత్యాచారాలు జరిగాయో లెక్కనే లేదు.. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయి అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి..

మా ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్, గంజాయి పైన సీఎం ఉక్కుపాదం మోపారు...
 తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TSNAB)  ను పటిష్టం చేశాం... 


పదేళ్లలో అనేక చోట్ల అల్లర్లు ,మతకల్లోలాలు చోటు చేసుకున్నాయి.. 

బైంసా లో ఎన్ని రోజులు కర్ఫ్యూ పెట్టారో అందరికీ తెలుసు...


ఆదిలాబాద్ జిల్లాలో లంబాడీలు, ఆదివాసీల మధ్య  చిచ్చు పెట్టింది మీరు కాదా.అప్పుడు జరిగిన అల్లర్లలో రెండు వైపులా ఎంత నష్టం జరిగిందో తెలియదా..? 

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎవరూ మరిచిపోలేదు.. 

 

Tags
Join WhatsApp

More News...

వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ అవసరమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్య

వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ అవసరమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్య జగిత్యాల నవంబర్ 04 (ప్రజా మంటలు)::జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో సోమవారం మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి గారిని కలసిన వీఆర్ఏలు (Village Revenue Assistants) తమ వ్యవస్థను పునరుద్ధరించాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ...
Read More...
Local News 

ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని ఏబీవీపీ ధర్నా

ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని ఏబీవీపీ ధర్నా మెట్టుపల్లి నవంబర్ 4 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పాత బస్టాండ్, శాస్త్రి చౌరస్తా వద్ద ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టే విషయంలో పోలీసులకు, విద్యార్థి...
Read More...

జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్ జాప్యంపై ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ రెండో రోజు కొనసాగింపు

జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్ జాప్యంపై ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ రెండో రోజు కొనసాగింపు    జగిత్యాల (రూరల్) నవంబర్ 04 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లాలో విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ మొత్తాలు విడుదలలో ప్రభుత్వం చూపుతున్న ఆలస్యం పై ప్రైవేట్ కళాశాలల నిరసన రెండో రోజుకు చేరుకుంది. జిల్లాలోని పలు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు నిరవధిక బంద్‌ను కొనసాగిస్తూ, విద్యార్థుల హక్కుల కోసం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక...
Read More...

“టీచరమ్మ చిల్లర పనులు..!” – శ్రీకాకుళం జిల్లాలో బాలికలతో ఊడిగం - ఉపాధ్యాయురాలిపై గాంభీర ఆరోపడులు

“టీచరమ్మ చిల్లర పనులు..!” – శ్రీకాకుళం జిల్లాలో బాలికలతో ఊడిగం - ఉపాధ్యాయురాలిపై గాంభీర ఆరోపడులు విశాఖపట్నం నవంబర్ 04: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని బందపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ ఘటన వెలుగుచూసింది. సమాచారం ప్రకారం, అక్కడ ఉపాధ్యాయురాలైన ఒక వ్యక్తి సెల్ ఫోన్‌తో మాట్లాడుతూ, ఇద్దరు విద్యార్థినులతో కాళ్ల నొక్కించుకోవడం వీడియో చిత్రంగా తీసుకోవడంతో ప్రజలలో ఆందోళన నెలకొంది. విద్యార్థులు విద్యాబుద్ధిని మరియు ఆస్తిత్వ పరిరక్షణ పరంపరను...
Read More...

విశాఖలో స్వల్ప భూకంపం

విశాఖలో స్వల్ప భూకంపం గాజువాక నుంచి భీమిలీ వరకు ప్రభావం విశాఖపట్నం, నవంబర్ 4:సముద్ర తీర నగరమైన విశాఖపట్నంలో ఈ రోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపం నమోదైంది. సమాచారం ప్రకారం, ఉదయం 4 గంటల నుండి 4.30 గంటల మధ్య కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంపం ప్రభావం గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలీ,...
Read More...

విజయ్ పార్టీ ప్రజా కార్యక్రమాల నియంత్రణకు రిటైర్డ్ పోలీసు అధికారుల శిక్షణతో వాలంటీర్ల బృందం

విజయ్ పార్టీ ప్రజా కార్యక్రమాల నియంత్రణకు రిటైర్డ్ పోలీసు అధికారుల శిక్షణతో వాలంటీర్ల బృందం చెన్నై, నవంబర్ 4:తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత తలపతి విజయ్ నేతృత్వంలో పార్టీ శ్రేణుల్లో నూతన మార్పులు మొదలయ్యాయి. ఇటీవల వెలుస్వామీపురం రోడ్‌షోలో ఏర్పడిన గందరగోళం అనంతరం, పార్టీకి ప్రత్యేకంగా ప్రజా సభల నియంత్రణ కోసం “థొండర్ అరి” (Thondar Ani) అనే వాలంటీర్స్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ ఈ...
Read More...
National  Filmi News  State News 

“నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇప్పుడు ఒక ‘సమతా అవార్డు’ లా మారిపోయాయి. నటుడు ప్రకాశ్ రాజ్

“నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇప్పుడు ఒక ‘సమతా అవార్డు’ లా మారిపోయాయి. నటుడు ప్రకాశ్ రాజ్ నేషనల్ అవార్డ్స్‌పై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు! “ఫైల్లు, పైల్లు అవార్డులు గెలుస్తున్నాయి” — మమ్ముట్టి ఉపేక్షపై ఆగ్రహం - ప్రకాశ్ రాజ్  న్యూ ఢిల్లీ నవంబర్ 04: ప్రఖ్యాత నటుడు ప్రకాశ్ రాజ్ నేషనల్ అవార్డ్స్‌పై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సౌత్ సినిమా లెజెండ్ మమ్ముట్టికి నేషనల్ అవార్డ్స్‌లో పట్టింపు...
Read More...
National  International  

అమెరికా షట్డౌన్‌ తర్వాత హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ పునరుద్ధరణ

అమెరికా షట్డౌన్‌ తర్వాత హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ పునరుద్ధరణ   తాత్కాలికంగా నిలిచిపోయిన వీసా ప్రక్రియను మళ్లీ ప్రారంభించిన అమెరికా కార్మిక శాఖ వాషింగ్టన్, నవంబర్ 4:అమెరికాలో కొనసాగుతున్న ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్ (U.S. Government Shutdown) కారణంగా గత కొన్ని వారాలుగా నిలిచిపోయిన H-1B వీసా ప్రాసెసింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ నిర్ణయాన్ని అమెరికా కార్మిక శాఖ (Department of Labor - DOL)...
Read More...
State News 

ఆదివాసీ ప్రముఖులతో సహపంక్తి భోజనం – తొడాసం కైలాష్ ఇంట్లో రాత్రి బస

ఆదివాసీ ప్రముఖులతో సహపంక్తి భోజనం – తొడాసం కైలాష్ ఇంట్లో రాత్రి బస ఆదిలాబాద్, నవంబర్ 04 (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు తన “జాగృతి జనంబాట” పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం పరిధిలోని గోండు సమాజ ప్రముఖ విద్యావేత్త తొడాసం కైలాష్  ఇంటిని  సందర్శించారు. గోండు భాషలో మహాభారతం, రామాయణం రచించిన తొడాసం కైలాష్ తో పాటు,...
Read More...
Crime  State News 

కరీంనగర్ – హైదరాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం

కరీంనగర్ – హైదరాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం ఇక్కడ మీ వెబ్‌సైట్ “ప్రజా మంటలు” కోసం పూర్తి వివరాలతో, పాఠకులకు ఆకర్షణీయంగా మరియ కరీంనగర్, నవంబర్ 04 (ప్రజా మంటలు):కరీంనగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఈ రోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం పరిధిలోని రేణికుంట గ్రామం వద్ద ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఈ ప్రమాదం...
Read More...
Local News 

చేవెళ్ల బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డాక్టర్ జీ. చిన్నారెడ్డి

చేవెళ్ల బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డాక్టర్ జీ. చిన్నారెడ్డి క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించి, రోడ్డు భద్రతపై తక్షణ చర్యల హామీ చేవెళ్ల, నవంబర్ 03 (ప్రజా మంటలు): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి స్వయంగా పరిశీలించారు. టిప్పర్ లారీ – ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో...
Read More...

“మంగోలియాలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం

 “మంగోలియాలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం మధ్య గగనంలో భయం – శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మంగోలియాలో అత్యవసర ల్యాండింగ్ సాంకేతిక లోపం గుర్తించిన సిబ్బంది – ప్రయాణికుల భద్రత కోసం ఉలాన్‌బాతర్‌లో సురక్షిత ల్యాండింగ్ న్యూఢిల్లీ నవంబర్ 03 :శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రయాణికుల విమానం (AI-176)...
Read More...