ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

On
ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ  - బీఆర్ఎస్   వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ

-బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో - వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

జగిత్యాల జిల్లా ప్రతినిధి /బొంగురాల రాజేష్, జులై 01 (ప్రజా మంటలు) :

జగిత్యాలతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నరు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది. ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హయాంలోని కాంగ్రెస్ పార్టీ.2004లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసింది.అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్‌తో కొట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం.2015 లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది మీరంతా చూశారు.తెలంగాణను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్‌ను పడగొట్టే ప్రయత్నం చేశారు.ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు.రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించలేదు.అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినప్పడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు.

రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలె? ఎవరిని రాళ్లతో కొట్టాలె? ఎవరు పిచ్చి కుక్క? 

ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టాలా? ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్‌ను కొట్టాలా?

రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియ్,వాళ్లను మళ్లీ గెలిపించుకుంటే నువ్వు దమ్మునోడివి,ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. రాహుల్ గాంధీ ఏమన్నాడో కూడా వినాలె,ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని హైదరాబాద్‌లోనే చెప్పిండు.పాంచ్ న్యాయ్ పేరుతో ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తుందేమెమిటీ ప్రజలు గుర్తించాలె.వాళ్ల పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఇదే అంశంపై సొంత పార్టీ పై విమర్శలు చేశాడు.బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.. మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచింది.14 సీట్లలో కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయింది.ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు ? మోడీ కావాలా? వద్దా? అన్నట్లుగా ప్రచారం చేశారు.దీంతో ఐతే ఎన్డీయే, ఇండియా కూటమిలో లేని పార్టీలకు ఇబ్బంది జరిగింది.ఒక్క బీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఏ కూటమిలో లేని  సీపీఎం, వైఎస్ఆర్ సీపీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీఎస్పీ, అకాలీదల్‌లకు కూడా ఎదురుదెబ్బ తగిలింది.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇప్పుడిప్పుడే ఒక్కో అంశం అర్థమవుతోంది.రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్‌ను బద్నాం చేశాడు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు.కానీ ఇప్పుడు అసలు విషయం తెలుస్తోంది.. ఓయూ విద్యార్థులు నిరసన మొదలుపెట్టారు.మోతీలాల్ అనే విద్యార్థి దీక్ష చేస్తుంటే పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీని తరిమి కొట్టారు.ఈ ఆరు నెలల్లో ఏం అభివృద్ధి జరిగింది.. అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు.మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ గెలుస్తుంది.తెలంగాణ తెచ్చింది.. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్.. ఇది చరిత్ర.. ఈ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు.ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టే విధంగా హామీలు ఇవ్వటం కారణంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.డిసెంబర్ 9 రుణమాఫీ అన్నారు.. ఏడు నెలలు అయ్యింది.. టైమ్‌పాస్ చేస్తున్నారు.వృద్ధులకు 4 వేలు, రైతులకు రైతు భరోసా రూ. 15,000, మహిళలకు రూ. 2,500 అంటూ నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు.ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు.వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ముసలం పుడుతుందని రేవంత్ భయపడ్డాడు.అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు, బర్రెల మాదిరిగా డబ్బులు పడేసి కొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడు.ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు.ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ బీఆర్ఎస్ ఖతం అయిపోయిందంటూ పుకార్లు పట్టిస్తున్నాడు. ఆయన మీడియాలో ఏదేదో కథనాలు రాయించుకుంటున్నాడు.కానీ బీఆర్ఎస్ మళ్లీ గెలవటం ఖాయం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కడతారు.జగిత్యాల కార్యకర్తలను చూస్తే సంతోషంగా ఉంది.జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నట్లుగా ధైర్యంగా కనిపిస్తున్నారు.కష్టాలు వచ్చినప్పుడే నాయకుల విలువ తెలుస్తుంది.జగిత్యాలలో కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అన్నారు.

ఈకార్యక్రంలో మాజీ మంత్రులు గోడిసెల రాజేశం గౌడ్, ఎల్.రమణ, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, zp ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు

తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు హైదరాబాద్‌ నవంబర్ 02 (ప్రజా మంటలు): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు బీసీ సమాజం నుంచి మద్దతు లభిస్తోంది. కవిత నాయకత్వం, బీసీ హక్కుల కోసం ఆమె చేస్తున్న కృషి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది బీసీ నాయకులు జాగృతి లో...
Read More...
Local News  State News 

తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటన

తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటన హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మోరం వీరభద్రరావు, జాడి శ్రీనివాస్ నియమితులయ్యారు. టీజేటీఎఫ్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రకటించారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్  విద్యారంగ వికాసానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.  తెలంగాణ...
Read More...
National  Sports  State News 

🇮🇳 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ — భారత మహిళలు 298/7 స్కోరుతో ఇన్నింగ్స్ పూర్తి

🇮🇳 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ — భారత మహిళలు 298/7 స్కోరుతో ఇన్నింగ్స్ పూర్తి నవి ముంబై నవంబర్ 02: నవి ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరుగుతున్న 2025 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. టాస్‌ నెగ్గిన దక్షిణాఫ్రికా మహిళల కెప్టెన్ లౌరా వోల్వార్ట్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నా, భారత బ్యాటర్లు తమ దూకుడు ఆటతో స్కోర్‌బోర్డ్‌ను రన్‌లతో నింపారు. ఓపెనర్ స్మృతి...
Read More...

భారత్‌ vs దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్‌ – శఫాలీ, స్మృతీ అద్భుత ఆరంభం

భారత్‌ vs దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్‌ – శఫాలీ, స్మృతీ అద్భుత ఆరంభం   ముంబయి నవంబర్ 02: నవి ముంబయిలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ జట్టు అద్భుత ఆరంభం చేసింది. ఓపెనర్లు శఫాలీ వర్మా, స్మృతీ మందానా సాహసోపేత బ్యాటింగ్‌తో భారత జట్టుకు బలమైన మొదటి పునాది వేశారు. ఇద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరు వేగంగా పెంచుతున్నారు. చరిత్ర సృష్టించాలన్న హర్మన్‌ప్రీత్ కౌర్...
Read More...

బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం

బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం శ్రీహరికోట నవంబర్ 02: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో గర్వకారణమైన ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహంను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన CMS-3 ఉపగ్రహం బరువు 4,410 కిలోలుగా ఉంది....
Read More...
Local News  State News 

రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? — దావ వసంత సురేష్ ప్రభుత్వంపై విమర్శ

రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? — దావ వసంత సురేష్ ప్రభుత్వంపై విమర్శ సారంగాపూర్, నవంబర్ 02 (ప్రజా మంటలు): జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఆమె మాట్లాడుతూ, “రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? కాలం, ప్రకృతి తో పాటు ప్రభుత్వం కూడా రైతులపై పగబట్టినట్లుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. సారంగాపూర్...
Read More...

క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్), నవంబర్ 02 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన గిరీష్ సింగ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని ట్రోఫీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయి. యువత క్రీడల్లో చురుకుగా...
Read More...
Local News 

నిరాశ్రయులు, సంచార జాతులకు దుస్తులు పంపిణి

నిరాశ్రయులు, సంచార జాతులకు దుస్తులు పంపిణి సికింద్రాబాద్  నవంబర్ 02 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు పంపిణి కార్యక్రమం నిర్వహించారు. దుస్తులు అందుకున్న నిరాశ్రయులు, సంచార జాతుల వారు స్కై ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ డాక్టర్....
Read More...
Local News 

భౌతికంగా దూరంగా ఉన్నా... వారి జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయి :ఎమ్మెల్యే తలసాని .

భౌతికంగా దూరంగా ఉన్నా... వారి జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయి :ఎమ్మెల్యే తలసాని . . సికింద్రాబాద్,  నవంబర్ 02 ( ప్రజా మంటలు):  మరణం భౌతికంగా వ్యక్తులను దూరం చేసినప్పటికీ, వారి జ్ఞాపకాలు, వారి పట్ల ఉన్న ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆత్మల దినం (ఆల్ సోల్స్ డే) సందర్భంగా బన్సీలాల్ పేట డివిజన్ లోని...
Read More...
Local News 

కార్తీకమాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రం : ఎమ్మెల్యే తలసాని

కార్తీకమాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రం : ఎమ్మెల్యే తలసాని సికింద్రాబాద్, నవంబర్ 02 (ప్రజా మంటలు):  కార్తీక మాసం మహా శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బన్సీలాల్ పేట డివిజన్ బోయగూడ ఉప్పలమ్మ  దేవాలయం ప్రాంగణంలో శివలింగం, నందీశ్వర పున: ప్రతిష్ట పూజలలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ శ్రీధర్ ఎమ్మెల్యే...
Read More...

నేడే మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ — భారత్ vs ఆస్ట్రేలియా మధ్య తుది పోరు

నేడే మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ — భారత్ vs ఆస్ట్రేలియా మధ్య తుది పోరు ముంబై, నవంబర్ 2:మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం ఈరోజు జరగనుంది. భారత్‌ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ పోరు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉదయం 10.00 గంటలకు ప్రారంభం కానుంది. టీమ్‌ ఇండియా ఈ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శనతో లీగ్‌ దశలో ఆస్ట్రేలియాపై విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది....
Read More...
National  State News 

కరూర్లో తొక్కిసలాట కేసు దర్యాప్తు మూడో రోజు కూడా కొనసాగింపు

కరూర్లో తొక్కిసలాట కేసు దర్యాప్తు మూడో రోజు కూడా కొనసాగింపు   — వ్యాపారులను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు కరూర్ (తమిళనాడు), నవంబర్ 2: తమిళనాడు రాష్ట్రం కరూర్లో జరిగిన దారుణమైన తొక్కిసలాట ఘటనపై సీబీఐ అధికారులు మూడో రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. కరూర్లోని వేలుచామిపురం ప్రాంతంలోని వ్యాపారులు, దుకాణ యజమానులను ఆదివారం ఉదయం నుంచి అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత సెప్టెంబర్ 27న థావేకా పార్టీ ప్రచార...
Read More...