“కృష్ణా నీటిపై అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందే ధర్నా చేస్తాం” — కల్వకుంట్ల కవిత

On
“కృష్ణా నీటిపై అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందే ధర్నా చేస్తాం” — కల్వకుంట్ల కవిత

“ఫ్రెంచ్ విప్లవ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం”

మా పిల్లల అరెస్టులు ఎందుకు?”

“బీఆర్ఎస్‌ను తిట్టి వచ్చిన కాంగ్రెస్ కూడా మారలేదు”

నల్గొండ, నవంబర్ 12 (ప్రజా మంటలు):


తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నల్గొండలో జరిగిన జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొని, ప్రెస్ మీట్‌లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా, ఎస్ఎల్‌బీసీ, నక్కలగండి, డిండి వంటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని తీవ్రంగా విమర్శించారు.

“బీఆర్ఎస్‌ను తిట్టి వచ్చిన కాంగ్రెస్ కూడా మారలేదు"

“బీఆర్ఎస్‌ను తిట్టి తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా పాత చట్రం నుంచి బయటపడలేకపోయింది. సుంకిశాల ప్రమాదంపై కాంట్రాక్ట్ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మేఘాతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులది ‘ఫెవికాల్ బంధం’ అయిపోయింది” అన్నారు.

ఆమె నక్కలగండి, నెల్లికల్, కిష్టరాయినిపల్లె ప్రాజెక్టుల పూర్తి ఆలస్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.IMG-20251112-WA0030

“నిర్వాసితుల బాధ వర్ణనాతీతం”

ప్రాజెక్టుల కింద భూములు ఇచ్చిన నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా ఉందని కవిత గారు తెలిపారు.

“భూములు ఇచ్చిన 17 ఏళ్లైనా వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఇప్పటికీ ఆ మూడు పూర్తిగా సాధించలేకపోయాం” అన్నారు.

కృష్ణానది నీటిని తెచ్చే పనిలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే, నిర్వాసితులతో కలిసి సీఎం నివాసం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ఆసుపత్రి పరిస్థితిపై ఆవేదన

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా కవిత గారు అక్కడి దయనీయ పరిస్థితిని వివరించారు.

“ఒక్కో బెడ్‌పై ఇద్దరు పేషెంట్లు పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎపిడ్యూరెల్ మందు లేక మహిళలు ఇంకా ఆటవిక కాలం మాదిరిగా ప్రసవ వేదన పడుతున్నారు” అని పేర్కొన్నారు.

ఆసుపత్రుల్లో సౌకర్యాల లోపంపై మహిళలకు క్షమాపణ చెబుతూ, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా గారు తప్పక చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.

“మా పిల్లల అరెస్టులు ఎందుకు?”

జాగృతి కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కవిత గారు —

“వెంకట్ రెడ్డి అన్నా, నాతో నీకు ఏ పంచాయితీ ఉందన్నా? మా పిల్లలను ఎందుకు అరెస్ట్ చేయించావు?” అంటూ ప్రశ్నించారు.
“ఇప్పుడు రాజకీయాలు చేయటానికి రాలేదు, కానీ చేస్తే గట్టి పోటీదారులను పెడతాం. జాగృతి కార్యకర్తలతో పెట్టుకోకండి — పెట్టుకున్నవాళ్లు బాగుపడలేదు” అని హెచ్చరించారు.

రైతులు, విద్య, ఇండస్ట్రీ సమస్యలపై డిమాండ్లు

కవిత గారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తగినంత లేవని, వెంటనే కేంద్రాల సంఖ్యను వెయ్యికి పెంచాలని డిమాండ్ చేశారు.
మిర్యాలగూడలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉండటంతో వంద మెట్రిక్ టన్నుల గోడౌన్ ఏర్పాటు చేయాలని కోరారు.
దామర్లచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఐదు యూనిట్లు నడవాల్సి ఉన్నా రెండు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు.

అలాగే మహిళలు, బీసీలు, మైనార్టీలు, డబ్బులేని యువతకు అవకాశాలు రావాలంటే సామాజిక తెలంగాణ రావాలి అని పిలుపునిచ్చారు.

“ఫ్రెంచ్ విప్లవ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం”

“భూమి, భుక్తి, విముక్తి — ఇదే తెలంగాణ ఆత్మ. భౌగోళిక తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణ రావాలి. అందుకే మా పోరాటం కొనసాగుతుంది” అని కవిత గారు పేర్కొన్నారు.

జిల్లాలో విద్యార్థి ఎన్నికలు పునరుద్ధరించి, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.

ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక

“తప్పు బీఆర్ఎస్ చేసినా తప్పే, కాంగ్రెస్ చేసినా తప్పే. ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కొత్త ప్రత్యామ్నాయాన్ని గెలిపిస్తారు” అని కవిత గారు హెచ్చరించారు.

నల్గొండలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఆసుపత్రుల అభివృద్ధి, పత్తి రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

జాగృతి జనం బాట కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యమని కల్వకుంట్ల కవిత తెలిపారు.

Join WhatsApp

More News...

ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ప్లేయర్ల లిస్ట్ హాట్ టాపిక్

ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ప్లేయర్ల లిస్ట్ హాట్ టాపిక్ ప్రజా మంటలు స్పోర్ట్స్ డెస్క్ – నవంబర్ 12: డిసెంబర్ మూడో వారంలో జరగబోయే ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం జట్లు సిద్ధమవుతున్నాయి. ఈసారి వేలం మరింత ఆసక్తిగా మారనుంది. కారణం – బీసీసీఐ నిర్దేశించిన రిటైన్ & విడుదల డెడ్‌లైన్. ఫ్రాంచైజీలు తమ జట్టులో ఉంచుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోపు సమర్పించాలి....
Read More...

“కృష్ణా నీటిపై అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందే ధర్నా చేస్తాం” — కల్వకుంట్ల కవిత

“కృష్ణా నీటిపై అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందే ధర్నా చేస్తాం” — కల్వకుంట్ల కవిత “ఫ్రెంచ్ విప్లవ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం” “మా పిల్లల అరెస్టులు ఎందుకు?” “బీఆర్ఎస్‌ను తిట్టి వచ్చిన కాంగ్రెస్ కూడా మారలేదు” నల్గొండ, నవంబర్ 12 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నల్గొండలో జరిగిన జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొని, ప్రెస్ మీట్‌లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...
Read More...
Local News  State News 

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కల్వకుంట్ల కవిత – చిన్నారికి “దీక్ష” అని పేరు

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కల్వకుంట్ల కవిత – చిన్నారికి “దీక్ష” అని పేరు జనంబాట”లో భాగంగా కవిత నల్గొండ ఆసుపత్రి సందర్శన రోగులను కలుసుకుని, ఆసుపత్రి పరిస్థితి పరిశీలన అపరిశుభ్రతపై ప్రభుత్వంపై ప్రశ్నలు మాతాశిశు విభాగంలో జన్మించిన చిన్నారికి “దీక్ష” అని పేరు ప్రజా ఆరోగ్యంపై జాగృతి అధ్యక్షురాలి పిలుపు నల్గొండ నవంబర్ 12 (ప్రజా మంటలు):“జనంబాట” కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు ...
Read More...
Local News 

మెటుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్ శిబిరం

మెటుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్ శిబిరం మెటుపల్లి నవంబర్ 12 (ప్రజా మంటలు):   లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నవంబర్‌ 11, 2025న ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్‌ ఆసుపత్రి, హైదరాబాద్‌ కు చెందిన వైద్యుల బృందం పాల్గొంది. డాక్టర్లు పేషెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి వివరాలు తెలుసుకున్నారు....
Read More...
Filmi News 

నాగార్జున కుటుంబానికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు – సుదీర్ఘ వివాదానికి తెర

నాగార్జున కుటుంబానికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు – సుదీర్ఘ వివాదానికి తెర హైదరాబాద్ నవంబర్ 12 (ప్రజా మంటలు): చాలాకాలంగా చర్చనీయాంశమైన సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదానికి చివరికి ముగింపు లభించింది. మంత్రి సురేఖ ఇటీవల తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ, నాగార్జున కుటుంబానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.తన వ్యాఖ్యలు ఆ కుటుంబ సభ్యులను ఇబ్బంది...
Read More...
Crime  State News 

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత — రూ.12 కోట్ల విలువైన గంజాయి సీజ్‌

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత — రూ.12 కోట్ల విలువైన గంజాయి సీజ్‌ న్యూ ఢిల్లీ నవంబర్ 13 (ప్రజా మంటలు):ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకున్నారు.బ్యాంకాక్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళ దగ్గర రూ.12 కోట్ల విలువైన 12 కిలోల విదేశీ గంజాయిను కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. లగేజీ తనిఖీ సమయంలో ఆ మహిళ తాను NIA...
Read More...

“సీఎం ప్రజావాణి”ని సందర్శించిన రాష్ట్ర అధికారుల బృందం

“సీఎం ప్రజావాణి”ని సందర్శించిన రాష్ట్ర అధికారుల బృందం హైదరాబాద్, నవంబర్ 12 (ప్రజా మంటలు): “సీఎం ప్రజావాణి” పనితీరును పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారుల బృందం మంగళవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా అధికారులు సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డిని కలిశారు. ప్రజా...
Read More...

రాజస్థాన్, జోధ్‌పూర్‌లో భారీ శబ్దం – ప్రజల్లో భయం

రాజస్థాన్, జోధ్‌పూర్‌లో భారీ శబ్దం – ప్రజల్లో భయం జోధ్‌పూర్ (రాజస్థాన్) నవంబర్ 12: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా మండోర్ ప్రాంతంలో ఈరోజు ఉదయం భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ప్రజలు దీన్ని పెద్ద విస్ఫోటనంగా భావించి బయటకు పరుగులు తీశారు. అయితే, అధికారుల ప్రకారం ఇది పేలుడు కాదు, భారత వాయుసేన ఫైటర్ జెట్‌ “సోనిక్ బూమ్” కారణంగా ఉద్భవించిన...
Read More...
Crime  State News 

హైదరాబాద్–మెడ్చల్ ప్రాంతాల్లో హిజ్రాల రెచ్చగొట్టింపు… గృహప్రవేశంలో ఘోర దాడి—స్థానికుల్లో ఆందోళన

హైదరాబాద్–మెడ్చల్ ప్రాంతాల్లో హిజ్రాల రెచ్చగొట్టింపు… గృహప్రవేశంలో ఘోర దాడి—స్థానికుల్లో ఆందోళన చందానగర్ నవంబర్ 11 (ప్రజా మంటలు): మెడ్చల్‌ జిల్లా చీర్యాల బాలాజీ ఎన్క్లేవ్‌లో ఆదివారం ఉదయం జరిగిన గృహప్రవేశం వేడుక హింసాత్మక ఘటనకు వేదికైంద. సదానందం అనే వ్యక్తి కుటుంబం గృహప్రవేశం నిర్వహిస్తున్న సమయంలో, కొన్ని హిజ్రాలు వచ్చి రూ.1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అంత పెద్ద మొత్తం ఇవ్వలేమని కుటుంబ సభ్యులు స్పష్టం...
Read More...
National  International  

అటారి వద్ద హిందూ భక్తుల ప్రవేశానికి పాకిస్తాన్ నిరాకరణ

అటారి వద్ద హిందూ భక్తుల ప్రవేశానికి పాకిస్తాన్ నిరాకరణ అమృతసర్ నవంబర్ 11: అటారి–వాఘా సరిహద్దులో గురునానక్ ప్రకాశ్ పర్వం కోసం సిక్కు జాథాతో కలిసి పాకిస్తాన్‌కు వెళ్లిన హిందూ భక్తులకు పాకిస్తాన్ అధికారులు ప్రవేశం నిరాకరించినట్లు భారత్‌కు వచ్చిన భక్తులు ఆరోపించారు. జాథాలోని 12–14 మంది హిందూ యాత్రికులు పూర్తిస్థాయి పత్రాలతో వచ్చినప్పటికీ, ఇమిగ్రేషన్ వద్ద నిలిపి తిరిగి పంపించినట్లు వారు వెల్లడించారు. భక్తుల...
Read More...
Local News 

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుండి మినహాయింపు ఇప్పించండి

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుండి మినహాయింపు ఇప్పించండి   ఎంపీ అరవింద్ ధర్మపురికి జగిత్యాల జిల్లా PRTU–TS వినతి జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు,): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నుండి మినహాయింపు కల్పించాలని కోరుతూ జగిత్యాల జిల్లా PRTU–TS నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర...
Read More...
Local News 

జగిత్యాల కలెక్టరేట్‌లో దిశా సమావేశం – ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్యే డా. సంజయ్‌ ఆత్మీయ స్వాగతం

జగిత్యాల కలెక్టరేట్‌లో దిశా సమావేశం – ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్యే డా. సంజయ్‌ ఆత్మీయ స్వాగతం జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం సోమవారం చేపట్టబడింది. సమావేశానికి విచ్చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ ని, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  మొక్కను అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు...
Read More...