మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం -మంత్రి శ్రీధర్ బాబు  

On
మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం -మంత్రి శ్రీధర్ బాబు  

మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు
అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం
-మంత్రి శ్రీధర్ బాబు
 

ఎటు తేల్చుకోలేని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాలమే నిర్ణయిస్తుంది- కార్యకర్తల అభిప్రాయమే ముఖ్యం

-జీవన రెడ్డి

జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలలో ఆందోళన రేపిన ఎమ్మెల్యే సంజయ్ చేరిక

జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :

నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ నాయకునిగా జగిత్యాల ప్రాంత ప్రజలకు సేవలు అందించిన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన రెడ్డి జీవితంలో ఊహించని విధంగా, ఆయనకే తెలియకుండా, ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయనను కాలచి వేసింది. గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ, ఎవరితో పోటీపడి, అధికారంలో లేకున్నా పార్టీని కాపాడుకొన్న తననే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడని బాదపడుతున్న ఎమ్మెల్సీ జీవన రెడ్డి తన భాయిష్యత్ ను ఎటు తేల్చుకో లేకపోతున్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బి ఆర్ ఎస్ పార్టీ నుండి పోటీ చేసి జీవన రెడ్డిపై గెలిచిన ఆరు నెలలకే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం, జీవన రెడ్డికి కనీస సూచన కూడా లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని నిర్ణయించుకొన్న సమయంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు ఆడలూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, విజయరామనరావు లు ఇతర కాంగ్రెస్ నాయకులు వచ్చి, సముదాయించి, సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పి వెళ్లారు.   

 సాయంత్రం జగిత్యాల వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు దాదాపు రెండు గంటల పాటు ఎమ్మెల్సీ జీవన రెడ్డితో సంప్రదింపులు జరిపి, తొందరపాటులో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, పార్టీ అధికారంలో ఉందని, ముందు ముందు తగిన ప్రాధాన్యత ఇచ్చేట్లుగా మాట్లాడుదామని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు తెలుస్తుంది.

జీవన రెడ్డిని కలిసిన తరువాత బయటకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు విలేఖరులతో మాట్లాడుతూ, జీవన రెడ్డి పార్టీకి పెద్ద దిక్కు. నాలబై ఏళ్లుగా పార్టీని ఈప్రాంతంలో బలంగా ఉంచిన నాయకుడు. ఆయనకు తెలియకుండా జరిగిన విషయంలో అధిష్టాన వర్గానికి, పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి దృష్టికి తీసుకెళ్ళి, సమస్య పరిష్కారం అయ్యేట్లు చేస్తామని చెప్పారు. ఆయనే పెద్ద దిక్కు అయితే ఆయన అడుగుజాడల్లో నడిచే మేము ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేమని చెప్పారు. సమాచారలోపం వల్ల ఏర్పడ్డ మనస్తాపాన్ని తగ్గించడానికి, ఆయనతో మాట్లాడడానికి వచ్చినట్లు తెలిపారు.

పార్టీ ఆదేశం మేర గతంలో 2006, 2008 లో రెండుసార్లు బి ఆర్ ఎస్ నాయకుడు కాల్వకుంతల చంద్రశేఖర రావుపై కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడమే కాకుండా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ స్థానం నుండి పోటీ చేసి పార్టీకి అండగా ఉన్న జీవన రెడ్డి, రాష్ట్రంలోనే పెద్దదిక్కుగా ఉన్నారని, ఆయన అసంతృప్తి తొలగించడానికి కృషి చేస్తామని తెలిపారు.

 మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళిన తరువాత, జీవన రెడ్డి మాట్లాడుతూ, మూడుసార్లు పోటీ చేసిన వ్యక్తిని, ఎమ్మెల్యేలు అవసరమని భావించి, ఎలాంటి సమాచారం లేకుండా చేర్చుకోవడంతో నేనే కాదు, జగిత్యాల ప్రాంత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఎంత అవసరం అయినా, స్థానికి పార్టీ నాయకులను, కార్యకర్తలను కాదని, వారికి వ్యతిరేకంగా అధిష్టాన వర్గం ఎక్కడ కూడా వ్యవహరించడం సరికాదని అన్నారు.

నాలబై ఏళ్లుగా ఎన్నో కష్టలఉ భరించి, ఇక్కడ పార్టీని బలంగా నిలబెట్టిన నా భవిష్యత్ కార్యకర్తలు, నాయకులు  నిర్ణయిస్తుందని, కాలాన్ని మించినది ఏదిలేదని, అన్నిటినీ కాలమే పరిష్కారం చూపుతుందని, అందరితో కలిసి నడవడమే నా అభిమమతమని జీవన రెడ్డి తెలిపారు. తన రాజకీయ భవిష్యత్ కూడా కాలమే నిర్ణయిస్తుందని నిర్వేదంతో, ఆవేధనతో తెలిపారు.

------

Tags
Join WhatsApp

More News...

National  International   State News 

ఢిల్లీ విమానాశ్రయంలో  ATC సిస్టమ్ (Air Traffic Control System) ఫెయిల్యూర్ – సైబర్ దాడి అనుమానాలు

ఢిల్లీ విమానాశ్రయంలో  ATC సిస్టమ్ (Air Traffic Control System) ఫెయిల్యూర్ – సైబర్ దాడి అనుమానాలు 400 లకు వందలకు పైగా విమాన రాకపోకలు ఆలస్యం, కొన్ని రద్దు. ఇప్పటికీ ఇంకా సాధారణ స్థితికి రాని డిల్లీ విమానరాకపోకలు హైదరాబాద్, నవంబర్ 07, ప్రజా మంటలు: దేశ రాజధాని ఢిల్లీలోని ఇంద్రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Indira Gandhi International Airport) ఈ రోజు మధ్యాహ్నం భారీ సాంకేతిక లోపం (Technical Glitch) సంభవించింది....
Read More...
Crime  State News 

చేవెళ్ల బస్సు ప్రమాదం బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత

చేవెళ్ల బస్సు ప్రమాదం బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత – బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, నవంబర్ 07  (ప్రజా మంటలు): చేవెళ్ల వద్ద ఇటీవల జరిగిన భయంకర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయి ప్రియ, నందిని, తనూష కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత...
Read More...
Local News  State News 

హైదరాబాద్‌లో ప్రారంభమైన జాతీయ గిరిజన ఉత్సవం  ఆది బజార్–2025’

హైదరాబాద్‌లో ప్రారంభమైన జాతీయ గిరిజన ఉత్సవం  ఆది బజార్–2025’ గిరిజన కళాకారులకు మార్కెట్ వేదికను అందిస్తోంది ఆది బజార్‌: దివ్య దేవరాజన్ హైదరాబాద్‌, నవంబర్‌ 7 ( ప్రజా మంటలు): హైటెక్‌ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్‌లో జాతీయ గిరిజన ఉత్సవం ‘ఆది బజార్–2025’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సీఈవో దివ్య దేవరాజన్,...
Read More...
Local News  State News 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుల ఉమ ప్రచారం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుల ఉమ ప్రచారం హైదరాబాద్, నవంబర్ 07 – (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవ్ఉఎండ్మ్మఆర్డి రెడ్డితో కలిసి, కరీంనగర్ జిల్లా మాజీ జిల్లాపరిషద్ చైర్‌పర్సన్ తుల ఉమ ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు....
Read More...
Local News 

ప్రజా సంక్షేమ,అభివృద్ది పనులే కాంగ్రెస్ గెలుపుకు బాటలు

ప్రజా సంక్షేమ,అభివృద్ది పనులే కాంగ్రెస్ గెలుపుకు బాటలు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవితనస్రీన్ బేగంతో కలసి జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం సికింద్రాబాద్, నవంబర్ 07 ( ప్రజామంటలు): రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయని జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పి.కవిత అన్నారు. మహిళా కాంగ్రెస్ ఏ–...
Read More...
Local News 

అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ..

అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ.. బీజేపీ  రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి... సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):    భారత జాతీయ ఎన్నికల కమిషనర్ గారిని ఉద్దేశించి మీరు ప్రశాంతంగా ఉద్యోగ విరమణ చేయలేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో బయోత్పాతాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ రాజ్యాంగాన్ని...
Read More...

మహాభారత నవాహ్నిక ప్రవచనా జ్ఞాన యజ్ఞం కరపత్ర ఆవిష్కరణ

మహాభారత నవాహ్నిక ప్రవచనా జ్ఞాన యజ్ఞం కరపత్ర ఆవిష్కరణ జగిత్యాల నవంబర్ 7 ( ప్రజా మంటలు)జగదాలయ ఆధ్యాత్మిక బృందం వారి ఆధ్వర్యంలో మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం డిసెంబర్ 6_ 2025 శనివారం నుండి డిసెంబర్ 14 _2025 ఆదివారం మార్గశీర్ష మాసంలో శృంగేరి శారదా పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్...
Read More...

ప్రభుత్వ చర్చలు సఫలం – ప్రైవేట్ కళాశాల బంద్ విరమణ

ప్రభుత్వ చర్చలు సఫలం – ప్రైవేట్ కళాశాల బంద్ విరమణ హైదరాబాద్, నవంబర్ 07 – ప్రజా మంటలు: ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల ఫలితంగా కళాశాల యాజమాన్యాలు తమ బంద్ మరియు నిరసన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం...
Read More...
Local News 

వందేమాతరం 150 ఏళ్ల జాతీయ ఉత్సవాల్లో పీఐబీ 

వందేమాతరం 150 ఏళ్ల జాతీయ ఉత్సవాల్లో పీఐబీ  సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):  దేశభక్తి, ఐక్యత ప్రతీకగా నిలిచిన జాతీయ గేయం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పీఐబీ హైదరాబాద్‌ ఘనంగా నిర్వహించింది. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ), డీపీడీ యూనిట్లతో కలిసి పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది...
Read More...
Local News 

ప్రభుత్వ ఉద్యోగులకు 44% ఫిట్‌మెంట్ అమలు చేయాలి - ఎఐటియుసి నేతల డిమాండ్ 

ప్రభుత్వ ఉద్యోగులకు 44% ఫిట్‌మెంట్ అమలు చేయాలి - ఎఐటియుసి నేతల డిమాండ్  సికింద్రాబాద్, నవంబర్07 (ప్రజామంటలు)::రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణలు తక్షణం అమలు చేయాలని ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.మూర్తి డిమాండ్‌ చేశారు.శుక్రవారం ముషీరాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాలలో హేమలత అధ్యక్షతన జరిగిన యూనియన్‌ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ— ప్రభుత్వ...
Read More...
Local News 

సెయింట్ ప్రాన్సిస్  గర్ల్స్ హైస్కూల్ లో వందేమాతరం ఉత్సవాలు

సెయింట్ ప్రాన్సిస్  గర్ల్స్ హైస్కూల్ లో వందేమాతరం ఉత్సవాలు సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజామంటలు): సికింద్రాబాద్ సెయింట్ ప్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్ లో శుక్రవారం 150 వసంతాల వందేమాతరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బాన్ని పురస్కరించుకొని స్కూల్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్సీసీ కమాండ్ ఆఫీసర్ కల్నల్ ఎంఎస్.కుమార్ ను స్కూల్ హెడ్మాస్టర్ సిస్టర్ గ్రేసీ, ఎన్సీసీ కోఆర్డినేటర్ ఏ.క్రిస్టినా నిర్మల, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు...
Read More...
Local News  Crime  State News 

TV5 CEO మూర్తికి హైకోర్టులో ఎదురుదెబ్బ

TV5 CEO మూర్తికి హైకోర్టులో ఎదురుదెబ్బ TV5 CEO D.H.V.S.S.N. Murthy పై సినీనటుడు ధర్మ మహేష్ ఫిర్యాదుతో కూకట్‌పల్లి పోలీసులు ఎక్స్టోర్షన్, బ్లాక్‌మెయిల్, ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. హైకోర్టు మూర్తి క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసి విచారణ కొనసాగించమని ఆదేశించింది.
Read More...