మావిడాకుల చాటునున్న ఓ పక్షి.. మా అక్క జాడ తెలిసిందా..!

On
మావిడాకుల చాటునున్న ఓ పక్షి.. మా అక్క జాడ తెలిసిందా..!

కామ్రేడ్ లలితక్క అలియాస్ రంగవల్లి స్మృతిలో.

   కామ్రేడ్ రంగవల్లి 26 వర్ధంతి. విప్లవ జోహార్లు

(అల్లే రమేష్, సీనియర్ జర్నలిస్ట్, సిరిసిల్ల FB నుండి)

     *ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రతిఘటన పోరాటాలు దాకా స్ఫూర్తినిచ్చే "ఆచరణ.."*

        ఉమ్మడి రాష్ట్రంలోని 80 దశకం  సమాజం కోసం తపన పడిన ఎందరో వీరులను అందించింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో విప్లవ మేఘాలు అల్లుకున్న కాలం. ఆ కాలమే పీడితుల పక్షాన నిలబడిన మానవీయ తరాన్ని రూపొందించింది. 
అలా రూపొందిన తరంలోనే కామ్రేడ్ రంగవల్లి ఎర్రజెండాను ఎత్తి పట్టింది. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాల నుంచి గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాల నిర్మాణంలో కడదాకా సాగిన కామ్రేడ్ రంగవల్లి జీవితం నుంచి ఈ తరం నేర్చుకోవాల్సిన విషయాలను ఎన్నో అందించి పోయింది. 

      కామ్రేడ్ రంగవల్లి గురించి ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పాటలో చెప్పుకుంటే "మావిడాకులు చాటునున్న ఓ పక్షి మా అక్క జాడ తెలిసిందా.. అంటూ రంగవల్లి అక్కను మదిలో తలుచుకొని" రంగవల్లి"సమాజం పట్ల చూపిన మానవీయతను ఆ పాటలో కన్నీళ్ళతో చెప్పిన తీరు కండ్ల ముందు ఇప్పటికీ కదిలినట్టే అనిపిస్తుంది. 

ఇంతకీ ఎవరీ"రంగవల్లి"..

      ఉమ్మడి రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో వర్ని మండలంలోని వకీల్ఫారం లో  ఎస్ .వి .ఎల్ .నరసింహారావు గిరిజ దంపతులకు తొలిసూరి బిడ్డగా డిసెంబర్ 1959లో జన్మించారు.  ఇంటర్, డిగ్రీ లో ఉత్తమ విద్యార్థినిగా రాణిస్తూనే విప్లవ రాజకీయాల వైపు తన పయనం కొనసాగించారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో చదువుతూనే ప్రగతిశీల విద్యార్థి సంఘం రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. పిడిఎస్యు "విజృంభణ "పత్రిక బాధ్యతలను కూడా నిర్వహించారు. అటు నుంచి గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాల నిర్మాణంలో భాగమై సాగారు. విప్లవోద్యమంలో అనేక ఆటుపోట్లకు గురవుతున్న సమయంలో కూడా నిక్కచ్చిగా పీడిత ప్రజల పక్షాన నిలబడి తన ప్రయాణాన్ని కొనసాగించారు. అమరవీరుల ఆశయాలను సమున్నతంగా ఎత్తిపడుతూ ఆ ప్రయాణంలో ఉన్న క్రమంలోనే నవంబర్ 1999లో ఆనాటి ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నగూడెం గ్రామంలోని ఎల్లమ్మ బోడుగండి అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో తుది శ్వాస విడిచారు. తన జీవితాన్ని పీడిత ప్రజల కోసం ధారబోసిన" రంగవల్లి"తన జీవితాన్ని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా స్ఫూర్తిగా అందించారు. లలితగా ప్రారంభమై ప్రజా ఉద్యమాలలో "రంగవల్లి"గా మహోన్నతమైన మానవీయ విలువలతో ప్రజలను ప్రేమిస్తూ వచ్చారు. 

FB_IMG_1762657398839

 (నిర్మాణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కమాన్ దగ్గరి రంగవల్లి విజ్ఞాన కేంద్రం)

    కామ్రేడ్ రంగవల్లికి రాజన్న సిరిసిల్ల జిల్లాతో విడదీయరాని బంధం ఉన్నది. 1981 ప్రాంతంలో ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో "గ్రామాలకు తరలండి"పి. డి. ఎస్. యు పిలుపులో భాగంగా"రంగవల్లి"ఈ ప్రాంతంలో ప్రజలతో మమేకం అయ్యారు. ప్రజల సాధక బాధకాలను  దగ్గరుండి తెలుసుకోవడమే కాకుండా పీడిత ప్రజల భవిష్యత్తుకు పోరాటాలకు బాసటగా నిలబడ్డారు. సుదీర్ఘకాలం ప్రజలే కేంద్రంగా పనిచేసి నమ్మిన ఆశయం కోసం కడదాకా నిలబడ్డ కామ్రేడ్ "రంగవల్లి"జ్ఞాపకమై మిగిలి 26 వసంతాలు గడుస్తున్న ఇప్పటికి స్ఫూర్తిని అందించే ఆమె జీవితం ఎగురుతున్న ఎర్రజెండలా రెపరెపలాడుతూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది. 

Join WhatsApp

More News...

Local News 

టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నికైన మారం జగదీశ్వర్ ను సన్మానించిన  జగిత్యాల టిఎన్జీఓ లు

టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నికైన మారం జగదీశ్వర్ ను సన్మానించిన  జగిత్యాల టిఎన్జీఓ లు కరీంనగర్ ఏప్రిల్ 1(ప్రజా మంటలు)ఇటీవల టిఎన్జీఓ కేంద్ర సంఘానికి జరిగిన ఎన్నికలలో  రెండవ సారి రాష్ట్ర అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన మారం జగదీశ్వర్ ని  జగిత్యాల జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో జగిత్యాల టిఎన్జీఓ లు ఘనంగా సన్మానించారు. కరీంనగర్...
Read More...
State News 

కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత

కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత హైదరాబాద్, ఏప్రిల్ 01 (ప్రజా మంటలు): కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలిపోవడంతో 15 మంది భక్తులు గాయపడిన ఘటన ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన ట్విట్టర్ లో విమర్శించారు. . హనుమాన్ చిన్న జయంతి వేడుకల సందర్భంగా నాసిరకంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వల్లే ఈ...
Read More...
Local News 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకుని పదవి విరమణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకుని పదవి విరమణ జగిత్యాల మార్చి 31 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకులు మేడిపల్లి రాజన్న శాస్త్రి పదవి విరమణ మంగళవారం జరగగా ఆలయ ఆవరణలో రాజన్న శాస్త్రి పద్మ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు, ఈవో సురేందర్  తదితరులు ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు. ఈ...
Read More...
Local News  State News 

తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై జీవోలు అడ్డంకి –కల్వకుంట్ల కవిత ఆరోపణ

తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై జీవోలు అడ్డంకి –కల్వకుంట్ల కవిత ఆరోపణ హైదరాబాద్ ఏప్రిల్ 01 (ప్రజా మంటలు): రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో జీవోలు అడ్డంకిగా మారుతున్నాయని తెలంగాణ జాగృతి నేత కవిత విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివిధ జీవోల ద్వారా అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించారు.డిగ్రీ లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన జీవో నంబర్ 4 వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు....
Read More...
Local News 

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి కొండగట్టు మార్చి 31 (ప్రజా మంటలు)  హనుమాన్ చిన్న జయంతికి  914  మంది సిబ్బందితో పటిష్ట భద్రత సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ   జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  మల్యాల ఎక్స్ రోడ్ వద్దగల ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బందోబస్తు పై పోలీసు అధికారులతో ఎస్పి సమీక్ష నిర్వహించారు. ప్రసిద్ధ...
Read More...
State News 

“రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” : కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం

 “రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” : కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం :హైదరాబాద్, మార్చ్ 31 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు.కాగ్ (CAG) 2024-25 నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల నిర్వహణకే రిజర్వ్ బ్యాంక్...
Read More...
Local News 

అకాల వర్షంతో పంట దెబ్బతిన్న వరి,మామిడి తోటలు  పరిశీలించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత 

అకాల వర్షంతో పంట దెబ్బతిన్న వరి,మామిడి తోటలు  పరిశీలించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత       రాయికల్ మార్చి 31 (ప్రజా మంటలు)మండలం కిష్టంపేట గ్రామంలో నిన్న కురిసిన వర్షాలకు నష్టపోయిన మామిడి మరియు వరి పంట పొలాలను  బి ఆర్ ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి పరిశీలించి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్  ఈ సందర్భంగా వారు...
Read More...
Spiritual   State News 

కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్‌లో పేలుడు ఘటన - నలుగురికి గాయాలు

కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్‌లో పేలుడు ఘటన - నలుగురికి గాయాలు చల్లపల్లె, మార్చ్ 31 (ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ పరిధిలో అకస్మాత్తుగా పేలుడు శబ్దం వినిపించడంతో సిబ్బంది, సమీప ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఘటన స్థలాన్ని...
Read More...

మైనర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్

మైనర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)పట్టణం లో ట్రాఫిక్ ఎస్ ఐ, టౌన్ ఎస్ ఐ ఆద్వర్యం లో  సోమవారం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న దాదాపు 50 మంది మైనర్ లను పట్టుకున్న ట్రాఫిక్ మరియు పట్టణ పోలీసులు... ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు తరలించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్  ఇక పై మైనర్...
Read More...
Local News 

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు మాజీ కౌన్సిలర్ జయ శ్రీ వినతి

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు మాజీ కౌన్సిలర్ జయ శ్రీ వినతి    జగిత్యాల మార్చి 30 ( ప్రజా మంటలు)పట్టణానికి చెందిన ఇల్లు లేని నిరుపేదల కొరకు నూకపెల్లి వద్ద డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 4520 కట్టడం జరిగింది. వాటిలో 520 ఇండ్ల నిర్మాణం వద్ద డ్రైనేజీ వాటర్ కొరకు సంపు ఏర్పాటు చేసి దాని నుండి మోటార్ల ద్వారా బయటకు పంపింగ్ చేసే విధానం...
Read More...
State News 

రవీంద్రభారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు –

రవీంద్రభారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు  – హైదరాబాద్ మార్చ్ 30 (ప్రజా మంటలు); శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి A. Revanth Reddy జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకల్లో మండలి చైర్మన్ Gutta Sukender Reddy, ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka...
Read More...
Local News 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా: క్షమాపణలు తెలిపిన కల్వకుంట్ల కవిత

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా: క్షమాపణలు తెలిపిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్, మార్చ్ 30 (ప్రజా మంటలు): ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన ధర్నాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయానని అంగీకరిస్తూ క్షమాపణలు తెలిపారు.ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల...
Read More...