గ్రూప్1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 30( ప్రజా మంటలు) :
తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ - 1 పరీక్ష ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
గురువారం రోజున కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కోర్ గ్రూప్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.....
గ్రూప్ 1 పరీక్షను టి జి పి ఎస్ సి నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు.
పరీక్ష నిర్వహకు 22 మంది చీఫ్ సూపర్ ఇంటెండెంట్ లు, 22 మంది పరిశీలకులు, 22 మంది డిపార్టుమెంటల్ అధికారులను, నలుగురు రూట్ అధికారులు, నలుగురు సహాయ రూట్ అధికారులు, నలుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 157 మంది ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో 22 పరీక్ష కేంద్రాల్లో జగిత్యాల లో 18 జేఎన్టీయూ లో ఒకటి, కోరుట్లలో 3 కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు.
ఈ గ్రూప్ 1 పరీక్షకు 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.
ఈ పరీక్షకు నోడల్ అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర ను నియమించినట్లు తెలిపారు.
జూన్ 9 న జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండి పరీక్ష కేంద్రాలకు నిషిత పరిశీలన చేసి పంపించడం జరుగుతుందని, ఉదయం 9-30 నీ. లకు బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అభ్యర్తులేవరు అనుమతి లేని వస్తువులు పరీక్ష హాల్ లోకి తీసుక వెళ్లరాదని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో కనీసం మూడు సి.సి. కెమెరాలు అమర్చడం, అవసరమైన పక్షంలో అదనంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను సంబంధిత తహశీల్దార్లు పరిశీలించాలని పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాలకు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే రూట్లలో సమయానికి ముందే ఆర్.టి.సి. బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్.టి.సి. డిపో మేనేజర్ ను ఆదేశించారు.
పరీక్ష నిర్వహించి సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ కేంద్రంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ను ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, కాన్ఫిడెన్షియల్ మెటరియల్ ను సురక్షింతంగా ఉంచాలని పోలీసు అధికారులను కోరారు. రూట్ అధికారులు ముందే ఆయా రూట్లలో పర్యటించాలని సూచించారు. అభ్యర్థులను ఎలాంటి ఎలక్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించ బోమని తెలిపారు. పరీక్ష సమయం నకు ముందే అభ్యర్థులు వారి కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలని తెలిపారు.
జూన్ 3 నుండి 11 వరకు జరిగే పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షను కూడా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో సుమారు 700 మంది విద్యార్థులు మూడు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, రీజనల్ కో ఆర్డినేటర్ వేణుగోపాల్, ఆర్డీఓ లు పి.మధుసూదన్, ఆనంద్ కుమార్, డీఎస్పీ రవీందర్ జిల్లా వైద్య అధికారి శ్రీధర్, ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి అర్ధరాత్రి నుండి ఆటోల బంద్ _ప్రజలు సహకరించాలి
జగిత్యాల ఆగస్ట్ 23 (ప్రజా మంటలు)
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113
నేటి అర్ధరాత్రి నుండి జగిత్యాల జిల్లా స్థాయిలో రాష్ట్ర పిలుపుమేరకు ఆటోలు బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. విధి లేని పరిస్థితుల్లోనే తాము బందుకు శ్రీకారం చుట్టామని ప్రజలు తమ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో... మహిళా ఉద్యోగి ఆరోపణలన్నీ ఆవాస్తవం - ది మనోహార్ హోటల్ చైర్మన్ డీవీ మనోహర్ వెల్లడి..
సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు):
తమ సంస్థలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమ్ గెస్ట్ రిలేషన్స్ మేనేజర్గా పనిచేసిన కొరపు లావణ్య చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, తీవ్ర నిరాధారమైనవని హోటల్ 'ది మనోహర్' చైర్మన్ డీవీ మనోహర్ స్పష్టం చేశారు. శనివారం బేగంపేటలోని హోటల్ 'ది మనోహర్'లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లావణ్య... యాదవులను కురుమ కులంలో కలపవద్దు
సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు):
యాదవ సామాజిక వర్గాన్ని కురుమ కులంలో కలపడానికి కుట్రలు జరుగుతున్నాయని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం, కురుమ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, సభ్యులు ఆర్. జయప్రకాష్, టి. సుదర్శన్లను కలిసి... జర్నలిస్టులపై ఇక అక్రమ కేసులు చెల్లవా? వైరల్ మెసేజ్లో నిజమెంత?
న్యూఢిల్లీ, ఆగస్టు 22 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చిందంటూ సోషల్ మీడియా, వాట్సాప్లో వైరల్ అవుతున్న ఓ సందేశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “పెన్నుతో వార్తలు రాసే జర్నలిస్టులు, వీడియో కెమెరాలతో వార్తలను కవర్ చేసే రిపోర్టర్లు, శాటిలైట్ న్యూస్ చానళ్లు, యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసే... ఘనంగా కుంకుమార్చనలు, విశేష సంఖ్యలో పాల్గొన్న మహిళలు
జగిత్యాల ఆగస్టు 21 (ప్రజా మంటలు)పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం నంబి వేణుగోపాల ఆచార్య ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పూజా ద్రవ్యాలు ఆలయం పక్షాన అందజేశారు .
కార్యక్రమం అనంతరం తీర్థ... అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు - మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
రూ.32 కోట్లతో నూకలపల్లి 2బీహెచ్కే కాలనీకి మౌలిక వసతుల కల్పన
రేషన్ దుకాణం, బస్సు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్కు మంత్రి ఆదేశాలు
భూ రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- ఏడాదిన్నరలో రీ - సర్వే పూర్తి
ధర్మపురికి రెవెన్యూ డివిజన్, సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలి
- మంత్రి అడ్లూరి... ఎల్కతుర్తిలో కారులో అనుమానాస్పద మృతదేహం కలకలం
ఎల్కతుర్తి, ఆగస్టు 21 (ప్రజా మంటలు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని 12వ వార్డులో కారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. రెండు రోజులుగా రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న కారులో నుంచి శుక్రవారం దుర్వాసన రావడంతో బాటసారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎల్కతుర్తి పోలీసులు... వేములవాడలో ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్పై భార్య ఫిర్యాదు
వేములవాడ, ఆగస్టు 20 (ప్రజా మంటలు):
వేములవాడలోని రెడ్డి భవన్లో తన భర్త ఈశ్వర్ సాయిని మాధురి రాథోడ్తో ఒకే గదిలో గుర్తించానని ఆరోపిస్తూ ఆయన భార్య శరణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. శరణ్య ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఫోక్ సాంగ్స్లో నటించిన ఈశ్వర్ సాయి,... 2 వేల మంది అన్ఫిట్ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలి: కవిత
హైదరాబాద్, ఆగస్టు 19 (ప్రజా మంటలు):
సింగరేణిలో అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 2 వేల మంది కార్మికులను మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యే వరకు ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు.
హెచ్ఎంఎస్ జనరల్... పేదల కోసం ‘భూలక్ష్మి’ పథకం - కల్వకుంట్ల కవిత
సామాజిక న్యాయం కోసం మళ్లీ భూ పంపిణీ జరగాలి: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఆగస్టు 18 (ప్రజా మంటలు):
తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం సాధించాలంటే మళ్లీ భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీ అధికారంలోకి... కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం* *బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
*
జగిత్యాల జిల్లా ఆగస్టు17 {ప్రజా మంటలు}
మల్యాల మండలం కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మందికి ప్రయాణికులు గాయపడగా క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మల్యాల మండలం కొండగట్టు సమీపంలో జగిత్యాల నుంచి... బృందావనం ఫ్యామిలీ రిసార్ట్లో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం
కొండగట్టు ఆగస్టు 16 (ప్రజా మంటలు)మల్యాల మండలం కొండగట్టు బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ లో ఆదివారం శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంటింటా లలిత పారాయణ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా కలశ గణాధిపతి గౌరీ పూజ తొలతగా నిర్వహించి అమ్మవారి విగ్రహానికి పల రసాలు పంచామృతాలతో అభిషేకం చేసి వివిధ రకాలైన పుష్పాలతో అమ్మవారిని... 