నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి - స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి దళిత బందు ద్రోహి - తాటికొండ రాజయ్య... బిజెపి పార్టీ తెలంగాణకు చేసిందేమిలేదు... స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి
దళిత బందు ద్రోహి - తాటికొండ రాజయ్య...
బిజెపి పార్టీ తెలంగాణకు చేసిందేమిలేదు...
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
వేలేరు మే 9 (ప్రజా మంటలు) : తన బిడ్డ కడియం కావ్యకు రాజకీయ భవిష్యత్తునివ్వాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు.
హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రం లోని పిచరా మద్దెలగూడెం, శాలపల్లి కమ్మరిపేట గుండ్ల సాగర్ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిది గా పాల్గొన్నారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండలేక తాను నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీలో చేరానని పేర్కోన్నారు.
అందరం కలిసి కట్టుగా మన గ్రామాలను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. కాంగ్రెస్ పార్టీల సునామిలో కల్వకుంట్ల కుటుంబం కొట్టుకు పోయిందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ తన కుటుంబ ఖాజాన నింపుకున్నాడని ఆరోపించారు.పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆయన కుటుంబ సభ్యులే బాగుపడ్డారని ఆరోపించారు.
వేలేరు మండలం అభివృద్ధి చేశానంటూ అంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి సాగు నీరు కోసం తెచ్చిన ప్రాజెక్టు లో 104 కోట్ల రూపాయలలో 6కోట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి కమిషన్ తీసుకున్నది నిజం కదా.అధికారం చేతిలో ఉందని కోట్ల కోట్లకు దండుకున్నారు. కేసీఆర్ కుటుంబమంతా అవినీతికి పాల్పడ్డారని స్వయంగా కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని తీహార్ జైల్లో ఉందని పేర్కోన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని అంబేడ్కర్ విగ్రహాలను కూల్చి వేస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే పదవులు పనులు అమ్ముకున్నారని దళిత ఎమ్మెల్యే అయ్యి కూడా దళితబందులో కమిషన్ తీసుకున్నారని దుయ్యబట్టారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు తనకు రాజకీయంగా అండగా నిలిచి కడుపులో పెట్టుకొని ఆదరిస్తున్నారన్నారు. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు.నియోజక వర్గానికి 7వేల ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయని ఇందిరమ్మ పథకాలు అమలు చేయాలన్న, మంజూరు ఇవ్వాలన్నా ఇందిరమ్మ కమిటీల ద్వారానే జరుగుతుందన్నారు. కేంద్రంలో 10ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందని అన్నారు .
మోడీ పాలనలో ముస్లింలకు క్రిస్టియన్లకు,దళితుకకు అన్యాయం జరుగుతుందని పేర్కోన్నారు. తన బిడ్డ కావ్యను మీ బిడ్డగా,చెల్లెగా, అక్కగా, అడపడుచుగా భావించి ఆశీర్వదించాలని ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని ప్రజలను కోరారు. మే 13న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు
---------------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ను అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 6(ప్రజా మంటలు)అర్బన్ మండలం అంబారిపేట గ్రామ సర్పంచ్ గా గోడిసెల గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవగా గంగాధర్ ను శాలువాతో సత్కరించి అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర ఆలయ... సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహన తనిఖీలు - ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ అశోక్ కుమార్
ధర్మపురి డిసెంబర్ 6 ( ప్రజా మంటలు)సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పోలీస్ శాఖ తనిఖీలు, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడం జరిగిందనీ జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో ఎస్పీ ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన రాయపట్నం చెక్పోస్ట్ను, వెల్గటూర్ పోలీస్... శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్ సేవలు వెలకట్టలేనివి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 6 (ప్రజా మంటలు)
శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్ సేవలు వెలకట్టలేనివి అని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు.
జిల్లాలో ఘనంగా హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం పరేడ్
63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయం నందు హోంగార్డ్ ఆఫీసర్స్ పరేడ్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ... శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ డ్రామా
ప్రయాణికులకు అర గంట వేచి ఉండమన్న ఎయిర్లైన్ – భద్రతా లోపాలపై ప్రశ్నలు
హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ–హైదరాబాద్ మధ్య నడిచే ఎయిర్ ఇండియా AI–2879 ఫ్లైట్ శుక్రవారం రాత్రి అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంది. ల్యాండింగ్ పూర్తైన వెంటనే, విమానం చుట్టూ ఫైరింజన్లు, భద్రతా సిబ్బంది... ‘అఖండ 2’ రిలీజ్పై నిర్మాణ సంస్థ కొత్త ప్రకటన
కొత్త విడుదల తేదీ త్వరలో!ప్రకటిస్తారు?
హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘అఖండ 2’ రిలీజ్పై నిర్మాణ సంస్థ కీలక అప్డేట్ ఇచ్చింది. చిత్ర విడుదల కోసం చివరి దశ పనులు పూర్తిచేస్తున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించబోతున్నట్టు తెలిపింది.
నిర్మాణ సంస్థ... పంచాయతీ బరిలో చంద్రబాబు – జగన్!
కొత్తగూడెం డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలోని పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. సాధారణంగా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రత్యర్థులుగా నిలిచే చంద్రబాబు – జగన్ పేర్లు ఈసారి గ్రామ సర్పంచి బరిలో కనిపించడంతో గ్రామంలో చర్చనీయాంశమైంది. అయితే వారు మీరు అనుకునే రాజకీయ... తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ — డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో
హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దిశను తెలిపే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ ఈ సదస్సులో ఆవిష్కరించడం ప్రధాన లక్ష్యమని... రాష్ర్టంలో పెరిగిన వీధి కుక్కల బెడద : జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు
సికింద్రాబాద్, డిసెంబర్ 05 (ప్రజామంటలు) :
తెలంగాణలో వీధికుక్కల బెడద మితిమీరిందని, రాష్ట్రవ్యాప్తంగా కుక్కలు మనుషులపై దాడులు, కరవడం, ప్రాణాలు తీసే ఘటనలు పెరుగుతున్నా, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొనసాగుతుందని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఈ విషయమై ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన అధికారులు తమ... గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి
బీసీ సంఘాల ఆందోళనతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
*ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు – పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన నిరసనకారులు పిఎంఓ లో రాజకీయ అలజడి సృష్టించిన హిరెన్ జోషి
హిరేన్ జోషి, ప్రో హిమానీ దూద్, నవనీత్ సెహగల్ లు ఎందుకు ఈరోజు ఢిల్లీ వర్గాల్లో చర్చనీయంగా మారారు? హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదకోశం జరుగుతున్న పోటీయే దీనికి ప్రధాన కారణమా? బెట్టింగ్ అప్ కంపెనీని నిర్వహిస్తున్న సెహగల్ కొడుకు వల్లన పీఎంఓ కు వీటి సంబంధాలు బయటకు రావడం కారణమా? పూర్తిగా చదవండి. జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ₹347 కోట్ల ప్రణాళిక - చిన్నారెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్లో కొలువైన పవిత్ర శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం ₹347 కోట్లతో ఆలయాన్ని ఆధునికంగా, భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దే కార్యక్రమం రూపొందించారు.
తక్షణ పనులకు ₹35 కోట్లు అవసరం
బాలాలయం నిర్మాణం, వజ్రలేపనం, కుంభాభిషేకం... ఇండిగో విమాన రద్దుల వెనుక అసలు కథ ఏమిటి?
గత నాలుగు రోజులుుగా జరుగుతున్న ఇండిగో విమాన రద్దులపై, ప్రచారంలో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని, కార్పొరేట్ పోరాటం కోణంలో ఒక సమగ్ర విశ్లేషణాత్మక కథనం.
దేశవ్యాప్తంగా నాలుగు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సంస్థకు చెందిన అనేక విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడం, కొన్ని గంటల తరబడి ఆలస్యంగా నడవడం, ప్రయాణికులు... 