రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ తో ఉద్యోగుల జే.ఏ.సీ. ప్రతినిధుల భేటీ - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ హామీ
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ తో ఉద్యోగుల జే.ఏ.సీ. ప్రతినిధుల భేటీ - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ హామీ
హైదరాబాద్ ఆగస్ట్ 31 :
రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చే విధంగా పెన్షన్ విధానాన్ని అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దని, 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చాలని ఉద్యోగుల జే.ఏ.సీ. చైర్మన్ వీ. లచ్చిరెడ్డి, విజ్ఞప్తి మేరకు విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని చిన్నారెడ్డి హామీ ఇచ్చారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ఉద్యోగుల జే ఏ సి చైర్మన్ వీ. లచ్చిరెడ్డీ నేతృత్వంలో ప్రతినిధుల బృందం చిన్నారెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేసింది. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడాలని లచ్చిరెడ్డి కోరగా అందుకు చిన్నారెడ్డి సానుకూలంగా స్పందించారు.
ఉద్యోగుల పెన్షన్ విషయంలో త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వాస్తవ పరిస్థితులను వివరిస్తానని చిన్నారెడ్డి జే ఏ సి ప్రతినిధి బృందానికి హామీనిచ్చారు. ఉద్యోగుల పెన్షన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటికే స్పష్టత ఉందని, త్వరలోనే తగిన నిర్ణయం జరుగుతుందని చిన్నారెడ్డి తెలిపారు. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
పెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలుస్తుందని చిన్నారెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్ర గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకు ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని చిన్నారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అని, ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
