తెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం

సంజయ్ కు మంత్రి పదవి...కష్టపడే కార్యకర్తకు దక్కిన గౌరవమిది - తెలంగాణ బీజేపీ శ్రేణులు

On
తెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

హైద్రాబాద్ జూన్ 9 (ప్రజా మంటలు) : 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి పదవి దక్కడంపట్ల తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా బండి సంజయ్ ను తెలంగాణ కాషాయ దళపతిగా పిలుచుకునే బీజేపీ కార్యకర్తల ఆనందానికి ఆవధుల్లేకుండాపోయాయి.

సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా వారు భావిస్తున్నారు. పార్టీలో కార్యకర్తగా చేరింది మొదలు ఏ పదవిలో ఉన్నా... నిరంతరం ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేయడమే లక్ష్యంగా పనిచేసిన బండి సంజయ్ కు అమాత్య పదవి లభించడం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం విశేషం.

సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి లభించడంపట్ల కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పట్టణాలకే పరిమితమైన బీజేపీని మారుమూల పల్లెల్లోకి విస్తరింపజేయడంలో బండి సంజయ్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

ప్రజాసంగ్రామ యాత్రతో 16 వందల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచారని, కేసీఆర్ పాలన అంతానికి బండి సంజయ్ పాదయాత్రతోనే అడుగులు పడ్డాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఆనాడు గొంతెత్తి ప్రశ్నించడానికే వీల్లేకుండా నిరసనలపై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ సర్కార్ పై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఉద్యమాలు చేసేందుకు వెనుకాడిన సమయంలో..... బీజేపీ రాష్ట్ర రథసారథిగా కార్యకర్తలందరినీ ఏకోన్ముఖులను చేసి రైతుల, నిరుద్యోగుల, ఉద్యోగుల, మహిళల సమస్యలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలు ఎదుర్కొంటున్న కష్టాలపై అడుగడుగున పోరాటాలు చేసి బీజేపీని ఇంటింటికీ పరిచయం చేసిన ఘనత బండి సంజయ్ దే. గత ఐదేళ్లపాటు కుటుంబానికి దూరమై బండి సంజయ్ చేసిన పోరాటాలు అన్నీ ఇన్నీ కావు.  

ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కార్యకర్తల కోసం ఎందాకైనా తెగించే మనస్తత్వం బండి సంజయ్ సొంతం. నిరంతరం ప్రజల్లో ఉండటం... నిత్యం కార్యకర్తలతో కలిసి నడవడం బండి సంజయ్ ప్రత్యేకత. ఎంపీగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ లాఠీఛార్జీలు, కేసులు, అరెస్టులకు లెక్క చేయని చరిత్ర సంజయ్ దే. 

రైతులకు భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు వెళుతుంటే నాటి అధికార పార్టీ మూకలు రాళ్ళ దాడికి తెగబడినా వెనుకంజ వేయకుండా ధీటుగా ఎదుర్కొని రైతులకు అండగా నిలిచిన ధీశాలి సంజయ్ రైతుల పక్షాన అనేక దీక్షలు చేపట్టారు.

నిరుద్యోగ మార్చ్ పేరుతో జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలతో నిరుద్యోగుల పక్షాన పోరాడారు. బండి సంజయ్ పోరాటాలతో బెంబేలెత్తిన నాటి కేసీఅర్ సర్కార్ టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో అర్ధరాత్రి పోలీసులను ఇంటికి పంపి అక్రమంగా అరెస్ట్ చేసినా వెనుకంజ వేయకుండా ఉద్యమించి కాషాయ పార్టీ పోరాట పటిమను చాటి చెప్పారు. 317 జీవోను సవరించాలని ఉద్యోగుల పక్షాన పోరాడి సర్కార్ ను గడగడలాడించిన ఘనత కూడా సంజయ్ దే. సంజయ్ ధాటికి తట్టుకోలేని నాటి బీఆర్ ఎస్ పాలకులు కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులను పంపి గ్యాస్ కట్టర్లతో ఆఫీస్ గేట్లను ధ్వంసం చేయించి బండి సంజయ్ ను అరెస్ట్ చేసి భవిష్యత్తులో దీక్షలు చేయకుండా బీజేపీని కట్టడి చేయాలని చూశారు.

అయినా వెరవని సంజయ్ కేసీఅర్ సర్కార్ పై అలుపెరగని పోరాటాలు చేసి నాటి ప్రభుత్వ పతనంలో అత్యంత చురుకైన పాత్ర పోషించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఎంపీగా కొనసాగుతూ ప్రజా సమస్యలపై పోరాడి రెండు సార్లు జైలుకు వెళ్లిన ఘనత కూడా బండి సంజయ్ దే.

ప్రజల కోసం, కార్యకర్తల కోసం కొట్లాడి భారతదేశంలోనే అత్యధిక కేసులు ఎదుర్కొంటున్న ఎంపీ కూడా బండి సంజయ్ మాత్రమే కావడం గమనార్హం. అట్లాంటి వ్యక్తికి మోడీ కేబినెట్ లో చోటు దక్కడంతో కార్యకర్తల భావోద్వేగంతో ఉప్పొంగిపోతున్నారు. 

నిజానికి బండి సంజయ్ రాజకీయ జీవిత ప్రస్థానాన్ని పరిశీలిస్తే... ఆయన రాజకీయ జీవితమంతా ఆటుపోట్లమయమే. కరీంనగర్ లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బండి సంజయ్ సామాన్య బీజేపీ కార్యకర్తగా ప్రస్తానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు.

రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచిన బండి సంజయ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్ పట్టణంలో ముస్లిం ప్రజలు నివసించే ప్రాంతంలో గంప గుత్తగా బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నప్పటికీ ఆయన ఏనాడూ హిందుత్వ భావజాలాన్ని వీడలేదు. బీజేపీ హిందుత్వ భావజాలాన్ని నరనరాన పుణికిపుచ్చుకున్న బండి సంజయ్ ఓట్ల కోసం, పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తను నమ్మిన సిద్దాంతాన్ని ఏనాడూ పక్కన పెట్టలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మరెన్ని అవమానాలు ఎదురైనా అధిగమిస్తూ ముందుకు సాగారు. అందుకే బీజేపీలో కార్యకర్తలందరికీ బండి సంజయ్ ‘హిందుత్వ ఐకాన్’ గా మారారు.

2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 89 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలపై అలుపెరగని ఉద్యమాలు చేస్తూ బీజేపీపీ రాష్ట్రవాప్తంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ను అనూహ్యంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించడం రాష్ట్రంలో పెను సంచలనమైంది. ముఖ్యంగా కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారి, బీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకెళ్లారు. కానీ బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించిన ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయిందని సొంత పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానించారంటే సంజయ్ పని తీరు ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలి.

రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించాక జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి ఉన్నత పదవిని బండి సంజయ్ కు కట్టబెట్టినప్పటికీ కార్యకర్తల్లో అసంత్రప్తి తగ్గలేదు. అందుకే బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కగానే బీజేపీలో కష్టపడే కార్యకర్తలంతా తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే బండి సంజయ్ కు కేంద్రంలో ఏ శాఖ అప్పగించినా... ఆ శాఖను సమర్ధవంతంగా నిర్వర్తించడంతోపాటు ఆ శాఖ ద్వారా ప్రజలకు ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ముఖ్యంగా తనను ఈ స్థాయికి తీసుకెళ్లిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల అభివ్రుద్ధిపై ప్రత్యేకంగా ద్రుష్టిసారిస్తారనే నమ్మకం తమకుందనే అభిప్రాయాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

Edit Page Articles  International  

దౌత్య మర్యాదలు దాటి పశ్చిమ రాయబారుల రచన – భారత విదేశాంగ స్వతంత్రతకు వచ్చిన కొత్త సవాలు

దౌత్య మర్యాదలు దాటి పశ్చిమ రాయబారుల రచన – భారత విదేశాంగ స్వతంత్రతకు వచ్చిన కొత్త సవాలు (సిహెచ్ వి ప్రభాకర్ రావు) ఆధునిక అంతర్జాతీయ రాజకీయాల్లో దేశాల మధ్య సంబంధాలు సున్నితమైనవి, సంక్లిష్టమైనవి. ప్రత్యేకంగా, భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న శక్తి ప్రపంచంలోని అన్ని ప్రధాన శక్తులతో సమసమాన దూరం పెట్టుకుంటూ—Strategic Autonomy అనే తన దౌత్య సిద్ధాంతాన్ని దృఢంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో, యుకే, ఫ్రాన్స్, జర్మనీ రాయబారులు కలిసి Times...
Read More...
National  State News 

ఇండిగో విమాన సర్వీసులో రెండు రోజులుగా సమస్యలు

ఇండిగో విమాన సర్వీసులో రెండు రోజులుగా సమస్యలు న్యూ ఢిల్లీ డిసెంబర్04: ✈️ IndiGo విమానాలకు భారీ ఆలస్యాలు, రద్దులు – ప్రయాణికులకు ఇబ్బందులు పెరిగిన రోజు దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌లైన్ అయిన IndiGo భారీ విమాన లేటీలు, కొన్ని రద్దులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. క్రూ కొరత తీవ్రంగా పెరగడంతో, మొత్తం కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. డిసెంబర్ 2న కేవలం 35% విమానాలే సమయానికి...
Read More...
Local News  State News 

త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి

త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థితాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా RTC ఎక్స్‌ప్రెస్ బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్‌ను ప్రారంభించారు. అనంతరం 70...
Read More...
State News 

సీఎం రేవంత్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు: రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కవిత

సీఎం రేవంత్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు: రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కవిత హైదరాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనంతో రాజకీయ ప్రచారం చేస్తున్నారని ఆరోజిస్తూ, తెలంగాణ జాగృతి ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. జాగృతి అధ్యక్షురాలు కవిత సమర్పించిన ఫిర్యాదు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. “ప్రభుత్వ ధనంతో ఎన్నికల ప్రచారం… సీఎం...
Read More...
Local News  State News 

తెలంగాణ ఉద్యమం, అమరుల పట్టాభిషేకంపై ప్రభుత్వానికి కవిత హెచ్చరిక

తెలంగాణ ఉద్యమం, అమరుల పట్టాభిషేకంపై ప్రభుత్వానికి కవిత హెచ్చరిక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత స్పందన .హైదరాబాద్, డిసెంబర్ 3 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎల్‌బీ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలు, ప్రభుత్వ వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత చెప్పిన ప్రకారం, తెలంగాణ ఉద్యమానికి ఎల్‌బీ నగర్ ప్రధాన కేంద్రమై, నవంబర్ 29న...
Read More...
National  State News 

తెలంగాణ ప్రభుత్వంలో కోవర్ట్ కలకలం: కీలక నిర్ణయాలు లీక్ ‌‌యవుతున్నాయనే అనుమానాలు తీవ్రం

తెలంగాణ ప్రభుత్వంలో కోవర్ట్ కలకలం: కీలక నిర్ణయాలు లీక్ ‌‌యవుతున్నాయనే అనుమానాలు తీవ్రం విజిలెన్స్ దర్యాప్తు – ముఖ్య నివేదిక సీఎం వద్దకు కాంగ్రెస్‌కు పెద్ద ఇబ్బంది :  కోవర్ట్ పాత్రపై కాంగ్రెస్‌లో తీవ్ర చర్చ హైదరాబాద్‌ డిసెంబర్ 03:తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న అత్యంత కీలక నిర్ణయాలు బహిర్గతం అవుతుండటంపై అధికార యంత్రాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా హిల్ట్ పాలసీ వంటి సున్నితమైన అంశం కేబినెట్‌లో...
Read More...
Local News 

కాలనీ అభివృద్ధిపై జోనల్ కమిషనర్ తో సమావేశం

కాలనీ అభివృద్ధిపై జోనల్ కమిషనర్ తో సమావేశం సికింద్రాబాద్‌, డిసెంబర్ 03 (ప్రజామంటలు):  కాలనీ సమస్యల పరిష్కారానికి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏసీఆర్‌డబ్ల్యూఏ అధ్యక్షుడు  ఎన్‌.చంద్రపాల్ రెడ్డి, సంఘ ప్రతినిధులు GHMC నార్త్‌జోన్ జోనల్ కమిషనర్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర బొగ్గు ఖనిజ శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రైవేట్ సెక్రటరీ ఇచ్చిన పత్రాన్ని కమిషనర్‌కు వ్యక్తిగతంగా అందజేశారు. కాలనీ రహదారులు సహా...
Read More...
Local News  State News 

హిందూ దేవుళ్ళ పై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు : క్షమాపణ చెప్పాలి : బీజేపీ నాయకురాలు రాజేశ్వరి

హిందూ దేవుళ్ళ పై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు  : క్షమాపణ చెప్పాలి : బీజేపీ నాయకురాలు రాజేశ్వరి సికింద్రాబాద్,  డిసెంబర్ 03 (ప్రజా మంటలు):  హిందూ దేవీదేవతలను అవమానించేలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు.కాంగ్రెస్‌కు హిందూ వ్యతిరేకత కొత్తేమీ కాదని, పీసీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మనోభావాలను...
Read More...
Local News  Crime 

భవన నిర్మాణ పనుల్లో అపశృతి..జేసీబీ తగిలి కూలీ మృతి

భవన నిర్మాణ పనుల్లో అపశృతి..జేసీబీ తగిలి కూలీ మృతి సికింద్రాబాద్, డిసెంబర్ 03 ( ప్రజామంటలు) : భవన నిర్మాణ పనుల్లో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కూలీ తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహాంకాళి పోలీసులు తెలిపిన వివరాలు..పాన్ బజార్ లో ఓ భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గత నెల 28న నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ...
Read More...
Local News  State News 

హైదరాబాద్ ను సేఫరాబాద్ గా మార్చాలనేది తమ లక్ష్యం : సర్వేజనా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి

హైదరాబాద్ ను సేఫరాబాద్ గా మార్చాలనేది తమ లక్ష్యం : సర్వేజనా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి    సికింద్రాబాద్, డిసెంబర్ 03 ( ప్రజామంటలు) : హైదరాబాద్‌ను సేఫరాబాద్ గా మార్చాలన్న లక్ష్యంతో సర్వేజనా ఫౌండేషన్ రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న సప్త పాపాలపై అవగాహన కల్పించేందుకు ప్రతీకాత్మకంగా యమలోకం నుంచి వచ్చిన యమధర్మరాజును రంగంలోకి దింపారు. రసూల్‌పురా జంక్షన్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని నగరంలోని 365...
Read More...
Local News 

గాంధీనగర్ సర్పంచ్‌గా కేతిరి లక్ష్మారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీనగర్ సర్పంచ్‌గా కేతిరి లక్ష్మారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక భీమదేవరపల్లి, డిసెంబర్ 3 (ప్రజామంటలు): మండలంలోని గాంధీనగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. గ్రామ అభివృద్ధి, ఐక్యత, సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ ప్రజల ఏకాభిప్రాయంతో కేతిరి లక్ష్మారెడ్డి సర్పంచ్‌గా ఎన్నుకోబడ్డారు. సర్పంచ్ బరిలో నలుగురు అభ్యర్థులు కేతిరి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకన్న, తాళ్లపల్లి రవీందర్, తాళ్లపల్లి దయాకర్ నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ,...
Read More...
Local News 

ముల్కనూరులో కాకతీయ టయోటా ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’

ముల్కనూరులో కాకతీయ టయోటా ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’ భీమదేవరపల్లి, డిసెంబర్ 3 (ప్రజామంటలు)  : మండలంలోని ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం వద్ద ఈ నెల 3, 4 తేదీల్లో (సోమ,మంగళ) కాకతీయ టయోటా కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి కారు కొనుగోలుపై లక్ష రూపాయల వరకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయని సేల్స్ మేనేజర్...
Read More...