ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

On
ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ  - బీఆర్ఎస్   వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ

-బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో - వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

జగిత్యాల జిల్లా ప్రతినిధి /బొంగురాల రాజేష్, జులై 01 (ప్రజా మంటలు) :

జగిత్యాలతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నరు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది. ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హయాంలోని కాంగ్రెస్ పార్టీ.2004లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసింది.అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్‌తో కొట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం.2015 లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది మీరంతా చూశారు.తెలంగాణను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్‌ను పడగొట్టే ప్రయత్నం చేశారు.ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు.రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించలేదు.అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినప్పడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు.

రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలె? ఎవరిని రాళ్లతో కొట్టాలె? ఎవరు పిచ్చి కుక్క? 

ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టాలా? ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్‌ను కొట్టాలా?

రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియ్,వాళ్లను మళ్లీ గెలిపించుకుంటే నువ్వు దమ్మునోడివి,ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. రాహుల్ గాంధీ ఏమన్నాడో కూడా వినాలె,ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని హైదరాబాద్‌లోనే చెప్పిండు.పాంచ్ న్యాయ్ పేరుతో ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తుందేమెమిటీ ప్రజలు గుర్తించాలె.వాళ్ల పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఇదే అంశంపై సొంత పార్టీ పై విమర్శలు చేశాడు.బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.. మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచింది.14 సీట్లలో కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయింది.ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు ? మోడీ కావాలా? వద్దా? అన్నట్లుగా ప్రచారం చేశారు.దీంతో ఐతే ఎన్డీయే, ఇండియా కూటమిలో లేని పార్టీలకు ఇబ్బంది జరిగింది.ఒక్క బీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఏ కూటమిలో లేని  సీపీఎం, వైఎస్ఆర్ సీపీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీఎస్పీ, అకాలీదల్‌లకు కూడా ఎదురుదెబ్బ తగిలింది.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇప్పుడిప్పుడే ఒక్కో అంశం అర్థమవుతోంది.రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్‌ను బద్నాం చేశాడు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు.కానీ ఇప్పుడు అసలు విషయం తెలుస్తోంది.. ఓయూ విద్యార్థులు నిరసన మొదలుపెట్టారు.మోతీలాల్ అనే విద్యార్థి దీక్ష చేస్తుంటే పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీని తరిమి కొట్టారు.ఈ ఆరు నెలల్లో ఏం అభివృద్ధి జరిగింది.. అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు.మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ గెలుస్తుంది.తెలంగాణ తెచ్చింది.. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్.. ఇది చరిత్ర.. ఈ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు.ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టే విధంగా హామీలు ఇవ్వటం కారణంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.డిసెంబర్ 9 రుణమాఫీ అన్నారు.. ఏడు నెలలు అయ్యింది.. టైమ్‌పాస్ చేస్తున్నారు.వృద్ధులకు 4 వేలు, రైతులకు రైతు భరోసా రూ. 15,000, మహిళలకు రూ. 2,500 అంటూ నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు.ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు.వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ముసలం పుడుతుందని రేవంత్ భయపడ్డాడు.అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు, బర్రెల మాదిరిగా డబ్బులు పడేసి కొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడు.ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు.ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ బీఆర్ఎస్ ఖతం అయిపోయిందంటూ పుకార్లు పట్టిస్తున్నాడు. ఆయన మీడియాలో ఏదేదో కథనాలు రాయించుకుంటున్నాడు.కానీ బీఆర్ఎస్ మళ్లీ గెలవటం ఖాయం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కడతారు.జగిత్యాల కార్యకర్తలను చూస్తే సంతోషంగా ఉంది.జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నట్లుగా ధైర్యంగా కనిపిస్తున్నారు.కష్టాలు వచ్చినప్పుడే నాయకుల విలువ తెలుస్తుంది.జగిత్యాలలో కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అన్నారు.

ఈకార్యక్రంలో మాజీ మంత్రులు గోడిసెల రాజేశం గౌడ్, ఎల్.రమణ, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, zp ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్    జగిత్యాల సెప్టెంబర్ 14 (ప్రజా మంటలు)   పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 22 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .అనంతరం వారికి ఉచిత కంటి అద్దాలు,మందులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  మానవ...
Read More...
Local News 

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత    జగిత్యాల సెప్టెంబర్ 14(ప్రజా మంటలు)ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసిన నవదుర్గ సేవా సమితి సభ్యులు.నవదుర్గ సేవా సమితి ట్రస్ట్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో గోవింద్ పల్లి  నవదుర్గ పీఠ క్షేత్రం దుర్గ శరన్నవరాత్రి ఉత్సవ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారికి అందజేశారు.
Read More...
Local News  Sports 

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల సెప్టెంబర్ 09 (ప్రజా మంటలు) :  నేటి ఆదివారం రోజున ఉధయం 10.30 am కి జగిత్యాల వివేకానంద మినీ స్టేడియం లో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్వర్యంలో సబ్ జూనియర్ కబడ్డీ పోటిల ఎంపిక చేస్తామని జిల్లా కబడ్డీ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి...
Read More...
Local News 

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు.  ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ. 

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు.   ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.  16 తేదీ నుండి20 తేదీ వరకు  నుండి 5 రోజుల ప్రత్యేక శిక్షణ మెట్టుపల్లి సెప్టెంబర్ 14 (ప్రజా  మంటలు దగ్గుల అశోక్): దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కేసుల్ని వేగంగా పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు ముందడుగు వేస్తూనే వుంది. ఈ క్రమంలో లోయర్ కోర్టులో పెండింగ్ కేసుల్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే ఒక వినూత్న...
Read More...
Local News 

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు సికింద్రాబాద్, సెప్టెంబర్ 14 (ప్రజామంటలు): జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో  స్నేహిత ఫుడ్స్ అనే ఆహార ఉత్పత్తుల సంస్థ ఆదివారం రోజున ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు భవాని రెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫారం ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి ,సుభిక్ష అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్...
Read More...
National  International  

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 14: భారతదేశం యొక్క బాహ్య FDIలో దాదాపు 60% 'పన్ను స్వర్గధామాలకు' వెళుతుంది, ఇది ఈ దేశాల వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని ' ది హిందూ' దినపత్రిక ఒక పరిశోధనా వ్యాసంలో ప్రకటించింది. 2024-25లో ఇటువంటి పెట్టుబడులలో దాదాపు 56% సింగపూర్, మారిషస్, UAE, నెదర్లాండ్స్, UK మరియు స్విట్జర్లాండ్ వంటి...
Read More...
Local News 

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. *బిజెపి నాయకురాలు ఎం.రాజేశ్వరి. సికింద్రాబాద్, సెప్టెంబర్14 ,(ప్రజామంటలు): సికింద్రాబాద్ లో పగలంతా తరగతులు నిర్వహిస్తూ రాత్రంతా మత్తు పదార్థాలు తయారు చేస్తున్న మేధా హై స్కూల్ గుర్తింపును వెంటనే రద్దుచేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకొని తెలంగాణ యువత జీవితాలను కాపాడాలని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర...
Read More...
Local News 

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్ సికింద్రాబాద్,  సెప్టెంబర్ 14 (ప్రజా మంటలు): గాంధీ మెడికల్ కాలేజీ 71వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కళాశాల ఆలుమ్ని అసోసియేషన్ హాలులో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆలుమ్మి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ D.రాజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ పీవీ.నందకుమార్ రెడ్డి, తెలంగాణ...
Read More...
National  International  

భారతీయ మహిళ దుబాయ్ వీడియో. అక్కడి మహిళా సురక్షకు సాక్షమా?.

భారతీయ మహిళ దుబాయ్ వీడియో. అక్కడి మహిళా సురక్షకు సాక్షమా?. అర్థరాత్రి దుబాయ్ రోడ్లపై భారతీయ మహిళ  నేను, మా ఇంటి వాళ్ళు ఊహించలేనిదని ఆమె వ్యాఖ్య   దుబాయ్ సెప్టెంబర్ 14: దుబాయ్ వైరల్ వీడియో దుబాయ్ నగరం,మహిళలకు సురక్షితమైనదిగా నిరూపించింది. మరియు ఇది మళ్ళీ నిరూపించబడింది. త్రిష రాజ్ అనే భారతీయ మహిళ రాత్రిపూట దుబాయ్ వీధుల్లో తిరుగుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో...
Read More...
Crime  State News 

క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్

క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్ కరీంనగర్ సెప్టెంబర్ 14 (ప్రజా మంటలు); కరీంనగర్ రూరల్ మండలంలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడులపై మూడు రెట్లు రాబడి ఇస్తానని ప్రజలను మోసం చేసినందుకు కోతిరాంపూర్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ (50)ను పోలీసు అధికారులు అరెస్టు చేశారు. తీగలగుట్టపల్లికి చెందిన నునావత్ భాస్కర్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు కరీంనగర్ రూరల్...
Read More...
National  Opinion  International  

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా ఉన్నత భవిష్యత్ కోసం ప్రజా పోరాటం తప్పదా? నాయకులపై నమ్మకం పోతే, శ్రీలంక,బంగ్లాదేశ్ ల పరిస్థితి. భారతదేశ నాయకులు గమనించాలి నేపాల్ సైద్ధాంతిక గుర్తింపు కోసం అన్వేషణఇది స్పష్టమైన ఉద్దేశ్యం లేదా భవిష్యత్తు కోసం ఏకీకృత దృక్పథంతో కూడిన విప్లవం కాదు. ఇది నాయకత్వం లేని కోపం, ముడి విస్ఫోటనం, తమ నాయకులచే మోసగించబడటంతో...
Read More...
National  International  

చార్లీ కిర్క్ ప్రారంభించిన టర్నింగ్ పాయింట్ ఉద్యమం ఆగిపోదు - ఎరికా కిర్క్

చార్లీ కిర్క్ ప్రారంభించిన టర్నింగ్ పాయింట్ ఉద్యమం ఆగిపోదు - ఎరికా కిర్క్ న్యూయార్క్ సెప్టెంబర్ 14: భర్త చార్లీ కిర్క్ హత్య తర్వాత ఎరికా కిర్క్ దేశానికి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు "మీరు ఈ భార్యలో రగిలించిన అగ్ని మీకు తెలియదు, ఈ వితంతువు ఏడుపులు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ కేకలా ప్రతిధ్వనిస్తాయి" అని హత్యకు గురైన కన్జర్వేటివ్ వ్యాఖ్యాత చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్, తన భర్త...
Read More...