గ్రూప్1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 30( ప్రజా మంటలు) :
తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ - 1 పరీక్ష ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
గురువారం రోజున కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కోర్ గ్రూప్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.....
గ్రూప్ 1 పరీక్షను టి జి పి ఎస్ సి నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు.
పరీక్ష నిర్వహకు 22 మంది చీఫ్ సూపర్ ఇంటెండెంట్ లు, 22 మంది పరిశీలకులు, 22 మంది డిపార్టుమెంటల్ అధికారులను, నలుగురు రూట్ అధికారులు, నలుగురు సహాయ రూట్ అధికారులు, నలుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 157 మంది ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో 22 పరీక్ష కేంద్రాల్లో జగిత్యాల లో 18 జేఎన్టీయూ లో ఒకటి, కోరుట్లలో 3 కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు.
ఈ గ్రూప్ 1 పరీక్షకు 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.
ఈ పరీక్షకు నోడల్ అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర ను నియమించినట్లు తెలిపారు.
జూన్ 9 న జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండి పరీక్ష కేంద్రాలకు నిషిత పరిశీలన చేసి పంపించడం జరుగుతుందని, ఉదయం 9-30 నీ. లకు బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అభ్యర్తులేవరు అనుమతి లేని వస్తువులు పరీక్ష హాల్ లోకి తీసుక వెళ్లరాదని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో కనీసం మూడు సి.సి. కెమెరాలు అమర్చడం, అవసరమైన పక్షంలో అదనంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను సంబంధిత తహశీల్దార్లు పరిశీలించాలని పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాలకు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే రూట్లలో సమయానికి ముందే ఆర్.టి.సి. బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్.టి.సి. డిపో మేనేజర్ ను ఆదేశించారు.
పరీక్ష నిర్వహించి సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ కేంద్రంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ను ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, కాన్ఫిడెన్షియల్ మెటరియల్ ను సురక్షింతంగా ఉంచాలని పోలీసు అధికారులను కోరారు. రూట్ అధికారులు ముందే ఆయా రూట్లలో పర్యటించాలని సూచించారు. అభ్యర్థులను ఎలాంటి ఎలక్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించ బోమని తెలిపారు. పరీక్ష సమయం నకు ముందే అభ్యర్థులు వారి కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలని తెలిపారు.
జూన్ 3 నుండి 11 వరకు జరిగే పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షను కూడా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో సుమారు 700 మంది విద్యార్థులు మూడు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, రీజనల్ కో ఆర్డినేటర్ వేణుగోపాల్, ఆర్డీఓ లు పి.మధుసూదన్, ఆనంద్ కుమార్, డీఎస్పీ రవీందర్ జిల్లా వైద్య అధికారి శ్రీధర్, ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం
జగిత్యాల మార్చి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 15 .03.2026 ఆదివారం నుండి మొదటి విడత మూల్యాంకనము ప్రారంభమవుతుందని క్యాంప్ ఆఫీసర్ బి నారాయణ తెలిపారు
మొదటి విడతలో ఆంగ్లము,తెలుగు, హిందీ, గణితము మరియు రాజనీతి శాస్త్రము (సివిక్స్) మొదలైన సబ్జెక్టులలో మూల్యాంకనము... సోనం వాంగ్చుక్పై ఎన్ఎస్ఏ కేసు ఉపసంహరణ… విడుదలకు మార్గం సుగమం
న్యూ ఢిల్లీ మార్చి 14 (ప్రజా మంటలు):
లడాఖ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్పై నమోదైన ఎన్ఎస్ఏ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీన జరగాల్సి ఉండగా, దానికి ముందుగానే కేసు ఉపసంహరణ నిర్ణయం... ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు - గోధుమలతో భారీ చిత్రం, డాక్యుమెంటరీ విడుదల
హైదరాబాద్ మార్చి 13 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత తెలంగాణ జాగృతి నాయకులు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
శుక్రవారం ఉదయం వేద పండితులు ఆశీర్వాదాలు అందించగా, బంజారా పూజారులు సంప్రదాయ విధానంలో దీవించారు. జాగృతి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు... క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెంపొందిస్తాయి- ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల మార్చి 12(ప్రజా మంటలు)క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.పట్టణ వివేకానంద మినీ స్టేడియంలో తెలంగాణ యూత్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆద్వర్యం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అస్మిత ఖేలో ఇండియా కార్యక్రమం లో భాగంగా జిల్లా స్తాయి అస్మిత లీగ్... జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వీరశైవ సమాజం నూతన కార్యవర్గం
జగిత్యాల మార్చి 12 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని కలిసిన జగిత్యాల పట్టణ వీర శైవ సమాజం నూతన కార్యవర్గ సభ్యులు.జగిత్యాల పట్టణ వీరశైవసమాజం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అసంబద్ధమైన తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులను విరమించుకోవాలి తపస్ జిల్లా అధ్యక్షులు ప్రసాదరావు
జగిత్యాల, మార్చి 12:అసంబధ్ధమైన, ఆశాస్త్రియమైన తెలంగాణ విద్యా కమిషన్ సిపారసులను విరామించుకోవాలని జగిత్యాల జిల్లా తపస్ అధ్యక్షులు బోయినపల్లి ప్రసాద్ రావు కోరారు. తపస్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులపై గీత గ్రంధాలయం కేంద్రంగా గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసాద్ రావు మాట్లాడుతూ తెలంగాణ... వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 11 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కొనసాగుతున్న నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మసమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్ విరమించారు.జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి... స్మశాన వాటికలో చెట్లు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్
జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)పట్టణ గొల్లపల్లి రోడ్ లో గల సత్య హరిచంద్ర స్మశాన వాటిక లో రోటరీ ఆపి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమం,పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల... ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ సిబ్బందికి అవగాహన
జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన సిబ్బందికి అవగాహన కార్యక్రమం బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన చీఫ్ సూపర్డెంట్ లకు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు నియమ
ఈ... ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి
జగిత్యాల మార్చి 11 ( ప్రజా మంటలు)పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని జగిత్యాల పట్టణం లో జగిత్యాల జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు లియాకత్ అలీ మోసిన్ స్వగృహం లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి .ఈ... సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్పల్లి, మార్చ్ 10 (ప్రజా మంటలు):
సమాజంలో సానుకూల మార్పులు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన సాధికారత సాధ్యమవుతుందని మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన... కాంగ్రెస్లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
జగిత్యాల రూరల్, మార్చ్ 10 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అన్న విషయంపై తాను ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల రోజే... 