పది రాష్ట్రాల్లో ముగిసిన నాల్గో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ - పూర్తి ప్రశాంతం
పది రాష్ట్రాల్లో ముగిసిన నాల్గో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ - పూర్తి ప్రశాంతం
96 లోక్ సభ స్థానాలకు 1717 మంది అభ్యర్థుల పోటీ
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 525 మంది పోటీ
204 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికల నిర్వహణ
ఇక జూన్ 4న బయట పడనున్న అభ్యర్థుల భవితవ్యం
(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ - 99481 33539)
జగిత్యాల మే 13:
నాలుగవ విడత పది రాష్ట్రాల్లోని 96 లోకసభ స్థానాల ఎన్నికలు సోమవారం ముగిశాయి. వాటితో పాటు మూడు రాష్ట్రాల్లోని 204 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు నిర్వహించారు.
ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా 10 రాష్ట్రాల్లోని మొత్తం 96 లోక్ సభ స్థానాలకు గాను 1717 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం అయిన జమ్ము కాశ్మీర్ లో ఒక లోక్ సభ స్థానం, ఆంధ్ర ప్రదేశ్ లో - 25, తెలంగాణలో - 17, ఉత్తర ప్రదేశ్ లో - 13, మహా రాష్ట్ర లో - 11, మధ్య ప్రదేశ్ లో - 8, పశ్చిమ బెంగాల్ లో - 8, బీహార్ లో - 5, ఒడిస్సా లో - 4, ఝార్ఖండ్ లో - 4, మొత్తం : 96 లోక్ సభ స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. వీటితో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని - 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిస్సా లోని - 28 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణ లోని సికింద్రాబాద్ కంటోన్ మెంట్ లోని ఒక అసెంబ్లీ స్థానానికి కూడా సోమవారం ఎన్నికలు జరిగాయి.
తెలంగాణ రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 9,900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జూన్ 4 ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నాయి. అప్పటి దాకా అభ్యర్థులతో పాటు, ఓటర్లు కూడా ఫలితాల కోసం వేచి చూడాల్సిందే.....
కాగా ఇట్టి ఎన్నికల్లో అక్కడక్కడ చెదురు - మొధురు సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల అల్లర్లు జరిగాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
కంచి పీఠమే కుటుంబ వ్యవస్థ బలం – శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గుంటూరు నవంబర్ 09 (ప్రజా మంటలు):
మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా నిలవడానికి కంచి పీఠం వంటి ఆధ్యాత్మిక సంస్థలు కీలక పాత్ర పోషించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం గుంటూరు సమీపంలోని శంకర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా... 25వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 9 (ప్రజా మంటలు)పట్టణ 25వ వార్డులో 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ డ్రైన్ అభివృద్ధి పనులని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
పనులు నాణ్యతలో చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి గారు జగిత్యాల కు 62.50 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది అని,అతిత్వరలో పనులు టెండర్... జగిత్యాల కవయిత్రి మద్దెల సరోజనకు ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారం
జగిత్యాల నవంబర్ 09 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి, కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ప్రధాన అడ్మిన్ శ్రీమతి మద్దెల సరోజన గారు సాహిత్య రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె ప్రతిభ, కృషి, కవితా వైభవానికి ఇది గొప్ప గుర్తింపుగా నిలిచింది.
ఈ... మార్కండేయ ఆలయంలో ఆంజనేయస్వామి ,జంట నాగుల పునఃప్రతిష్ట
జగిత్యాల నవంబర్ 9 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఆంజనేయ స్వామి, జంట నాగేంద్ర స్వామి, విగ్రహాల పున: ప్రతిష్ట సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ర సోమవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాల వరకు జరిగే అఖండ హనుమాన్
ఉదయం... జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు – పోలింగ్ స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి: అధికారులు
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం అధికారికంగా ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిర్వాహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్లాల్సిందిగా... ఫుట్ పాత్ నిరాశ్రయులకు 288 వ అన్నదానం
సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు):
రాష్ట్ర రాజధాని మహానగరం హైద్రాబాద్ లో వాహనంలో సంచరిస్తూ వివిధ ప్రాంతాలలో ఫుట్ పాత్ ల మీద ఆకలితో ఉన్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారికి ఆదివారం స్కై ఫౌండేషన్ తమ 288 వ వారం అన్నదానం నిర్వహించారు. ఈసందర్బంగా వారికి ఫుడ్డు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అందచేశారు.... గాంధీలో ముగిసిన ఇంటెన్సివ్ ఆర్థోపెడిక్స్ పీజీ టీచింగ్ ప్రోగ్రాం
రాష్ర్టంలోని 200 మంది పీజీ వైద్య విద్యార్థుల హాజరు
సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు): గాంధీ మెడికల్కాలేజీ ఆర్థోపెడిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఐఓఏ ఆర్థోపెడిక్స్పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఇంటెన్సివ్ అకాడెమిక్ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. గాంధీ అలుమ్ని ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రంలోని
విద్యార్థులకు... జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంపుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):
తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని మరింత విస్తరించుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ నుంచి పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్లో చేరగా, మంత్రి సీతక్క వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహిళా సాధికారతపై ఒక కీలక ప్రణాళికను... కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన :
పాట్నా బీహార్) నవంబర్ 09 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు.
“కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్” అన్న వ్యాఖ్యలు విని తాను షాక్కు గురయ్యానని రాజ్నాథ్ పేర్కొన్నారు. హిందువులు–ముస్లింల మధ్య విభజన సృష్టించి రాజకీయ... ఛత్తీస్గఢ్ నేత అమిత్ భగేల్ వ్యాఖ్యలపై సింధీ ప్రజల ఆగ్రహం
సికింద్రాబాద్ లో భారీ శాంతి ర్యాలీ
సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజా మంటలు):
ఛత్తీస్గఢ్ జోహార్ పార్టీ నేత అమిత్ భగేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సింధీ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. భగేల్ సింధీ సమాజాన్ని "పాకిస్తానీలు"గా అభివర్ణించడం, వారి ఆరాధ్యదేవుడైన భగవాన్ ఝూలేలాల్ గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడంపై సమాజం తీవ్రంగా స్పందించింది.... బీహార్ సమస్తీపూర్లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్
సమస్తీపూర్ (బీహార్), నవంబర్ 9:
బీహార్ ఎన్నికల సమయంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. సమస్తీపూర్ జిల్లాలోని సరాయ్ రంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారిపై భారీ సంఖ్యలో VVPAT పర్చీలు (ఓటు స్లిప్స్) పడివున్నాయి. ఈ సంఘటన బయటపడటంతో ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి, రెండు ఎన్నికల సిబ్బందిని సస్పెండ్ చేసింది.
సమాచారం ప్రకారం, ఈ... భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్
సంఘ్ అధికారానికి కాదు, సమాజ సేవకే పనిచేస్తుంది
బెంగళూరు, నవంబర్ 9:రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ భారత్లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే అని వ్యాఖ్యానించారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా ఇదే నేలలో పుట్టిన హిందూ పూర్వీకుల సంతతులు అని ఆయన పేర్కొన్నారు.
బెంగళూరులో జరిగిన “100... 