ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

On
ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ  - బీఆర్ఎస్   వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ

-బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో - వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

జగిత్యాల జిల్లా ప్రతినిధి /బొంగురాల రాజేష్, జులై 01 (ప్రజా మంటలు) :

జగిత్యాలతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నరు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది. ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హయాంలోని కాంగ్రెస్ పార్టీ.2004లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసింది.అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్‌తో కొట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం.2015 లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది మీరంతా చూశారు.తెలంగాణను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్‌ను పడగొట్టే ప్రయత్నం చేశారు.ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు.రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించలేదు.అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినప్పడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు.

రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలె? ఎవరిని రాళ్లతో కొట్టాలె? ఎవరు పిచ్చి కుక్క? 

ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టాలా? ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్‌ను కొట్టాలా?

రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియ్,వాళ్లను మళ్లీ గెలిపించుకుంటే నువ్వు దమ్మునోడివి,ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. రాహుల్ గాంధీ ఏమన్నాడో కూడా వినాలె,ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని హైదరాబాద్‌లోనే చెప్పిండు.పాంచ్ న్యాయ్ పేరుతో ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తుందేమెమిటీ ప్రజలు గుర్తించాలె.వాళ్ల పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఇదే అంశంపై సొంత పార్టీ పై విమర్శలు చేశాడు.బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.. మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచింది.14 సీట్లలో కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయింది.ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు ? మోడీ కావాలా? వద్దా? అన్నట్లుగా ప్రచారం చేశారు.దీంతో ఐతే ఎన్డీయే, ఇండియా కూటమిలో లేని పార్టీలకు ఇబ్బంది జరిగింది.ఒక్క బీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఏ కూటమిలో లేని  సీపీఎం, వైఎస్ఆర్ సీపీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీఎస్పీ, అకాలీదల్‌లకు కూడా ఎదురుదెబ్బ తగిలింది.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇప్పుడిప్పుడే ఒక్కో అంశం అర్థమవుతోంది.రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్‌ను బద్నాం చేశాడు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు.కానీ ఇప్పుడు అసలు విషయం తెలుస్తోంది.. ఓయూ విద్యార్థులు నిరసన మొదలుపెట్టారు.మోతీలాల్ అనే విద్యార్థి దీక్ష చేస్తుంటే పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీని తరిమి కొట్టారు.ఈ ఆరు నెలల్లో ఏం అభివృద్ధి జరిగింది.. అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు.మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ గెలుస్తుంది.తెలంగాణ తెచ్చింది.. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్.. ఇది చరిత్ర.. ఈ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు.ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టే విధంగా హామీలు ఇవ్వటం కారణంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.డిసెంబర్ 9 రుణమాఫీ అన్నారు.. ఏడు నెలలు అయ్యింది.. టైమ్‌పాస్ చేస్తున్నారు.వృద్ధులకు 4 వేలు, రైతులకు రైతు భరోసా రూ. 15,000, మహిళలకు రూ. 2,500 అంటూ నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు.ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు.వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ముసలం పుడుతుందని రేవంత్ భయపడ్డాడు.అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు, బర్రెల మాదిరిగా డబ్బులు పడేసి కొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడు.ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు.ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ బీఆర్ఎస్ ఖతం అయిపోయిందంటూ పుకార్లు పట్టిస్తున్నాడు. ఆయన మీడియాలో ఏదేదో కథనాలు రాయించుకుంటున్నాడు.కానీ బీఆర్ఎస్ మళ్లీ గెలవటం ఖాయం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కడతారు.జగిత్యాల కార్యకర్తలను చూస్తే సంతోషంగా ఉంది.జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నట్లుగా ధైర్యంగా కనిపిస్తున్నారు.కష్టాలు వచ్చినప్పుడే నాయకుల విలువ తెలుస్తుంది.జగిత్యాలలో కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అన్నారు.

ఈకార్యక్రంలో మాజీ మంత్రులు గోడిసెల రాజేశం గౌడ్, ఎల్.రమణ, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, zp ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇందిరా భవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు జగిత్యాల ఆగస్ట్ 20 ( ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు...
Read More...
Filmi News  State News 

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్ ఎందరో నటులు సినీరంగం నుండి రాజకీయాల్లోకి - అదేబాటలు సుమన్ విజయవాడ ఆగస్టు 20: 2029 లో సుమన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పోటీ పోటీచేస్తానని ప్రకటించారు.ఇక తాజాగా సినీ హీరో సుమన్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్వతంత్ర సమరయోధులు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన సుమన్ తన...
Read More...
National  State News 

ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు

ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్వాగతించిన చిన్నారెడ్డి గారు హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు): భారత దేశ ఉప రాష్ట్రపతి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి పేరును ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం దేశంలో...
Read More...
Local News  Spiritual  

రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు జగిత్యాల ఆగస్ట్ 19 (ప్రజా మంటలు)): శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవ ఉత్సవ ప్రచార రథాన్ని డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్ ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవాలు తేదీ:20-08-2025 బుధవారం  నుండి 23-08-2025 శనివారం  వరకు జరుగురాయని ఆలయ కమిటీ ప్రకటించింది. డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్  అమ్మవారుకు ప్రత్యేక పూజలు...
Read More...
National  State News 

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం ముంబై ఆగస్టు 19: ముంబైలోని మోనోరైలులో చిక్కుకున్న ప్రయాణికులందరినీ సురక్షితంగా రక్షించారు. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైలు సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితిలో, ఈ సాయంత్రం (ఆగస్టు 19) భారీ వర్షాల మధ్య నడుస్తున్న మోనోరైలు ముంబైలోని మైసూర్ కాలనీ స్టేషన్ సమీపంలో కదులుతుండగా అకస్మాత్తుగా మధ్యలో ఆగిపోయింది....
Read More...
State News 

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది.- వాంకిడి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహరం తిని 22 రోజులు మృత్యువు తో పోరాడి గత ఏడాది నవంబర్ 25 న మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనలో-  సుమారు 60...
Read More...
Local News 

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి అంబేడ్కర్ ను రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సే .. సికింద్రాబాద్,  ఆగస్టు 19 (ప్రజా మంటలు):  రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందని దాన్ని అంబేడ్కర్ వాదులు తిప్పికొట్టాలని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టి అంబేద్కర్ గారిని  రాజ్యాంగాన్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన ప్రస్తుతం చేస్తున్న...
Read More...
Local News  State News 

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గాంధీ ఆసుపత్రిలో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ నేతలు వినతి పత్రం సమర్పించారు. కెరీర్ అడ్వాన్స్మెంట్, టైం బౌండ్ ప్రమోషన్స్ అమలు చేయాలని, వైద్యులకు ట్రాన్స్...
Read More...

గాంధీ ఆసుపత్రి కి  స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

గాంధీ ఆసుపత్రి కి  స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓపీ విభాగాల్లో పర్యటించిన మంత్రి    వైద్యాధికారులతో కలసి రివ్యూ మీటింగ్ సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : రాష్ర్టంలోనే పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో ఎప్పటి కప్పుడు సమస్యల పరిష్కారానికి, అడ్మినిస్ర్టేషన్ లో లోపాలు లేకుండా ఓ స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలనే ఆలోచన ఉన్నట్లు రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర...
Read More...
Local News  Crime 

ఆత్మకూరు గ్రామంలో గ్రామ సభ లో ఇసుక రవాణాపై అవగాహన

ఆత్మకూరు గ్రామంలో గ్రామ సభ లో  ఇసుక రవాణాపై అవగాహన కుల దూషణ ఘటనపై కేసు నమోదు    మెట్‌పల్లి ఆగస్టు 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్):  జగిత్యాల జిల్లా కలెక్టర్ అనుమతితో కథలాపూర్ మండలంలో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టు కోసం ఆత్మకూర్ గ్రామ వాగు నుండి ఇసుకను తరలించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక రవాణాను ఎవరైనా అడ్డుకుంటే వారిపై...
Read More...
Filmi News  State News 

ఆగస్ట్ 20 నుండి OTT లో "హరిహర వీరమల్లు"

ఆగస్ట్ 20 నుండి OTT లో హైదరాబాద్ ఆగస్ట్ 19: : పవన్కల్యాణ్ కథానాయకుడిగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు.ఈ చిత్రానికి జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించారు. జులై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ పవన్ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.  ఇప్పుడు ఈ చిత్రం,ఓటీటీ వేదిక...
Read More...
Local News  State News 

రోళ్ల వాగు ప్రాజెక్టు కు షెట్టర్ బిగచకపోవడంతో నీరు వృధాగా పోతుంది - ఎమ్మెల్సీ ఎల్ రమణ

రోళ్ల వాగు ప్రాజెక్టు కు షెట్టర్ బిగచకపోవడంతో నీరు వృధాగా పోతుంది - ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల ఆగస్ట్ 19 (ప్రజా మంటలు): గత ప్రభుత్వ హయంలోనే 90% పూర్తయిన రోల్లవాగు ప్రాజెక్ట్ కు ఇంతవరకు షట్టర్లు అమర్చకపోవడంతో వర్షపు నీరంతా గోదారి పాలౌతుందని, రైతుల పంటలకు నీరందించలేక పోతుందని MLC ఎల్ .రమణ విమర్శించారు. గతంలో మాజీ మంత్రి కొప్పులఈశ్వర్, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, జెడ్పీ...
Read More...