మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం -మంత్రి శ్రీధర్ బాబు  

On
మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం -మంత్రి శ్రీధర్ బాబు  

మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు
అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం
-మంత్రి శ్రీధర్ బాబు
 

ఎటు తేల్చుకోలేని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాలమే నిర్ణయిస్తుంది- కార్యకర్తల అభిప్రాయమే ముఖ్యం

-జీవన రెడ్డి

జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలలో ఆందోళన రేపిన ఎమ్మెల్యే సంజయ్ చేరిక

జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :

నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ నాయకునిగా జగిత్యాల ప్రాంత ప్రజలకు సేవలు అందించిన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన రెడ్డి జీవితంలో ఊహించని విధంగా, ఆయనకే తెలియకుండా, ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయనను కాలచి వేసింది. గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ, ఎవరితో పోటీపడి, అధికారంలో లేకున్నా పార్టీని కాపాడుకొన్న తననే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడని బాదపడుతున్న ఎమ్మెల్సీ జీవన రెడ్డి తన భాయిష్యత్ ను ఎటు తేల్చుకో లేకపోతున్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బి ఆర్ ఎస్ పార్టీ నుండి పోటీ చేసి జీవన రెడ్డిపై గెలిచిన ఆరు నెలలకే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం, జీవన రెడ్డికి కనీస సూచన కూడా లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని నిర్ణయించుకొన్న సమయంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు ఆడలూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, విజయరామనరావు లు ఇతర కాంగ్రెస్ నాయకులు వచ్చి, సముదాయించి, సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పి వెళ్లారు.   

 సాయంత్రం జగిత్యాల వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు దాదాపు రెండు గంటల పాటు ఎమ్మెల్సీ జీవన రెడ్డితో సంప్రదింపులు జరిపి, తొందరపాటులో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, పార్టీ అధికారంలో ఉందని, ముందు ముందు తగిన ప్రాధాన్యత ఇచ్చేట్లుగా మాట్లాడుదామని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు తెలుస్తుంది.

జీవన రెడ్డిని కలిసిన తరువాత బయటకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు విలేఖరులతో మాట్లాడుతూ, జీవన రెడ్డి పార్టీకి పెద్ద దిక్కు. నాలబై ఏళ్లుగా పార్టీని ఈప్రాంతంలో బలంగా ఉంచిన నాయకుడు. ఆయనకు తెలియకుండా జరిగిన విషయంలో అధిష్టాన వర్గానికి, పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి దృష్టికి తీసుకెళ్ళి, సమస్య పరిష్కారం అయ్యేట్లు చేస్తామని చెప్పారు. ఆయనే పెద్ద దిక్కు అయితే ఆయన అడుగుజాడల్లో నడిచే మేము ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేమని చెప్పారు. సమాచారలోపం వల్ల ఏర్పడ్డ మనస్తాపాన్ని తగ్గించడానికి, ఆయనతో మాట్లాడడానికి వచ్చినట్లు తెలిపారు.

పార్టీ ఆదేశం మేర గతంలో 2006, 2008 లో రెండుసార్లు బి ఆర్ ఎస్ నాయకుడు కాల్వకుంతల చంద్రశేఖర రావుపై కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడమే కాకుండా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ స్థానం నుండి పోటీ చేసి పార్టీకి అండగా ఉన్న జీవన రెడ్డి, రాష్ట్రంలోనే పెద్దదిక్కుగా ఉన్నారని, ఆయన అసంతృప్తి తొలగించడానికి కృషి చేస్తామని తెలిపారు.

 మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళిన తరువాత, జీవన రెడ్డి మాట్లాడుతూ, మూడుసార్లు పోటీ చేసిన వ్యక్తిని, ఎమ్మెల్యేలు అవసరమని భావించి, ఎలాంటి సమాచారం లేకుండా చేర్చుకోవడంతో నేనే కాదు, జగిత్యాల ప్రాంత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఎంత అవసరం అయినా, స్థానికి పార్టీ నాయకులను, కార్యకర్తలను కాదని, వారికి వ్యతిరేకంగా అధిష్టాన వర్గం ఎక్కడ కూడా వ్యవహరించడం సరికాదని అన్నారు.

నాలబై ఏళ్లుగా ఎన్నో కష్టలఉ భరించి, ఇక్కడ పార్టీని బలంగా నిలబెట్టిన నా భవిష్యత్ కార్యకర్తలు, నాయకులు  నిర్ణయిస్తుందని, కాలాన్ని మించినది ఏదిలేదని, అన్నిటినీ కాలమే పరిష్కారం చూపుతుందని, అందరితో కలిసి నడవడమే నా అభిమమతమని జీవన రెడ్డి తెలిపారు. తన రాజకీయ భవిష్యత్ కూడా కాలమే నిర్ణయిస్తుందని నిర్వేదంతో, ఆవేధనతో తెలిపారు.

------

Tags

More News...

Local News 

మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు)ప్రపంచికరణ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్లాస్టిక్ వినియోగం వేగంగా పెరుగుతుంది ఇది భూతం లాంటిదని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. వెదురు దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సందీప్ పాల్గొన్నారు.మేదరి వృత్తిపై ఆదారపడిన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు.నాగరిక ప్రపంచంలో అడవులు వేగంగా...
Read More...
Local News 

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు)మండలం లోని కండ్లపల్లి మోడల్ స్కూల్లో పిజిటి జువాలజీ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న చిలుకూరి శివకృష్ణ తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా సెప్టెంబర్ 5వ  తేదీన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని...
Read More...
Local News 

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్  బి. సత్యప్రసాద్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే  జగిత్యాల జిల్లా కలెక్టర్  బి. సత్యప్రసాద్ జగిత్యాల సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు)గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో దివ్యాంగుల మరియు వయోవృద్ధుల జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులను విస్మరించే కొడుకులకు, కోడళ్ళకు, వారసులకు సీనియర్ సిటిజన్స్ కమిటీ ప్రతినిధులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిలో చైతన్యం కల్పించాలన్నారు....
Read More...
Local News  State News  Crime 

భువనేశ్వర్‌–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్‌ ఆటకట్టు

భువనేశ్వర్‌–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్‌ ఆటకట్టు 8 కోట్ల విలువైన 16 టన్నుల గంజాయి స్వాధీనం  కింద్రాబాద్, సెప్టెంబర్18 (ప్రజామంటలు): , సికింద్రాబాద్‌ రైల్వే పోలీసు(జీఆర్పీ) రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 16.166 కిలోల పొడి గంజాయి (విలువ రూ.8,08,300/-)ను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈకేసులో వడాలా ఈస్ట్‌, అంటాప్‌హిల్‌, ముంబయి, మహారాష్ట్ర...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్‌ క్యాంపు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్‌ క్యాంపు సికింద్రాబాద్,సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు): భారత ప్రభుత్వ ఫ్యామిలీ ప్లానింగ్‌ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ ఇందు గ్రేవాల్‌ గురువారం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పీడియాట్రిక్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పీడియాట్రిక్‌ ఆరోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ శిబిరంలో చిన్నారులకు ఉచిత వైద్య...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలి పనులు సకాలంలో పూర్తిచేసి బిల్లులు పొందాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్   ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో గురువారం రోజున ఇందిరమ్మ ఇండ్లు, అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్ వంటగది నిర్మాణం...
Read More...
Local News 

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు -  స్పందించిన ముల్కనూర్ పోలీస్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు -  స్పందించిన ముల్కనూర్ పోలీస్ జెసిబి సహాయంతో చెట్ల పొదలను తొలగింపు
Read More...
Local News 

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష  ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం  ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ ధర్మపురి సెప్టెంబర్ 17(ప్రజా మంటలు) ధర్మపురిలో పలు ప్రాంతాలను పరిశీలించిన దేవదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ 2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దేవదాయ కమిషనర్ శైలజ రామయ్యార్ అధికారులను ఆదేశించారు.  ఈ సందర్బంగా ధర్మపురి పట్టణానికి విచ్చేసిన దేవదాయ కమిషనర్...
Read More...
Local News  State News 

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి (రామ కిష్టయ్య సంగన భట్ల - 9440595494) ధర్మపురి సెప్టెంబర్ 15: 2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను కుంభ మేళా తరహాలో నిర్వహించాలని, అందుకు, వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...
Read More...
Local News 

మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా 

మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా  (రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494) సౌమ్య బొజ్జా ‘మిసెస్ చికాగో యూనివర్స్ 2026’ కిరీటాన్ని సొంతం చేసుకుని తెలుగు ప్రజలకు గర్వకారణమయ్యారు. అమెరికా న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ వేదికగా సెప్టెంబర్ 12, 2025న నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీలో ఆమె విజయం సాధించడం విశేషం. చికాగోలో...
Read More...
Local News  State News 

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్ న్యూఢిల్లీ సెప్టెంబర్ 17: చాలా రాష్ట్రాల్లోని సగం కంటే ఎక్కువ మంది ఓటర్లు SIRలో ఎటువంటి పత్రాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చునని EC అధికారులు తెలిపారు.చాలా రాష్ట్రాలు 2002 మరియు 2004 మధ్య ఓటర్ల జాబితా యొక్క చివరి స్పెషల్ ఇంటెన్సివ్ సవరణను కలిగి ఉన్నాయని వారు తెలిపారు.ఆ సంవత్సరం తదుపరి SIR కోసం...
Read More...
Local News 

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ  జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్   జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు) జిల్లా సమీకృత భవన సముదాయం లో శిల్పకళ, వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా బిసి కమిషన్ చైర్మన్  జి. నిరంజన్,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం...
Read More...