నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి - స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి దళిత బందు ద్రోహి - తాటికొండ రాజయ్య... బిజెపి పార్టీ తెలంగాణకు చేసిందేమిలేదు... స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి
దళిత బందు ద్రోహి - తాటికొండ రాజయ్య...
బిజెపి పార్టీ తెలంగాణకు చేసిందేమిలేదు...
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
వేలేరు మే 9 (ప్రజా మంటలు) : తన బిడ్డ కడియం కావ్యకు రాజకీయ భవిష్యత్తునివ్వాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు.
హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రం లోని పిచరా మద్దెలగూడెం, శాలపల్లి కమ్మరిపేట గుండ్ల సాగర్ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిది గా పాల్గొన్నారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండలేక తాను నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీలో చేరానని పేర్కోన్నారు.
అందరం కలిసి కట్టుగా మన గ్రామాలను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. కాంగ్రెస్ పార్టీల సునామిలో కల్వకుంట్ల కుటుంబం కొట్టుకు పోయిందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ తన కుటుంబ ఖాజాన నింపుకున్నాడని ఆరోపించారు.పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆయన కుటుంబ సభ్యులే బాగుపడ్డారని ఆరోపించారు.
వేలేరు మండలం అభివృద్ధి చేశానంటూ అంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి సాగు నీరు కోసం తెచ్చిన ప్రాజెక్టు లో 104 కోట్ల రూపాయలలో 6కోట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి కమిషన్ తీసుకున్నది నిజం కదా.అధికారం చేతిలో ఉందని కోట్ల కోట్లకు దండుకున్నారు. కేసీఆర్ కుటుంబమంతా అవినీతికి పాల్పడ్డారని స్వయంగా కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని తీహార్ జైల్లో ఉందని పేర్కోన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని అంబేడ్కర్ విగ్రహాలను కూల్చి వేస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే పదవులు పనులు అమ్ముకున్నారని దళిత ఎమ్మెల్యే అయ్యి కూడా దళితబందులో కమిషన్ తీసుకున్నారని దుయ్యబట్టారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు తనకు రాజకీయంగా అండగా నిలిచి కడుపులో పెట్టుకొని ఆదరిస్తున్నారన్నారు. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు.నియోజక వర్గానికి 7వేల ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయని ఇందిరమ్మ పథకాలు అమలు చేయాలన్న, మంజూరు ఇవ్వాలన్నా ఇందిరమ్మ కమిటీల ద్వారానే జరుగుతుందన్నారు. కేంద్రంలో 10ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందని అన్నారు .
మోడీ పాలనలో ముస్లింలకు క్రిస్టియన్లకు,దళితుకకు అన్యాయం జరుగుతుందని పేర్కోన్నారు. తన బిడ్డ కావ్యను మీ బిడ్డగా,చెల్లెగా, అక్కగా, అడపడుచుగా భావించి ఆశీర్వదించాలని ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని ప్రజలను కోరారు. మే 13న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు
---------------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇండిగో సీఈఓ కు dgca నోటీస్
న్యూ ఢిల్లీ డిసెంబర్ 06;
ఇండిగో flights ఆలస్యాలు, క్రూ కొరత, ప్రయాణీకుల అసౌకర్యంపై దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో, డీజీసీఏ నేరంగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. “మీపై తగిన అమలు చర్య ఎందుకు ప్రారంభించకూడదు?” అనే ప్రశ్నకు సంబంధించి, ఎల్బర్స్ 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని... IND vs SA: జైస్వాల్ తొలి వన్డే సెంచరీ – భారత్కు ఘన విజయం, సిరీస్ కైవసం
విశాఖపట్నం డిసెంబర్ 06:
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వన్డేల్లో తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో బోచ్ బౌలింగ్లో సింగిల్ తీసుకుని శతకం పూర్తి చేశాడు.
ఆరంభంలో రోహిత్ శర్మ (75) వేగంగా రాణించినా మహరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. కోహ్లీ (33*)తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.... తెలంగాణ ను దేశంలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి
నల్లగొండ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే వరి ఉత్పత్తి, శాంతి భద్రతలు, విద్య, వైద్య రంగం, మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలో నంబర్ వన్గా నిలిచిందని తెలిపారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,... తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే :జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే జైలు శిక్ష జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వృద్ధుల నిరాధరణ కేసులను విచారించారు.
జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట... తులగంగవ్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి
మెటుపల్లి డిసెంబర్ 06:మెట్పల్లి అంబేద్కర్ పార్క్లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తుల గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ కుమార్ అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామాల్లో కోతుల బెడద నివారించే అభ్యర్థులనే గెలిపించండి : తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం పిలుపు
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
తెలంగాణ గ్రామాలను వేధిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించగల అభ్యర్థులనే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (జై కిసాన్) విజ్ఞప్తి చేసింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను... రాయికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
రాయికల్ డిసెంబర్ 6(ప్రజా మంటలు)*గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి*
అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి శనివారం రాయికల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి
ఈ... అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్టుపల్లి డిసెంబర్ 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
భారత రత్న డా. బి. ఆర్. ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన... డబ్బా గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు*
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 6 (ప్రజ మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ నాయకులు మాట్లాడుతు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు నేరల సుభాష్ గౌడ్,విడిసి అధ్యక్షుడు తేలు... కరీంనగర్లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):అంబేద్కర్ వర్ధంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్,ఇతర నేతలు మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని, కుల–మత–వర్గ విభేదాలకు ముగింపు పలుకుతూ అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడిగా ఆయనను జాతి శతకోటీ వందనాలతో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.నేడు BJP, BRS వంటి... తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ఆహ్వాన పత్రికను కేంద్ర హోంమంత్రి బండి సంజయ్కు అందించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,... జగిత్యాల జిల్లాలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనుమతులు వేగవంతం చేయాలి – ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్ళవాగు ప్రాజెక్ట్కు సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ–అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు.
ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ అనుమతుల విషయంపై ఎంపీ అర్వింద్ ను... 