ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

On
ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ  - బీఆర్ఎస్   వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ

-బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో - వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

జగిత్యాల జిల్లా ప్రతినిధి /బొంగురాల రాజేష్, జులై 01 (ప్రజా మంటలు) :

జగిత్యాలతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నరు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది. ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హయాంలోని కాంగ్రెస్ పార్టీ.2004లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసింది.అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్‌తో కొట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం.2015 లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది మీరంతా చూశారు.తెలంగాణను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్‌ను పడగొట్టే ప్రయత్నం చేశారు.ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు.రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించలేదు.అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినప్పడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు.

రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలె? ఎవరిని రాళ్లతో కొట్టాలె? ఎవరు పిచ్చి కుక్క? 

ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టాలా? ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్‌ను కొట్టాలా?

రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియ్,వాళ్లను మళ్లీ గెలిపించుకుంటే నువ్వు దమ్మునోడివి,ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. రాహుల్ గాంధీ ఏమన్నాడో కూడా వినాలె,ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని హైదరాబాద్‌లోనే చెప్పిండు.పాంచ్ న్యాయ్ పేరుతో ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తుందేమెమిటీ ప్రజలు గుర్తించాలె.వాళ్ల పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఇదే అంశంపై సొంత పార్టీ పై విమర్శలు చేశాడు.బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.. మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచింది.14 సీట్లలో కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయింది.ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు ? మోడీ కావాలా? వద్దా? అన్నట్లుగా ప్రచారం చేశారు.దీంతో ఐతే ఎన్డీయే, ఇండియా కూటమిలో లేని పార్టీలకు ఇబ్బంది జరిగింది.ఒక్క బీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఏ కూటమిలో లేని  సీపీఎం, వైఎస్ఆర్ సీపీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీఎస్పీ, అకాలీదల్‌లకు కూడా ఎదురుదెబ్బ తగిలింది.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇప్పుడిప్పుడే ఒక్కో అంశం అర్థమవుతోంది.రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్‌ను బద్నాం చేశాడు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు.కానీ ఇప్పుడు అసలు విషయం తెలుస్తోంది.. ఓయూ విద్యార్థులు నిరసన మొదలుపెట్టారు.మోతీలాల్ అనే విద్యార్థి దీక్ష చేస్తుంటే పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీని తరిమి కొట్టారు.ఈ ఆరు నెలల్లో ఏం అభివృద్ధి జరిగింది.. అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు.మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ గెలుస్తుంది.తెలంగాణ తెచ్చింది.. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్.. ఇది చరిత్ర.. ఈ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు.ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టే విధంగా హామీలు ఇవ్వటం కారణంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.డిసెంబర్ 9 రుణమాఫీ అన్నారు.. ఏడు నెలలు అయ్యింది.. టైమ్‌పాస్ చేస్తున్నారు.వృద్ధులకు 4 వేలు, రైతులకు రైతు భరోసా రూ. 15,000, మహిళలకు రూ. 2,500 అంటూ నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు.ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు.వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ముసలం పుడుతుందని రేవంత్ భయపడ్డాడు.అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు, బర్రెల మాదిరిగా డబ్బులు పడేసి కొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడు.ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు.ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ బీఆర్ఎస్ ఖతం అయిపోయిందంటూ పుకార్లు పట్టిస్తున్నాడు. ఆయన మీడియాలో ఏదేదో కథనాలు రాయించుకుంటున్నాడు.కానీ బీఆర్ఎస్ మళ్లీ గెలవటం ఖాయం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కడతారు.జగిత్యాల కార్యకర్తలను చూస్తే సంతోషంగా ఉంది.జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నట్లుగా ధైర్యంగా కనిపిస్తున్నారు.కష్టాలు వచ్చినప్పుడే నాయకుల విలువ తెలుస్తుంది.జగిత్యాలలో కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అన్నారు.

ఈకార్యక్రంలో మాజీ మంత్రులు గోడిసెల రాజేశం గౌడ్, ఎల్.రమణ, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, zp ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  Crime 

మహిళపై లైంగిక దాడి, బెదిరింపులు.. నలుగురు నిందితుల అరెస్ట్

 మహిళపై లైంగిక దాడి, బెదిరింపులు.. నలుగురు నిందితుల అరెస్ట్ జగిత్యాల ga, ఆగస్టు 08 (ప్రజా మంటలు): మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడిన నలుగురు నిందితులను మల్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 3న నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో బాధితురాలు తనకు...
Read More...
Local News 

హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్రలో భాగంగా మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్‌ను సన్మానించిన  డా. బోగ శ్రావణి

హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్రలో భాగంగా మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్‌ను సన్మానించిన  డా. బోగ శ్రావణి జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న "హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర" కార్యక్రమంలో భాగంగా, భారత త్రివిధ దళాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ ని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ...
Read More...
Local News 

బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి కి పోచమ్మ తల్లి బోనాల జాతర ఆహ్వాన పత్రిక అందజేత

బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి కి పోచమ్మ తల్లి బోనాల జాతర ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా యూట్యూబర్స్ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణికి బోనాల జాతర వర్కింగ్ కమిటీ సభ్యులు, జగిత్యాల జిల్లా కళాకారులు మర్యాదపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

తల్లిపాలే శిశువుకు తొలి వరం – మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్

తల్లిపాలే శిశువుకు తొలి వరం – మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్    జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు )పట్టణంలోని స్థానిక 43వ వార్డు వాణీనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్  సమీండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సమీండ్ల...
Read More...
Local News 

విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్

విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్    జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)పట్టణంలోని నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన "పరిచయ్–2K26" ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్  సమిండ్ల వాణి శ్రీనివాస్ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్య జీవితానికి బలమైన పునాది అని, ఈ దశలో విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను...
Read More...
Local News 

సామాజిక న్యాయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ సంకల్పం

సామాజిక న్యాయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ సంకల్పం హైదరాబాద్, ఆగస్టు 06 (ప్రజా మంటలు): సామాజిక న్యాయ తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ నిర్వహించిన **"సామాజిక న్యాయ సంకల్ప సభ"**లో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక ప్రసంగం చేశారు. ఈ సభ దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన వర్గాల జీవితాలను మార్చే ఉద్యమానికి నాంది అవుతుందని ఆమె పేర్కొన్నారు. తాను బీసీల కోసం...
Read More...
Local News 

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి – మున్సిపల్ చైర్ పర్సన్  సమీండ్ల వాణి శ్రీనివాస్

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి – మున్సిపల్ చైర్ పర్సన్  సమీండ్ల వాణి శ్రీనివాస్    జగిత్యాల ఆగస్ట్ 6(ప్రజా మంటలు) మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కరీంనగర్ రోడ్‌లోని జయశంకర్ విగ్రహం వద్ద, గొల్లపల్లి రోడ్‌లోని విగ్రహం వద్ద, అలాగే మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర...
Read More...
Local News 

ధనం ఉంటే దాన స్వభావము ఉండాలి  బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేష్ శర్మ 

ధనం ఉంటే దాన స్వభావము ఉండాలి  బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేష్ శర్మ  కోరుట్ల ఆగస్టు 5 ( ప్రజా మంటలు)  సిరిసిల్ల రాజేంద్ర శర్మ 9348422113 ధనమున్న వ్యక్తికి దాన స్వభావం ఉండాలని అదేవిధంగా శక్తి ఉంటే క్షమాగుణం ఉండాలని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి శిష్యులు గర్రెపల్లి మహేష్ శర్మ అన్నారు. కోరుట్ల పట్టణములో సనాతన ధర్మ ప్రచార సమితి కోరుట్ల...
Read More...
Local News  State News 

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ప్రజా మంటలు):ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 150–152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రిని కలిశారు.148 మీటర్లతో పోలిస్తే 152...
Read More...
Local News 

నల్లమల్లలో చెంచు గిరిజనుల జీవన పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి పరిశీలన

నల్లమల్లలో చెంచు గిరిజనుల జీవన పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి పరిశీలన విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతులపై అధికారులతో సమగ్ర సమీక్ష – చెంచు కుటుంబాలతో ముఖాముఖిహైదరాబాద్, ఆగస్టు 5 (ప్రజా మంటలు): నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన పరిస్థితులను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్...
Read More...
Local News  State News 

పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి లేక గొల్లపల్లి అభివృద్ధి కుంటుపాటు

పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి లేక గొల్లపల్లి అభివృద్ధి కుంటుపాటు గొల్లపల్లికి రావాలంటేనే జంకుతున్న కార్యదర్శులు!రాజకీయ ఒత్తిళ్లే కారణమా..? గ్రామంలో గుసగుసలు? గొల్లపల్లి, ఆగస్టు 5 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పూర్తిస్థాయి కార్యదర్శి లేక తీవ్ర పరిపాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నెలకోసారి ఇన్‌చార్జి కార్యదర్శిని నియమిస్తూ కాలం గడుపుతుండటంతో గ్రామ అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి...
Read More...
Local News 

ఐక్య ఉద్యమాలతోనే పీఆర్సీ సాధ్యం, అశాస్త్రీయమైన టెట్ పరీక్షను రద్దు చేయాలి : జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్

ఐక్య ఉద్యమాలతోనే పీఆర్సీ సాధ్యం, అశాస్త్రీయమైన టెట్ పరీక్షను రద్దు చేయాలి : జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్    జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ లకు  రావాల్సిన పి.ఆర్సి , డి.ఏ లు, పెండింగ్ బకాయిల సమస్యలు   ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం తీర్మానించింది.  ఆదివారం జగిత్యాల పట్టణంలో   రామకృష్ణ డిగ్రీ కళాశాల సమావేశమందిరంలో  ఎస్టీయు తృతీయ కార్యవర్గ...
Read More...