ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ
-బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో - వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
జగిత్యాల జిల్లా ప్రతినిధి /బొంగురాల రాజేష్, జులై 01 (ప్రజా మంటలు) :
జగిత్యాలతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నరు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది. ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హయాంలోని కాంగ్రెస్ పార్టీ.2004లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసింది.అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్తో కొట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం.2015 లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది మీరంతా చూశారు.తెలంగాణను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్ను పడగొట్టే ప్రయత్నం చేశారు.ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు.రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించలేదు.అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు.
రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలె? ఎవరిని రాళ్లతో కొట్టాలె? ఎవరు పిచ్చి కుక్క?
ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టాలా? ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్ను కొట్టాలా?
రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియ్,వాళ్లను మళ్లీ గెలిపించుకుంటే నువ్వు దమ్మునోడివి,ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. రాహుల్ గాంధీ ఏమన్నాడో కూడా వినాలె,ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని హైదరాబాద్లోనే చెప్పిండు.పాంచ్ న్యాయ్ పేరుతో ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తుందేమెమిటీ ప్రజలు గుర్తించాలె.వాళ్ల పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఇదే అంశంపై సొంత పార్టీ పై విమర్శలు చేశాడు.బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.. మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచింది.14 సీట్లలో కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయింది.ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు ? మోడీ కావాలా? వద్దా? అన్నట్లుగా ప్రచారం చేశారు.దీంతో ఐతే ఎన్డీయే, ఇండియా కూటమిలో లేని పార్టీలకు ఇబ్బంది జరిగింది.ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే కాదు.. ఏ కూటమిలో లేని సీపీఎం, వైఎస్ఆర్ సీపీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీఎస్పీ, అకాలీదల్లకు కూడా ఎదురుదెబ్బ తగిలింది.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇప్పుడిప్పుడే ఒక్కో అంశం అర్థమవుతోంది.రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చి లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్ను బద్నాం చేశాడు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు.కానీ ఇప్పుడు అసలు విషయం తెలుస్తోంది.. ఓయూ విద్యార్థులు నిరసన మొదలుపెట్టారు.మోతీలాల్ అనే విద్యార్థి దీక్ష చేస్తుంటే పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీని తరిమి కొట్టారు.ఈ ఆరు నెలల్లో ఏం అభివృద్ధి జరిగింది.. అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు.మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ గెలుస్తుంది.తెలంగాణ తెచ్చింది.. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్.. ఇది చరిత్ర.. ఈ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు.ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టే విధంగా హామీలు ఇవ్వటం కారణంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.డిసెంబర్ 9 రుణమాఫీ అన్నారు.. ఏడు నెలలు అయ్యింది.. టైమ్పాస్ చేస్తున్నారు.వృద్ధులకు 4 వేలు, రైతులకు రైతు భరోసా రూ. 15,000, మహిళలకు రూ. 2,500 అంటూ నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు.ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు.వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ముసలం పుడుతుందని రేవంత్ భయపడ్డాడు.అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు, బర్రెల మాదిరిగా డబ్బులు పడేసి కొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడు.ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు.ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ బీఆర్ఎస్ ఖతం అయిపోయిందంటూ పుకార్లు పట్టిస్తున్నాడు. ఆయన మీడియాలో ఏదేదో కథనాలు రాయించుకుంటున్నాడు.కానీ బీఆర్ఎస్ మళ్లీ గెలవటం ఖాయం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడతారు.జగిత్యాల కార్యకర్తలను చూస్తే సంతోషంగా ఉంది.జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నట్లుగా ధైర్యంగా కనిపిస్తున్నారు.కష్టాలు వచ్చినప్పుడే నాయకుల విలువ తెలుస్తుంది.జగిత్యాలలో కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అన్నారు.
ఈకార్యక్రంలో మాజీ మంత్రులు గోడిసెల రాజేశం గౌడ్, ఎల్.రమణ, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, zp ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
లక్ష్మణ్ కుమార్ ప్రశ్నలకు జాబితాతో సమాధా నం ఇచ్చిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, జనవరి 12 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్మపురిలో ఏం అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో ప్రెస్మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన హయాంలో ధర్మపురి మున్సిపాలిటీ ఏర్పాటు, డబుల్ రోడ్లు, హైవే అభివృద్ధి, ఇంటర్నల్ రోడ్లు, బ్రిడ్జిల... TPUS రాష్ట్ర అధ్యక్షునిగా వోడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జిల్లా: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో జగిత్యాల జిల్లా ఉపాధ్యాయుడు వోడ్నాల రాజశేఖర్ రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా వోడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలపై అంకితభావంతో పనిచేస్తూ సంఘాన్ని మరింత బలోపేతం... మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులుగా బీర్పూర్ తిరుపతి
గొల్లపల్లి జనవరి 12 (ప్రజా మంటలు):
బుగ్గారం మండల సర్పంచ్ ల ఫోరం ఎన్నికలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ సమక్షంలో సోమవారం ఏకగ్రీవంగా జరిగాయి.మండలంలోనీ సర్పంచులు సమావేశమై మండల ఫోరం అధ్యక్షులుగా సర్పంచ్ బీర్ పూర్ తిరుపతి... ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి
ఇబ్రహీంపట్నం జనవరి 12(ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి హిందూ సేన ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఫోనుకంటి చిన్న వెంకట్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా
ఈ... ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొని విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ నలంద డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులు తయారు చేసిన తినుబండారాలు, స్వీట్ల ను పరిశీలించి విద్యార్థులను అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం,
అడువాల జ్యోతి... జగిత్యాలలో C.C రోడ్ పనుల పరిశీలన: అక్రమ కట్టడాలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ ఎల్ గార్డెన్ సమీపంలో నిధులు మంజూరైన సి.సి రోడ్ నిర్మాణ పనులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనుల నాణ్యత, వెడల్పు అంశాలపై ఆయన ఆరా తీశారు.
మున్సిపల్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన... జగిత్యాలలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభం
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జిల్లాలో ఒంటరిగా ఉన్న సీనియర్ సిటీజేన్స్(వృద్ధుల)కోసం బైపాస్ రోడ్డులో వయో వృద్ధుల సంక్షేమ శాఖ తరపున డే కేర్ సెంటర్ ను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్చువల్ గా ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి బి.నరేశ్ మాట్లాడుతూ వృద్దులు సామాజికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ డే కేర్... అలిశెట్టి అక్షరాలు… సమాజ హితాన్ని కోరాయి
జగిత్యాల, జనవరి 12 (ప్రజా మంటలు):
అలిశెట్టి ప్రభాకర్ రచనలు కణికల వంటివని, ఆయన సాహిత్యం సమాజ హితాన్ని కోరుతూ ప్రజలను చైతన్యవంతులను చేసిందని సినీ కథా రచయిత, అలిశెట్టి జీవిత సాఫల్య పురస్కార గ్రహీత పెద్దింటి అశోక్ కుమార్ అన్నారు. యువతరానికి అలిశెట్టి సాహిత్యం నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం కళాశ్రీ... అలిశెట్టి ప్రభాకర్కు జగిత్యాలలో ఘన నివాళులు
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో ప్రజాకవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్, ఉద్యమకారుడు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ప్రజల పక్షాన నిలబడి అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సమాజ మార్పు కోసం జీవితాంతం పోరాడిన అక్షరయోధుడిగా అలిశెట్టి ప్రభాకర్... మెట్టుగూడలో కాంగ్రెస్ మహా పాదయాత్ర ; GHMC ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జ్, కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం సంతోష్ కుమార్ నాయకత్వంలో జరిగిన ఈ పాదయాత్ర GHMC ఎన్నికల్లో విజయం లక్ష్యంగా సాగింది.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, ప్రభుత్వ పథకాలను... సూరారం ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
ఎల్కతుర్తి డిసెంబర్ 11 ప్రజా మంటలు
ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో ఆటో యూనియన్ నూతన కమిటీని కమిటీని ఆదివారం అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్ ఎల్కతుర్తి స్టేషన్ ఎస్ ఐ అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్లను మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు.ఈ సమావేశంలో... నేరెళ్ల గ్రామంలో యువకుని ఆదృశ్యం
గొల్లపల్లి జనవరి 11 (ప్రజా మంటలు ):
ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మంద నరేష్ (35) నేరెళ్లలో కుటుంబంతో సోమవారం మధ్యాహ్నం భార్యతో కిరాణా షాపుకు వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుండి వెళ్ళి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి మంద శంకరమ్మ 