ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

On
ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ  - బీఆర్ఎస్   వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ

-బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో - వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

జగిత్యాల జిల్లా ప్రతినిధి /బొంగురాల రాజేష్, జులై 01 (ప్రజా మంటలు) :

జగిత్యాలతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నరు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది. ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హయాంలోని కాంగ్రెస్ పార్టీ.2004లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసింది.అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్‌తో కొట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం.2015 లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది మీరంతా చూశారు.తెలంగాణను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్‌ను పడగొట్టే ప్రయత్నం చేశారు.ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు.రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించలేదు.అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినప్పడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు.

రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలె? ఎవరిని రాళ్లతో కొట్టాలె? ఎవరు పిచ్చి కుక్క? 

ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టాలా? ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్‌ను కొట్టాలా?

రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియ్,వాళ్లను మళ్లీ గెలిపించుకుంటే నువ్వు దమ్మునోడివి,ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. రాహుల్ గాంధీ ఏమన్నాడో కూడా వినాలె,ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని హైదరాబాద్‌లోనే చెప్పిండు.పాంచ్ న్యాయ్ పేరుతో ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తుందేమెమిటీ ప్రజలు గుర్తించాలె.వాళ్ల పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఇదే అంశంపై సొంత పార్టీ పై విమర్శలు చేశాడు.బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.. మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచింది.14 సీట్లలో కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయింది.ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు ? మోడీ కావాలా? వద్దా? అన్నట్లుగా ప్రచారం చేశారు.దీంతో ఐతే ఎన్డీయే, ఇండియా కూటమిలో లేని పార్టీలకు ఇబ్బంది జరిగింది.ఒక్క బీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఏ కూటమిలో లేని  సీపీఎం, వైఎస్ఆర్ సీపీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీఎస్పీ, అకాలీదల్‌లకు కూడా ఎదురుదెబ్బ తగిలింది.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇప్పుడిప్పుడే ఒక్కో అంశం అర్థమవుతోంది.రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్‌ను బద్నాం చేశాడు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు.కానీ ఇప్పుడు అసలు విషయం తెలుస్తోంది.. ఓయూ విద్యార్థులు నిరసన మొదలుపెట్టారు.మోతీలాల్ అనే విద్యార్థి దీక్ష చేస్తుంటే పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీని తరిమి కొట్టారు.ఈ ఆరు నెలల్లో ఏం అభివృద్ధి జరిగింది.. అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు.మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ గెలుస్తుంది.తెలంగాణ తెచ్చింది.. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్.. ఇది చరిత్ర.. ఈ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు.ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టే విధంగా హామీలు ఇవ్వటం కారణంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.డిసెంబర్ 9 రుణమాఫీ అన్నారు.. ఏడు నెలలు అయ్యింది.. టైమ్‌పాస్ చేస్తున్నారు.వృద్ధులకు 4 వేలు, రైతులకు రైతు భరోసా రూ. 15,000, మహిళలకు రూ. 2,500 అంటూ నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు.ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు.వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ముసలం పుడుతుందని రేవంత్ భయపడ్డాడు.అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు, బర్రెల మాదిరిగా డబ్బులు పడేసి కొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడు.ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు.ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ బీఆర్ఎస్ ఖతం అయిపోయిందంటూ పుకార్లు పట్టిస్తున్నాడు. ఆయన మీడియాలో ఏదేదో కథనాలు రాయించుకుంటున్నాడు.కానీ బీఆర్ఎస్ మళ్లీ గెలవటం ఖాయం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కడతారు.జగిత్యాల కార్యకర్తలను చూస్తే సంతోషంగా ఉంది.జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నట్లుగా ధైర్యంగా కనిపిస్తున్నారు.కష్టాలు వచ్చినప్పుడే నాయకుల విలువ తెలుస్తుంది.జగిత్యాలలో కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అన్నారు.

ఈకార్యక్రంలో మాజీ మంత్రులు గోడిసెల రాజేశం గౌడ్, ఎల్.రమణ, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, zp ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల రూరల్ డిసెంబర్ 11(ప్రజా మంటలు)రూరల్ మండలం అంతర్గం గ్రామానికి చెందిన ఏ.సుగుణ కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 1లక్ష 20 వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వెంట నాయకులు నక్కల రవీందర్ రెడ్డి రౌతు గంగాధర్ తదితరులు...
Read More...

జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్నమొదటి విడత సర్పంచ్  ఎన్నికలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్నమొదటి విడత సర్పంచ్  ఎన్నికలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    జగిత్యాల డిసెంబర్ 11 (ప్రజా మంటలు)మొదటి విడత సర్పంచి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ   తెలిపారు.ఎన్నికలు  జరుగుతున్న పోలింగ్  కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు మరియు ప్రత్యేక పోలీసు...
Read More...
State News  Crime 

పవిత్ర హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ అరెస్ట్

పవిత్ర హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ అరెస్ట్ సికింద్రాబాద్, డిసెంబర్ 10 (ప్రజామంటలు) : వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్‌లో 18ఏళ్ల యువతి పవిత్రపై జరిగిన క్రూరహత్య కేసులో నిందితుడు దుక్కా ఉమాశంకర్‌ను వారాసిగూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.   డిసెంబర్ 8న జరిగిన...
Read More...

మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి  : జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి  : జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     ఎన్నికలు నిర్వహణకు 843  మంది పోలీస్ లతో  పటిష్ట బందోబస్తు.జగిత్యాల/కోరుట్ల మెట్పల్లి,డిసెంబర్ 10(ప్రజా మంటలు) జిల్లాలో జరుగుతున్న మొదటి విడత  గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  అన్నారు. బుధవారం బీమారం ,కోరుట్ల,మెట్ పల్లి లో ఏర్పాటు చేసిన...
Read More...
Local News 

శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ

శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ (అంకం భూమయ్య) గొల్లపల్లి, డిసెంబర్ 10 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం మల్లన్నపేటలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (దొంగ మల్లన్న) జాతర కార్యక్రమంలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ బుధవారం ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమొగిలి కూడా స్వామి వారిని దర్శించుకుని...
Read More...

మైతాపూర్ గ్రామంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి కి మద్దతు గా ప్రచారము నిర్వహించిన డా భోగ శ్రావణి

మైతాపూర్ గ్రామంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి కి మద్దతు గా ప్రచారము నిర్వహించిన డా భోగ శ్రావణి    రాయికల్ డిసెంబర్ 10 ( ప్రజా మంటలు)మండలములోని మహితాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో భాగంగా బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజనాల సుందరి-జయానందం గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి ఈ కార్యక్రమంలో రాయికల్...
Read More...
Local News 

కొండగట్టులో అగ్ని ప్రమాద బాధితులకు జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యుల చేయూత

కొండగట్టులో అగ్ని ప్రమాద బాధితులకు జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యుల చేయూత కొండగట్టు డిసెంబర్ 10 –(ప్రజా మంటలు): కొండగట్టుకు రోజు వారీ జీవనోపాధి కోసం వచ్చి చిన్న దుకాణాల ద్వారా బొమ్మలు, గాజులు, పిల్లల ఆట వస్తువులు అమ్ముకునే కుటుంబాలు కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. ఈ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యులు...
Read More...

రోడ్డు విస్తరణ గూర్చి తమ వినతిని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన ఎంపీ అరవింద్ కు కృతజ్ఞతలు తెలియజేసిన డా బోగ శ్రావణి

రోడ్డు విస్తరణ గూర్చి తమ వినతిని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన ఎంపీ అరవింద్ కు కృతజ్ఞతలు తెలియజేసిన డా బోగ శ్రావణి జగిత్యాల డిసెంబర్ 10 (ప్రజా మంటలు)నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి కి గతంలో జగిత్యాల నియోజకవర్గం లోని జగిత్యాల రురల్ మండల్ అనంతరం గ్రామంలోని లో లెవెల్ బ్రిడ్జ్ వర్షాకాలంలో ప్రజలు తీవ్ర  ఇబ్బంది పడడం, నిత్యం ప్రమాదాలు జరగడం మరియు జగిత్యాల్ అర్బన్ మండల్ అంబారిపేట్ రోడ్డు విస్తరణ మరియు రైల్వే...
Read More...

బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలి  డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ  తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ 

బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలి   డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ   తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  జగిత్యాల డిసెంబర్ 10 (ప్రజా మంటలు,) బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలని శృంగేరీ శారద పీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ  తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని  స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో మహాభారత ప్రవచన మహాయజ్ఞం 5...
Read More...

మొదటి విడత 11వ తేదీన  జరిగే 7 మండలాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్

మొదటి విడత 11వ తేదీన  జరిగే 7 మండలాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ మేడిపల్లి/ కథలాపూర్/ మల్లాపూర్ /ఇబ్రహీంపట్నం డిసెంబర్ 10(ప్రజా మంటలు   )    మేడిపల్లి, కథలాపూర్, మల్లాపూర్ మరియు ఇబ్రహీంపట్నం మండలాల్లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల  డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్   పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సిబ్బంది బాధ్యతల పంపిణీ, లాజిస్టిక్స్ ఎన్నికల మెటీరియల్ను   జిల్లా కలెక్టర్...
Read More...

కేంద్ర మంత్రులు గడ్కరీ,  అశ్విని వైష్ణవ్ లను కలిసిన ఎంపీ అర్వింద్ పలు సమస్యలపై విన్నపాలు సానుకూలంగా స్పందించిన మంత్రులు

కేంద్ర మంత్రులు గడ్కరీ,  అశ్విని వైష్ణవ్ లను కలిసిన ఎంపీ అర్వింద్  పలు సమస్యలపై విన్నపాలు  సానుకూలంగా స్పందించిన మంత్రులు ఢిల్లీ డిసెంబర్ 10 (ప్రజా మంటలు) (S. వేణు గోపాల్)  నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ లను  వేర్వేరుగా కలిశారు.  ఈ సందర్భంగా నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాలకు సంబంధించి పలు విజ్ఞప్తులను అందజేశారు.  కేంద్ర రైల్వే శాఖ...
Read More...
Local News  Crime 

స్కూల్ బస్సు ప్రమాదంలో విద్యార్థి మృతి

స్కూల్ బస్సు ప్రమాదంలో విద్యార్థి మృతి కామారెడ్డి డిసెంబర్ 10 (ప్రజా మంటలు): కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్‌కు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడడంతో 10వ తరగతి విద్యార్థి ప్రణవ్‌ (15) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు. జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామం నుండి ఖండే ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను...
Read More...