మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం -మంత్రి శ్రీధర్ బాబు  

On
మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం -మంత్రి శ్రీధర్ బాబు  

మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు
అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం
-మంత్రి శ్రీధర్ బాబు
 

ఎటు తేల్చుకోలేని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాలమే నిర్ణయిస్తుంది- కార్యకర్తల అభిప్రాయమే ముఖ్యం

-జీవన రెడ్డి

జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలలో ఆందోళన రేపిన ఎమ్మెల్యే సంజయ్ చేరిక

జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :

నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ నాయకునిగా జగిత్యాల ప్రాంత ప్రజలకు సేవలు అందించిన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన రెడ్డి జీవితంలో ఊహించని విధంగా, ఆయనకే తెలియకుండా, ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయనను కాలచి వేసింది. గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ, ఎవరితో పోటీపడి, అధికారంలో లేకున్నా పార్టీని కాపాడుకొన్న తననే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడని బాదపడుతున్న ఎమ్మెల్సీ జీవన రెడ్డి తన భాయిష్యత్ ను ఎటు తేల్చుకో లేకపోతున్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బి ఆర్ ఎస్ పార్టీ నుండి పోటీ చేసి జీవన రెడ్డిపై గెలిచిన ఆరు నెలలకే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం, జీవన రెడ్డికి కనీస సూచన కూడా లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని నిర్ణయించుకొన్న సమయంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు ఆడలూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, విజయరామనరావు లు ఇతర కాంగ్రెస్ నాయకులు వచ్చి, సముదాయించి, సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పి వెళ్లారు.   

 సాయంత్రం జగిత్యాల వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు దాదాపు రెండు గంటల పాటు ఎమ్మెల్సీ జీవన రెడ్డితో సంప్రదింపులు జరిపి, తొందరపాటులో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, పార్టీ అధికారంలో ఉందని, ముందు ముందు తగిన ప్రాధాన్యత ఇచ్చేట్లుగా మాట్లాడుదామని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు తెలుస్తుంది.

జీవన రెడ్డిని కలిసిన తరువాత బయటకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు విలేఖరులతో మాట్లాడుతూ, జీవన రెడ్డి పార్టీకి పెద్ద దిక్కు. నాలబై ఏళ్లుగా పార్టీని ఈప్రాంతంలో బలంగా ఉంచిన నాయకుడు. ఆయనకు తెలియకుండా జరిగిన విషయంలో అధిష్టాన వర్గానికి, పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి దృష్టికి తీసుకెళ్ళి, సమస్య పరిష్కారం అయ్యేట్లు చేస్తామని చెప్పారు. ఆయనే పెద్ద దిక్కు అయితే ఆయన అడుగుజాడల్లో నడిచే మేము ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేమని చెప్పారు. సమాచారలోపం వల్ల ఏర్పడ్డ మనస్తాపాన్ని తగ్గించడానికి, ఆయనతో మాట్లాడడానికి వచ్చినట్లు తెలిపారు.

పార్టీ ఆదేశం మేర గతంలో 2006, 2008 లో రెండుసార్లు బి ఆర్ ఎస్ నాయకుడు కాల్వకుంతల చంద్రశేఖర రావుపై కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడమే కాకుండా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ స్థానం నుండి పోటీ చేసి పార్టీకి అండగా ఉన్న జీవన రెడ్డి, రాష్ట్రంలోనే పెద్దదిక్కుగా ఉన్నారని, ఆయన అసంతృప్తి తొలగించడానికి కృషి చేస్తామని తెలిపారు.

 మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళిన తరువాత, జీవన రెడ్డి మాట్లాడుతూ, మూడుసార్లు పోటీ చేసిన వ్యక్తిని, ఎమ్మెల్యేలు అవసరమని భావించి, ఎలాంటి సమాచారం లేకుండా చేర్చుకోవడంతో నేనే కాదు, జగిత్యాల ప్రాంత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఎంత అవసరం అయినా, స్థానికి పార్టీ నాయకులను, కార్యకర్తలను కాదని, వారికి వ్యతిరేకంగా అధిష్టాన వర్గం ఎక్కడ కూడా వ్యవహరించడం సరికాదని అన్నారు.

నాలబై ఏళ్లుగా ఎన్నో కష్టలఉ భరించి, ఇక్కడ పార్టీని బలంగా నిలబెట్టిన నా భవిష్యత్ కార్యకర్తలు, నాయకులు  నిర్ణయిస్తుందని, కాలాన్ని మించినది ఏదిలేదని, అన్నిటినీ కాలమే పరిష్కారం చూపుతుందని, అందరితో కలిసి నడవడమే నా అభిమమతమని జీవన రెడ్డి తెలిపారు. తన రాజకీయ భవిష్యత్ కూడా కాలమే నిర్ణయిస్తుందని నిర్వేదంతో, ఆవేధనతో తెలిపారు.

------

Tags
Join WhatsApp

More News...

శంకరాచార్యులు – మహంత్ యోగి వివాదం : హోదా, ధర్మం, క్షమాపణ ప్రశ్న

శంకరాచార్యులు – మహంత్ యోగి వివాదం : హోదా, ధర్మం, క్షమాపణ ప్రశ్న (ప్రత్యేక కథనం) ఉత్తరప్రదేశ్‌లో జ్యోతిర్పీఠ శంకరాచార్యులు మరియు సీఎం యోగి ఆదిత్యనాథ్ మధ్య ఇటీవల చోటుచేసుకున్న వాదనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ వివాదం కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా, హిందూ ధర్మంలో ఉన్న శంకరాచార్యుల హోదా, మహంత్ స్థానం, ధార్మిక మర్యాదలు వంటి అంశాలను మళ్లీ ప్రశ్నార్థకంగా నిలబెట్టింది. శంకరాచార్యులు – హిందూ ధర్మంలో...
Read More...

25వ వార్డ్ కు చెందిన పలువురు బిజెపిలో చేరిక

25వ వార్డ్ కు చెందిన పలువురు బిజెపిలో చేరిక జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు)పట్టణ 25వ వార్డ్ కి చెందిన గుండేటి సాయి  మరియు 25 వార్డ్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ  అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి భారతీయ జనతా పార్టీ  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన...
Read More...

డిప్యూటీ సీఎం ను కలిసిన బీసీ నేతలు 

డిప్యూటీ సీఎం ను కలిసిన బీసీ నేతలు       ధర్మపురి జనవరి 21 ( ప్రజా మంటలు)పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కు ధర్మపురి కి విచ్చేసినతెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ  కలసి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం వినతి పత్రం అందించారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42...
Read More...

శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో పూజలు చేసిన డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్

శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో పూజలు చేసిన డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ బుగ్గారం జనవరి 21 (ప్రజా మంటలు)  శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా బుగ్గారం మండలంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి ఈ కార్యక్రమంలో బుగ్గారం బిజెపి మండల అధ్యక్షులు శ్రీధర్, రాష్ట్ర పద్మశాలి మహిళా ఉపాధ్యక్షురాలు సింగం...
Read More...

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి  జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి   జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.    జగిత్యాల జనవరి 21 ( ప్రజా మంటలు)మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని  పునరుద్దరించాలని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు.   జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామంలో ఉపాధి హామీ వర్కర్స్ తో  విజయలక్ష్మి  మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ...
Read More...
National  Comment  International  

ట్రంప్ ప్రతిపాదించిన “Board of Peace” – ప్రపంచ నాయకులకు ఆహ్వానం,

ట్రంప్ ప్రతిపాదించిన “Board of Peace” – ప్రపంచ నాయకులకు ఆహ్వానం, (ప్రత్యేక కథనం) యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తాజా లేఖలో ప్రపంచ దేశాధినేతలను “Board of Peace” (ప్రపంచ శాంతి బోర్డు) అనే కొత్త అంతర్జాతీయ శాంతి సంస్థలో భాగస్వాములుగా చేరమని ఆహ్వానించారు. ఈ బోర్డు గాజా సహారా వివాదానికి సమాధానాలు కనుగొనడమే ధ్యేయంగా ప్రారంభమౌతుందన్నట్లు వెల్లడించారు, తదుపరి ఇతర అంతర్జాతీయ సంఘర్షణలకు...
Read More...
State News 

 అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా శుద్ధ నీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది 

 అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా శుద్ధ నీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది  ధర్మపురి జనవరి 21 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, అన్ని వర్గాల సంక్షేమంతో పాటు శుద్ధ త్రాగునీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని...
Read More...

రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు జ్యోతి హై స్కూల్ – ఐఐటీ అకాడమీ విద్యార్థులు

రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు జ్యోతి హై స్కూల్ – ఐఐటీ అకాడమీ విద్యార్థులు      జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు)పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన  8 మంది  స్కౌట్స్  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడే రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌కు  ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వకారణంగా నిలిచింది ఈ రాష్ట్రస్థాయి పరేడ్‌కు సంబంధించిన శిక్షణ మరియు రిహార్సల్స్...
Read More...
National  Crime 

ప్రయాగ్‌రాజ్‌లో  చెరువులో పడిన శిక్షణ విమానం

 ప్రయాగ్‌రాజ్‌లో  చెరువులో పడిన శిక్షణ విమానం ప్రయాగ్‌రాజ్ జనవరి 21(ప్రజా మంటలు): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగర శివారులో శిక్షణ విమానం కూలిపోయింది. నగరానికి సమీపంలోని ఓ చెరువులో విమానం పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమానం శిక్షణ ప్రయాణంలో భాగంగానే ప్రమాదానికి గురైనట్లు...
Read More...

టీ20 ప్రపంచకప్‌లో ఆడేది లేదంటున్న బంగ్లాదేశ్

టీ20 ప్రపంచకప్‌లో ఆడేది లేదంటున్న బంగ్లాదేశ్ ఢిల్లీ / ఢాకా జనవరి 21(ప్రజా మంటలు): రానున్న టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలలో ప్రారంభం కానుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు ‘సీ’ గ్రూప్‌లో చోటు దక్కించుకుంది. బంగ్లాదేశ్ ఆడాల్సిన లీగ్ మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబైలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, ...
Read More...
National  Crime 

అక్రమాలు బయటపెట్టిందన్న కక్షతో ఎల్ఐసీ మహిళా మేనేజర్ హత్య

అక్రమాలు బయటపెట్టిందన్న కక్షతో ఎల్ఐసీ మహిళా మేనేజర్ హత్య మదురై జనవరి 21 (ప్రజా మంటలు):మదురైలోని ఎల్ఐసీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం వెనుక దారుణ హత్య బయటపడింది. కార్యాలయంలో అక్రమాలను గుర్తించి ప్రశ్నించినందుకు సీనియర్ మహిళా మేనేజర్ కల్యాణి నంబి (55)పై పెట్రోల్ పోసి తగలబెట్టి హత్య చేసిన సహాయ పరిపాలన అధికారి రామ్ (45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును ప్రమాదంగా...
Read More...

ఎడప్పాడి పేరు చెప్పేందుకు నిరాకరించిన టీటీవీ దినకరన్

ఎడప్పాడి పేరు చెప్పేందుకు నిరాకరించిన టీటీవీ దినకరన్ చెన్నై జనవరి 21 (ప్రజా మంటలు): అన్నాడీఎంకే–బీజేపీ కూటమిలో చేరినప్పటికీ, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి పేరును చెప్పేందుకు కూడా ఏఎంఎంకే నేత టిటివి దినకరన్ నిరాకరించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్‌డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు స్పందించిన దినకరన్, “ఎన్‌డీఏ సీఎం అభ్యర్థి ఎవరో అందరికీ తెలుసు” అని...
Read More...