మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం -మంత్రి శ్రీధర్ బాబు
మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు
అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం
-మంత్రి శ్రీధర్ బాబు
ఎటు తేల్చుకోలేని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కాలమే నిర్ణయిస్తుంది- కార్యకర్తల అభిప్రాయమే ముఖ్యం
-జీవన రెడ్డి
జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలలో ఆందోళన రేపిన ఎమ్మెల్యే సంజయ్ చేరిక
జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :
నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ నాయకునిగా జగిత్యాల ప్రాంత ప్రజలకు సేవలు అందించిన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన రెడ్డి జీవితంలో ఊహించని విధంగా, ఆయనకే తెలియకుండా, ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయనను కాలచి వేసింది. గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ, ఎవరితో పోటీపడి, అధికారంలో లేకున్నా పార్టీని కాపాడుకొన్న తననే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడని బాదపడుతున్న ఎమ్మెల్సీ జీవన రెడ్డి తన భాయిష్యత్ ను ఎటు తేల్చుకో లేకపోతున్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బి ఆర్ ఎస్ పార్టీ నుండి పోటీ చేసి జీవన రెడ్డిపై గెలిచిన ఆరు నెలలకే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం, జీవన రెడ్డికి కనీస సూచన కూడా లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని నిర్ణయించుకొన్న సమయంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు ఆడలూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, విజయరామనరావు లు ఇతర కాంగ్రెస్ నాయకులు వచ్చి, సముదాయించి, సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పి వెళ్లారు.
సాయంత్రం జగిత్యాల వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు దాదాపు రెండు గంటల పాటు ఎమ్మెల్సీ జీవన రెడ్డితో సంప్రదింపులు జరిపి, తొందరపాటులో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, పార్టీ అధికారంలో ఉందని, ముందు ముందు తగిన ప్రాధాన్యత ఇచ్చేట్లుగా మాట్లాడుదామని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు తెలుస్తుంది.
జీవన రెడ్డిని కలిసిన తరువాత బయటకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు విలేఖరులతో మాట్లాడుతూ, జీవన రెడ్డి పార్టీకి పెద్ద దిక్కు. నాలబై ఏళ్లుగా పార్టీని ఈప్రాంతంలో బలంగా ఉంచిన నాయకుడు. ఆయనకు తెలియకుండా జరిగిన విషయంలో అధిష్టాన వర్గానికి, పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి దృష్టికి తీసుకెళ్ళి, సమస్య పరిష్కారం అయ్యేట్లు చేస్తామని చెప్పారు. ఆయనే పెద్ద దిక్కు అయితే ఆయన అడుగుజాడల్లో నడిచే మేము ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేమని చెప్పారు. సమాచారలోపం వల్ల ఏర్పడ్డ మనస్తాపాన్ని తగ్గించడానికి, ఆయనతో మాట్లాడడానికి వచ్చినట్లు తెలిపారు.
పార్టీ ఆదేశం మేర గతంలో 2006, 2008 లో రెండుసార్లు బి ఆర్ ఎస్ నాయకుడు కాల్వకుంతల చంద్రశేఖర రావుపై కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడమే కాకుండా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ స్థానం నుండి పోటీ చేసి పార్టీకి అండగా ఉన్న జీవన రెడ్డి, రాష్ట్రంలోనే పెద్దదిక్కుగా ఉన్నారని, ఆయన అసంతృప్తి తొలగించడానికి కృషి చేస్తామని తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళిన తరువాత, జీవన రెడ్డి మాట్లాడుతూ, మూడుసార్లు పోటీ చేసిన వ్యక్తిని, ఎమ్మెల్యేలు అవసరమని భావించి, ఎలాంటి సమాచారం లేకుండా చేర్చుకోవడంతో నేనే కాదు, జగిత్యాల ప్రాంత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఎంత అవసరం అయినా, స్థానికి పార్టీ నాయకులను, కార్యకర్తలను కాదని, వారికి వ్యతిరేకంగా అధిష్టాన వర్గం ఎక్కడ కూడా వ్యవహరించడం సరికాదని అన్నారు.
నాలబై ఏళ్లుగా ఎన్నో కష్టలఉ భరించి, ఇక్కడ పార్టీని బలంగా నిలబెట్టిన నా భవిష్యత్ కార్యకర్తలు, నాయకులు నిర్ణయిస్తుందని, కాలాన్ని మించినది ఏదిలేదని, అన్నిటినీ కాలమే పరిష్కారం చూపుతుందని, అందరితో కలిసి నడవడమే నా అభిమమతమని జీవన రెడ్డి తెలిపారు. తన రాజకీయ భవిష్యత్ కూడా కాలమే నిర్ణయిస్తుందని నిర్వేదంతో, ఆవేధనతో తెలిపారు.
------
More News...
<%- node_title %>
<%- node_title %>
సీడ్ బిల్లు–2025 పై రైతులు, నిపుణుల నుంచి అభిప్రాయాల సేకరణ
సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు):
తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) నిర్వహిస్తున్న టీడీఎఫ్ జైకిసాన్ ప్రాజెక్ట్ లో భాగంగా సీడ్ బిల్–2025 పై రైతులు, వ్యవసాయ నిపుణుల అభిప్రాయాలు, సూచనలను సేకరించింది. ఆన్లైన్ కాన్ఫరెన్స్ లు, వెబినార్ ల ద్వారా తీసుకున్న అభిప్రాయాల నివేదికను గురువారం కేంద్ర వ్యవసాయ & రైతుల సంక్షేమ శాఖ... దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థ ఇది : రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు) :
దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థగా సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ నిలిచిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రెజిమెంటల్ బజార్లో జరిగిన సెయింట్ ఫ్రాన్సిస్ బాలికల హైస్కూల్ 175వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలికల విద్యకు 175 ఏళ్లుగా సేవ చేస్తూ ఎందరో ఐఏఎస్, ఐపీఎస్,... అఖండ 2 సినిమా టికెట్ ధరల పెంపు జీవోను రద్దు చేసిన హైకోర్టు
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా కోసం ప్రభుత్వ ధరల కంటే అధికంగా టికెట్ రేట్లు వసూలు చేయడానికి అనుమతిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. టికెట్ రేట్లు పెంచడానికి సరైన ఆధారాలు, సమగ్ర కారణాలు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడం చట్టానికి... నాన్బెయిలబుల్ వారెంట్ ప్రచారం అసత్యం: కొండా సురేఖ ఖండన:
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి గా పనిచేస్తున్న కొండా సురేఖపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం కావడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.
మంత్రి కొండా సురేఖ వివరణ... రోడ్డు భద్రతపై యమధర్మరాజుగా అవగాహన
సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు) :
హైదరాబాద్ సిటీ కమిషనర్ వి.సీ. సజ్జనార్ పర్యవేక్షణలో, ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో బేగంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ సిగ్నల్, బోయిన్పల్లి జంక్షన్ వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని బేగంపేట్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు.
సర్వేజనా ఫౌండేషన్,కిమ్స్ సన్షైన్ ఆస్పత్రుల సీఈఓ డా. గురవా రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్... మంత్రి పొంగులేటి కొడుకుపై కేసు పెట్టిన ఎస్ఐకి ‘పనిష్మెంట్ ట్రాన్స్ఫర్?
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడిపై కేసు నమోదు చేసిన ఎస్ఐకి “పనిష్మెంట్ ట్రాన్స్ఫర్” విధించడంపై పెద్ద వివాదం మొదలైంది. వేకెన్సీ రిజర్వ్ పేరుతో సీఐ మొహమ్మద్ హబీబుల్లా ఖాన్ను ట్రాన్స్ఫర్ చేయించేందుకు మంత్రి ప్రభావం చూపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏం జరిగింది?మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... అమెరికాకు 20-పాయింట్ల సవరించిన శాంతి ప్రతిపాదన అందజేసిన ఉక్రెయిన్
లండన్ డిసెంబర్ 11 :
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి చర్చలు వేగం పుంజుకుంటున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ వెల్లడించిన వివరాల ప్రకారం, యుద్ధం ముగింపుకు దోహదపడే 20 పాయింట్ల శాంతి ప్రతిపాదనను సవరించి అమెరికాకు అందజేశారు.
ఉక్రెయిన్ అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రతిపాదనలో కొత్త ఆలోచనలు, ముఖ్యంగా ఆక్రమిత... హబ్సిపూర్ గ్రామంలో బిజెపి అభ్యర్థికి ప్రచారం నిర్వహించిన బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గ జగిత్యాల రూరల్ మండల్ హబ్సిపూర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ..
భారతీయ జనతా పార్టీ బలపరిచిన
ఈ... ప్రశాంత వాతావరణంలో మెదటి విడత పోలింగ్ నిర్వహణ పూర్తి *జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*
కోరుట్ల /మెట్పల్లి /మేడిపల్లి డిసెంబర్ 11 ( ప్రజా మంటలు)మొదటి విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
మేడిపల్లి మండల కేంద్రంలోని కొండాపూర్ గ్రామం, భీమారం మండల కేంద్రంలోని కమ్మరిపేట, కోరుట్ల మండలంలోని మెట్... ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 11 (ప్రజా మంటలు)
గ్రామాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఓట్ల... బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకి 9వ షెడ్యూల్ లో చేర్చాలి: జీవన్ రెడ్డి
జగిత్యాల, డిసెంబర్ 11 (ప్రజా మంటలు):బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే, రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం తప్పనిసరి అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరా భవన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన, 50% రిజర్వేషన్ పరిమితిని అధిగమించడానికి ఇదే మార్గమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఆలోచనలతో బలహీన... ముత్తారం సర్పంచ్ గా ఉరడి భారతి జైపాల్ రెడ్డి విజయం
అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తా - ఊరడి భారతి 