స్వాతంత్ర్య ఫలితాలు అందరికీ అందాలి -ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
స్వాతంత్ర్య ఫలితాలు అందరికీ అందాలి
-ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఆగస్టు 15 (ప్రజా మంటలు) :
ఎందరో భారతీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వాతంత్ర్య ఫలాలు దేశవాసులందరికీ చెందాల్సిన అవసరం అనివార్యంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.గురువారం 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే హోదాలో ప్రప్రథమంగా జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...స్వాతంత్ర్యం సాధించిన అమరులను, వాటి అమూల్య త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నియోజక వర్గ సమస్యలన్నీ తనకు కరతలామలకం మాత్రమే అని, సమయానుకూలంగా వాటి పరిష్కారం కోసం అహరహం శ్రమించి, ప్రగతి పథంలో నడిపేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే సతీమణి కాంత కుమారి, పిసిసి సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్, మున్సిపల్ కౌన్సిలర్ లు సంతోషి, నాగలక్ష్మి,
పద్మ, అరునాయకులు వేముల రాజేశ్, ప్రసాద్ సింహరాజు, సముక్, సత్యనారాయణ, శ్రీనివాస్, మొగిలి, రాజేశ్, తిరుపతి, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి శ్రీకాంత్ అనుమానస్పద మృతి

కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం
