తెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం
సంజయ్ కు మంత్రి పదవి...కష్టపడే కార్యకర్తకు దక్కిన గౌరవమిది - తెలంగాణ బీజేపీ శ్రేణులు
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైద్రాబాద్ జూన్ 9 (ప్రజా మంటలు) :
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి పదవి దక్కడంపట్ల తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా బండి సంజయ్ ను తెలంగాణ కాషాయ దళపతిగా పిలుచుకునే బీజేపీ కార్యకర్తల ఆనందానికి ఆవధుల్లేకుండాపోయాయి.
సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా వారు భావిస్తున్నారు. పార్టీలో కార్యకర్తగా చేరింది మొదలు ఏ పదవిలో ఉన్నా... నిరంతరం ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేయడమే లక్ష్యంగా పనిచేసిన బండి సంజయ్ కు అమాత్య పదవి లభించడం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం విశేషం.
సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి లభించడంపట్ల కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పట్టణాలకే పరిమితమైన బీజేపీని మారుమూల పల్లెల్లోకి విస్తరింపజేయడంలో బండి సంజయ్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
ప్రజాసంగ్రామ యాత్రతో 16 వందల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచారని, కేసీఆర్ పాలన అంతానికి బండి సంజయ్ పాదయాత్రతోనే అడుగులు పడ్డాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఆనాడు గొంతెత్తి ప్రశ్నించడానికే వీల్లేకుండా నిరసనలపై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ సర్కార్ పై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఉద్యమాలు చేసేందుకు వెనుకాడిన సమయంలో..... బీజేపీ రాష్ట్ర రథసారథిగా కార్యకర్తలందరినీ ఏకోన్ముఖులను చేసి రైతుల, నిరుద్యోగుల, ఉద్యోగుల, మహిళల సమస్యలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలు ఎదుర్కొంటున్న కష్టాలపై అడుగడుగున పోరాటాలు చేసి బీజేపీని ఇంటింటికీ పరిచయం చేసిన ఘనత బండి సంజయ్ దే. గత ఐదేళ్లపాటు కుటుంబానికి దూరమై బండి సంజయ్ చేసిన పోరాటాలు అన్నీ ఇన్నీ కావు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కార్యకర్తల కోసం ఎందాకైనా తెగించే మనస్తత్వం బండి సంజయ్ సొంతం. నిరంతరం ప్రజల్లో ఉండటం... నిత్యం కార్యకర్తలతో కలిసి నడవడం బండి సంజయ్ ప్రత్యేకత. ఎంపీగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ లాఠీఛార్జీలు, కేసులు, అరెస్టులకు లెక్క చేయని చరిత్ర సంజయ్ దే.
రైతులకు భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు వెళుతుంటే నాటి అధికార పార్టీ మూకలు రాళ్ళ దాడికి తెగబడినా వెనుకంజ వేయకుండా ధీటుగా ఎదుర్కొని రైతులకు అండగా నిలిచిన ధీశాలి సంజయ్ రైతుల పక్షాన అనేక దీక్షలు చేపట్టారు.
నిరుద్యోగ మార్చ్ పేరుతో జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలతో నిరుద్యోగుల పక్షాన పోరాడారు. బండి సంజయ్ పోరాటాలతో బెంబేలెత్తిన నాటి కేసీఅర్ సర్కార్ టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో అర్ధరాత్రి పోలీసులను ఇంటికి పంపి అక్రమంగా అరెస్ట్ చేసినా వెనుకంజ వేయకుండా ఉద్యమించి కాషాయ పార్టీ పోరాట పటిమను చాటి చెప్పారు. 317 జీవోను సవరించాలని ఉద్యోగుల పక్షాన పోరాడి సర్కార్ ను గడగడలాడించిన ఘనత కూడా సంజయ్ దే. సంజయ్ ధాటికి తట్టుకోలేని నాటి బీఆర్ ఎస్ పాలకులు కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులను పంపి గ్యాస్ కట్టర్లతో ఆఫీస్ గేట్లను ధ్వంసం చేయించి బండి సంజయ్ ను అరెస్ట్ చేసి భవిష్యత్తులో దీక్షలు చేయకుండా బీజేపీని కట్టడి చేయాలని చూశారు.
అయినా వెరవని సంజయ్ కేసీఅర్ సర్కార్ పై అలుపెరగని పోరాటాలు చేసి నాటి ప్రభుత్వ పతనంలో అత్యంత చురుకైన పాత్ర పోషించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఎంపీగా కొనసాగుతూ ప్రజా సమస్యలపై పోరాడి రెండు సార్లు జైలుకు వెళ్లిన ఘనత కూడా బండి సంజయ్ దే.
ప్రజల కోసం, కార్యకర్తల కోసం కొట్లాడి భారతదేశంలోనే అత్యధిక కేసులు ఎదుర్కొంటున్న ఎంపీ కూడా బండి సంజయ్ మాత్రమే కావడం గమనార్హం. అట్లాంటి వ్యక్తికి మోడీ కేబినెట్ లో చోటు దక్కడంతో కార్యకర్తల భావోద్వేగంతో ఉప్పొంగిపోతున్నారు.
నిజానికి బండి సంజయ్ రాజకీయ జీవిత ప్రస్థానాన్ని పరిశీలిస్తే... ఆయన రాజకీయ జీవితమంతా ఆటుపోట్లమయమే. కరీంనగర్ లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బండి సంజయ్ సామాన్య బీజేపీ కార్యకర్తగా ప్రస్తానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు.
రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచిన బండి సంజయ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్ పట్టణంలో ముస్లిం ప్రజలు నివసించే ప్రాంతంలో గంప గుత్తగా బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నప్పటికీ ఆయన ఏనాడూ హిందుత్వ భావజాలాన్ని వీడలేదు. బీజేపీ హిందుత్వ భావజాలాన్ని నరనరాన పుణికిపుచ్చుకున్న బండి సంజయ్ ఓట్ల కోసం, పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తను నమ్మిన సిద్దాంతాన్ని ఏనాడూ పక్కన పెట్టలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మరెన్ని అవమానాలు ఎదురైనా అధిగమిస్తూ ముందుకు సాగారు. అందుకే బీజేపీలో కార్యకర్తలందరికీ బండి సంజయ్ ‘హిందుత్వ ఐకాన్’ గా మారారు.
2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 89 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలపై అలుపెరగని ఉద్యమాలు చేస్తూ బీజేపీపీ రాష్ట్రవాప్తంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ను అనూహ్యంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించడం రాష్ట్రంలో పెను సంచలనమైంది. ముఖ్యంగా కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారి, బీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకెళ్లారు. కానీ బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించిన ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయిందని సొంత పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానించారంటే సంజయ్ పని తీరు ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలి.
రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించాక జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి ఉన్నత పదవిని బండి సంజయ్ కు కట్టబెట్టినప్పటికీ కార్యకర్తల్లో అసంత్రప్తి తగ్గలేదు. అందుకే బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కగానే బీజేపీలో కష్టపడే కార్యకర్తలంతా తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే బండి సంజయ్ కు కేంద్రంలో ఏ శాఖ అప్పగించినా... ఆ శాఖను సమర్ధవంతంగా నిర్వర్తించడంతోపాటు ఆ శాఖ ద్వారా ప్రజలకు ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ముఖ్యంగా తనను ఈ స్థాయికి తీసుకెళ్లిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల అభివ్రుద్ధిపై ప్రత్యేకంగా ద్రుష్టిసారిస్తారనే నమ్మకం తమకుందనే అభిప్రాయాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చీఫ్ మినిస్టర్ కప్ ఎంపిక పోటీలు ప్రారంభించిన అదనపు కలెక్టర్ బిఎస్ లత
జగిత్యాల ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకముగా తల పెట్టిన 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2025 సందర్భముగా జగిత్యాల జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు జిల్లాలోని వివిధ క్రీడా అంశములను జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు ఉదయం 10 గం. ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి... ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత
న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత
బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి... పశ్చిమ దేశాలలో స్టార్మర్ నాయకత్వ సంక్షోభం ప్రభావం
స్టార్మర్ సంక్షోభం – మార్కెట్లపై ప్రభావం
యూకే రాజకీయ పరిణామాలు ఆర్థిక మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితి పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా పాలసీలు వామపక్ష వైపు మళ్లవచ్చనే భయంతో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి.
పౌండ్ యూరోతో పోలిస్తే 0.5% పడిపోయి €1.146... ఇండియా టుడే రౌండ్టేబుల్లో అన్నామలై–కార్తీ చిదంబరం
మర్యాదకు, రాజకీయ పరిణితకు అద్దం
న్యూఢిల్లీ ఫిబ్రవరి 12:
ఇండియా టుడే నిర్వహించిన రౌండ్టేబుల్ చర్చలో తమిళనాడు రాజకీయాలకు చెందిన ప్రముఖ నాయకులు అన్నామలై కుప్పుస్వామి మరియు కార్తీ చిదంబరం పాల్గొన్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ చర్చ రాజకీయ వర్గాల్లో ప్రత్యేకంగా నిలిచింది.
సాధారణంగా టెలివిజన్ డిబేట్లలో కనిపించేలా అసభ్య పదజాలం, వ్యక్తిగత విమర్శలు... ట్రంప్–నేతన్యాహూ సీక్రెట్ మీటింగ్
వాషింగ్టన్ ఫిబ్రవరి 12:
:వైట్ హౌస్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మధ్య దాదాపు మూడు గంటల పాటు జరిగిన గోప్య సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు, మరియు భవిష్యత్ వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.... మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత ఉత్సాహం
జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)
(శ్రీధర గణపతి జగిత్యాల)జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో బుధవారం యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేస్తూ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మీడియా ముందు సంకేతాన్ని ప్రదర్శించారు.
39వ వార్డుకు చెందిన గోలి... డాలర్ బలహీనమైనా రూపాయి ఎందుకు మరింత పడిపోయింది?
న్యూఢిల్లీ ఫిబ్రవరి 12:
జనవరి నెలలో అమెరికా డాలర్ విలువ కొంత బలహీనపడింది. అయితే సాధారణంగా ఒక కరెన్సీ బలహీనపడితే, దాని ఎదురు కరెన్సీలు బలపడటం సహజం. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. డాలర్ బలహీనత కనిపించిన సమయంలోనే భారత రూపాయి మరింత క్షీణించింది. దీని వెనుక పలు కీలక కారణాలు ఉన్నాయి.
1️⃣ ... RBI నివేదిక: తెలంగాణ అప్పుల భారం పెరుగుతోంది
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా విడుదల చేసిన State Finances నివేదికలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గంభీరమైన సూచనలు ఉన్నాయి. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయి మరియు దీనికి గత బడ్జెట్ డేటా కూడా అద్దం పడుతుంది.
1. RBI తెలిపిన... మధ్యప్రదేశ్పై రూ.5.31 లక్షల కోట్ల ప్రజా రుణం – కమల్నాథ్ విమర్శలతో రాజకీయ వేడి
భోపాల్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంపై ప్రజా రుణ భారం రూ.5,31,012.8 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ రుణం మరింత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారీ రుణభారం... 234 నియోజకవర్గాల్లోనూ స్టాలిన్ అభ్యర్థి అన్న భావనతో పని చేయాలి: సీఎం స్టాలిన్ పిలుపు
చెంగల్పట్టు (తమిళనాడు), ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):డీఎంకే పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెంగల్పట్టు జిల్లా తిరువిదంతైలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 234 నియోజకవర్గాలన్నింటిలోనూ “ఈ స్టాలిన్ అభ్యర్థి” అన్న భావనతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.గత ఐదేళ్లలో అమలు చేసిన... 44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ – రితు తావ్డే ఎన్నిక
ముంబై, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) 78వ మేయర్గా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్పొరేటర్ రితు తావ్డే ఫిబ్రవరి 11న ఎన్నికయ్యారు. 44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ రావడం విశేషంగా మారింది.
శివసేనకు చెందిన సంజయ్ ఘాడి ఉపమేయర్గా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్... పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్స్ల తరలింపు.
*
జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
అన్ని పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బాక్స్లను పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్కు తరలించినట్లు తెలిపారు.స్ట్రాంగ్... 