మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం -మంత్రి శ్రీధర్ బాబు
మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు
అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం
-మంత్రి శ్రీధర్ బాబు
ఎటు తేల్చుకోలేని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కాలమే నిర్ణయిస్తుంది- కార్యకర్తల అభిప్రాయమే ముఖ్యం
-జీవన రెడ్డి
జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలలో ఆందోళన రేపిన ఎమ్మెల్యే సంజయ్ చేరిక
జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :
నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ నాయకునిగా జగిత్యాల ప్రాంత ప్రజలకు సేవలు అందించిన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన రెడ్డి జీవితంలో ఊహించని విధంగా, ఆయనకే తెలియకుండా, ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయనను కాలచి వేసింది. గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ, ఎవరితో పోటీపడి, అధికారంలో లేకున్నా పార్టీని కాపాడుకొన్న తననే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడని బాదపడుతున్న ఎమ్మెల్సీ జీవన రెడ్డి తన భాయిష్యత్ ను ఎటు తేల్చుకో లేకపోతున్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బి ఆర్ ఎస్ పార్టీ నుండి పోటీ చేసి జీవన రెడ్డిపై గెలిచిన ఆరు నెలలకే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం, జీవన రెడ్డికి కనీస సూచన కూడా లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని నిర్ణయించుకొన్న సమయంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు ఆడలూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, విజయరామనరావు లు ఇతర కాంగ్రెస్ నాయకులు వచ్చి, సముదాయించి, సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పి వెళ్లారు.
సాయంత్రం జగిత్యాల వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు దాదాపు రెండు గంటల పాటు ఎమ్మెల్సీ జీవన రెడ్డితో సంప్రదింపులు జరిపి, తొందరపాటులో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, పార్టీ అధికారంలో ఉందని, ముందు ముందు తగిన ప్రాధాన్యత ఇచ్చేట్లుగా మాట్లాడుదామని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు తెలుస్తుంది.
జీవన రెడ్డిని కలిసిన తరువాత బయటకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు విలేఖరులతో మాట్లాడుతూ, జీవన రెడ్డి పార్టీకి పెద్ద దిక్కు. నాలబై ఏళ్లుగా పార్టీని ఈప్రాంతంలో బలంగా ఉంచిన నాయకుడు. ఆయనకు తెలియకుండా జరిగిన విషయంలో అధిష్టాన వర్గానికి, పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి దృష్టికి తీసుకెళ్ళి, సమస్య పరిష్కారం అయ్యేట్లు చేస్తామని చెప్పారు. ఆయనే పెద్ద దిక్కు అయితే ఆయన అడుగుజాడల్లో నడిచే మేము ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేమని చెప్పారు. సమాచారలోపం వల్ల ఏర్పడ్డ మనస్తాపాన్ని తగ్గించడానికి, ఆయనతో మాట్లాడడానికి వచ్చినట్లు తెలిపారు.
పార్టీ ఆదేశం మేర గతంలో 2006, 2008 లో రెండుసార్లు బి ఆర్ ఎస్ నాయకుడు కాల్వకుంతల చంద్రశేఖర రావుపై కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడమే కాకుండా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ స్థానం నుండి పోటీ చేసి పార్టీకి అండగా ఉన్న జీవన రెడ్డి, రాష్ట్రంలోనే పెద్దదిక్కుగా ఉన్నారని, ఆయన అసంతృప్తి తొలగించడానికి కృషి చేస్తామని తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళిన తరువాత, జీవన రెడ్డి మాట్లాడుతూ, మూడుసార్లు పోటీ చేసిన వ్యక్తిని, ఎమ్మెల్యేలు అవసరమని భావించి, ఎలాంటి సమాచారం లేకుండా చేర్చుకోవడంతో నేనే కాదు, జగిత్యాల ప్రాంత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఎంత అవసరం అయినా, స్థానికి పార్టీ నాయకులను, కార్యకర్తలను కాదని, వారికి వ్యతిరేకంగా అధిష్టాన వర్గం ఎక్కడ కూడా వ్యవహరించడం సరికాదని అన్నారు.
నాలబై ఏళ్లుగా ఎన్నో కష్టలఉ భరించి, ఇక్కడ పార్టీని బలంగా నిలబెట్టిన నా భవిష్యత్ కార్యకర్తలు, నాయకులు నిర్ణయిస్తుందని, కాలాన్ని మించినది ఏదిలేదని, అన్నిటినీ కాలమే పరిష్కారం చూపుతుందని, అందరితో కలిసి నడవడమే నా అభిమమతమని జీవన రెడ్డి తెలిపారు. తన రాజకీయ భవిష్యత్ కూడా కాలమే నిర్ణయిస్తుందని నిర్వేదంతో, ఆవేధనతో తెలిపారు.
------
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాలలో 120 గ్రాముల గంజాయి స్వాధీనం.. నిందితుడు అరెస్ట్
జగిత్యాల, జూన్ 20 (ప్రజా మంటలు):జగిత్యాల రూరల్ మండలం చల్గల్ శివార్లలో గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన దగ్గు రాజేష్ వద్ద నుంచి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, అనంతరం... నకిలీ ట్రక్ చిట్టీలతో రూ.91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం :
ఆరుగురు నిందితుల అరెస్ట్.. రూ.14.16 లక్షల నగదు స్వాధీనం, రూ.46.21 లక్షల ఖాతాలు ఫ్రీజ్
సిరిసిల్ల, జూన్ 20 (ప్రజా మంటలు):
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి సుమారు రూ.91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా... వీధికుక్కల దాడి, నిరాశ్రయ వృద్ధురాలి దుస్థితిపై మానవ హక్కుల కమిషన్ సుమోటో విచారణ
హైదరాబాద్, జూన్ 20 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) న్యాయ సభ్యురాలు శ్రీమతి శివడి ప్రవీణ రెండు వార్తా కథనాలను స్వప్రేరితంగా (సుమోటో) విచారణకు స్వీకరించారు. సాక్షి దినపత్రికలో జూన్ 20న ప్రచురితమైన వార్తల ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు.హెచ్ఆర్సీ నెం.2468/2026 కింద, వరంగల్ నగరంలోని శాలినీనగర్లో వీధికుక్క దాడిలో... సాహితీవేత్త ఎంవీ నరసింహారెడ్డికి ఘనంగా నివాళులు
జగిత్యాల జూన్ 19 ( ప్రజా మంటలు) సాహితీవేత్త, విద్యావేత్త రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు ఎంవి నరసింహారెడ్డి సంస్కరణ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని పద్మ నాయక మండపంలో శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి శిష్య బృందం, విద్యాసంస్థల ఉపాధ్యాయ బృందం, అధ్యాపకులు బంధువులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా... సింగరేణి ప్రాంత వనరులు, ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ నేతలు: కవిత
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఎదుగుతుంది - కల్వకుంట్ల కవిత
పెద్దపల్లి, జూన్ 19 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి ప్రాంత ప్రజలు,... మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలి :చిన్నారెడ్డి
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డిహైదరాబాద్, జూన్ 17 (ప్రజా మంటలు):
పురుషులతో సమానంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మార్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో నిర్వహించిన ‘ఉమెన్ ఎంపవర్మెంట్... రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభం నేడు
హైదరాబాద్, జూన్ 17 (ప్రజా మంటలు):
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి A. Revanth Reddy ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS)ను నేడు ప్రారంభించనున్నారు. విద్యా రంగంలో సంస్కరణలకు నాంది పలుకుతున్న ఈ పాఠశాల సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంది.
నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ... జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి
జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)యావర్ రోడ్డు పై అక్రమ నిర్మాణాలు తొలగించండి
జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో జీవన్ రెడ్డి పిర్యాదు
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అవలంబిస్తున్న వైఖరి చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో... బదిలీ పై వెళుతున్న సహాయ సంచాలకులు డా.బి.నరేష్ ను సన్మానించిన టిఎన్జీఓ లు
జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లా పశు సంవర్థక శాఖ లో సహాయ సంచాలకులు గా పని చేసిన డా.బోనగిరి నరేష్ ఇటీవలే బదిలీ పై కరీంనగర్ వెళ్లిన సందర్బంగా జిల్లా పశు వైద్యాధికారి డా.బి.ప్రకాశ్ అధ్యక్షతన నిర్వహించిన వీడ్కోలు సన్మాన కార్యక్రమం లో టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఎన్జీఓ... జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లాను వైద్య ఆరోగ్య రంగాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి, పేద వర్గాల వారికి ఆధునిక వైద్య సౌకర్యాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు.
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో... సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత
మంచిర్యాల/బెల్లంపల్లి/ఆసిఫాబాద్, జూన్ 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన ఉత్తర తెలంగాణ పర్యటనలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, కేస్లాపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యలు, ఆదివాసీ హక్కులు, యువత ఉపాధి, విద్యా-వైద్య రంగాలపై పార్టీ వైఖరిని వెల్లడించారు.
మంచిర్యాలలో... తహసీల్దార్ సంతకం ఫోర్జరీ ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్
జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు):
(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)
జగిత్యాల జిల్లా మెట్పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్లను మెట్పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి... 