మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం -మంత్రి శ్రీధర్ బాబు
మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు
అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం
-మంత్రి శ్రీధర్ బాబు
ఎటు తేల్చుకోలేని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కాలమే నిర్ణయిస్తుంది- కార్యకర్తల అభిప్రాయమే ముఖ్యం
-జీవన రెడ్డి
జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలలో ఆందోళన రేపిన ఎమ్మెల్యే సంజయ్ చేరిక
జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :
నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ నాయకునిగా జగిత్యాల ప్రాంత ప్రజలకు సేవలు అందించిన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన రెడ్డి జీవితంలో ఊహించని విధంగా, ఆయనకే తెలియకుండా, ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయనను కాలచి వేసింది. గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ, ఎవరితో పోటీపడి, అధికారంలో లేకున్నా పార్టీని కాపాడుకొన్న తననే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడని బాదపడుతున్న ఎమ్మెల్సీ జీవన రెడ్డి తన భాయిష్యత్ ను ఎటు తేల్చుకో లేకపోతున్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బి ఆర్ ఎస్ పార్టీ నుండి పోటీ చేసి జీవన రెడ్డిపై గెలిచిన ఆరు నెలలకే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం, జీవన రెడ్డికి కనీస సూచన కూడా లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని నిర్ణయించుకొన్న సమయంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు ఆడలూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, విజయరామనరావు లు ఇతర కాంగ్రెస్ నాయకులు వచ్చి, సముదాయించి, సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పి వెళ్లారు.
సాయంత్రం జగిత్యాల వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు దాదాపు రెండు గంటల పాటు ఎమ్మెల్సీ జీవన రెడ్డితో సంప్రదింపులు జరిపి, తొందరపాటులో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, పార్టీ అధికారంలో ఉందని, ముందు ముందు తగిన ప్రాధాన్యత ఇచ్చేట్లుగా మాట్లాడుదామని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు తెలుస్తుంది.
జీవన రెడ్డిని కలిసిన తరువాత బయటకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు విలేఖరులతో మాట్లాడుతూ, జీవన రెడ్డి పార్టీకి పెద్ద దిక్కు. నాలబై ఏళ్లుగా పార్టీని ఈప్రాంతంలో బలంగా ఉంచిన నాయకుడు. ఆయనకు తెలియకుండా జరిగిన విషయంలో అధిష్టాన వర్గానికి, పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి దృష్టికి తీసుకెళ్ళి, సమస్య పరిష్కారం అయ్యేట్లు చేస్తామని చెప్పారు. ఆయనే పెద్ద దిక్కు అయితే ఆయన అడుగుజాడల్లో నడిచే మేము ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేమని చెప్పారు. సమాచారలోపం వల్ల ఏర్పడ్డ మనస్తాపాన్ని తగ్గించడానికి, ఆయనతో మాట్లాడడానికి వచ్చినట్లు తెలిపారు.
పార్టీ ఆదేశం మేర గతంలో 2006, 2008 లో రెండుసార్లు బి ఆర్ ఎస్ నాయకుడు కాల్వకుంతల చంద్రశేఖర రావుపై కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడమే కాకుండా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ స్థానం నుండి పోటీ చేసి పార్టీకి అండగా ఉన్న జీవన రెడ్డి, రాష్ట్రంలోనే పెద్దదిక్కుగా ఉన్నారని, ఆయన అసంతృప్తి తొలగించడానికి కృషి చేస్తామని తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళిన తరువాత, జీవన రెడ్డి మాట్లాడుతూ, మూడుసార్లు పోటీ చేసిన వ్యక్తిని, ఎమ్మెల్యేలు అవసరమని భావించి, ఎలాంటి సమాచారం లేకుండా చేర్చుకోవడంతో నేనే కాదు, జగిత్యాల ప్రాంత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఎంత అవసరం అయినా, స్థానికి పార్టీ నాయకులను, కార్యకర్తలను కాదని, వారికి వ్యతిరేకంగా అధిష్టాన వర్గం ఎక్కడ కూడా వ్యవహరించడం సరికాదని అన్నారు.
నాలబై ఏళ్లుగా ఎన్నో కష్టలఉ భరించి, ఇక్కడ పార్టీని బలంగా నిలబెట్టిన నా భవిష్యత్ కార్యకర్తలు, నాయకులు నిర్ణయిస్తుందని, కాలాన్ని మించినది ఏదిలేదని, అన్నిటినీ కాలమే పరిష్కారం చూపుతుందని, అందరితో కలిసి నడవడమే నా అభిమమతమని జీవన రెడ్డి తెలిపారు. తన రాజకీయ భవిష్యత్ కూడా కాలమే నిర్ణయిస్తుందని నిర్వేదంతో, ఆవేధనతో తెలిపారు.
------
More News...
<%- node_title %>
<%- node_title %>
సంచర జాతుల వారికి ఆహారం పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 27 ( ప్రజా మంటలు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్కు నివాళులు అర్పించారు. నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతుల కుటుంబాలను గుర్తించి వారికి ఆహారం అందించారు.
దేశాభివృద్ధికి విద్యే ప్రధాన పునాది... జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం : ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల, జనవరి 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్లో గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాలకు రూ.62.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గత అధికారుల నిర్లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ లేక ఇష్టారీతిన నిర్మాణాలు జరిగాయని విమర్శించారు.
అభివృద్ధికి అడ్డంకులు... తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదీ ప్రకటించారు. నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ముఖ్య తేదీలు
నామినేషన్లు: జనవరి 28 నుంచి 30 వరకు
పరిశీలన: జనవరి 31
ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3... బీసీ కులగణన అవసరం - జనగణనపై జాగృతి రౌండ్ టేబుల్
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు)::
ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు నవీన్ ఆచారి తెలిపారు.
బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దేశవ్యాప్తంగా పకడ్బందీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు.
ఒకే కులానికి భిన్న పేర్లు, వలస కులాల సమస్యలపై... గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు : జాగృతి నేత కవిత తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల నుంచి దూరం చేయడానికి ప్రధాన కారణం సంతోష్ రావేనని జాగృతి నేత తీవ్ర ఆరోపణలు చేశారు. గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారిగా వ్యవహరిస్తూ కేసీఆర్ వ్యక్తిగత విషయాల వరకూ సమాచారాన్ని చేరవేసిన వ్యక్తి సంతోష్ రావేనని విమర్శించారు.
కేసీఆర్ ఫార్మ్... చెన్నైలో గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ :సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభం
చెన్నై, జనవరి 27:
తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ మంగళవారం, బుధవారం (జనవరి 27, 28) తేదీల్లో చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్ సెంటర్ లో జరుగుతోంది. ఈ సదస్సును ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.... ఆస్కార్ అవార్డు లకు 10 సినిమాలు పోటీ
–వర్తమానం సంగమంగా మారిన సినిమా వేడుక
ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) ఈసారి కేవలం అవార్డుల వేడుకగా మాత్రమే కాకుండా —👉 సమాజం, రాజకీయాలు, చరిత్ర, మానవ విలువలపై చర్చకు వేదికగా మారింది.
🏆 బెస్ట్ పిక్చర్ విభాగం ఎందుకు ప్రత్యేకం?
ఈ... బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
హైదరాబాద్ / వరంగల్ జనవరి 26, (ప్రజా మంటలు):మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్న ఆయన, పార్టీ మార్పు వెనుక ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. త్వరలో... ఇన్నయ్యకు జాగృతి అండగా ఉంటుంది: జనగాంలో కవిత వ్యాఖ్యలు
జనగాం, జనవరి 26 (ప్రజా మంటలు):
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఎవరూ మాట్లాడని సమయంలోనే ‘దగాపడ్డ తెలంగాణ’ అనే పుస్తకాన్ని ప్రచురించి, 1997లో అదే పేరుతో సభ నిర్వహించి ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఇన్నయ్య అని జాగృతి నేతలు పేర్కొన్నారు. తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో మందిని ఉద్యమంలోకి తీసుకువచ్చారని తెలిపారు.... కల్లెడ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవమని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ మెనేని రవీందర్ రావు అన్నారు.
గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ చేట్కూరి... రాయికల్లో టీయూడబ్ల్యూజే–ఐజేయు నూతన కార్యవర్గం ఎన్నిక
రాయికల్, జనవరి 26 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణంలో టీయూడబ్ల్యూజే–ఐజేయు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షుడు గడ్డల హరికృష్ణ, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడిగా గుర్రాల వేణుగోపాల్, ఉపాధ్యక్షుడిగా వాసరి రవి, ప్రధాన కార్యదర్శిగా నాగమల్ల శ్రీకర్,... 