బద్రీనాథ్​ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు -పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

On
బద్రీనాథ్​ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు  -పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

బద్రీనాథ్​ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు

-పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

   *  వర్షాల ధాటికి విరిగి పడిన కొండచరియలు...
   *  ఇద్దరు హైదరాబాద్​ యాత్రికుల దుర్మరణం
   *  డెడ్​ బాడీలు బాగా డ్యామెజ్ ​కావడంతో అక్కడే అంత్యక్రియలు
   *  పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

సికింద్రాబాద్​ జూలై 07 (ప్రజామంటలు) :

బద్రీనాథ్​ దైవ దర్శనానికి వెళ్ళిన ఇద్దరు హైదరాబాద్​ యాత్రికులు మృత్యువాత పడ్డారు. స్థానికులు, ఫ్యామిలీమెంబర్స్​ కథనం ప్రకారం..గత వారం క్రితం పద్మారావునగర్​ లోని స్కందగిరికి చెందిన దార సత్యనారాయణ (50), నిర్మల్​ షాహీ (36) తో పాటు మరో ఇద్దరు మొత్తం నలుగురు నార్త్​ ఇండియా యాత్రకు బయలు దేరి వెళ్ళారు.

శనివారం ఉదయం ఉత్తరాఖండ్​ లో రెండు బైక్​లను అద్దెకు తీసుకున్న వీరు బద్రీనాథ్​ ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా, ఉత్తర ఖండ్​ లోని చమోలీ జిల్లా కర్ణప్రయోగ, గౌచర్​ ల మద్యలో బద్రీనాథ్​ నేషనల్​ హైవేపై కొండచరియలు అకస్మాత్తుగా విరిగి సత్యనారాయణ, నిర్మల్​ షాహీ లు నడుపుతున్న బైక్​ పై పడ్డాయి.

పెద్ద, పెద్ద బండరాళ్ళు పడటంతో వీరిద్దరితో పాటు బైక్​ పూర్తిగా డ్యామేజ్​ అయ్యింది. బండరాళ్ళ తాకిడికి ఇద్దరి శరీరాలు చిధ్రమైపోగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, శిథిలాల కింద నుంచి వారి డెడ్​ బాడీలను బయటకు తీశారు. ఉత్తరాఖండ్​ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా, నదులన్నీ ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయని సమాచారం.

పోలీసులు హైదరాబాద్​ లోని వారి ఫ్యామిలీ మెంబర్స్​ కు ప్రమాద సమాచారం అందించారు. వెంటనే ఇక్కడి వారి కుటుంబసభ్యులు ఫ్లైట్​ లో ఆదివారం తెల్లవారుజామున  హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి, అక్కడి నుంచి ఉత్తరాఖండ్​ వెళ్ళారు. అయితే ఇద్దరి శరీరాభాగాలు బాగా డ్యామేజ్​ కావడంతో అక్కడి పోలీస్​ అధికారుల సూచన మేరకు అక్కడే అంత్యక్రియలను నిర్వహించినట్లు ఫ్యామిలీ మెంబర్స్​  ఫోన్​ లో తెలిపారు.

ప్రమాదం వార్త తెలియగానే స్కందగిరిలో సత్యనారాయణ నివాసం ఉండే  ప్రియా ఆపార్ట్​ మెంట్​ లో విషాదం నెలకొంది. సత్యనారాయణ ఓ ప్రైవేట్​ జాబ్ చేస్తుండగా, అతడి భార్య హేమ చిన్న కిరాణ కొట్టు నడిపిస్తోంది. వీరికి ఒక కుమారుడు నిఖిల్​ ఉన్నారు. 
–––––––

Tags
Join WhatsApp

More News...

ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం 

ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం  జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు  మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించి వివిధ పుష్పాలతో మాలలు అల్లి అలంకరించారు .సాయంత్రం మొదటి పాశురం సామూహికంగా...
Read More...

గ్రామపంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మద్దతు తో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పి చైర్పర్సన్

గ్రామపంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మద్దతు తో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పి చైర్పర్సన్ జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గం లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లను సన్మానించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మరియు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ......
Read More...

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్     ధర్మపురి డిసెంబర్ 16 (ప్రజా మంటలు) నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం  మీడియాతో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూమాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  గత 10 సంవత్సరాలలో చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందుంచుతాననిఅబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ మీ ప్రభుత్వం అన్నారు. , మీ నాయకత్వమే., సంక్షేమ శాఖ మంత్రిగా...
Read More...

మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు:జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు:జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 16( ప్రజా మంటలు)   పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు  163  బి  ఎన్ ఎస్ ఎస్(144  సెక్షన్ అమలు)  విజయోత్సవ  ర్యాలీలు, ఊరేగింపులకు  అనుమతి లేదు జిల్లాలో జరగనున్న  మూడవ   విడత  గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ...
Read More...
Local News  Crime 

దళితుల భూమిని ఆక్రమించి, దారి మూసివేత

దళితుల భూమిని ఆక్రమించి, దారి మూసివేత ఎల్కతుర్తి డిసెంబర్ 16 (ప్రజా మంటలు):  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని దండేపల్లి, దగ్గువారి పల్లె మధ్య ఉన్న డిబిఎం 20 ఎస్సారెస్పీ కాలువ ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటూ, దళితుల పొలాలకు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సూరారం గ్రామానికి చెందిన బచ్చు శ్రీనివాస్...
Read More...

ఈనెల 21 న జాతీయ లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోండి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

ఈనెల 21 న జాతీయ లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోండి  జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ ఈనెల 21న జాతీయ మెగా లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వి నియోగం చేసుకుని రాజీ కుదుర్చుకోవాలని సూచించారు.  జిల్లాలో సుమారు 18 యేళ్ళనుంచి కేసులు నమోదు అయి...
Read More...
State News 

యంగ్ ఇండియా స్కూల్, IIM హైదరాబాద్, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలపై కీలక చర్చలు

యంగ్ ఇండియా స్కూల్, IIM హైదరాబాద్, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలపై కీలక చర్చలు న్యూఢిల్లీ డిసెంబర్ 16 (ప్రజా మంటలు): తెలంగాణలో విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన భేటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు...
Read More...

నేను జీవన్ రెడ్డికి నమ్మిన బంటును జీవన్ రెడ్డికు చెడ్డ పేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా..జగిత్యాల డిసిసి అధ్యక్షుడు ...గాజంగి నందయ్య .

నేను జీవన్ రెడ్డికి నమ్మిన బంటును  జీవన్ రెడ్డికు చెడ్డ పేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా..జగిత్యాల డిసిసి అధ్యక్షుడు ...గాజంగి నందయ్య . జగిత్యాల డిసెంబర్ 16(ప్రజా మంటలు)నావల్ల కాంగ్రెస్ పార్టీకి, జీవన్ రెడ్డికి చెడ్డపేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా అన్నారు డిసిసి అధ్యక్షులు  నందయ్య జగిత్యాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ కొనసాగుతుండగా ఎమ్మెల్యే సంజయ్‌తో నందయ్య సన్నిహితంగా కార్యక్రమాల్లో పాల్గొనడంపై అసంతృప్తి వ్యక్తం చేసిమంత్రి అడ్లూరి లక్ష్మణ్...
Read More...
Local News 

చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్

చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్ చౌలామద్ది డిసెంబర్ 15 (ప్రజా మంటలు): ఈరోజు జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌలామద్ది గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, తుల గంగవ్వ స్మారక ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని...
Read More...
State News 

గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత 

గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత  సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ మెడికల్‌ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్‌ఓడీ డా. జి. రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. గాంధీ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థినిగా, అదే కళాశాలలో సేవలందించి పదవీ విరమణ పొందారు. నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్...
Read More...

తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.  జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై  ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు....
Read More...

ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బలపరిచిన 70 మంది సర్పంచులు మరియు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందగా 65 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులను...
Read More...