పిడుగుపడి ప్రాణాపాయంలో విద్యార్థి.. : రూ18లక్షల ఆర్థిక సాయం అందించి, ఆదుకున్న మంత్రి అడ్లూరి
యశోద ఆసుపత్రి నుంచి బాధిత విద్యార్థి డిశ్చార్జీ
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు) :
పిడుగు పాటుకు గురై తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని స్టేట్ సోషల్ వెల్పేర్ మినిష్టర్ అడ్లూరి లక్ష్మణ్ స్పందించి, ఆర్థిక సాయం అందించి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి లో వైద్యం చేయించడానికి సహకరించారు.
వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ ఎస్పీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న బొల్లె హిమేష్ చంద్ర అనే విద్యార్థి గత సెప్టెంబర్ నెలలో హాస్టల్ బిల్డింగ్ పై ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్ళినపుడు పిడుగు పడడంతో 60 శాతం ఒళ్ళంతా గాయాలు అయ్యాయి. దాంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
అక్కడ మెరుగైన వైద్యం లేకపోవడంతో అధికారులు, తల్లిదండ్రులు మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి విద్యార్థికి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లమని మంత్రి ఆదేశించారు. దాంతో వైద్యాధికారులు హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించారు. అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ ఐదు సార్లు ఆస్పత్రికి వచ్చి విద్యార్థిని పరామర్శించారు. విద్యార్థి కుటుంబ దైన్యస్థితిని చూనిన మంత్రి సోషల్ వెల్పేర్ డిపార్ట్మెంట్ తరపున పూర్తి వైద్య ఖర్చులు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ క్రమంలో బుధవారం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాశ్ కుటుంబసభ్యులకు వైద్య ఖర్చులు రూ.18 లక్షల చెక్కును అందచేశారు. కోలుకున్న విద్యార్థి హిమేశ్ చంద్రను ఆసుపత్రినుంచి బుధవారం డిశ్చార్జీ చేశారు. పేదరికంలో ఉన్న తమను ఆడుకున్న మంత్రికి..సోషల్ వెల్పేర్ డిపార్ట్మెంట్ అధికారులకు విద్యార్థి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
–
More News...
<%- node_title %>
<%- node_title %>
సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ కేసుపై వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ
మహిళల భద్రత కోసం గళం వినిపిస్తున్న సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ పై సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ!
హైదరాబాద్, నవంబర్ 12 (ప్రజా మంటలు):
మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న దారుణాలపై తన స్వరం వినిపిస్తూ ఎప్పుడూ ముందుండే సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు.... ఢిల్లీ కారు పేలుడును ఉగ్రవాద దాడిగా ప్రకటించిన కేంద్రం
ఢిల్లీ కారు పేలుడు ఉగ్రదాడి – ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్రం అధికారిక ప్రకటన
న్యూ ఢిల్లీ నవంబర్ 12 (ప్రజామంటలు):
దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఢిల్లీ కారు పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం నాడు జరిగిన ఉన్నత స్థాయి మంత్రివర్గ సమావేశం అనంతరం,... అంగన్వాడీ చిన్నారుల మధ్య స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ పావని జన్మదిన వేడుకలు
అంగన్వాడీ విద్యార్థులకు ఆటవస్తువుల పంపిణీ సికింద్రాబాద్,నవంబర్ 12 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ పరిధిలో రాణిగంజ్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం చిన్నారుల మధ్యలో స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కుమారి. ఓ.పావని జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా చిన్నారులకు ఇష్టమైన వివిధ రకాల తినుబండారాలను, ఆటవస్తువులను అందజేశారు.
ఈ కార్యక్రమములో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు సరిత, ప్రెసిడెంట్ వై.... పిడుగుపడి ప్రాణాపాయంలో విద్యార్థి.. : రూ18లక్షల ఆర్థిక సాయం అందించి, ఆదుకున్న మంత్రి అడ్లూరి
యశోద ఆసుపత్రి నుంచి బాధిత విద్యార్థి డిశ్చార్జీ
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు) :
పిడుగు పాటుకు గురై తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని స్టేట్ సోషల్ వెల్పేర్ మినిష్టర్ అడ్లూరి లక్ష్మణ్ స్పందించి, ఆర్థిక సాయం అందించి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి లో వైద్యం చేయించడానికి సహకరించారు.
వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా... తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ భద్రత మరింత బలోపేతం :: మీడియా తో టెలికాం అదనపు డీజీ
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు):
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్ వినియోగదారుల డిజిటల్ భద్రత బలోపేతం చేస్తూ పౌరుల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని టెలికాం అదనపు డీజీ నాగేష్ రావు తెలిపారు. బుధవారం సీటీవోలోని కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు పొగొట్టుకున్న,... నిమోనియా ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడవచ్చు
మెడికవర్ ఆసుపత్రి చీఫ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ రెడ్డి మళ్లూ ప్రపంచ నిమోనియా దినోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు) :
నిమోనియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే తీవ్రమైన ఇన్ఫెక్షన్అని, దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికి దారితీస్తుందని సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ పల్మనాలజిస్ట్ డా. గంగాధర్రెడ్డి మళ్లూ అన్నారు. ప్రపంచ నిమోనియా దినోత్సవం––... సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు):
దేశంలోనే మొదటిసారిగా కిమ్స్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్కు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అవార్డు లభించింది. రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు పదివేలకు పైగా చేయడం, పరిశోధన పత్రాలు, హాస్పిటాలిటీ అంశాలను పరిగణనలోకి తీసుకుని స్ట్రైకర్ కంపెనీ ఈ అవార్డును అందజేసింది.ఈ సందర్భంగా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్... 'దేశియా తలైవార్’ సినిమా పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ –
సినిమా విడుదలను నిలిపివేయాలని శత్రియ సంద్రోర్ పడై సంస్థ స్థాపకుడు హరి నాదర్ హైకోర్టును ఆశ్రయించారు
చెన్నై నవంబర్ 12,(ప్రజా మంటలు)
మాజీ ముఖ్యమంత్రి కే. కామరాజర్ ను అపఖ్యాతి పాల్జేస్తోందని ఆరోపిస్తూ, ఒక రాజకీయ పార్టీ ‘దేశియా తలైవార్ (Desiya Thalaivar)’ సినిమా విడుదలను నిషేధించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
సిలైవ్ లాకి నివేదిక... మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టు నుండి బిగ్ రిలీఫ్
కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ — తదుపరి తేదీగా జనవరి 19 నిర్ణయం
హైదరాబాద్ నవంబర్ 12,(ప్రజా మంటలు):
తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు పెద్ద ఉపశమనం లభించింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై వచ్చిన నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని... టీవీకే పై డీఎంకే అపవాద ప్రచారం చేస్తోందని విజయ్
డీఎంకే నాయకత్వం నిరాధార ఆరోపణలు చేస్తోందని, తమ పార్టీ విమర్శలు మాత్రం మర్యాదపూర్వకంగానే ఉన్నాయని విజయ్ వ్యాఖ్య
చెన్నై నవంబర్ 12,
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రగులుతోంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ బుధవారం (నవంబర్ 12) డీఎంకే పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.స్పష్టంగా పేరు చెప్పకపోయినా, తమిళనాడు... ధాన్యం కొనుగోళ్లపై రైతులు, మరియు మిల్లర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి
సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్మల్యాల /కొడిమ్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు)బుధవారం జిల్లాలోని మల్యాల, కొడిమ్యాల మండల పరిధిలోని రైతులు మరియు రైస్ మిల్లర్ లతో జేఎన్టీయు లో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం తో కలిసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే మేడిపల్లి... రాయికల్ మండలం రాజనగర్ గ్రామంలో బాల్యవివాహాల పై అవగాహన కార్యక్రమం
రాయికల్ నవంబర్ 12 ( ప్రజా మంటలు)జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి వన్ స్టాప్ సెంటర్* వారి ఆధ్వర్యంలో బాల్య వివాహాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సఖి ఉద్యోగిని శారద మాట్లాడుతూ తల్లులకు, కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల... 