రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు
సౌకర్యాలు కల్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు
జగిత్యాల మే 02:
రాష్ట్ర రాజధాని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు
జగిత్యాల జిల్లా నుండి ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమయ స్ఫూర్తితో స్పందించి జిల్లాలోని ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను గుర్తించి హైదారాబాద్ లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. వారికి తగిన ఏర్పాట్లు, వసతులు కల్పించారు. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజక వర్గాలకు వేర్వేరుగా బస్సులను, కార్లను, ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చులతోనే రవాణా సౌకర్యం కల్పించారు. అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, పరిపాలనాధికారి పుప్పాల హన్మంతరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు లు ఎప్పటి కప్పుడు ఏర్పాట్లను, రవాణా విషయాలను సందాన కర్తల ద్వారా తెలుసుంకుంటూ ఎలాంటి లోటు - పాట్లు జరుగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రతి బస్సులో సందాన కర్తలను, సహాయకులను, ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించి సేవలు అందించారు. ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు అల్పాహారం, భోజన సౌకర్యాలు, త్రాగు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఉద్యమ కారులు సి.హెచ్.వి.ప్రభాకర్ రావు, చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మ, కంతి మోహన్ రెడ్డి, సౌడల కమలాకర్ ల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాలతో పాటు పట్టణాల, గ్రామాల నుండి సుమారు రెండు వందల మందికి పైగా ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను
రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలించారు. కొందరు ఉద్యమకారులు వారంతట వారే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలి వెళ్లారు. ధర్మపురి లోని తహశీల్దార్ కార్యాలయం నుండి, జగిత్యాల లోని ఆర్డీవో కార్యాలయం నుండి, మెట్ పల్లి ఆర్డీవో కార్యాలయాల నుండి ఆదివారం ఉదయత్ పూర్వం 3-00 గంటలకు వాహనాల్లో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లారు.
ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు
ఆరు దశాబ్దాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనంతరం ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలన తర్వాత నూతన ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం రావడం ఆనందంగా ఉందని ఉద్యమ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ కారులను గుర్తించి వేడుకలకు ఆహ్వానం పలికిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కు, అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర కు, ఇతర అధికారులకు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ కారులకు ఇచ్చిన ఇదే గుర్తింపును ఎప్పటికీ కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ ఆకాంక్షలను, అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజక వర్గాల తో పాటు వివిధ మండలాల నుండి, పట్టణాల నుండి సుమారు 200 మందికి పైగా ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లినట్లు వారు వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించి వివిధ పుష్పాలతో మాలలు అల్లి అలంకరించారు .సాయంత్రం మొదటి పాశురం సామూహికంగా... గ్రామపంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మద్దతు తో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పి చైర్పర్సన్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గం లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లను సన్మానించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి డిసెంబర్ 16 (ప్రజా మంటలు) నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూమాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత 10 సంవత్సరాలలో చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందుంచుతాననిఅబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ మీ ప్రభుత్వం అన్నారు.
, మీ నాయకత్వమే., సంక్షేమ శాఖ మంత్రిగా... మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 16( ప్రజా మంటలు)
పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు 163 బి ఎన్ ఎస్ ఎస్(144 సెక్షన్ అమలు) విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు
జిల్లాలో జరగనున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ... దళితుల భూమిని ఆక్రమించి, దారి మూసివేత
ఎల్కతుర్తి డిసెంబర్ 16 (ప్రజా మంటలు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని దండేపల్లి, దగ్గువారి పల్లె మధ్య ఉన్న డిబిఎం 20 ఎస్సారెస్పీ కాలువ ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటూ, దళితుల పొలాలకు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సూరారం గ్రామానికి చెందిన బచ్చు శ్రీనివాస్... ఈనెల 21 న జాతీయ లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోండి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ ఈనెల 21న జాతీయ మెగా లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వి నియోగం చేసుకుని రాజీ కుదుర్చుకోవాలని సూచించారు.
జిల్లాలో సుమారు 18 యేళ్ళనుంచి కేసులు నమోదు అయి... యంగ్ ఇండియా స్కూల్, IIM హైదరాబాద్, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలపై కీలక చర్చలు
న్యూఢిల్లీ డిసెంబర్ 16 (ప్రజా మంటలు):
తెలంగాణలో విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన భేటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు... నేను జీవన్ రెడ్డికి నమ్మిన బంటును జీవన్ రెడ్డికు చెడ్డ పేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా..జగిత్యాల డిసిసి అధ్యక్షుడు ...గాజంగి నందయ్య .
జగిత్యాల డిసెంబర్ 16(ప్రజా మంటలు)నావల్ల కాంగ్రెస్ పార్టీకి, జీవన్ రెడ్డికి చెడ్డపేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా అన్నారు డిసిసి అధ్యక్షులు నందయ్య
జగిత్యాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ కొనసాగుతుండగా
ఎమ్మెల్యే సంజయ్తో నందయ్య సన్నిహితంగా కార్యక్రమాల్లో పాల్గొనడంపై అసంతృప్తి వ్యక్తం చేసిమంత్రి అడ్లూరి లక్ష్మణ్... చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్
చౌలామద్ది డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
ఈరోజు జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌలామద్ది గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, తుల గంగవ్వ స్మారక ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని... గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత
సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్ఓడీ డా. జి. రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థినిగా, అదే కళాశాలలో సేవలందించి పదవీ విరమణ పొందారు.
నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్... తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.
జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు.... 