రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ తో ఉద్యోగుల జే.ఏ.సీ. ప్రతినిధుల భేటీ - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ హామీ 

On
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ తో ఉద్యోగుల జే.ఏ.సీ. ప్రతినిధుల భేటీ - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ హామీ 

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ తో ఉద్యోగుల జే.ఏ.సీ. ప్రతినిధుల భేటీ - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ హామీ 

హైదరాబాద్ ఆగస్ట్ 31 :

రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చే విధంగా పెన్షన్ విధానాన్ని అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దని, 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చాలని ఉద్యోగుల జే.ఏ.సీ. చైర్మన్ వీ. లచ్చిరెడ్డి, విజ్ఞప్తి మేరకు విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని చిన్నారెడ్డి హామీ ఇచ్చారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ఉద్యోగుల జే ఏ సి చైర్మన్ వీ. లచ్చిరెడ్డీ నేతృత్వంలో ప్రతినిధుల బృందం చిన్నారెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేసింది. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడాలని లచ్చిరెడ్డి కోరగా అందుకు చిన్నారెడ్డి సానుకూలంగా స్పందించారు.

ఉద్యోగుల పెన్షన్ విషయంలో త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వాస్తవ పరిస్థితులను వివరిస్తానని చిన్నారెడ్డి జే ఏ సి ప్రతినిధి బృందానికి హామీనిచ్చారు. ఉద్యోగుల పెన్షన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటికే స్పష్టత ఉందని, త్వరలోనే తగిన నిర్ణయం జరుగుతుందని చిన్నారెడ్డి తెలిపారు. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

పెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలుస్తుందని చిన్నారెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్ర గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకు ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని చిన్నారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అని, ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం

TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజా మంటలు): తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ సౌజన్యంతో కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం, అదనపు క్లాస్‌రూమ్స్‌ను ప్రారంభించారు. టిడిఎఫ్–మన తెలంగాణ బడి ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అందించిన ఆర్థిక సహాయంతో ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి....
Read More...
Local News  State News 

గద్వాల జిల్లా ప్రజల సమస్యలపై కవిత ఘాటు ప్రశ్నలు

గద్వాల జిల్లా ప్రజల సమస్యలపై కవిత ఘాటు ప్రశ్నలు జోగులాంబ గద్వాల జిల్లా డిసెంబర్ 21(ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గద్వాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బీచుపల్లి బ్రిడ్జి వద్ద జాగృతి నాయకులు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీచుపల్లి...
Read More...
Local News 

తిమ్మాపూర్ జడ్పీ హైస్కూల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తిమ్మాపూర్ జడ్పీ హైస్కూల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ధర్మపురి డిసెంబర్ 21 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాధవరం కృష్ణారావు – ఆండాళ్ దేవి ల జ్ఞాపకార్థం వారి కుమారుడు మాధవరం విష్ణు ప్రకాశరావు (అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు) ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో...
Read More...
Local News 

గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్‌ నిరసనలు అర్థరహితం : బీజేపీ నేత  రాజేశ్వరి

గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్‌ నిరసనలు అర్థరహితం : బీజేపీ నేత  రాజేశ్వరి సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు): ఉపాధి హామీ పథకం పేరు మార్పును రాజకీయంగా మలిచి కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న నిరసనలు అర్థరహితమని బీజేపీ ఓబీసీ మోర్చా రజక సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ మల్లేశ్వరపు రాజేశ్వరి అన్నారు. ఆమె ఆదివారం సికింద్రాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..పథకం పేరు మారిందని గాంధీని అవమానించారంటూ చేస్తున్న ఆరోపణలు సిగ్గుచేటన్నారు. ఉపాధి...
Read More...
Local News 

నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ వారిచే దుస్తులు పంపిణి

నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ వారిచే దుస్తులు పంపిణి సికింద్రాబాద్,  డిసెంబర్ 21 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం  సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తులు కార్యక్రమము  నిర్వహించారు.   సామాజిక బాధ్యతతో నిరంతరం విభిన్న సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దుస్తులు అందుకున్న  నిరాశ్రయులు, సంచారజాతులవారు స్కై ఫౌండేషన్ కి కృతఙ్ఞతలు
Read More...
Local News 

ఎల్కతుర్తి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పుల్లూరి శ్రీధర్ రావు ఏకగ్రీవ ఎన్నిక 

ఎల్కతుర్తి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పుల్లూరి శ్రీధర్ రావు ఏకగ్రీవ ఎన్నిక  ఎల్కతుర్తి డిసెంబర్ 21 ప్రజా మంటలు  ఎల్కతుర్తి మండలంలోని నూతన సర్పంచుల ఐక్యతకు ప్రతీకగా సర్పంచ్ ల ఫోరం కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీ అధ్యక్షుడిగా వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి శ్రీధర్ రావును సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ భవన్ లో నిర్వహించిన సమావేశానికి, కాంగ్రెస్...
Read More...

యాక్సిడెంట్ కు గురైన వ్యక్తిని సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించిన పోలీసులు

యాక్సిడెంట్ కు గురైన వ్యక్తిని సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించిన పోలీసులు జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న ఆటోకు TVS XL అనే టూ వీలర్ పైన వస్తున్నటువంటి వ్యక్తి ఆదివారం సాయంత్రం యాక్సిడెంట్ గురి కాగా అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు యాక్సిడెంట్స్ ని గమనించి  అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్
Read More...

జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ ఆదాలత్,  అందరి సహకారంతోనే సత్ఫలితాలు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ ఆదాలత్,  అందరి సహకారంతోనే సత్ఫలితాలు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు)రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దనీ, ఆదివారంనాటి జాతీయ లోక్ ఆదాలత్ ను  సద్వినియోగం చేసుకుని, రాజీ కుదుర్చుకోవాలని తాము ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం ఉదయం 10-30 నుండి సాయంత్రం వరకు జిల్లా కోర్ట్ లో నిర్వహిస్తున్నజాతీయ లోక్...
Read More...

విద్యారంగం బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కృషి  — టీఆర్టీఎఫ్ విద్యా సదస్సులో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

విద్యారంగం బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కృషి  — టీఆర్టీఎఫ్ విద్యా సదస్సులో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ డిసెంబర్ 21 (ప్రజా మంటలు):   విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నాగోల్ లో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్)  ఏర్పాటై ఎనిమిది దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్,...
Read More...
National  State News 

నదీ జలాల కోసం మరో ఉద్యమం అవసరం – పాలమూరు ద్రోహాన్ని మరచిపోం: కేసీఆర్

నదీ జలాల కోసం మరో ఉద్యమం అవసరం – పాలమూరు ద్రోహాన్ని మరచిపోం: కేసీఆర్ హైదరాబాద్, డిసెంబరు 21 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి): సమైక్యాంధ్ర పాలనలో మహబూబ్‌నగర్ జిల్లా తీవ్ర వివక్షకు గురైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాలమూరు ప్రయోజనాలను కాలరాశాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన విస్తృత...
Read More...
Local News 

అక్రమ నిర్మాణాలు చేపట్టలేదు - న్యూ బోయిగూడ బస్తీవాసులు

అక్రమ నిర్మాణాలు చేపట్టలేదు - న్యూ బోయిగూడ బస్తీవాసులు సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు): జీహెచ్ఎమ్సీ బేగంపేట సర్కిల్–30 పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ న్యూబోయిగూడలోని ఉప్పలమ్మ దేవాలయం పక్కన ఉన్న ప్రభుత్వ రహదారిపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగడం లేదని పలువురు బస్తీవాసులు పేర్కొన్నారు. 6-–5-–144 నంబర్ గల ఇంటి రెనోవేషన్ పనులు పూర్తిగా రిజిస్ట్రేషన్ పట్టా ఉన్న స్థల పరిధిలోనే జరుగుతున్నాయని జీబీ...
Read More...
Local News 

కాంగ్రెస్‌ హయాంలోనే  క్రీడలకు అధిక ప్రాధాన్యత

కాంగ్రెస్‌ హయాంలోనే  క్రీడలకు అధిక ప్రాధాన్యత సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు) :  తెలంగాణలో క్రీడలు, క్రీడాకారుల అభ్యున్నతికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే, సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జీ ఆదం సంతోష్‌కుమార్‌ అన్నారు. చిలకలగూడ జీహెచ్‌ఎంసీ పార్కులో షటిల్‌ బాడ్మింటన్‌కోర్టులను ఆయన ఆదివారం అధికారికంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆదం సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాత...
Read More...