ఉపాధ్యాయుల అక్రమ స్పాస్ బదిలీలపై చర్యలు తీసుకోవాలి తపస్ డిమాండ్
ఉపాధ్యాయుల అక్రమ స్పాస్ బదిలీలపై చర్యలు తీసుకోవాలి తపస్ డిమాండ్
జగిత్యాల జులై 07 (ప్రజా మంటలు)
ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో వివిధ క్యాడర్లలో ప్రత్యేక కేటగిరీ కింద పలువురు ఉపాధ్యాయులు తప్పుడు విధానాలతో జిల్లా కేంద్రానికి సమీపాన బదిలీ ఉత్తర్వులు పొందినారని నిబంధనలకు విరుద్ధంగా వీరి బదిలీలు జరిగాయని స్పోస్ మరియు ప్రత్యేక కేటగిరి బదిలీలన్నిటిని పరిశీలించి సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ కోరింది ఈ మేరకు జిల్లా విద్యాధికారి బి జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ సూచించిన నియమ నిబంధన ప్రకారం స్పోస్ కేటగిరి కింద బదిలీ ఉత్తర్వులు పొందాలంటే భార్య కాని భర్త గాని పనిచేసే చోటు నుండి మొదలుపెట్టి పాఠశాలలకు ఆప్షన్స్ ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు ఆన్లైన్లో బదిలీలు కదా అని ఎవరు చూస్తారులే అని తమ ఇష్టం వచ్చినట్టు ఆప్షన్స్ పెట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా పట్టణ ప్రాంతాలలో బదిలీ ఉత్తర్వులు పొందారని వారు వివరించారు. బుగ్గారం మండలంలో పనిచేస్తున్న ఒక ఎస్జీటీ ఉపాధ్యాయిని తన యొక్క భర్త అదే మండలంలో పనిచేస్తున్నప్పటికి అక్కడ ఖాళీలు ఉన్నప్పటికీ ,వాటిని ఆప్షన్స్ పెట్టుకోకుండా జిల్లా కేంద్రానికి సమీపంలోని పాఠశాలలను ఎంచుకొని అక్రమంగా బదిలీ ఉత్తర్వులు పొందినారని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇలా మరికొందరు ఇలాంటి ఉత్తర్వులు పొందినట్లు తెలుస్తోంది. అలాగే ఉపాధ్యాయుల అన్ని క్యాడర్లలో జరిపిన ప్రత్యేక కేటగిరిలో పొందిన బదిలీ ఉత్తర్వులన్నిటిని పరిశీలించాలని అవకతవకలకు పాల్పడ్డ ఉపాధ్యాయులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య బోయినిపెల్లి ప్రసాదరావు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడుఅయిల్నేని నరేందర్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓడ్నాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ..

ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన రాణి అహల్యాబాయి హోల్కర్

భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మహిళా చట్టాలపై జిల్లా షీ టీం, బరోసా టీం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు

తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
.jpg)
సుపరిపాలనకు స్ఫూర్తి అహల్యబాయి జీవితం. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి..

ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
.jpeg)