ప్రతి పిర్యాదు పట్ల స్పందిస్తాం: గంజాయి రవాణా, విక్రయాలపై పూర్తిస్థాయిలో నిఘా జిల్లా ఎస్పి అశోక్ కుమార్
ప్రతి పిర్యాదు పట్ల స్పందిస్తాం:శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు గంజాయి రవాణా, విక్రయాలపై పూర్తిస్థాయిలో నిఘా
జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల జూన్ 21( ప్రజా మంటలు )
జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యo అని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ అన్నారు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎస్పి గారు మాట్లాడుతూ... జిల్లా పరిధిలోని సామ్యాసుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పావు , విద్వేషాలను రెచ్చగోట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము అన్నారు. మహిళలు రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముఖ్యంగా పోకరిలా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు షీ టీమ్ పనిచేస్తుంది. మహిళల రక్షణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. షీ టీం ఫోన్ నెంబర్( 8712670783) తెలిసేలా ఏర్పాటు చేశాం. ఆకతాయిలా వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు విద్యార్థినిలు నిర్భయంగా ముందుకు రావాలని సూచించారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికపై పోలీస్ స్టేషన్ల వారీగా నిరంతరగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ నేరాలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం అన్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణాపై పటిష్ట నిఘ ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి బారిన పడిన యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పై దృష్టి సారించాలి అన్నారు. సైబర్ నేరస్తులు కొత్త విధానాలు కొత్త మార్గాలను అనుసరిస్తూ ప్రజలను ఆర్థికంగా మోసం చేస్తున్నారు వాటినీ అరికట్టేందుకు ప్రజలకు సైబర్ నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా అన్నారు. జిల్లాలో అనుమతి లేకుండా ఫైనాన్స్ లు నిర్వహించిన ,సామాన్యుల నుంచి అధిక వడ్డీ వసూలు చేసిన చట్టపరమైన చర్యలకు వెళ్తాం. వడ్డీ వ్యాపారులు వేధిస్తే బాధితులు నేరుగా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.జిల్లా నుంచి గల్ఫ్ వెళ్ళేవారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఇమ్మిగ్రేషన్, చట్టబద్ధత ఉన్నవారు నుంచి వీసాలు పొందాలి ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతాం. బాధితుల ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేస్తామన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
IND vs SA: జైస్వాల్ తొలి వన్డే సెంచరీ – భారత్కు ఘన విజయం, సిరీస్ కైవసం
విశాఖపట్నం డిసెంబర్ 06:
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వన్డేల్లో తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో బోచ్ బౌలింగ్లో సింగిల్ తీసుకుని శతకం పూర్తి చేశాడు.
ఆరంభంలో రోహిత్ శర్మ (75) వేగంగా రాణించినా మహరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. కోహ్లీ (33*)తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.... తెలంగాణ ను దేశంలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి
నల్లగొండ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే వరి ఉత్పత్తి, శాంతి భద్రతలు, విద్య, వైద్య రంగం, మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలో నంబర్ వన్గా నిలిచిందని తెలిపారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,... తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే :జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే జైలు శిక్ష జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వృద్ధుల నిరాధరణ కేసులను విచారించారు.
జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట... తులగంగవ్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి
మెటుపల్లి డిసెంబర్ 06:మెట్పల్లి అంబేద్కర్ పార్క్లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తుల గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ కుమార్ అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామాల్లో కోతుల బెడద నివారించే అభ్యర్థులనే గెలిపించండి : తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం పిలుపు
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
తెలంగాణ గ్రామాలను వేధిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించగల అభ్యర్థులనే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (జై కిసాన్) విజ్ఞప్తి చేసింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను... రాయికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
రాయికల్ డిసెంబర్ 6(ప్రజా మంటలు)*గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి*
అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి శనివారం రాయికల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి
ఈ... అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్టుపల్లి డిసెంబర్ 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
భారత రత్న డా. బి. ఆర్. ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన... డబ్బా గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు*
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 6 (ప్రజ మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ నాయకులు మాట్లాడుతు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు నేరల సుభాష్ గౌడ్,విడిసి అధ్యక్షుడు తేలు... కరీంనగర్లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):అంబేద్కర్ వర్ధంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్,ఇతర నేతలు మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని, కుల–మత–వర్గ విభేదాలకు ముగింపు పలుకుతూ అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడిగా ఆయనను జాతి శతకోటీ వందనాలతో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.నేడు BJP, BRS వంటి... తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ఆహ్వాన పత్రికను కేంద్ర హోంమంత్రి బండి సంజయ్కు అందించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,... జగిత్యాల జిల్లాలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనుమతులు వేగవంతం చేయాలి – ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్ళవాగు ప్రాజెక్ట్కు సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ–అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు.
ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ అనుమతుల విషయంపై ఎంపీ అర్వింద్ ను... డా.బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతిని శనివారం బన్సీలాల్ పేట డివిజన్ చాచా నెహ్రునగర్ లో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా అంబేడ్కర్ అమర్ రహే... 