గ్రూప్1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 30( ప్రజా మంటలు) :
తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ - 1 పరీక్ష ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
గురువారం రోజున కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కోర్ గ్రూప్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.....
గ్రూప్ 1 పరీక్షను టి జి పి ఎస్ సి నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు.
పరీక్ష నిర్వహకు 22 మంది చీఫ్ సూపర్ ఇంటెండెంట్ లు, 22 మంది పరిశీలకులు, 22 మంది డిపార్టుమెంటల్ అధికారులను, నలుగురు రూట్ అధికారులు, నలుగురు సహాయ రూట్ అధికారులు, నలుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 157 మంది ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో 22 పరీక్ష కేంద్రాల్లో జగిత్యాల లో 18 జేఎన్టీయూ లో ఒకటి, కోరుట్లలో 3 కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు.
ఈ గ్రూప్ 1 పరీక్షకు 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.
ఈ పరీక్షకు నోడల్ అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర ను నియమించినట్లు తెలిపారు.
జూన్ 9 న జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండి పరీక్ష కేంద్రాలకు నిషిత పరిశీలన చేసి పంపించడం జరుగుతుందని, ఉదయం 9-30 నీ. లకు బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అభ్యర్తులేవరు అనుమతి లేని వస్తువులు పరీక్ష హాల్ లోకి తీసుక వెళ్లరాదని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో కనీసం మూడు సి.సి. కెమెరాలు అమర్చడం, అవసరమైన పక్షంలో అదనంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను సంబంధిత తహశీల్దార్లు పరిశీలించాలని పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాలకు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే రూట్లలో సమయానికి ముందే ఆర్.టి.సి. బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్.టి.సి. డిపో మేనేజర్ ను ఆదేశించారు.
పరీక్ష నిర్వహించి సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ కేంద్రంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ను ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, కాన్ఫిడెన్షియల్ మెటరియల్ ను సురక్షింతంగా ఉంచాలని పోలీసు అధికారులను కోరారు. రూట్ అధికారులు ముందే ఆయా రూట్లలో పర్యటించాలని సూచించారు. అభ్యర్థులను ఎలాంటి ఎలక్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించ బోమని తెలిపారు. పరీక్ష సమయం నకు ముందే అభ్యర్థులు వారి కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలని తెలిపారు.
జూన్ 3 నుండి 11 వరకు జరిగే పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షను కూడా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో సుమారు 700 మంది విద్యార్థులు మూడు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, రీజనల్ కో ఆర్డినేటర్ వేణుగోపాల్, ఆర్డీఓ లు పి.మధుసూదన్, ఆనంద్ కుమార్, డీఎస్పీ రవీందర్ జిల్లా వైద్య అధికారి శ్రీధర్, ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బి ఆర్ ఎస్ కండువా కప్పుకోవాలి_ లేదా పార్టీకి రాజీనామా చేయాలి....
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు) జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బి ఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోవాలి లేదా పార్టీకి రాజీనామా చేయాలనిజగిత్యాల జిల్లా బి ఆర్ ఎస్పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులుకల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జగిత్యాల జిల్లా... రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కారం చూపాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు స్పందించి అధికారులు పరిష్కారం చూపాలన్నారు జిల్లా కలెక్టర్
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్, రాఘవపేట్ మరియు ఓబులాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం సందర్శించి సమగ్రంగా పరిశీలిచారు.... గ్రామాల అభివ్రుద్ది నా ధ్యేయం ....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ నవంబర్ 20 (ప్రజా మంటలు)గ్రామాలను అభివ్రుద్ది చేయడమే నా ధ్యేయం అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గురువారం నాడుజగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 18 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రాష్ట్రంలోనే అత్యధిక... శ్రీ చక్రపీఠం ఆధ్వర్యంలో ఘనంగా రుద్ర హోమం
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవనంలో, కార్తీక మాసం అమావాస్య పురస్కరించుకొని అద్వైత శ్రీ చక్రపీఠం భవాని నగర్ శ్రీ శ్రీ పాద లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో 27 కుండములు 108 మంది దంపతులు చే విష్ణు సహస్రనామ, మరియు... రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు :సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూ ఢిల్లీ నవంబర్ 20:
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతికి లేదా గవర్నర్లకు పంపించే బిల్లుల విషయంలో గడువు విధించే అధికారం న్యాయస్థానానికి లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము చేసిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్పై గురువారం వెలువరించిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గవర్నర్లు కారణం... బిహార్ సీఎం గా మళ్లీ నితీశ్కుమార్ ప్రమాణ స్వీకారం – 26 మంది మంత్రుల మంత్రివర్గం ప్రమాణం
26 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పేర్ల జాబితా చివర్లో
పాట్నా: నవంబర్ 20:
బిహార్లో మరోసారి రాజకీయ పటంలో మార్పులు చోటుచేసుకున్నాయి. జేడీయూ అధినేత నితీశ్కుమార్ బుధవారం బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 26 మంది మంత్రులు కూడా... శబరిమల యాత్రికులకు కొత్త నిబంధనలు – వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి
హెల్ప్లైన్ నంబర్లు
శబరిమల హెల్ప్లైన్: 14432
ఇతర రాష్ట్రాల భక్తుల కోసం: 04735-14432
పంబ నవంబర్ 20:
శబరిమలలో రోజురోజుకు పెరుగుతున్న అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నియమాలను అమలు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. నవంబర్ 24, 2025... జర్నలిస్టుల సంక్షేమం కోసం లెక్కలేనన్ని పోరాటాలు – టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్ అలీ
హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడింది ఏ ఒక్క సంఘమో అయితే, అది టీయూడబ్ల్యూజే (తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం) అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. బషీర్బాగ్లోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు... జగిత్యాల పాత్రికేయుడు శఫీని ఆస్పత్రిలో పరామర్శిన మంత్రి అడ్లూరి
హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల పాత్రికేయుడు షఫీ అనారోగ్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్లోని రెనోవా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బుధవారం ఆస్పత్రిలో ఆయనను పరామర్శించారు.
షఫీ ఆరోగ్య పరిస్థితిని మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని, వెంటనే విధినిర్వహణలో ఉన్న వైద్యులతో మాట్లాడారు. ఆయనకు ... మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి - చీరల పంపిణీ
హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు):తె లంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా, లోపాలు లేకుండా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఈ పథకంపై సీఎం సచివాలయం నుంచి... ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు
మెట్టుపల్లి నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా.మెట్టుపల్లి లోని సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది మరియు రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్... డ్రగ్స్.సైబర్ నేరాలపై అవగాహన సదస్సు.
ఇబ్రహీంపట్నం నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం ఎస్... 