నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి - స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి దళిత బందు ద్రోహి - తాటికొండ రాజయ్య... బిజెపి పార్టీ తెలంగాణకు చేసిందేమిలేదు... స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి
దళిత బందు ద్రోహి - తాటికొండ రాజయ్య...
బిజెపి పార్టీ తెలంగాణకు చేసిందేమిలేదు...
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
వేలేరు మే 9 (ప్రజా మంటలు) : తన బిడ్డ కడియం కావ్యకు రాజకీయ భవిష్యత్తునివ్వాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు.
హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రం లోని పిచరా మద్దెలగూడెం, శాలపల్లి కమ్మరిపేట గుండ్ల సాగర్ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిది గా పాల్గొన్నారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండలేక తాను నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీలో చేరానని పేర్కోన్నారు.
అందరం కలిసి కట్టుగా మన గ్రామాలను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. కాంగ్రెస్ పార్టీల సునామిలో కల్వకుంట్ల కుటుంబం కొట్టుకు పోయిందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ తన కుటుంబ ఖాజాన నింపుకున్నాడని ఆరోపించారు.పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆయన కుటుంబ సభ్యులే బాగుపడ్డారని ఆరోపించారు.
వేలేరు మండలం అభివృద్ధి చేశానంటూ అంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి సాగు నీరు కోసం తెచ్చిన ప్రాజెక్టు లో 104 కోట్ల రూపాయలలో 6కోట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి కమిషన్ తీసుకున్నది నిజం కదా.అధికారం చేతిలో ఉందని కోట్ల కోట్లకు దండుకున్నారు. కేసీఆర్ కుటుంబమంతా అవినీతికి పాల్పడ్డారని స్వయంగా కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని తీహార్ జైల్లో ఉందని పేర్కోన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని అంబేడ్కర్ విగ్రహాలను కూల్చి వేస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే పదవులు పనులు అమ్ముకున్నారని దళిత ఎమ్మెల్యే అయ్యి కూడా దళితబందులో కమిషన్ తీసుకున్నారని దుయ్యబట్టారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు తనకు రాజకీయంగా అండగా నిలిచి కడుపులో పెట్టుకొని ఆదరిస్తున్నారన్నారు. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు.నియోజక వర్గానికి 7వేల ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయని ఇందిరమ్మ పథకాలు అమలు చేయాలన్న, మంజూరు ఇవ్వాలన్నా ఇందిరమ్మ కమిటీల ద్వారానే జరుగుతుందన్నారు. కేంద్రంలో 10ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందని అన్నారు .
మోడీ పాలనలో ముస్లింలకు క్రిస్టియన్లకు,దళితుకకు అన్యాయం జరుగుతుందని పేర్కోన్నారు. తన బిడ్డ కావ్యను మీ బిడ్డగా,చెల్లెగా, అక్కగా, అడపడుచుగా భావించి ఆశీర్వదించాలని ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని ప్రజలను కోరారు. మే 13న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు
---------------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
డీసీపీవో హరీష్పై కఠిన చర్య – సేవల నుంచి తొలగింపు
జగిత్యాల, మే 02 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా డీసీపీవో ఎం. హరీష్ను సేవల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగం, మహిళా ఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు వంటి ఆరోపణలు ఆయనపై నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ అంశాలపై గతంలోనే హరీష్కు... సురభి గోశాల, తాటిపల్లిలో భక్తిశ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు
జగిత్యాల మే1(ప్రజా మంటలు)సురభి గోశాలలో నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం విజయవంతంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ముగిసింది. 11 మంది దంపతులు కలసి, ఒకే సంకల్పంతో, ఒకే భక్తితో వ్రతం నిర్వహించడం చూడటం నిజంగా హృదయానికి హత్తుకునే అనుభూతనీ నిర్వాహకులు అన్నారు.
మొదట గోమాతకు పూజలు చేసి, అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముని... సర్వోదయ తెలంగాణ” – ఉచిత విద్య, వైద్యం, 4 లక్షల ఉద్యోగాల హామీ!
హైదరాబాద్ మే 02 (ప్రజా మంటలు):
తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా “తెలంగాణ రక్షణ సేన”ను ప్రారంభించిన కల్వకుంట్ల కవిత, సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై పోరాటం చేస్తామని మీట్ ది ప్రెస్ లో
తెలిపారు.
“సర్వోదయ తెలంగాణ కోసం పాంచజన్యం మార్గంలో... ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవగ్రహ పూజా అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో... కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం
కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్... సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్లోని యూసుఫ్గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.రఘురాం జగిత్యాలకు చెందిన బండి... ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత... ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)
పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థలు మరోసారి తమ ప్రతిభను చాటుకుంటూ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించాయి.
ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి లో 591, 590 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా... పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి ఏప్రిల్ 28 (ప్రజా మంటలు)
రానున్న 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై టెంపుల్ మాస్టర్... రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం... - ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 26 (ప్రజా మంటలు)
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం లో ఆర్య వైశ్య సంఘం ఆద్వర్యం లో జయంతి వేడుకల్లో పాల్గొని పోచమ్మ ఆలయం నుండి వాసవి మాత ఆలయానికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతని పల్లకిలో తీసుకొచ్చే కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోసి ప్రత్యేక... ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు) జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు.*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత మాట్లాడుతూ* వాసవీ మాత
