గ్రూప్1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 30( ప్రజా మంటలు) :
తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ - 1 పరీక్ష ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
గురువారం రోజున కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కోర్ గ్రూప్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.....
గ్రూప్ 1 పరీక్షను టి జి పి ఎస్ సి నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు.
పరీక్ష నిర్వహకు 22 మంది చీఫ్ సూపర్ ఇంటెండెంట్ లు, 22 మంది పరిశీలకులు, 22 మంది డిపార్టుమెంటల్ అధికారులను, నలుగురు రూట్ అధికారులు, నలుగురు సహాయ రూట్ అధికారులు, నలుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 157 మంది ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో 22 పరీక్ష కేంద్రాల్లో జగిత్యాల లో 18 జేఎన్టీయూ లో ఒకటి, కోరుట్లలో 3 కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు.
ఈ గ్రూప్ 1 పరీక్షకు 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.
ఈ పరీక్షకు నోడల్ అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర ను నియమించినట్లు తెలిపారు.
జూన్ 9 న జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండి పరీక్ష కేంద్రాలకు నిషిత పరిశీలన చేసి పంపించడం జరుగుతుందని, ఉదయం 9-30 నీ. లకు బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అభ్యర్తులేవరు అనుమతి లేని వస్తువులు పరీక్ష హాల్ లోకి తీసుక వెళ్లరాదని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో కనీసం మూడు సి.సి. కెమెరాలు అమర్చడం, అవసరమైన పక్షంలో అదనంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను సంబంధిత తహశీల్దార్లు పరిశీలించాలని పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాలకు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే రూట్లలో సమయానికి ముందే ఆర్.టి.సి. బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్.టి.సి. డిపో మేనేజర్ ను ఆదేశించారు.
పరీక్ష నిర్వహించి సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ కేంద్రంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ను ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, కాన్ఫిడెన్షియల్ మెటరియల్ ను సురక్షింతంగా ఉంచాలని పోలీసు అధికారులను కోరారు. రూట్ అధికారులు ముందే ఆయా రూట్లలో పర్యటించాలని సూచించారు. అభ్యర్థులను ఎలాంటి ఎలక్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించ బోమని తెలిపారు. పరీక్ష సమయం నకు ముందే అభ్యర్థులు వారి కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలని తెలిపారు.
జూన్ 3 నుండి 11 వరకు జరిగే పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షను కూడా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో సుమారు 700 మంది విద్యార్థులు మూడు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, రీజనల్ కో ఆర్డినేటర్ వేణుగోపాల్, ఆర్డీఓ లు పి.మధుసూదన్, ఆనంద్ కుమార్, డీఎస్పీ రవీందర్ జిల్లా వైద్య అధికారి శ్రీధర్, ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘాజియాబాద్ బాలికల మృతి కేసు: ‘కొరియన్ సంస్కృతి’ నుంచి దూరం చేశారనే వేదనతో లేఖ
ఘాజియాబాద్ ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):
ఘాజియాబాద్లో ముగ్గురు అక్కాచెల్లెలు మృతి చెందిన ఘటనలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. 'ది హిందూ' పత్రిక ప్రచురించిన సమాచారం మేరకు, వారికి లభించిన లేఖ ప్రకారం, తమ మూడేళ్ల చిన్న అర్ధసోదరికి “తమ కొరియన్ సంస్కృతి” నేర్పించనివ్వలేదనే బాధను బాలికలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
లేఖలో,... మునిసిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాం ఎమ్మెల్సీ ఎల్. రమణ
జగిత్యాల ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణంలో పలు వార్డులో BRS పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్సీ ఎల్ రమణ మరియు మాజీ మంత్రి రాజేశం గౌడ్ మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత తో కలిసి ప్రచారం లో గురువారం రాత్రి 7 గంటలకు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ... ఘాజియాబాద్లో ముగ్గురు బాలికల ఆత్మహత్య
ఘాజియాబాద్ / ఢిల్లీ, (ప్రజా మంటలు):
ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ సంఘటన కుటుంబాలు, పాఠశాలలు, మానసిక ఆరోగ్య నిపుణులను కలవరపాటుకు గురి చేసింది.
ఈ ఘటనపై స్పందించిన బాలికల తండ్రి, తమ పిల్లల మృతికి కొరియన్ కల్చర్ ప్రభావమే కారణమని... 39వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొలుసాని శ్రీనివాస్ జోరుగా ప్రచారం
జగిత్యాల ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలోని 39 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోలు సాని శ్రీనివాస్ ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా చేతి గుర్తుపై తనకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు.
స్థానిక సమస్యల పరిష్కారంలో తాను వార్డులోనే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.... వరంగల్–కరీంనగర్ జంట నగరాల అభివృద్ధికి బృహత్ ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):
వరంగల్–కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికను రూపొందించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెండు పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లు పూర్తి చేయడంతో పాటు, వాటిని అనుసంధానించే రహదారులను విస్తరించనున్నట్లు చెప్పారు. రెండు నగరాల మధ్య భారీ డంప్ యార్డు ఏర్పాటు చేసి, అక్కడే విద్యుత్... రాయికల్ పలు వార్డులలో అభ్యర్థులకు మద్దతుగా డా బోగ శ్రావణి ఇంటింట ప్రచారం
రాయికల్ ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మున్సిపల్ 8వ వార్డ్ అభ్యర్థి మచ్చ నారాయణ మరియు 12వ వార్డ్ అభ్యర్థి కల్లెడ చిన్న ధర్మపురి కి మద్దతుగా అదేవిధంగా రాయికల్ పదవ వార్డు అభ్యర్థి ఆడెపు ప్రశాంతి మరియు 11వ వార్డు అభ్యర్థి పుర్రె శ్రీధర్... ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా.
జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ 40వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి
స్థానికంగా ఉంటూ ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటా.. జగిత్యాల పట్టణ 40వ వార్డు తన కుటుంబంగా భావిస్తాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా తక్షణమే స్పదింస్తా.. మరోమారు ఆశీర్వదించండి.... జగిత్యాల పట్టణం 3వ వార్డులో కారు అభ్యర్థికి జోరుగా ప్రచారం
జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)పట్టణం 3వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుమ్మడి సత్యం గౌడ్ కి మద్దతుగా ఇంటింటా తిరిగి ప్రచారం చేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ . ఏ ఇంటి గడప తట్టిన కూడా కేసీఆర్ పై అభిమానం తగ్గలేదని పేద ప్రజల... అనిల్ అంబానీ–ఇప్స్టీన్ ఫైల్ విశ్లేషణ: మోదీ, హార్దీప్ సింగ్ పూరి సంబంధాలు
అనిల్ అంబాని–జెఫ్రీ ఇప్స్టీన్ ఫైల్: మోదీ, హార్దీప్ సింగ్ పూరి సంబంధాలపై సంక్షిప్తంగా, సమగ్ర విశ్లేషణ
గత రెండు మూడు నెలలుగా, అమెరికాకు చెందిన నేరస్తుడు, దళారీ జాఫ్రీ ఎప్స్టీన్ మరియు అనెక మంది దేశాధినేతలతో, పారిశ్రామికవేత్తలతో, ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉన్నాడని, అనేక అరాచకాలు చేశాడని నేరారోపణలు ప్రచారంలో ఉన్నాయి.
.ఇతనికి శిక్ష... న్యాయవాది స్వప్న హత్య నిందితులకు వెంటనే శిక్ష విధించాలి: మెట్పల్లి బార్ అసోసియేషన్
మెట్పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు న్యాయవాది స్వప్న హత్యకు పాల్పడిన నిందితులకు వెంటనే కఠిన శిక్ష విధించాలని మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
స్వప్న హత్యను నిరసిస్తూ గురువారం మెట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అనంతరం... ల్యాండ్మార్క్ తీర్పుకు కారణమైన న్యాయమూర్తికి మెట్పల్లి బార్ సన్మానం
మెట్పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):
మంథని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా ఉన్న సమయంలో పోలీసుల ఫర్దార్ ఇన్వెస్టిగేషన్పై డి. నాగేశ్వరావు రచించిన ఆర్టికల్ను ఉదాహరణగా తీసుకుని అలహాబాద్ హైకోర్టుతో పాటు భారత సుప్రీంకోర్టు ల్యాండ్మార్క్ తీర్పు వెలువరించిన సందర్భంగా, ప్రస్తుతం మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి. నాగేశ్వరావును మెట్పల్లి బార్ అసోసియేషన్... మెట్పల్లి వరుస దొంగతనాల కేసులు ఛేదింపు : 7 మంది నిందితుల అరెస్ట్
మెట్పల్లిలో వరుస దొంగతనాల కేసులు ఛేదింపు
7 మంది నిందితుల అరెస్ట్ – 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం
మెట్పల్లి, ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు):మెట్పల్లి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో జరిగిన వరుస దొంగతనాల కేసులను మెట్పల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ఏడుగురు నిందితులను... 