తెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం

సంజయ్ కు మంత్రి పదవి...కష్టపడే కార్యకర్తకు దక్కిన గౌరవమిది - తెలంగాణ బీజేపీ శ్రేణులు

On
తెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

హైద్రాబాద్ జూన్ 9 (ప్రజా మంటలు) : 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి పదవి దక్కడంపట్ల తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా బండి సంజయ్ ను తెలంగాణ కాషాయ దళపతిగా పిలుచుకునే బీజేపీ కార్యకర్తల ఆనందానికి ఆవధుల్లేకుండాపోయాయి.

సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా వారు భావిస్తున్నారు. పార్టీలో కార్యకర్తగా చేరింది మొదలు ఏ పదవిలో ఉన్నా... నిరంతరం ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేయడమే లక్ష్యంగా పనిచేసిన బండి సంజయ్ కు అమాత్య పదవి లభించడం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం విశేషం.

సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి లభించడంపట్ల కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పట్టణాలకే పరిమితమైన బీజేపీని మారుమూల పల్లెల్లోకి విస్తరింపజేయడంలో బండి సంజయ్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

ప్రజాసంగ్రామ యాత్రతో 16 వందల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచారని, కేసీఆర్ పాలన అంతానికి బండి సంజయ్ పాదయాత్రతోనే అడుగులు పడ్డాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఆనాడు గొంతెత్తి ప్రశ్నించడానికే వీల్లేకుండా నిరసనలపై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ సర్కార్ పై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఉద్యమాలు చేసేందుకు వెనుకాడిన సమయంలో..... బీజేపీ రాష్ట్ర రథసారథిగా కార్యకర్తలందరినీ ఏకోన్ముఖులను చేసి రైతుల, నిరుద్యోగుల, ఉద్యోగుల, మహిళల సమస్యలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలు ఎదుర్కొంటున్న కష్టాలపై అడుగడుగున పోరాటాలు చేసి బీజేపీని ఇంటింటికీ పరిచయం చేసిన ఘనత బండి సంజయ్ దే. గత ఐదేళ్లపాటు కుటుంబానికి దూరమై బండి సంజయ్ చేసిన పోరాటాలు అన్నీ ఇన్నీ కావు.  

ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కార్యకర్తల కోసం ఎందాకైనా తెగించే మనస్తత్వం బండి సంజయ్ సొంతం. నిరంతరం ప్రజల్లో ఉండటం... నిత్యం కార్యకర్తలతో కలిసి నడవడం బండి సంజయ్ ప్రత్యేకత. ఎంపీగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ లాఠీఛార్జీలు, కేసులు, అరెస్టులకు లెక్క చేయని చరిత్ర సంజయ్ దే. 

రైతులకు భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు వెళుతుంటే నాటి అధికార పార్టీ మూకలు రాళ్ళ దాడికి తెగబడినా వెనుకంజ వేయకుండా ధీటుగా ఎదుర్కొని రైతులకు అండగా నిలిచిన ధీశాలి సంజయ్ రైతుల పక్షాన అనేక దీక్షలు చేపట్టారు.

నిరుద్యోగ మార్చ్ పేరుతో జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలతో నిరుద్యోగుల పక్షాన పోరాడారు. బండి సంజయ్ పోరాటాలతో బెంబేలెత్తిన నాటి కేసీఅర్ సర్కార్ టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో అర్ధరాత్రి పోలీసులను ఇంటికి పంపి అక్రమంగా అరెస్ట్ చేసినా వెనుకంజ వేయకుండా ఉద్యమించి కాషాయ పార్టీ పోరాట పటిమను చాటి చెప్పారు. 317 జీవోను సవరించాలని ఉద్యోగుల పక్షాన పోరాడి సర్కార్ ను గడగడలాడించిన ఘనత కూడా సంజయ్ దే. సంజయ్ ధాటికి తట్టుకోలేని నాటి బీఆర్ ఎస్ పాలకులు కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులను పంపి గ్యాస్ కట్టర్లతో ఆఫీస్ గేట్లను ధ్వంసం చేయించి బండి సంజయ్ ను అరెస్ట్ చేసి భవిష్యత్తులో దీక్షలు చేయకుండా బీజేపీని కట్టడి చేయాలని చూశారు.

అయినా వెరవని సంజయ్ కేసీఅర్ సర్కార్ పై అలుపెరగని పోరాటాలు చేసి నాటి ప్రభుత్వ పతనంలో అత్యంత చురుకైన పాత్ర పోషించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఎంపీగా కొనసాగుతూ ప్రజా సమస్యలపై పోరాడి రెండు సార్లు జైలుకు వెళ్లిన ఘనత కూడా బండి సంజయ్ దే.

ప్రజల కోసం, కార్యకర్తల కోసం కొట్లాడి భారతదేశంలోనే అత్యధిక కేసులు ఎదుర్కొంటున్న ఎంపీ కూడా బండి సంజయ్ మాత్రమే కావడం గమనార్హం. అట్లాంటి వ్యక్తికి మోడీ కేబినెట్ లో చోటు దక్కడంతో కార్యకర్తల భావోద్వేగంతో ఉప్పొంగిపోతున్నారు. 

నిజానికి బండి సంజయ్ రాజకీయ జీవిత ప్రస్థానాన్ని పరిశీలిస్తే... ఆయన రాజకీయ జీవితమంతా ఆటుపోట్లమయమే. కరీంనగర్ లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బండి సంజయ్ సామాన్య బీజేపీ కార్యకర్తగా ప్రస్తానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు.

రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచిన బండి సంజయ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్ పట్టణంలో ముస్లిం ప్రజలు నివసించే ప్రాంతంలో గంప గుత్తగా బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నప్పటికీ ఆయన ఏనాడూ హిందుత్వ భావజాలాన్ని వీడలేదు. బీజేపీ హిందుత్వ భావజాలాన్ని నరనరాన పుణికిపుచ్చుకున్న బండి సంజయ్ ఓట్ల కోసం, పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తను నమ్మిన సిద్దాంతాన్ని ఏనాడూ పక్కన పెట్టలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మరెన్ని అవమానాలు ఎదురైనా అధిగమిస్తూ ముందుకు సాగారు. అందుకే బీజేపీలో కార్యకర్తలందరికీ బండి సంజయ్ ‘హిందుత్వ ఐకాన్’ గా మారారు.

2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 89 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలపై అలుపెరగని ఉద్యమాలు చేస్తూ బీజేపీపీ రాష్ట్రవాప్తంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ను అనూహ్యంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించడం రాష్ట్రంలో పెను సంచలనమైంది. ముఖ్యంగా కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారి, బీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకెళ్లారు. కానీ బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించిన ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయిందని సొంత పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానించారంటే సంజయ్ పని తీరు ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలి.

రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించాక జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి ఉన్నత పదవిని బండి సంజయ్ కు కట్టబెట్టినప్పటికీ కార్యకర్తల్లో అసంత్రప్తి తగ్గలేదు. అందుకే బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కగానే బీజేపీలో కష్టపడే కార్యకర్తలంతా తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే బండి సంజయ్ కు కేంద్రంలో ఏ శాఖ అప్పగించినా... ఆ శాఖను సమర్ధవంతంగా నిర్వర్తించడంతోపాటు ఆ శాఖ ద్వారా ప్రజలకు ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ముఖ్యంగా తనను ఈ స్థాయికి తీసుకెళ్లిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల అభివ్రుద్ధిపై ప్రత్యేకంగా ద్రుష్టిసారిస్తారనే నమ్మకం తమకుందనే అభిప్రాయాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

బిసి ల రిజర్వేషన్ల కోసం జాక్ నాయకుల వినతి

బిసి ల రిజర్వేషన్ల కోసం జాక్ నాయకుల వినతి జగిత్యాల, నవంబర్ 04 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ నేతలు అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) నాయకులు మాట్లాడుతూ బీసీ హక్కుల సాధనకు కేంద్ర...
Read More...
National 

బిలాస్ పూర్ వద్ద రైళ్ల డీ : 6గురి మృతి

బిలాస్ పూర్ వద్ద రైళ్ల డీ : 6గురి మృతి బిలాస్‌పూర్ (చత్తీస్‌గఢ్), నవంబర్ 04:చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం కోర్బా ప్యాసింజర్ రైలు నిలిపి ఉంచిన గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 6మంది మృతి చెందగా, 25మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు రైల్వే బోగీలలో ఇరుక్కుపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు....
Read More...

నిరుపేద కుటుంబానికి ఏఎస్ఐ రాజేశుని శ్రీనివాస్ ఆర్థిక చేయూత

నిరుపేద కుటుంబానికి ఏఎస్ఐ రాజేశుని శ్రీనివాస్ ఆర్థిక చేయూత    జగిత్యాల నవంబర్ 4 (ప్రజా మంటలు ) పట్టణానికి చెందిన మార రమేష్ ధర్మపత్ని మార వసంత లుచిన్న కిరాణం దుకాణం నడిపిస్తూ కిరాయికి ఉంటున్నారు.  ఈ సందర్భంగా వారి సంపాదన అంతంత మాత్రమే ఇల్లు లేదు, జాగా లేదు, చేతిలో చిల్లిగవ్వ లేదని, రమేష్ గత ఆరు నెలల నుంచి కడుపునొప్పితో బాధపడుతూ...
Read More...
Local News 

నిరుపేద కుటుంబానికి ASI రాజేశుని శ్రీనివాస్ చేయూత – రూ.47,969 ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి ASI రాజేశుని శ్రీనివాస్ చేయూత – రూ.47,969 ఆర్థిక సహాయం జగిత్యాల (రూరల్) నవంబర్ 04 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని పురానిపేటకు చెందిన నిరుపేద కుటుంబానికి ASI రాజేశుని శ్రీనివాస్ గారు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించారు. మార రమేష్ మరియు ఆయన భార్య మార వసంత చిన్న కిరాణా దుకాణం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఆర్థికంగా బలహీన పరిస్థితుల్లో ఉన్న రమేష్...
Read More...

వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ అవసరమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్య

వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ అవసరమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్య జగిత్యాల నవంబర్ 04 (ప్రజా మంటలు)::జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో సోమవారం మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి గారిని కలసిన వీఆర్ఏలు (Village Revenue Assistants) తమ వ్యవస్థను పునరుద్ధరించాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ...
Read More...
Local News 

ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని ఏబీవీపీ ధర్నా

ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని ఏబీవీపీ ధర్నా మెట్టుపల్లి నవంబర్ 4 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పాత బస్టాండ్, శాస్త్రి చౌరస్తా వద్ద ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టే విషయంలో పోలీసులకు, విద్యార్థి...
Read More...

జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్ జాప్యంపై ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ రెండో రోజు కొనసాగింపు

జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్ జాప్యంపై ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ రెండో రోజు కొనసాగింపు    జగిత్యాల (రూరల్) నవంబర్ 04 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లాలో విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ మొత్తాలు విడుదలలో ప్రభుత్వం చూపుతున్న ఆలస్యం పై ప్రైవేట్ కళాశాలల నిరసన రెండో రోజుకు చేరుకుంది. జిల్లాలోని పలు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు నిరవధిక బంద్‌ను కొనసాగిస్తూ, విద్యార్థుల హక్కుల కోసం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక...
Read More...

“టీచరమ్మ చిల్లర పనులు..!” – శ్రీకాకుళం జిల్లాలో బాలికలతో ఊడిగం - ఉపాధ్యాయురాలిపై గాంభీర ఆరోపడులు

“టీచరమ్మ చిల్లర పనులు..!” – శ్రీకాకుళం జిల్లాలో బాలికలతో ఊడిగం - ఉపాధ్యాయురాలిపై గాంభీర ఆరోపడులు విశాఖపట్నం నవంబర్ 04: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని బందపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ ఘటన వెలుగుచూసింది. సమాచారం ప్రకారం, అక్కడ ఉపాధ్యాయురాలైన ఒక వ్యక్తి సెల్ ఫోన్‌తో మాట్లాడుతూ, ఇద్దరు విద్యార్థినులతో కాళ్ల నొక్కించుకోవడం వీడియో చిత్రంగా తీసుకోవడంతో ప్రజలలో ఆందోళన నెలకొంది. విద్యార్థులు విద్యాబుద్ధిని మరియు ఆస్తిత్వ పరిరక్షణ పరంపరను...
Read More...

విశాఖలో స్వల్ప భూకంపం

విశాఖలో స్వల్ప భూకంపం గాజువాక నుంచి భీమిలీ వరకు ప్రభావం విశాఖపట్నం, నవంబర్ 4:సముద్ర తీర నగరమైన విశాఖపట్నంలో ఈ రోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపం నమోదైంది. సమాచారం ప్రకారం, ఉదయం 4 గంటల నుండి 4.30 గంటల మధ్య కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంపం ప్రభావం గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలీ,...
Read More...

విజయ్ పార్టీ ప్రజా కార్యక్రమాల నియంత్రణకు రిటైర్డ్ పోలీసు అధికారుల శిక్షణతో వాలంటీర్ల బృందం

విజయ్ పార్టీ ప్రజా కార్యక్రమాల నియంత్రణకు రిటైర్డ్ పోలీసు అధికారుల శిక్షణతో వాలంటీర్ల బృందం చెన్నై, నవంబర్ 4:తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత తలపతి విజయ్ నేతృత్వంలో పార్టీ శ్రేణుల్లో నూతన మార్పులు మొదలయ్యాయి. ఇటీవల వెలుస్వామీపురం రోడ్‌షోలో ఏర్పడిన గందరగోళం అనంతరం, పార్టీకి ప్రత్యేకంగా ప్రజా సభల నియంత్రణ కోసం “థొండర్ అరి” (Thondar Ani) అనే వాలంటీర్స్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ ఈ...
Read More...
National  Filmi News  State News 

“నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇప్పుడు ఒక ‘సమతా అవార్డు’ లా మారిపోయాయి. నటుడు ప్రకాశ్ రాజ్

“నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇప్పుడు ఒక ‘సమతా అవార్డు’ లా మారిపోయాయి. నటుడు ప్రకాశ్ రాజ్ నేషనల్ అవార్డ్స్‌పై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు! “ఫైల్లు, పైల్లు అవార్డులు గెలుస్తున్నాయి” — మమ్ముట్టి ఉపేక్షపై ఆగ్రహం - ప్రకాశ్ రాజ్  న్యూ ఢిల్లీ నవంబర్ 04: ప్రఖ్యాత నటుడు ప్రకాశ్ రాజ్ నేషనల్ అవార్డ్స్‌పై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సౌత్ సినిమా లెజెండ్ మమ్ముట్టికి నేషనల్ అవార్డ్స్‌లో పట్టింపు...
Read More...
National  International  

అమెరికా షట్డౌన్‌ తర్వాత హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ పునరుద్ధరణ

అమెరికా షట్డౌన్‌ తర్వాత హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ పునరుద్ధరణ   తాత్కాలికంగా నిలిచిపోయిన వీసా ప్రక్రియను మళ్లీ ప్రారంభించిన అమెరికా కార్మిక శాఖ వాషింగ్టన్, నవంబర్ 4:అమెరికాలో కొనసాగుతున్న ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్ (U.S. Government Shutdown) కారణంగా గత కొన్ని వారాలుగా నిలిచిపోయిన H-1B వీసా ప్రాసెసింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ నిర్ణయాన్ని అమెరికా కార్మిక శాఖ (Department of Labor - DOL)...
Read More...