స్వాతంత్ర్య ఫలితాలు అందరికీ అందాలి -ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
స్వాతంత్ర్య ఫలితాలు అందరికీ అందాలి
-ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఆగస్టు 15 (ప్రజా మంటలు) :
ఎందరో భారతీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వాతంత్ర్య ఫలాలు దేశవాసులందరికీ చెందాల్సిన అవసరం అనివార్యంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.గురువారం 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే హోదాలో ప్రప్రథమంగా జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...స్వాతంత్ర్యం సాధించిన అమరులను, వాటి అమూల్య త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నియోజక వర్గ సమస్యలన్నీ తనకు కరతలామలకం మాత్రమే అని, సమయానుకూలంగా వాటి పరిష్కారం కోసం అహరహం శ్రమించి, ప్రగతి పథంలో నడిపేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే సతీమణి కాంత కుమారి, పిసిసి సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్, మున్సిపల్ కౌన్సిలర్ లు సంతోషి, నాగలక్ష్మి,
పద్మ, అరునాయకులు వేముల రాజేశ్, ప్రసాద్ సింహరాజు, సముక్, సత్యనారాయణ, శ్రీనివాస్, మొగిలి, రాజేశ్, తిరుపతి, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
